యువకుడి బలవన్మరణం | youngster suicide | Sakshi

యువకుడి బలవన్మరణం

Sep 23 2016 2:17 AM | Updated on Nov 6 2018 8:04 PM

టి.నరసాపురం: పొలం పనులు సరిగా చేయడం లేదని తల్లితండ్రులు మందలించారనే కోపంతో మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన టి.నరసాపురం మండలం బొర్రంపాలెంలో గురువారం చోటుచేసుకుంది.

టి.నరసాపురం: పొలం పనులు సరిగా చేయడం లేదని తల్లితండ్రులు మందలించారనే కోపంతో మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన టి.నరసాపురం మండలం బొర్రంపాలెంలో గురువారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. బొర్రంపాలానికి చెందిన కలపర్తి గంగరాజు కుమారుడు గోవర్దన (19) గురువారం ఉదయం పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు అతడ్ని జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రికి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఏలూరు తరలించారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొం దుతూ గోవర్దన మృతిచెందాడు. ఈ మేరకు ఆస్పత్రి నుంచి సమాచారం రావడంతో ఎస్సై కె.నాగేంద్రప్రసాద్‌ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement