Published
Thu, Jul 21 2016 6:55 PM
| Last Updated on Mon, Sep 4 2017 5:41 AM
కొనసాగుతున్న యాదాద్రి విస్తరణ పనులు
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహాస్వామి దేవస్థాన విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రిటైనింగ్ వాల్ నిర్మాణంలో భూమికి సమాంతరంగా పనులు జరుగుతున్నాయి. ఈ నిర్మాణానికి అడ్డుగా వచ్చిన పెద్ద పెద్ద బండరాళ్లను తొలగించి పనులను వేగవంతం చేస్తున్నారు. బాలాలయంలో ప్రస్తుతం ప్రసాద విక్రయశాల, శాశ్వత పూజల గదులను పూర్తి చేశారు. విస్తరణ పనుల్లో సుమారు 1000 మంది కూలీలు, 200మంది పర్యవేక్షకులు, మరో 200 మంది ఇంజనీర్లు, 250 మంది కంప్యూటర్ ఇంజనీర్లు ఇందులో భాగస్వాములవుతున్నారు.