బైక్ అదుపుతప్పి గోడను ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు.
మణుగూరు మండలం కోడిపుంజుల వాగు వద్ద ఆర్ అండ్ బీ అధికారులు ప్రధాన రహదారిపై నిర్మించిన గోడను ఆదివారం వేకువజామున 2 గంటల సమయంలో బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న వాగుమల్లారం గ్రామానికి చెందిన ప్రశాంత్(28) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా..శేఖర్ అనే మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. శేఖర్ను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.