సమావేశంలో మాట్లాడుతున్న ప్రసాద్నాయుడు
గంగవరం: సంక్షేమపథకాలు అర్హులకు అందాలని మండల టీడీపీ అధ్యక్షుడు ప్రసాద్నాయుడు అన్నారు. గురువారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ప్రసాద్నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కార్యకర్తలు ప్రజల్లోనికి తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్, నాయకులు శ్రీనివాసులు నాయుడు, వెంకటరమణారెడ్డి, హరి తదితరులు పాల్గొన్నారు.