బాసర ట్రిపుల్ ఐటీ వద్ద విద్యార్థుల ఆందోళన | students strike at basar iiit | Sakshi
Sakshi News home page

బాసర ట్రిపుల్ ఐటీ వద్ద విద్యార్థుల ఆందోళన

Published Mon, Aug 17 2015 11:50 AM | Last Updated on Fri, Nov 9 2018 4:51 PM

ఆదిలాబాద్ జిల్లా బాసరలో ట్రిపుల్ ఐటీ ఆవరణలో విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు.

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బాసరలో ట్రిపుల్ ఐటీ ఆవరణలో విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు. మధ్యాహ్న భోజనం వికటించి అస్వస్థతకు గురైన ట్రిపుల్ ఐటీ విద్యార్థుల పరిస్థితిపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రిపుల్ ఐటీ యాజమాన్యానికి వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారికి స్థానిక నేతలు మద్దతు తెలిపారు.

బాసర ట్రిపుల్ ఐటీలో ఆదివారం కలుషిత ఆహారం తిని 120 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ట్రిఫుల్ ఐటీ విద్యార్థులు క్యాంపస్‌లో ఆందోళనకు దిగారు. తాగునీరు, వాతావరణ మార్పుల కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురై ఉండి ఉంటారని విద్యాసంస్థ ఉన్నతాధికారులు కప్పిపుచ్చుకునే ప్రయాత్నాలు చేస్తున్నారని వారు మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement