ఘట్కేసర్ మండలం ఎన్ఎఫ్సీనగర్ వద్ద కారు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు.
ఘట్కేసర్ మండలం ఎన్ఎఫ్సీనగర్ వద్ద కారు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. మృతుడు హైదరాబాద్ నగరంలోని రామాంతపూర్కు చెందిన సురేందర్(35)గా గుర్తించారు. రోడ్డు దాటుతుండగా అకస్మాత్తుగా కారు ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.