ఖమ్మం : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బైరనంపల్లి వద్ద గురువారం ట్రాక్టర్ - ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 8 మంది మహిళా కూలీలు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షలు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.