విజయవాడ: వంగవీటి మోహన రంగా 69వ జయంతి సందర్భంగా ఆయన తనయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత వంగవీటి రాధా సోమవారం ఘనంగా నివాళులు అర్పించారు. బందర్ రోడ్డులోని రంగా విగ్రహానికి వంగవీటి రాధా పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాధా మాట్లాడుతూ రంగా ఆశయసాధనకు కృషి చేస్తానని తెలిపారు. తనకు, తన కుటుంబానికి అండగా ఉన్న అభిమానులు కార్యకర్తలకు తానెంతో రుణపడి ఉన్నానని చెప్పారు. మరోవైపు కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలోనూ కాపు నేతలు వంగవీటి రంగా జయంతి వేడుకలు నిర్వహించారు.
వంగవీటి రంగాకు రాధా ఘన నివాళి
Published Mon, Jul 4 2016 10:11 AM | Last Updated on Mon, Sep 4 2017 4:07 AM
Advertisement
Advertisement