అమడగూరు : తనను దుర్భాషలాడిన వెంకటరెడ్డి అనే వ్యక్తిపై తహశీల్దార్ ఎల్ రెడ్డి పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఎలాంటి రికార్డులు చూపకుండా కొన్ని సర్వే నంబర్లను పాసుపుస్తకంలో నమోదు చేయాలని తరచూ వెంకటరెడ్డి తనను వేధించేవాడన్నాడు. ఒప్పుకోకపోవడంతో సోమవారం సీఎం వీడియో కాన్ఫరెన్స్లో ఉన్న తనను దుర్భాషలాడాడని, అతడిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఐ రఫీకి ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ సురేష్బాబు, ఆర్ఐలు జాకీర్హుసేన్, ఈశ్వరయ్య, ఆపరేటర్ వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.
తహశీల్దార్ ఫిర్యాదు
Published Tue, Aug 2 2016 12:03 AM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM
Advertisement
Advertisement