టీడీపీ నేతల బెదిరింపులకు ‘ఉపాధి’ ఉద్యోగి బలి | Anand committed suicide by drinking pesticide | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల బెదిరింపులకు ‘ఉపాధి’ ఉద్యోగి బలి

Published Fri, Jul 12 2024 5:23 AM | Last Updated on Fri, Jul 12 2024 5:23 AM

Anand committed suicide by drinking pesticide

ఉద్యోగానికి రాజీనామా చేయాలని ఫీల్డ్‌ అసిస్టెంట్‌కు హెచ్చరిక 

లేకపోతే తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని వేధింపులు 

మనస్తాపంతో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఆనంద్‌ 

పల్నాడు జిల్లా గోపాలంవారిపాలెంలో విషాదం

చిలకలూరిపేట: టీడీపీ నాయకుల బెదిరింపు­లు భరించలేక ఉపాధి హామీ పథకం ఉద్యో­గి ఒకరు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన పల్నాడు జిల్లా చిలకలూ­రిపేట మండలం గోపాలంవారిపాలెం గ్రామంలో గురువారం జరిగింది. మృతుని కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం... గోపాలంవారిపాలెం గ్రామానికి చెందిన జడ ఆనంద్‌(38) గత 18 సంవత్సరాలుగా మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎన్‌ఆర్‌ఈజీఎస్‌)లో ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. 

ఇటీవల టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నాయకులు వచ్చి ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఆనంద్‌ను ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగానికి రాజీనామా చేయా­లని హెచ్చరించారు. ఉద్యోగానికి రాజీనామా చేయకపోతే ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు క్రిమినల్‌ కేసులు పెట్టి అరెస్ట్‌ చేయిస్తా­మ­ని బెదిరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర మన­స్తాపానికి గురైన ఆనంద్‌ గురువారం మధ్యా­హ్నం తన ఇంటి వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. 

వెంటనే గమనించిన కుటుంబసభ్యులు చిలకలూరిపేటలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకురాగా, చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతిచెందాడు. ఆనంద్‌కు భార్య రత్నకుమారి, కుమార్తెలు దివ్య(10వ తరగతి), అర్షిత(8వ తరగతి), మహి(7వ తరగతి) ఉన్నారు. తన భర్త మృతికి గోపాళంవారిపాలెం గ్రామానికి చెందిన చిన్నం రవిబాబు, గోపాళం సాగర్‌బాబు, గోరంట్ల బుజ్జి, గోపాళం శ్రీధర్, మిన్నకంటి వీరబాబు, మానుకొండ బాలయ్య తదితరుల వేధింపులే కారణమని రత్నకుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement