యూజీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రవేశాలు
ఎస్కేయూ: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మార్గదర్శకాలకు అనుగుణంగా పీహెచ్డీ ప్రవేశాలను నిర్వహించాలని ఎస్కేయూ వీసీ ఆచార్య కే. రాజగోపాల్ అన్నారు. వర్సిటీలోని కాన్ఫరెన్స్ హాలులో శనివారం అకడమిక్ స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఇండిస్ట్రియల్, ఎక్జిక్యూటివ్ కోటాలో ఉన్న పీహెచ్డీ సీట్లు తాజా యూజీసీ మార్గదర్శకాల ప్రకారం కేటాయించాలని వీసీ ఆదేశించారు. ఎంబీఏ, కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ కోర్సుల్లో ఇండిస్ట్రియల్ కోటాలో సీట్లు ఉన్నాయి. రెక్టార్ జి.శ్రీధర్ , రిజిస్ట్రార్ వెంకటరమణ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ చింతా సుధాకర్, ప్రిన్సిపాల్ సీఎన్ కృష్ణానాయక్, డీన్స్, డైరెక్టర్లు పాల్గొన్నారు.