pesticide
-
తగ్గిన ‘నానో’ ఎరువుల అమ్మకాలు
గత మూడేళ్లలో గణనీయంగా పెరిగిన నానో ఎరువుల అమ్మకాలు.. గత ఖరీఫ్ సీజన్ నుంచి భారీగా తగ్గాయి. సంప్రదాయ ఎరువులకు ప్రత్యామ్నాయంగా నానో బయోటెక్నాలజీ ద్వారా ద్రవరూపంలో అభివృద్ధి చేసిన ఈ సూక్ష్మ ఎరువులను 2021లో భారత రైతులు ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో) మార్కెట్లోకి తీసుకొచ్చింది. తొలుత యూరియా, ఆ తర్వాత నానో డీఏపీలను మార్కెట్లోకి తీసుకొచ్చిన ఇఫ్కో గత ఖరీఫ్ సీజన్ నుంచి నాలుగింతల నత్రజని (16 శాతం)తో సహా అధిక పోషక విలువలతో కూడిన నానో యూరియా ప్లస్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. వచ్చే సీజన్ నుంచి నానో జింక్, నానో కాపర్ను తీసుకొచ్చేందుకు సైతం ఏర్పాట్లు చేస్తోంది. – సాక్షి, అమరావతిఏపీలో తగ్గిన అమ్మకాలుగడచిన మూడేళ్లలో ఏపీలో ఇఫ్కో అవుట్లెట్స్తో పాటు ఆర్బీకేల ద్వారా 10.50 లక్షల బాటిళ్ల విక్రయాలు జరిగాయి. కాగా 2024–25 సీజన్ కోసం 10లక్షల నానో యూరియా, 4 లక్షల నానో డీఏపీ బాటిళ్లను ఇఫ్కో సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు. వర్షాలు, వరదలు, వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో ఖరీఫ్–2024లో అతికష్టమ్మీద 1.04లక్షల బాటిళ్ల నానో యూరియా ప్లస్, 48వేల నానో డీఏపీ బాటిళ్ల అమ్మకాలు జరిగాయి. కాగా వచ్చే రబీ సీజన్లో నానో యూరియా ప్లస్ 3లక్షల బాటిళ్లతో పాటు లక్ష బాటిళ్ల నానో డీఏపీని అందుబాటులో ఉంచేందుకు ఇఫ్కో ఏర్పాట్లు చేసింది. గడచిన మూడేళ్లుగా ఆర్బీకేల ద్వారా కూడా విక్రయాలు జరపగా, గడచిన ఖరీఫ్ సీజన్ నుంచి ఇఫ్కో అవుట్లెట్స్తో పాటు ఓపెన్ మార్కెట్ ద్వారా మాత్రమే నానో ఎరువులను అందుబాటులో ఉంచుతోంది. నానో ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రైతులు, గ్రామీణ యువతకు కిసాన్ డ్రోన్స్ కూడా ఇస్తున్నారు. గతేడాది ఒక్కొక్కటి రూ.15లక్షల విలువైన ఈ వెహికల్తో కూడిన కిసాన్ డ్రోన్స్ను 75 మందికి అందజేశారు. ఈ ఏడాది మరో 70 మందికి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.500 మిల్లీ లీటర్ల బాటిల్లో తీసుకొచ్చిన నానో యూరియా/డీఏపీలు 45 కిలోల సంప్రదాయ యూరియా, డీఏపీ బస్తాకు సమానం. బస్తా యూరియా ధర మార్కెట్లో రూ.266.50 ఉండగా, అదే పరిమాణంలో ఉన్న ఈ నానో యూరియాను రూ.225కే ఇఫ్కో అందుబాటులోకి తీసుకొచ్చింది. సంప్రదాయ డీఏపీ బస్తా మార్కెట్లో రూ.1,350 ఉండగా, నానో డీఏపీ బాటిల్ రూ.600కే తెచ్చింది. గడచిన మూడేళ్లలో వీటి అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. దేశ వ్యాప్తంగా 2021–22 సీజన్లో 2.12 కోట్ల బాటిళ్లు, 2022–23లో 3.30 కోట్ల బాటిళ్ల అమ్మకాలు . దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల ప్రభావం వల్ల సాగు తగ్గడంతో 2023–24లో 2.04 కోట్ల నానో యూరియా, 44 లక్షల నానో డీఏపీ బాటిళ్ల విక్రయాలు జరిగాయి. 2024–25 సీజన్లో 4.60 కోట్ల నానో యూరియా, 2 కోట్ల నానో డీఏపీ బాటిళ్ల విక్రయాలు లక్ష్యంగా నిర్ధేశించుకోగా, ఖరీఫ్ సీజన్లో కేవలం కోటి బాటిళ్ల నానో యూరియా ప్లస్, 43 లక్షల నానో డీఏపీ బాటిళ్ల అమ్మకాలు మాత్రమే జరిగాయి. తగ్గిన నానో విక్రయాలు.. -
ప్రేమోన్మాది ఘాతుకం
ఆదోని రూరల్: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం నగరూరు గ్రామానికి చెందిన అశ్విని అనే ఇంటర్మీడియెట్ విద్యార్థిని ప్రేమోన్మాది చేతిలో బలైంది. విద్యార్థిని నోట్లో పురుగుల మందు పోసి హత్యచేసిన ఘటన శుక్రవారం నగరూరు గ్రామంలో కలకలం రేపింది. విద్యార్థిని తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన నరసమ్మ, చిన్న వీరేష్ దంపతుల ఏకైక కుమార్తె అశ్విని పత్తికొండ మోడల్ స్కూల్లో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతోంది. దసరా సెలవులకు ఇంటికి వచ్చింది. అదే గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి సన్నీ శుక్రవారం అశ్విని ఇంట్లో ఎవరూలేని సమయం చూసి ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. తనను ప్రేమించకపోతే చంపేస్తానని వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బా చూపుతూ ఆమెను బెదిరించాడు. అయినప్పటికీ బాలిక అతని మాట లెక్కచేయకపోవడంతో సన్నీ ఆమె నోట్లో బలవంతంగా పురుగు మందు పోసి పరారయ్యాడు. కొద్దిసేపటికి విద్యార్థిని తల్లిదండ్రులు పొలం పనులు ముగించుకుని ఇంటికి వచ్చి చూసేసరికి కుమార్తె చావుబతుకుల్లో కనిపించింది. సన్నీ అనే వ్యక్తి బలవంతంగా పురుగు మందు తాగించాడని తల్లిదండ్రులకు తెలిపింది. వారు వెంటనే ఆమెను ఆదోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
టీడీపీ నేతల బెదిరింపులకు ‘ఉపాధి’ ఉద్యోగి బలి
చిలకలూరిపేట: టీడీపీ నాయకుల బెదిరింపులు భరించలేక ఉపాధి హామీ పథకం ఉద్యోగి ఒకరు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం గోపాలంవారిపాలెం గ్రామంలో గురువారం జరిగింది. మృతుని కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం... గోపాలంవారిపాలెం గ్రామానికి చెందిన జడ ఆనంద్(38) గత 18 సంవత్సరాలుగా మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎన్ఆర్ఈజీఎస్)లో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఇటీవల టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నాయకులు వచ్చి ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఆనంద్ను ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి రాజీనామా చేయాలని హెచ్చరించారు. ఉద్యోగానికి రాజీనామా చేయకపోతే ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయిస్తామని బెదిరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఆనంద్ గురువారం మధ్యాహ్నం తన ఇంటి వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే గమనించిన కుటుంబసభ్యులు చిలకలూరిపేటలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకురాగా, చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతిచెందాడు. ఆనంద్కు భార్య రత్నకుమారి, కుమార్తెలు దివ్య(10వ తరగతి), అర్షిత(8వ తరగతి), మహి(7వ తరగతి) ఉన్నారు. తన భర్త మృతికి గోపాళంవారిపాలెం గ్రామానికి చెందిన చిన్నం రవిబాబు, గోపాళం సాగర్బాబు, గోరంట్ల బుజ్జి, గోపాళం శ్రీధర్, మిన్నకంటి వీరబాబు, మానుకొండ బాలయ్య తదితరుల వేధింపులే కారణమని రత్నకుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
'ప్రకృతి' పద్ధతిలో చీడపీడల యాజమాన్యం మేలు!
సాక్షి, హైదరాబాద్: వాతావరణ మార్పుల నేపథ్యంలో మెట్ట పంటల సాగును తక్షణమే ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోకి మార్చుకోవటం అత్యవసరమని పులివెందులలోని ఇండో–జర్మన్ ఆగ్రోఎకాలజీ అకాడమీ సీనియర్ కన్సల్టెంట్, జాతీయ నూనెగింజల పరిశోధనా సంస్థ పూర్వ సంచాలకులు డాక్టర్ కె.ఎస్. వరప్రసాద్ అన్నారు. వర్షాధార ప్రాంతాల పొలాలకు సాగు నీటి సదుపాయం కల్పించటం కన్నా సాగు పద్ధతిని ప్రకృతికి అనుగుణంగా సమూలంగా మార్చటం అవశ్యమని, ఆయన శనివారం నొక్కిచెప్పారు. పంటల ఆరోగ్య యాజమాన్యం– నవ్యత, సుస్థిరత అనే అంశంపై రాజేంద్రనగర్లోని ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నాలుగు రోజులుగా జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు శనివారం ముగిసింది. ఈ సదస్సులో డా. వరప్రసాద్ ఆసియా పసిపిక్ ప్రాంతంలో సుస్థిర చీడపీడల యాజమాన్యంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అనే అంశంపై ప్రసంగించారు. చీడపీడల యాజమాన్య పద్ధతులను పంటల వారీగా, పురుగుల వారీగా, తెగుళ్ల వారీగా వేర్వేరుగా చూస్తూ వేర్వేరు పరిష్కారాలను వెతకటం కన్నా.. స్థానిక వంగడాల జీవవైవిధ్యంతో కూడిన ప్రకృతి వ్యవసాయం ద్వారా వ్యవస్థాగత పరిష్కారం వెతకడమే మేలన్నారు. ఈ మేరకు నవీనీకరించిన సమీకృత సస్యరక్షణ సూత్రాలను అనుసరించాలని ఆయన సూచించారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో కలసి వాసన్ సంస్థ మన దేశంలోని వర్షాధార ప్రాంతాల్లో సంప్రదాయ సాగు పద్ధతులపై నిర్వహించిన అధ్యయనంతో పాటు, ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వ్యవసాయ అనుభవాలు కూడా ఈ విషయాన్ని ధృవపరుస్తున్నాయన్నారు. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ తెగుళ్ల శాస్త్రవేత్త డాక్టర్ పప్పు హనుమంతరావు రసాయనిక వ్యవసాయ దృష్టికి అతీతంగా ఈ ఫలితాలను శాస్త్రవేత్తలు గమనించాలని సూచించారు. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని వర్షాధార ప్రాంతాల్లో ప్రకృతి వ్యవసాయ ఫలితాలు కొత్త పాఠాలు నేర్పుతున్నాయని, అంతర్జాతీయ బృందాలు ఈ నెల 26–29 తేదీల్లో ఏపీలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నాయని డా. వరప్రసాద్ తెలిపారు. స్థానిక ప్రకృతి వ్యవసాయదారుల అనుభవాల ఆధారంగా శాస్త్రవేత్తలు సాగు పద్ధతుల నుంచి చీడపీడల యాజమాన్యం వరకు ఉన్న అంశాలను సరికొత్త దృష్టితో, ముఖ్యంగా వర్షాధార వ్యవసాయం విషయంలో, పరిశీలించాల్సిన తరుణం ఆసన్నమైందని డా. వరప్రసాద్ తెలిపారు. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ తెగుళ్ల శాస్త్రవేత్త డాక్టర్ పప్పు హనుమంతరావు జీనోమ్ ఎడిటింగ్(జన్యు సవరణ) వంటి అత్యాధునిక సాంకేతికతల ద్వారా చీడపీడల యాజమాన్యంలో ప్రతిబంధకాలను అధిగమించవచ్చని, అనేక పంటలకు సంబంధించి పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. జన్యు మార్పిడి సాంకేతికతపై మాదిరిగా జన్యు సవరణ సాంకేతికతపై అభ్యంతరాలు లేవన్నారు. పిజెటిఎస్ఎయు కీటక శాస్త్ర నిపుణుడు డా. ఎస్.జె. రహమాన్ ప్రసంగిస్తూ జీవన పురుగుమందులను క్షేత్రస్థాయిలో పునరుత్పత్తి చేసుకునే క్రమంలో నాణ్యతా ప్రమాణాలను పాటించటంలో ఖచ్చితత్వం కొరవడితే వ్యాధి కారక క్రిములతో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మార్కెట్లో నకిలీ పంచగవ్య వంటి ద్రావణాలను అధిక ధరలకు విక్రయిస్తున్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని, నియంత్రణ యంత్రాంగం చర్యలు తీసుకోవాలన్నారు. సుస్థిర వ్యవసాయాభివృద్ధే లక్ష్యం: సుస్థిర వ్యవసాయాభివృద్ధి లక్ష్యంగా పరిశోధనలకు శ్రీకారం చుట్టాలని, రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యంతో ప్రధాని మోదీ శాస్త్రవేత్తలకు ఈ మేరకు దిశానిర్దేశం చేశారని ఐసిఎఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డా. ఉదమ్ సింగ్ గౌతమ్ అన్నారు. పంటల ఆరోగ్య యాజమాన్యం– నవ్యత, సుస్థిరత అనే అంశంపై నాలుగు రోజులుగా జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు ముగింపు సభలో శనివారం సాయంత్రం ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. పిపిఎఐ అధ్యక్షులు డా. బి. శరత్బాబు, అటారి డైరెక్టర్ డా. షేక్ మీరా తదితరులు పాల్గొన్నారు. ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా స్వర్ణోత్సవాల సందర్భంగా వెటరన్ శాస్త్రవేత్తలు డా. కృష్ణయ్య, డా. వరప్రసాద్లకు జీవన సాఫల్య పురస్కారాలను ప్రదానం చేశారు. (చదవండి: మంచి వ్యవసాయం పద్ధతులే మేలు! ఐసిఎఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ పిలుపు) -
యువతికి బలవంతంగా పురుగుల మందు తాగించి...
సిర్పూర్ (టి): అతడికి అప్పటికే వివాహం జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా ఓ యువతిని ప్రేమ పేరుతో వేధించాడు. ఆ యువతి ప్రేమకు నిరాకరించడంతో నేరుగా ఇంట్లోకి వెళ్లి ఆమెకు పురుగుల మందు తాగించి పరారయ్యాడు. తొలుత ఆత్మహత్యగా భావించినప్పటికీ ఓ పదేళ్ల చిన్నారి చెప్పిన సాక్ష్యంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. కుమురంభీం జిల్లా సిర్పూర్(టి) మండలం వెంకట్రావ్పేటకు చెందిన బుదే విట్టు, జీవనకళ దంపతుల కుమార్తె బుదే దీప (19) ఇంటర్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటోంది. అదే గ్రామానికి చెందిన దంద్రె జోగాజీ, దుమన్బాయిల కుమారుడు కమలాకర్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొద్దిరోజులుగా కమలాకర్ ప్రేమ పేరుతో దీప వెంటపడుతున్నాడు. ఈ క్రమంలోనే ఈ నెల 17న ఆదివారం సాయంత్రం యువతి ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఉన్న ఇద్దరు చిన్నారులను భయపెట్టి బయటికి పంపించాడు. తనను ప్రేమించాలని లేకుంటే నిన్ను, నీ కుటుంబం మొత్తాన్నీ చంపుతానని దీపను బెదిరించాడు. అయినప్పటికీ ఆమె ఒప్పుకోకపోవడంతో వెంట తెచ్చుకున్న పురుగుల మందును బలవంతంగా ఆమెకు తాగించి పరారయ్యాడు. దీప కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. యువతిని మొదట సిర్పూర్(టి) ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం విషమించడంతో కాగజ్నగర్కు.. అక్కడి నుంచి మంచిర్యాలకు ఆ తర్వాత మెరుగైన చికిత్సకోసం కరీంనగర్కు తరలించారు. సోమవారం కరీంనగర్లో దీప మృతి చెందింది. దీపది ఆత్మహత్యగా భావించిన కుటుంబ సభ్యులు పోస్టుమార్టం కోసం సిర్పూర్(టి) సామాజిక ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే దీపకు కమలాకర్ బలవంతంగా పురుగుల మందు తాగించిన విషయం ఓ పదేళ్ల చిన్నారి ద్వారా మంగళవారం వెలుగులోకి వచ్చింది. దీంతో సామాజిక ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గ్రామంలో స్థానికులు నిందితుడిపై దాడికి యత్నించారు. కౌటాల సీఐ సాదిక్పాషా, ఎస్సై రమేశ్ వారికి నచ్చజెప్పారు. పోలీసులు ఆస్పత్రిలోనే చిన్నారిని విచారించి పూర్తి వివరాలు సేకరించారు. మృతురాలి సోదరుడు బుదే రాజేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. -
కన్నీటి వాగు
కెరమెరి(ఆసిఫాబాద్): పత్తి చేనులో పురుగు మందు పిచికారీ చేస్తూ విష ప్రభావానికి గురైన లక్మాపూర్ రైతు మాలోత్ లక్ష్మణ్ (50)ను వాగు దాటించి ఆస్పత్రికి తరలించడం ఆలస్యం కావడంతో మృతి చెందాడు. లక్ష్మణ్ శుక్రవారం తన పత్తి పంటకు పురుగు మందు పిచికారీ చేస్తుండగా విషప్రభావంతో స్పృహ తప్పి కింద పడిపోయాడు. గమనించిన సమీప రైతులు ఆయనను ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును కష్టంగా దాటించి.. కెరమెరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆ తర్వాత ఉట్నూ ర్ సీహెచ్సీకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యానికి ఆదిలాబాద్ రిమ్స్కు తరలించగా.. అర్ధరాత్రి 12 గంటలకు పరిస్థితి విషమించి మృతి చెందాడు. శనివారం కూడా వాగు ఉధృతి తగ్గక పోవ డంతో మృతదేహాన్ని మంచంపైనే వాగు దాటించారు. కాగా ఈ నెల 8న ‘ప్రాణాలు పోయా కా స్పందిస్తారా..?’ అన్న శీర్షికతో సాక్షిలో కథనం ప్రచురితమైన రోజే మృతి చెందడం గమనార్హం! ఆలస్యం కాకుంటే.. లక్ష్మణ్ తన చేనులో పడిపోగా.. వాగు దాటించి కెరమెరి పీహెచ్సీకి చేర్చడానికి రెండు గంటల సమయం పట్టింది. దీంతో ప్రాథమిక చికిత్స అందడం ఆలస్యమైంది. అక్కడి నుంచి ఉట్నూర్, ఆ తర్వాత ఆదిలాబాద్ రిమ్స్కు చేరేసరికి లక్ష్మణ్ పరిస్థితి విషమించింది. రిమ్స్ వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా ప్రయోజనం లేకుండా పోయింది. సకాలంలో తీసుకొస్తే ప్రాణాలు దక్కేవని రిమ్స్ వైద్యులు పేర్కొన్నట్లు మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ నేత్రాలను దానం చేసి ఆదర్శంగా నిలిచారు. -
నవజాత శిశువుకు పురుగుల మందు ఇచ్చిన తండ్రి.. కారణమేంటంటే..?
భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఓ వ్యక్తి తన నెల శిశువుకు పురుగుల మందు ఇచ్చాడు. ఈ అమానవీయ ఘటన ఒరిస్సాలోని బాలాసోర్లో జరిగింది. చందన్, తన్మయికి గత ఏడాది వివాహం జరిగింది. ఈ నెల 9న వారికి ఓ శిశువు పుట్టింది. ఆస్పత్రి నుంచి తన్మయి డిఛార్జ్ కాగానే నీలగిరి పోలీసు స్టేషన్ పరిధిలోని సింగిరి గ్రామంలోని తల్లిగారింటికి వెళ్లింది. ఈ క్రమంలో పాపను చూడడానికి అత్తగారింటికి చందన్ వెళ్లాడు. భార్య వాష్రూమ్కు వెళ్లినప్పుడు, తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును పసిపాపకు ఎక్కించాడు. పాప ఏడుపుతో బయటికి వచ్చిన తన్మయి షాక్కు గురైంది. భర్తను దూరంగా నెట్టి పాపను తీసుకుంది. తన తల్లిదండ్రులకు విషయం తెలుపగా.. వారు పాపను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయనప్పుటికీ గ్రామస్తుల సమాచారంతో కేసును సుమోటోగా తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పాప పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. చదవండి:రోడ్డుపై లవర్స్ రొమాంటిక్ వీడియో..కేసుపై పోలీసుల తంట..! -
పురుగుల మందు తాగి.. చెట్టుకు ఉరేసుకుని..
చందంపేట: తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోరన్న భయంతో ఓ ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆపై చెట్టుకు ఉరేసుకున్న ఘటన నల్లగొండ జిల్లా నేరెడుగొమ్ము మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాలిలా.. దేవరకొండ మండలం కొండభీమనపల్లి గ్రామానికి చెందిన అందుగుల భిక్షమయ్య, మార్తమ్మ దంపతుల కుమారుడు రాకేశ్(20) డిగ్రీ చదువును మధ్యలోనే వదిలేసి కూలి పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. కొండమల్లేపల్లి మండలం దోనియాల గ్రామానికి చెందిన వరికుప్పల కృష్ణయ్య, జయమ్మ దంపతుల కుమార్తె దేవి(16) దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఫస్ట్ ఇంటర్ చదువుతోంది. దేవి గతేడాది చింతపల్లి మండల పరిధిలోని మోడల్ స్కూల్లో పదోతరగతి చదువుతున్న సమయంలో రాకేశ్తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇటీవల ఇరువురూ తమ ప్రేమ విషయం ఇంట్లో చెప్పడంతో రాకేశ్ కుటుంబసభ్యులు సానుకూలంగా ఉండగా దేవి తరఫు బంధువులు నిరాకరించారు. ఈ క్రమంలో దేవి ఆదివారం రాకేశ్కు ఫోన్ చేసి తనకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, నేను వేరొకరిని పెళ్లి చేసుకుని బతకలేనని, వచ్చి తీసుకెళ్లాల్సిందిగా కోరింది. దీంతో రాకేశ్ అదే రోజు ఆమెను ఇంటి నుంచి తీసుకొచ్చి బైక్పై నేరెడుగొమ్ము మండలం కాచరాజుపల్లి గ్రామ శివారులోని ఉచ్చలబుడ్డి వద్దకు చేరుకున్నారు. తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆపై చెట్టుకు తాడుతో ఉరి వేసు కున్నారు. కాచరాజుపల్లి గ్రామస్తులు చూసి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలంలో తమ చావుకు ఎవరూ కారణం కాదని, తల్లిదండ్రులు క్షమించాలని రాసి ఉన్న సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పరిహారం కోసం రైతు ఆత్మహత్యాయత్నం
భూపాలపల్లి: సింగరేణి ఓపెన్కాస్ట్ ఏర్పాటులో ఉన్న భూమి పోయింది. పరిహారం కోసం ఆఫీసుల చుట్టూ ఎంత తిరిగినా పూర్తిస్థాయిలో అందలేదు. దీంతో విసిగివేసారిన ఓ రైతు కలెక్టరేట్లో ప్రజావాణి వద్దకు వచ్చి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. సోమవారం కలెక్టరేట్ పక్కన ఉన్న ఇల్లందు క్లబ్హౌస్లోని మీటింగ్ హాల్లో ప్రజావాణి కార్యక్రమం జరుగుతోంది. కలెక్టర్ భవేష్ మిశ్రా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో గణపురం మండలం మాధవరావుపల్లికి చెందిన జిట్టబోయిన సాంబయ్య అనే రైతు క్లబ్హౌస్ బయట క్రిమిసంహారక మందు తాగి పడిపోయాడు. అక్కడున్న వారు అతడిని లేపి ఏమైందని అడగ్గా.. తనకు అన్యాయం జరిగిందని, ఎవరూ పట్టించుకోకపోవడంతో పురుగుమందు తాగానని చెప్పాడు. మాధవరావుపల్లిలో సర్వే నంబర్ 318/92లో తనకు ఎకరన్నర భూమిలో 500 టేకు చెట్లు ఉండేవని, 2019లో సింగరేణి సంస్థ ఓపెన్కాస్ట్–3 నిర్మాణంలో భాగంగా ఆ భూమిని సేకరించిందన్నాడు. ఎకరన్నర భూమికి గాను ఎకరాకే పరిహారం వచ్చిందని, మిగిలిన 20 గుంటల పరిహారం ఓ దళారి పేరుపై వచ్చిందని వాపోయాడు. అలాగే, 78 చెట్లకు కూడా పరిహారం రాలేదన్నాడు. నష్టపరిహారం కోసం మూడేళ్లుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నానని చెప్పాడు. గతంలో గణపురం తహసీల్దార్ను ప్రశ్నిస్తే.. విధులకు ఆటంకం కలిగించానని పోలీసులకు ఫిర్యాదు చేశారని, పది రోజులు జైల్లో ఉండి వచ్చానని సాంబయ్య పేర్కొన్నాడు. రైతు ఆత్మహత్యాయత్నం విషయం తెలుసుకున్న కలెక్టర్ భవేష్ మిశ్రా వెంటనే సిబ్బందిని పంపి రైతును ఆస్పత్రిలో చేర్పించారు. సాంబయ్య ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వరంగల్లోని ఎంజీఎంకు తరలించారు. -
Devadula: భూములు తిరిగి ఇవ్వకుంటే మూకుమ్మడి ఆత్మహత్యలు
శాయంపేట: సొరంగం పనుల కోసం రైతుల నుంచి భూములను లీజుకు తీసుకుని, పనులైన వెంటనే తిరిగి ఇస్తామని చెప్పి.. తీరా ఇప్పుడు మినీ క్రషర్ ఏర్పాటు చేస్తున్నారని, వెంటనే భూములను మాకు అప్పగించాలంటూ రైతులు పురుగు మందు డబ్బాలతో ఆందోళన చేపట్టారు. భూములు అప్పగించకపోతే 18 కుటుంబాల రైతులందరమూ మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మైలారం గ్రామ శివారులో దేవాదుల మూడో విడత సొరంగం పనుల కోసం 18మంది రైతులనుంచి 27.30 ఎకరాల భూమిని కోస్టల్ మెగా కంపెనీ లీజుకు తీసుకుంది. ఆ స్థలంలో ఆడిట్ పాయింట్ ఏర్పాటు చేసి పనులు పూర్తి చేసింది. సొరంగం పనుల్లో వచ్చిన పెద్దపెద్ద బండరాళ్లు, మెటీరియల్స్ను ఆ ప్రాంతంలోనే నిల్వ చేశారు. పనులు పూర్తయినప్పటికీ తిరిగి రైతులకు భూములు అప్పగించలేదు. ఇటీవల కాలంలో రైతులు తమ భూములు అప్పగించాలని అడుగుతూ వస్తున్నారు. అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో 18.27 ఎకరాల పట్టా భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతోపాటు 5 ఎకరాల అసైన్డ్ భూమిని కూడా స్వాధీనం చేసుకుంది. ఆ స్థలంలో నిల్వ చేసిన బండరాళ్లను, మెటీరియల్ను తొలగించడానికి హైదరాబాద్కు చెందిన ప్రైవేట్ కాంట్రాక్టర్కు పనులను అప్పగించింది. దీంతో కాంట్రాక్టర్ ఆ ప్రాంతంలో మినీ క్రషర్ ఏర్పాటుచేయడానికి బుధవారం రాత్రికి రాత్రే మెటీరియల్ దింపాడు. విషయం తెలుసుకున్న రైతులు గురువారం ఉదయం అక్కడికి చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని పరిశీలించి తిరిగి వెళ్తున్న ఇరిగేషన్ అధికారుల వాహనాన్ని రెండు గంటలపాటు అడ్డుకున్నారు. సమస్య పరిష్కరించేంత వరకు వెళ్లనివ్వమని పురుగు మందు డబ్బాలు పట్టుకుని ఆందోళన చేపట్టారు. తమ స్థలంలో ఎలాంటి పనులూ చేపట్టవద్దని, కాదని చేపడితే 18 కుటుంబాల రైతులం ఆత్మహత్య చేసుకుంటా మని హెచ్చరించారు. దీంతో ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని, వారి ఆదేశాలను పాటిస్తామని డీఈ రవీందర్ తెలిపారు. రైతుల ఆందోళన మేరకు పదిరోజుల పాటు ఆడిట్ స్థలంలో ఎలాంటి పనులూ చేపట్టమని హామీ ఇచ్చారు. -
అమ్మా.. పురుగుల మందు తాగిన.. నన్ను క్షమించమ్మా!
సాక్షి, మంచిర్యాల: ‘ఉద్యోగం రాదోమోననే భయంతో పురుగుల మందు తాగిన.. అమ్మా.. నన్ను క్షమించమ్మా? అని ఆ కొడుకు చివరిసారిగా మాట్లాడిన మాటలు ఆ కన్నతల్లి జీర్ణించుకోలేకపోతోంది. చేతికందిన కొడుకు చేదోడువాదోడుగా ఉంటాడనుకుంటే అర్ధంతరంగా తనువు చాలించడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. మృతుడి తండ్రి, ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రోటిగూడ గ్రామానికి చెందిన దాసరి శేఖర్–సుజాత దంపతులకు కొడుకు శ్రీకాంత్ (25), కూతురు ఉన్నారు. కూతురుకు వివాహం జరిపించారు. శ్రీకాంత్ బీటెక్ చదివాడు. ఇటీవల ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాశాడు. తక్కువ మార్కులు వస్తాయని భావించి ఉద్యోగం రాదని దిగులు చెందాడు. ఇదే బెంగతో ఈనెల 10న రాత్రి 11గంటల ప్రాంతంలో ఇంట్లో పురుగుల మందు తాగాడు. ‘పరీక్షలో తక్కువ మార్కులు వస్తాయి.. ఉద్యోగం రాదేమోననే భయంతో పురుగుల మందు తాగిన.. నన్ను క్షమించమ్మా’ అని తల్లి సుజాతతో చివరిసారిగా మాట్లాడాడు. అంతలోనే అపస్మారక స్థితికి చేరాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని మేదరిపేట ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి కరీంనగర్ ఆస్పత్రి కి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఎదిగివచ్చిన కొడుకుపై పుట్టెడు ఆశలు పెట్టుకున్న ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కొడుకు చివరి మాటలు తలుచుకుని రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. మృతుడి తండ్రి శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తానాజీ తెలిపారు. చదవండి: (Kothapalli Geetha: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలు శిక్ష) -
సెల్ఫీ వీడియో తీస్తూ రైతు ఆత్మహత్యాయత్నం
కౌడిపల్లి(నర్సాపూర్): సెల్ఫీ వీడియో తీస్తూ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ యువ రైతు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం దేవులపల్లిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. దేవులపల్లి గ్రామానికి చెందిన జింక శ్రీశైలంకు గ్రామ శివారులోని అటవీభూమి పక్కన సాగుభూమి ఉంది. అందులో వరితోపాటు మిరప పంట సాగు చేశారు. ఇటీవల గ్రామానికి బృహత్ పల్లె ప్రకృతి వనం మంజూరైంది. అటవీశాఖ అధికారులు దీనికోసం ఐదు ఎకరాల స్థలం కేటాయించారు. శనివారం అక్కడికి వచ్చిన డిప్యూటీ ఎఫ్ఆర్ఓ రాజమణి, బీట్ అధికారి హరిత.. మిగతా భూమితోపాటు శ్రీశైలం పోడు చేసుకుంటున్న అటవీభూమిని సైతం దున్ని చదును చేయాలని సిబ్బందికి చెప్పారు. దీంతో శ్రీశైలం తమ తాతల కాలం నుంచి పోడు భూమిలో సాగు చేస్తున్నామని.. పంటను నాశనం చేయొద్దని అధికారులను కోరాడు. ఈ నేపథ్యంలో అతను అధికారులతో వాగ్వాదానికి దిగాడు. పనులను అడ్డుకోవడంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై వారు స్థానిక పోలీసులు ఫిర్యాదు చేశారు. అనంతరం శ్రీశైలం, అటవీశాఖ అధికారులు, సర్పంచ్ కలసి తన పొలంలో బృహత్ పల్లెప్రకృతి వనం ఏర్పాటు చేస్తున్నారంటూ సెల్ఫీ వీడియో ద్వారా బాధను తెలిపాడు. ఈ భూమి పోతే తమకు వేరే ఆధారం లేదని రోదిస్తూ పురుగు మందు తాగాడు. వీడియోను చూసిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అతడిని మెదక్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రీశైలం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. అది అటవీ భూమి.. జింక శ్రీశైలం ఇప్పటికే అటవీ భూమిని ఆక్రమించి వరి సాగు చేస్తున్నాడు. ఈ ఏడాది కొత్తగా మరో ఎకరా అటవీభూమి దున్ని మిరప పంట సాగు చేస్తున్నాడు. అటవీ భూమి కావడంతో పల్లెప్రకృతి వనం కోసం చదును చేస్తుండగా అడ్డుకొని ఇష్టానుసారంగా దూషించాడు. భూమికి సంబంధించి ఆధారాలు చూపించలేకపోయాడు. సిబ్బంది పనులకు అడ్డు తగలడంతో వాటిని నిలిపివేసి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ కోసం వస్తారన్న ఆందోళనతో శ్రీశైలం పురుగు మందు తాగి ఉండవచ్చు. – రాజమణి, డిప్యూటీ ఎఫ్ఆర్ఓ, కౌడిపల్లి -
స్కూల్కు సెలవులివ్వడం లేదని విషం కలిపాడు!
భువనేశ్వర్: స్కూల్కు సెలవులు ఇవ్వడం లేదని ఓ విద్యార్ధి ఏకంగా 20 మంది విద్యార్ధుల జీవితాలను ఇరకాటంలో పెట్టాడు. ఎందుకు చేశావని స్కూల్ ప్రిన్సిపాలు అడిగితే అతను చెప్పిన సమాధానం విని అందరూ నోరెళ్ల బెట్టారు. అసలేంజరిగిందంటే.. ఒడిశాలోని బర్గార్ జిల్లాకు చెందిన కామగాన్ హయ్యర్ సెకండరీ స్కూల్ల్లో 11వ తరగతి చదివే విద్యార్థి (16) తన 20 మంది స్నేహితులకు బాటిల్ నీళ్లలో విషం కలిపి ఇచ్చాడు. ఆ బాటిల్లోని నీళ్లు తాగిన వారంతా వాంతులు, వికారంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేర్పించడంతో చికిత్స అనంతరం ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ సంఘటనపై ప్రిన్సిపాల్ ప్రేమానంద్ పటేల్ మాట్లాడుతూ.. ఒమిక్రాన్ కారణంగా మరోమారు లాక్డౌన్ విధించే అవకాశం ఉందని నేరానికి పాల్పడిన విద్యార్ధి ఆశించాడు. అలా జరగకపోవడంతో ఈ పనికి పూనుకున్నాడని తెలిపాడు. ఐతే అనారోగ్యంపాలైన విద్యార్ధుల తల్లిదండ్రులు సదరు విద్యార్ధిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఐతే విద్యార్ధి కెరీర్, చిన్న వయసును దృష్టిలో ఉంచుకుని ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యలేదు. ఐతే పాఠశాల యాజమన్యం సదరు విద్యార్ధిని కొన్ని రోజులపాటు స్కూల్ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. పాఠశాలలోని హాస్టల్లో నివసిస్తున్న విద్యార్ధి ఎలాగైనా ఇంటికి వెళ్లాలనుకున్నాడు. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్లు వచ్చినప్పుడు స్కూళ్లు మూతపడ్డాయి. ఇప్పుడు ఒమిక్రాన్ వల్ల కూడా స్కూళ్లు మూతపడి సెలవులిస్తారని అనుకున్నాడు. అలా జరగకపోవడంతో తోటలోని పురుగుల మందును నీళ్లలో కలిపి విద్యార్ధులకు తాగేందుకు ఇచ్చాడు. నీళ్లను తాగిన విద్యార్ధులు ఆనారోగ్యానికి గురయ్యారు. చదవండి: జపాన్లో కొత్తగా 8 ఒమిక్రాన్ కేసులు.. ఆ దేశంలో రోజుకు 7 వేలకు పైనే..! -
దళిత దంపతులపై జులుం
-
‘చావు తప్ప మరో దారి లేదు’
భోపాల్: చేతికొచ్చిన పంటను అధికారులు బుల్డోజర్తో నాశనం చేయడం చూసి ఆ దళిత దంపతులు తట్టుకోలేకపోయారు. సొంత బిడ్డను చంపుతున్నట్లే భావించారు. ఆ ఘోరాన్ని చూడలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవ్వడంతో అధికారుల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ దారుణమైన సంఘటన మధ్యప్రదేశ్లోని గుణ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. రామ్ కుమార్ అహిర్వార్, సావిత్రి దేవి దంపతులు కొన్నేళ్లుగా రెండు బిఘాల(5.5 ఎకరాలు) ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో 2018లో ప్రభుత్వం ఆ భూమిని ఓ కాలేజీ కోసం కేటాయించింది. దాంతో ఆ భూమిని ఖాళీ చేయాల్సిందిగా అధికారులు రామ్ కుమార్ దంపతులకు సూచించారు. కానీ వాళ్లు అంగీకరించకపోవడంతో.. రెండు రోజుల క్రితం రాష్ట్ర రెవెన్యూ అధికారులు పోలీసులతో వచ్చి భూమిని ఖాళీ చేయాల్సిందిగా రామ్ కుమార్ దంపతులను బెదిరించారు. ఈ క్రమంలో బుల్డోజర్తో వారి పంటను నాశనం చేసే ప్రయత్నం చేశారు. దాంతో పోలీసులకు, రామ్ కుమార్ దంపతులకు మధ్య వాగ్వాదం జరిగింది. ‘మాకు మూడు లక్షల రూపాయల అప్పు ఉంది. దాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందా. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ సాగు చేసుకుంటున్నాం. ఇప్పుడ ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి అంటే.. మేం ఎలా బతకాలి. చావు తప్ప మాకు వేరే దారి లేదు’ అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో పోలీసులు లాఠీలతో విచక్షణారహితంగా రామ్ కుమార్ మీద దాడి చేశారు. అడ్డుకోబోయిన సావిత్రి దేవిని అసభ్యకరమైన మాటలతో అవమానించారు. చివరకు బుల్డోజర్తో పంటను నాశనం చేసేందుకు ప్రయత్నించారు. ఇది చూసి తట్టుకోలేకపోయిన ఆ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. దాంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. రామ్కుమార్ దంపతుల మీద దాడి చేసిన పోలీసులకు జిల్లా కలెక్టర్ క్లీన్చీట్ ఇవ్వడం మరింత వివాదాస్పదంగా మారింది. (మృతదేహం కళ్లు పీక్కుతిన్న చీమలు!) దాంతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా రంగంలోకి దిగారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్నింటికంటే ముందుగా పోలీసులకు క్లీన్చీట్ ఇచ్చిన కలెక్టర్ను, ఎస్పీని సస్పెండ్ చేశారు. తల్లిదండ్రులను కాపాడేందుకు ప్రయత్నించిన పిల్లలను కూడా పోలీసులు అవమానించారు. అవతలకు ఈడ్చిపారేశారు. ప్రతిపక్షాలు కూడా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మాజీ సీఎం కమల్నాథ్ రాష్ట్రంలో జంగిల్రాజా పాలన కొనసాగుతుందని ఆరోపించారు. ‘దళిత దంపతుల మీద పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారు. ఏంటిది జంగిల్ రాజా. ఒకవేళ వారు ప్రభుత్వ భూమినే సాగు చేస్తున్నారనుకుందా. దాన్ని చట్టబద్దంగా పరిష్కరించుకోవాలి. అంతకాని జాలీ, దయ లేకుండా ఆ దంపతులను, వారి పిల్లలను కొట్టడం న్యాయం కాదు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.(కమల్ను కాపాడిన ‘కరోనా’) దీని గురించి ప్రభుత్వ అధికారులను ప్రశ్నించగా.. ‘లోకల్ గ్యాంగ్స్టర్ ఒకడు దాదాపు 4.5 బిఘాల(12.5ఎకరాలు) భూమిని ఆక్రమించుకున్నాడు. రామ్ విలాస్ దందపతులను వాడుకుని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోకుండా ఉండేందుకు అప్పులపాలైన రామ్ విలాస్ దంపతులను వాడుకుంటున్నాడు’ అని తెలిపారు. -
‘మందుల’ వాడకంలో మనమే టాప్
క్రిమిసంహారక మందుల తయారీ సంస్థల ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా రైతుల ప్రాణాలను బలిగొంటున్నాయని, ఆ మందులను పంటపొలాల్లో వాడుతున్న రైతులు కేన్సర్ వ్యాధికి గురవుతున్నారని అంతర్జాతీయ అధ్యయనాలు భయంగొలిపే నివేదికలను వెలువరిస్తున్నాయి. ప్రపంచ పురుగుమందుల్లో 59 శాతంవరకు వినియోగిస్తున్న భారతదేశం అంతర్జాతీయంగా పురుగుమందుల వినియోగంలో అగ్రస్థానం పొందినట్లు తెలిసింది. పురుగుమందుల కంపెనీలు తయారు చేస్తున్న మందుల్లో 99.9 శాతం మందులు పర్యావరణంలో కలిసిపోతుండగా 0.1 శాతం మందులు మాత్రమే క్రిములను ప్రభావితం చేస్తున్నాయని ప్రొ. డేవిడ్ పిమెంటర్ యాభయ్యేళ్ల క్రితమే తన శాస్త్ర పరిశోధనా పత్రంలో సమర్పించారు. దీన్ని ముందుగానే గ్రహించి ఉంటే ప్రపంచం పురుగుమందులకు వ్యతిరేకంగా మరింత సురక్షితమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకుని ఉండేది. అంతర్జాతీయ వ్యవసాయ రసాయనిక ఉత్పత్తుల బహుళజాతి సంస్థ బేయర్–మోన్శాంటో తయారు చేసిన రౌండప్, డికాంబా అనే క్రిమిసంహాకర మందులు కేన్సర్ వ్యాధికారకాలను కలిగి ఉన్నట్లు వచ్చిన ఆరోపణలపై అమెరికాలోనూ, ఇతర దేశాల్లోనూ ఆ సంస్థ కేసులు ఎదుర్కొం టోంది. ఈ నేపథ్యంలో స్విట్జర్లాండ్ ఎన్జీఓ పబ్లిక్ ఐ, యూకేకు చెందిన గ్రీన్ పీస్ సంస్థలకు చెందిన జర్నలిస్టు పరిశోధనా బృందం ‘అన్ఎర్త్డ్’ చేసిన పరిశోధనలో.. అత్యంత ప్రమాదకరమైన పురుగుమందుల్లో 59 శాతంవరకు వినియోగిస్తున్న భారతదేశం అంతర్జాతీయంగా పురుగుమందుల వినియోగంలో అగ్రస్థానం పొందినట్లు తెలిసింది. అయితే ది గార్డియన్ పత్రిక నివేదిక ప్రకారం, వ్యవసాయ రసాయన ఉత్పత్తుల కంపెనీలు ఈ డేటాతో విభేదిస్తున్నాయి. పరిశోధనా బృందం ప్రకటించిన సమాచారం తప్పుదోవ పట్టిస్తోందని బేయర్ కంపెనీ చెబుతోంది కానీ దాన్ని తన సొంత డేటాతో ఎదుర్కోలేకపోయింది. మరోవైపున ఆగ్రో–కెమికల్ పరిశ్రమకు చెందిన బలమైన లాబీ గ్రూప్ అయిన క్రాప్ లైఫ్ ఇంటర్నేషనల్ ఒక ప్రకటన చేస్తూ, తన ఉత్పత్తులలో 15 శాతం మాత్రమే అత్యంత ప్రమాదకరమైనవిగా ఉంటున్నాయని, వీటిలో కూడా 10 శాతం మందులను రైతులు సురక్షితంగా వాడుతున్నారని తెలిపింది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికా ఆహార, వ్యవసాయ సంస్థ అభిప్రాయం ప్రకారం అత్యంత ప్రమాదకరమైన పురుగుమందులు అంటే.. ‘అంతర్జాతీయంగా ఆమోదించిన వర్గీకరణ వ్యవస్థల ప్రకారం మానవ ఆరోగ్యానికి లేదా పర్యావరణానికి తీవ్రమైన, దీర్ఘకాలిక హాని కలిగించేవి’ అని అర్థం. ఇది 1980లలో నోబెల్ గ్రహీత నార్మన్ బొర్లాగ్తో నేను జరిపిన చర్చను గుర్తుకు తెచ్చింది. పర్యావరణ ఉద్యమానికి దారిచూపుతున్నట్లుగా అప్పట్లో ప్రచారమైన రేచల్ కార్ల్సన్ రాసిన ‘సైలెంట్ స్ప్రింగ్’ పుస్తకంపై నేను సంధించిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ ఆమె ఒక దుష్టశక్తి అని అభివర్ణించారు. ఆమెలాంటి వ్యక్తులు ప్రపంచంలోనుంచి ఆకలిని తరిమివేయాలని అసలు కోరుకోరని ఆయన విమర్శించారు. పైగా పురుగుమందులు అనేవి ఔషధాల వంటివి అనేశారు. అన్ని జాగ్రత్తలూ తీసుకుని రైతులు వాటిని ఉపయోగించాలన్నారు. ఆరోజు బొర్లాగ్ చెప్పిన మాటలు చర్చనీయాంశమే. కానీ ఆయన అభిప్రాయాలు క్రిములు కలిగించే నష్టాన్నుంచి పంటలను కాపాడేందుకు పురుగుమందులను ఉపయోగించే హరిత విప్లవానికి కీలక వ్యూహాన్ని ఏర్పర్చాయి. కానీ ఏళ్లు గడిచేకొద్దీ, పురుగుమందులు పర్యావరణానికి మరిం తగా హాని కలిగించాయి. రసాయనమందుల వినియోగం, దుర్వినియోగం అనేవి ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ నష్టాలకు, పర్యావరణ అసమతుల్యతకు, పురుగుమందుల ప్రభావం నిరోధకతకు, మొత్తం ఆహార సరఫరా వ్యవస్థనే కలుషితం చేసిందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఎంత అధికంగా పురుగుమందులు వాడితే అంత అధికంగా ఆకలిని తొలగించవచ్చనే అభిప్రాయం భ్రాంతి మాత్రమే అని ఐక్యరాజ్య సమితి ప్రత్యేక ప్రతినిధి హిలాల్ ఎల్వర్ పేర్కొన్నారు. మరింతగా పురుగుమందులు వాడితే ఆకలి సమస్యపై అంత ఎక్కువగా స్వారీ చేయవచ్చనడంలో నిజం లేదు. ఎప్ఏఓ ప్రకారం, ఈరోజు మనం 700 కోట్లమందికి ప్రపంచంలో తిండిపెడుతున్నాం. ఉత్పత్తి కచ్చితంగా పెరిగింది. కానీ దారిద్య్రం, అసమానత్వం, పంపిణీయే అసలు సమస్య. పురుగుమందులను దీర్ఘకాలంగా వాడటం అనేది కేన్సర్, అల్జీమర్స్, పార్కిన్సన్ వంటి వ్యాధులకు దారితీస్తోందని, హార్మోన్ల విచ్ఛిన్నత, మానవ శరీర అభివృద్ధి క్రమరాహిత్యం, సంతాన విహీనత వంటివి కూడా తలెత్తుతున్నాయని పై నివేదిక వివరించింది. రౌండప్ పురుగుమందులో వాడుతున్న గ్లైపోసేట్ మనుషుల్లో కేన్సర్కు కారణమవుతోందన్న అంశాన్ని జతచేస్తూ ఇంటర్నేషనల్ ఏజెన్సీ రీసెర్చ్ ఆన్ కేన్సర్ నివేదికను ప్రచురించిన తర్వాత, విషపూరితమైన పురుగుమందుల వాడకానికి వ్యతిరేకంగా అమెరికాలో అనేక వ్యాజ్యాలు ప్రారంభమయ్యాయి. గ్లిపోసేట్కు, కేన్సర్ వ్యాధికి మధ్య లింకు ఉన్నట్లు యూరోపియన్ కమిషన్, అమెరికా పర్యావరణ రక్షణ ఏజెన్సీ వంటి రెగ్యులేటరీ సంస్థలు చెప్పడం లేదని మోన్శాంటో చెప్పింది కానీ పలువురు కేన్సర్ రోగులు పురుగుమందుల కంపెనీలపై లీగల్ కేసులు పెట్టడం ప్రారంభించారు. తాజా గణాంకాలను చూస్తే ఇంతవరకు పురుగుమందుల కంపెనీలపై 42,000 కేసులు పెట్టారు. కాగా ఫిర్యాదుదారుల సంఖ్య ఇప్పటికే లక్షకు పైగా దాటినట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఒక్క గ్లైపోసేట్కు వ్యతిరేకంగానే కాకుండా, మరొక క్రిమిసంహారక మందు అయిన డికాంబాపై కూడా న్యాయవివాదాలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 15న మిస్సోరి రైతుకు తన పీచ్ ఆర్చర్డ్ తోటను పురుగుమందులు ధ్వంసం చేసిపడేశాయన్న ఆరోపణతో ఏకీభవిం చిన అమెరికా ఫెడరల్ కోర్టు 265 మిలియన్ డాలర్ల పరిహారాన్ని చెల్లించాలని పురుగుమందుల కంపెనీలను ఆదేశించింది. తన పొరుగున ఉన్న పొలం యజమాని చల్లిన డికాంబా క్రిమిసంహాకర మందు పక్కనే ఉన్న తన పూలతోటకు వ్యాపించి తోట మొత్తాన్ని పాడు చేసిందంటూ ఆ రైతు బేయర్, బీఎఎస్ఎఫ్ అనే బడా ఆగ్రో–కెమికల్ కంపెనీలపై ఫిర్యాదు చేశారు. డికాంబా పురుగుమందు ప్రభావాన్ని తట్టుకునే పత్తిపంట కోసం పొరుగు రైతు ఈ కంపెనీల మందును చల్లగా అది పక్కనున్న తన పొలంలోని పీచ్ అర్చర్డ్ తోటలోని ఆకులను, చెట్లను చంపేసిందని ఆ రైతు వాదించి మరీ గెలిచారు. అయితే గ్లైపోసేట్ పురుగుమందుకు వ్యతిరేకంగా నడుస్తున్న న్యాయపరమైన లావాదేవీని మనం నిశితంగా పరిశీలించాలి. ఇంతవరకు గ్లైపోసేట్కు వ్యతిరేకంగా మూడు వ్యాజ్యాలలో నలుగురు ఫిర్యాదీదారులకు న్యాయస్థానం 2.3 బిలియన్ డాలర్ల పరిహారాన్ని చెల్లించాలని తీర్పు ఇచ్చింది. తన పురుగుమందులు వాడేటప్పుడు కేన్సర్ ప్రమాదం పొంచి ఉంటుందని వినియోగదారులను నిర్దిష్టంగా హెచ్చరించడంలో పురుగుమందుల కంపెనీ విఫలమైందని తీర్పులు స్పష్టం చేశాయి. మొట్టమొదటగా 2018 ఆగస్టు నెలలో డెవైన్ జాన్సన్ అనే తోటల పెంపకందారుకు శాన్ప్రాన్సిస్కో న్యాయస్థానం 289 మిలి యన్ డాలర్ల నష్టపరిహారాన్ని చెల్లించాలని పురుగుమందుల కంపెనీలను ఆదేశించింది. తన పొలంలో గ్లైపోసేట్కు చెందిన వివిధ రకాల కాంబినేషన్లను స్ప్రే చేశానని, దీంతో తాను లింపోమా వ్యాధికి గురయ్యానని ఆ రైతు చెప్పారు. ఇక భారతదేశం విషయానికి వస్తే ప్రతి సంవత్సరం 10 వేల పురుగుమందుల విషప్రభావానికి సంబంధించిన కేసులు సగటున నమోదవుతున్నాయని డౌన్ టు ఎర్త్ పత్రిక పేర్కొంది. 2015లో ప్రమాదవశాత్తూ పురుగుమందులతో విషప్రభావానికి గురై 7,060 మంది చనిపోయారని జాతీయ నేర నమోదు బ్యూరో పేర్కొంది. వాస్తవానికి దేశంలో రూ. 20,000 కోట్ల విలువైన క్రిమిసంహారక పరిశ్రమలు 2024 వరకు ప్రతి ఏటా 8.1 శాతంతో వృద్ధి సాధించనున్నాయని అంచనా. అంటే పురుగుమందుల కంపెనీల క్రమబద్ధీకరణ విషయంలో లొసుగులను పరిష్కరించడం ఎంత అవసరమో దీన్ని బట్టి తెలుస్తోంది. కేంద్రం తీసుకురానుందని చెబుతున్న పెస్టిసైడ్స్ మేనేజ్మెంట్ బిల్ 2020ను త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ చట్టం క్రిమిసంహారక మందుల కంపెనీలను క్రమబద్ధీకరించడమే కాకుండా తమ మందుల వాడకం ద్వారా రైతులకు కలుగుతున్న ఆరోగ్యపరమైన నష్టాలకు కూడా పరిహారం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పైగా వేలాది మంది రైతులు వేయబోయే కేసులను కూడా మననంలో ఉంచుకోవలసిన అవసరం ఉంది అయితే దాదాపు అయిదు దశాబ్దాల క్రితం 1970లలో కార్నెల్ యూనివర్సిటీకి చెందిన సుప్రసిద్ధ ప్రొఫెసర్ డేవిడ్ పిమెంటర్ చెప్పిన మాటలను ప్రపంచం పట్టించుకుని ఉంటే ఈ 50 ఏళ్లలో జరుగుతూ వచ్చిన నష్టాన్ని నివారించి ఉండేది. పురుగుమందుల కంపెనీలు తయారు చేస్తున్న మందుల్లో 99.9 శాతం మందులు పర్యావరణంలో కలిసిపోతుండగా 0.1 శాతం మందులు మాత్రమే క్రిములను ప్రభావితం చేస్తున్నాయని ఆయన ఆనాడే తన శాస్త్ర పరిశోధనా పత్రంలో సమర్పించారు. అంటే పురుగుమందుల్లోని రసాయనాలు ఒక శాతం మాత్రమే తమ లక్ష్యాన్ని తాకుతున్నాయని అర్థం. దీన్ని ముందుగానే గ్రహించి ఉంటే ప్రపంచం పురుగుమందులకు వ్యతిరేకంగా మరింత సురక్షితమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకుని ఉండేది. కానీ ఇంతవరకు జరిగిన నష్టానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? వ్యాసకర్త: దేవీందర్ శర్మ, వ్యవసాయ నిపుణులు, ఈ–మెయిల్ : hunger55@gmail.com -
‘పెస్టిసైడ్స్’ నియంత్రణకు బిల్లు
న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే పురుగు మందుల వ్యాపార నియంత్రణ బిల్లును సభలో ప్రవేశపెట్టనుంది. పురుగుమందుల వ్యాపార క్రమబద్ధీకరణతో పాటు, నకిలీ పురుగుమందుల కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం అందించే ప్రతిపాదనను కూడా బిల్లులో చేర్చారు. ఈ ‘పెస్టిసైడ్స్ మేనేజ్మెంట్ బిల్–2020’ని బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ‘ప్రస్తుతం పురుగుమందుల వ్యాపారం ఇన్సెక్టిసైడ్ యాక్ట్ – 1968 నిబంధనల ప్రకారం జరుగుతోంది. ఆ నిబంధనలకు కాలం చెల్లింది. అందుకే కొత్త బిల్లును రూపొందించాం’ అని సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. రైతుల ప్రయోజనాలే ధ్యేయంగా, వారికి సురక్షితమైన, ప్రభావశీలమైన పురుగుమందులు అందించడం, నకిలీ పురుగుమందులను అరికట్టడం లక్ష్యంగా ఈ బిల్లు రూపొందిందన్నారు. ఆయా పురుగు మందులకు సంబంధించిన సమస్త సమాచారం డీలర్ల నుంచి రైతులకు అందేలా నిబంధనలు రూపొందించామన్నారు. అలాగే, సేంద్రియ పురుగుమందుల వాడకాన్ని ప్రోత్సహించే ప్రతిపాదనలను కూడా తాజా బిల్లులో చేర్చామన్నారు. నకిలీ రసాయన మందుల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు ఒక సెంట్రల్ ఫండ్ను ఏర్పాటు చేస్తామన్నారు. పెస్టిసైడ్స్ కంపెనీల నుంచి వసూలు చేసిన జరిమానాకు, అవసరమైతే కొంత కలిపి కేంద్రం ఆ ఫండ్ను ఏర్పాటు చేస్తుందన్నారు. పురుగుమందుల ప్రచారాన్ని క్రమబద్ధీకరించే ప్రతిపాదన కూడా తాజా బిల్లులో ఉందన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే పురుగుమందుల తయారీ సంస్థలకు రూ. 25 వేల నుంచి రూ. 50 లక్షల వరకు జరిమానా విధించే ప్రతిపాదనను ఆ ముసాయిదా బిల్లులో చేర్చారు. నిబంధనలను అతిక్రమించేవారికి జైలు శిక్షను ఐదేళ్లవరకు పెంచే ప్రతిపాదనను తాజా బిల్లులో చేర్చారు. -
కడుపులోకి ‘కల్తీ’ కూట విషం..
సాక్షి, హైదరాబాద్: పండ్లు.. కూరగాయలు.. ఆకు కూరలు.. పప్పులు.. బియ్యం.. సుగంధ ద్రవ్యాలు.. గోధుమలు కాదేదీ పెస్టిసైడ్స్ (క్రిమి సంహారకాలు) ఆనవాళ్లకు అనర్హం అన్నట్లుగా మారింది ప్రస్తుత పరిస్థితి. హైదరాబాద్ వాసులు రోజువారీగా విని యోగిస్తున్న నిత్యావసరాలు, పలు రకాల ఆహార పదార్థాల నమూనాల్లోనూ ఫుడ్సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ ఎస్ఏఐ) నిర్దేశించిన పరిమితికి మించి రసాయనాలు, క్రిమి సంహారక ఆనవాళ్లు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ పరిధిలో బహిరంగ మార్కెట్ల, లో విక్రయిస్తున్న ఆహార పదార్థాల్లో మొత్తం గా సుమారు 30% మేర పెస్టిసైడ్స్ ఆనవాళ్లు బయటపడుతున్నాయి. ఎరువులు, పురుగు మందుల అవశేషాలు లేని సేంద్రియ ఆహార పదార్థాలను విక్రయిస్తున్నా మంటూ ప్రచారం చేసుకుంటున్న పలు సంస్థలు తమ ఆర్గానిక్ స్టోర్లలో విక్రయిస్తున్న నమూనాల్లోనూ ఈ ఆనవాళ్లు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఆయా స్టోర్లలో సేకరించిన పలు రకాల ఆకుకూరలు, పండ్లు, కూరగాయల్లోనూ విష రసాయనాల ఆనవాళ్లు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్ మెంట్ (హైదరాబాద్) ఆధ్వర్యంలో వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరల నమూనాలను సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షించగా వీటి ఆనవాళ్లు బయటపడ్డాయి. కూరల్లో వాడే కరివేపాకులోనూ వీటి ఆన వాళ్లు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నమూనాలను నగరంలోని పలు బహిరంగ మార్కెట్లలో సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షించగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. అమ్మో క్రిమి సంహారకాలు.. క్రిమి సంహారకాల్లో ప్రధానంగా ఆర్గానో క్లోరిన్, ఎసిఫేట్, ఎసిటామిప్రిడ్, అజోక్సీ స్టార్బిన్, కార్బన్డిజం, ఇమిడాక్లోప్రిడ్, టిబ్యుకొనజోల్ తదితర క్రిమిసంహారక ఆన వాళ్లు బయటపడ్డాయి. ఇవన్నీ ఫుడ్సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్దేశించి న పరిమితులకు మించి ఉంటున్నాయి. ఎసిఫేట్, లిండేన్ వంటి క్రిమి సంహారకాల వినియోగంపై నిషేధం ఉన్నప్పటికీ వాటి ఆనవాళ్లు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. సుగంధ ద్రవ్యమైన యాలకులలోనూ క్వినై ఫోస్, అజోక్సీస్టార్బిన్, థయామె టోక్సా మ్ వంటి క్రిమి సంహారకాలు ఉంటున్నాయి. పెస్టిసైడ్స్ ఆనవాళ్లతో అనర్థాలివే.. దేశంలో సరాసరిన 10% మధుమేహ బాధి తులుండగా.. హైదరాబాద్లో సుమారు 16–20% మంది ఈ వ్యాధితో బాధపడుతు న్నారు. దేశంలో గ్రేటర్ సిటీ డయాబెటిక్ క్యాపిటల్గా మారుతుండటం ఆందోళన కలి గిస్తోంది. ఆకుకూరలు, కూరగాయల్లో ఉండే క్రిమిసంహారకాలు ఆహారపదార్థాల ద్వారా మానవశరీరంలోకి ప్రవేశిస్తే సుమారు 20 ఏళ్ల పాటు అలాగే తిష్టవేసే ప్రమాదం ఉంద ని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని రకాల క్రిమిసంహారకాల అవశేషాలు దేహం లోని కొవ్వు కణాల్లో నిల్వ ఉంటాయని.. పలు రకాల అనారోగ్య సమస్యలకు కారణ మవుతాయంటున్నారు. కూరగాయలను ఉప్పు నీళ్లతో కడిగిన తరవాత.. బాగా ఉడికించి తినాలని వైద్యులు సూచిస్తున్నారు. మధుమేహానికి కారకాలు.. తెలుగు రాష్ట్రాల్లో శరీర బరువు తక్కువగా ఉన్న వారు.. రక్తంలో కొవ్వు మోతాదు తక్కువ ఉన్న వారు సైతం మధు మేహ వ్యాధి బారిన పడేందుకు ఆర్గానో క్లోరిన్ తదితర క్రిమి సంహారక ఆనవాళ్లు ఆహార పదార్థాల్లో చేర డమే ప్రధాన కారణ మని ఈ నివేదిక హెచ్చరిం చింది. మరోవైపు ఆర్గానో క్లోరిన్ క్రిమిసం హారకాల తయారీ దేశంలో అధి కంగా జరుగుతోందని.. ఇక లిండేన్ వంటి నిషే ధిత క్రిమిసంహారకాన్ని సైతం దేశంలో పలు ప్రాం తాల్లో విరివిగా విని యోగిస్తుండటంతో పలు అనర్థాలు తలెత్తు తున్నా యని ఈ నివేదిక స్పష్టం చేసింది. తలసరి క్రిమిసం హారకాల వినియోగం లోనూ రెండు తెలుగు రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల కంటే ముందంజలో ఉండటం గమనార్హం. తల్లిపాలలోనూ క్రిమి సంహారకాల ఆనవాళ్లు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. -
జాగ్రత్త తీసుకుని ఉంటే బతికేవాడే
ఏ మట్టిని నమ్ముకుని బతికాడో ఆ మట్టిలోనే కలిసిపోయాడు. ఏ పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నాడో ఆ పంట మధ్యనే ఊపిరి వదిలేశాడు. పంటను కాపాడుకోవాలనే ఆత్రుత లో తన ప్రాణానికి ఏమవుతుందో ఆలోచించడం మానేశాడు. ఫలితంగా అయిన వారికి కన్నీళ్లు మిగిల్చి కన్నుమూశాడు. పురుగు మందు కొట్టేటప్పుడు కనీస జాగ్రత్తలు పాటించాలని తెలుసుకోలేని ఓ రైతు ఆ అజాగ్రత్త వల్ల ఏకంగా ప్రాణాలే కోల్పోయాడు. ఓ చిన్న వస్త్రం ముఖానికి కట్టుకుని ఉంటే కుటుంబంతో చక్కగా నవ్వుతూ ఉండేవారు. సాగులో ఆధునిక పద్ధతులు పంటకే కాదు రైతుల ప్రాణాలకూ రక్షణగా నిలుస్తాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. సాక్షి, వీరఘట్టం(శ్రీకాకుళం) : వీరఘట్టం మండలం సంత–నర్శిపురంలో పడాల గోవిందరావు(51) అనే కౌలు రైతు పత్తి పంటకు పురుగు మందు కొట్టి ఆ అవశేషాలు శ్వాసలో చేరి మంగళవారం చనిపోయారు. గోవిందరావు 4 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. ఐదేళ్లుగా పత్తి పంటను పండిస్తున్నారు. మూడు రోజు లుగా కురుస్తున్న వర్షాలకు పత్తి పంటకు పురుగు ఆశించింది. ఆదిలోనే జాగ్రత్తలు తీసుకుంటే పంటను కాపాడుకోవచ్చునని భావించి మంగళవారం తెల్లవారుజామున పురుగుమందు స్ప్రే చేశారు. కానీ జాగ్రత్తలేవీ పాటించలేదు. గాలి వీచే దిశకు ఎదురుగా పురుగు మందు స్ప్రే చేయడంతో ఆ మందు అవశేషాలు అతని శ్వాసలో కలిసి పొలంలోనే కుప్పకూలిపోయాడు. చుట్టుపక్కల ఉన్న రైతులు ఆయనను గమనించి అతడిని ఇంటికి తీసుకువచ్చి సపర్యలు చేశారు. వైద్యుని వద్దకు తీసుకెళ్లేలోగానే ఆయన కన్ను మూశారు. సంత–నర్శిపురంలో విషాద ఛాయలు గోవిందరావుతో సన్నిహితంగా ఉండే చాలా మంది గ్రామస్తులు తెల్లవారి చూసిన వ్యక్తి గంటల వ్యవధిలోనే చనిపోయాడనే విషయం తెలియడంతో నివ్వెరపోయారు. ఆయన మృతితో సంత–సంతనర్శిపురంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుడికి భార్య బానమ్మ, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న గోవిందరావు మృతి చెందడంతో వారు కంటికీ మింటికీ ఏకధారగా రోదిస్తున్నారు. -
డ్రోన్తో పురుగుమందు పిచికారీ
హైదరాబాద్ : డ్రోన్ ద్వారా పురుగుమందు పిచికారీ చేసే విధానాన్ని గురువారం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రదర్శించారు. సెన్స్కర్ సంస్థ సహకారంతో రాజేంద్రనగర్లోని వ్యవసాయ పరిశోధనా సంస్థలో ప్రయోగాత్మకంగా ఈ డెమో ఏర్పాటు చేశారు. పది లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకును డ్రోన్కు అమర్చి రిమోట్ సహాయంతో జీపీఎస్, జీఐఎస్ పరిజ్ఞానం వినియోగించి స్ప్రే ఎలా చేయాలి? ఎంత మోతాదులో పురుగుమందు వాడాలి? తదితర అంశాలను పరిశీలించారు. ఈ ప్రదర్శనను వ్యవసాయ వర్సిటీ పరిశోధన సంచాలకులు డాక్టర్ ఆర్ జగదీశ్వర్, వరి పరిశోధనా కేంద్రం హెడ్ డాక్టర్ ప్రదీప్, వరి విభాగం శాస్త్రవేత్తలు, ప్లాంట్ ప్రొటెక్షన్ విభాగంలోని శాస్త్రవేత్తలు, యూజీ, పీజీ, పీహెచ్డీ విద్యార్థులు, అధ్యాపకులు పరిశీలించారు. -
కన్నీళ్లతో కడుపు నింపుకుంటున్నాం..
కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడ్డనగేరి గ్రామానికి చెందిన రైతు మచ్చల ఈరన్న అప్పుల బాధ భరించలేక 2017 అక్టోబరు 18న పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అతని భార్య శ్యామల, నలుగురు పిల్లల జీవితం వేదనా భరితంగా మారింది. ప్రభుత్వం నుంచి చంద్రన్న బీమా సహా ఎటువంటి ఆర్థిక సాయం అందలేదు. రైతుల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో చెప్పడానికి కన్నీళ్లతో కడుపు నింపుకుంటున్న శ్యామల, నలుగురు పిల్లల వేదనా భరిత జీవితమే నిదర్శనం. వివరాలు ఆమె మాటల్లోనే.. ‘‘మా సొంతూరు జాలిమంచి. పదేళ్ల క్రితం ఈరన్నతో పెళ్లి అయింది. నా భర్త పేరు మీద 3 ఎకరాల భూమి ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో సకాలంలో వర్షాలు కురవడంతో పంటలు బాగా పండాయి. మా కాపురం ఎంతో సంతోషంగా కొనసాగింది. మాకు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. మా అమ్మ, నాన్న, అత్త, మామ చనిపోయారు. నా భర్త సొంత భూమితోపాటు మరికొంత భూమి కౌలుకు తీసుకుని సేద్యం చేశారు. అతివృష్టి, అనావృష్టి కల్లోలం రేపడంతో పెట్టుబడి పెట్టడం తప్ప రాబడి లేకుండా పోయింది. రెండేళ్ల క్రితం ఉల్లి, పత్తి వేశాం. వానలు ఎక్కువై పంటలు పోయాయి. తెలిసిన వారి దగ్గర చేసిన అప్పు రూ. 3 లక్షలతో పాటు ఆదోని ఆంధ్రా బ్యాంకులో తీసుకున్న అప్పు రూ.1.5 లక్షలు కట్టలేక పోయాం. పోయినేడు వానలే లేవు. మా పొలంలో సాగు చేసిన పత్తి దిగుబడి విత్తనాల ఖర్చుకు కూడా రాలేదు. గర్భవతిని కావడంతో తొమ్మిదో నెలలో పుట్టినిల్లు జాలిమంచిలో మా చిన్నాన్న ఇంటికి పురిటికి వెళ్లాను. ఒంటరిగా ఉన్న నా భర్త ఇంట్లోనే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన చనిపోయిన వారంలో మగ పిల్లోడు పుట్టాడు. నెలలోపే దొడ్డనగేరికి వచ్చేశాను. విఆర్ఓ సురేష్ వివరాలు సేకరించుకు వెళ్లారు. ఏడాది దాటినా ఒక్క పైసా సాయం అందలేదు. ఈ ఏడు తీవ్ర కరువు వచ్చింది. మా పొలంలో పత్తి వేసినా దిగుబడి పెద్దగా రాలేదు. బోరు బావుల కింద కూడా పంటలు లేవు. ఉపాధి పనులు పెట్టలేదు. కూలి పనికి పిలిచే వారు కూలీలుగా మారారు. వారానికి రెండు రోజులు కూడా కూలి పనులు దొరకటం లేదు. డీలరు వేసే బియ్యంతో నెలలో సగం రోజులు ఒక పూట గడచిపోతోంది. మిగిలిన రోజుల్లో కూలి పనులు దొరికితే ఒక పూట కడుపు నింపుకుంటున్నాం. లేదంటే మంచి నీళ్లతోనే ఆకలిని సంపుకుంటున్నాం. ప్రభుత్వం ఏదో ఒక రోజు ఆదుకుంటుందన్న ఆశతోనే రోజులు వెళ్లదీస్తున్నా..’ – కె.బసవరాజు, సాక్షి, ఆదోని, కర్నూలు జిల్లా -
కంటి వెలుగు కార్యక్రమంలో అపశ్రుతి
పాల్వంచ : కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా కంటి పరీక్షల చేయించుకునేందుకు తన రెండేళ్ళ కూతురుని తీసుకుని తల్లి వెళ్లింది. అక్కడ ఓ కూల్ డ్రింక్ సీసాను చూసిన ఆ చిన్నారి, దానిని చేతిలోకి తీసుకుని అందులోని ద్రవాన్ని తాగింది. అందులో ఉన్నది కూల్డ్రింక్ కాదు... పురుగు మందు. ఆ తల్లి తెలిపిన వివరాలు.. శుక్రవారం పట్టణంలోని శేఖరం బంజరకు చెందిన బోడ వెంకటేష్ భార్య పద్మ. ప్రభుత్వ పాఠశాలలో కంటి పరీక్షలను చేయించుకునేందుకు రెండేళ్ల కూతురు సహస్త్రను తీసుకెళ్లింది. అక్కడ పెద్ద క్యూ ఉండటంతో నిరీక్షిస్తోంది. ఆమె ఒళ్లో నుంచి ఆ చిన్నారి కిందకు దిగి ఆడుకుంటోంది. పాఠశాల గదిలో ఓ మూలకు కూల్ డ్రింక్ సీసా కనిపించింది. దానిని తీసుకుని, అందులోని ద్రవాన్ని తాగింది. కొద్దిసేపటికే చిన్నారి నోటి నుంచి నురగలు రావడంతో తల్లి కంగారు పడింది. బాటిల్లోని డ్రింక్ తాగిందని ఓ పాప చెప్పింది. అది పురుగు మందుగా గుర్తించిన ఆ తల్లి, వెంటనే ప్రభుత్వ ఏరియా ఆసుపపత్రికి తన బిడ్డను తీసుకెళ్లింది. ఆ చిన్నారి కడుపు నుంచి మందును వైద్యులు కక్కించారు. ఆ మందును ఎండ్రోసల్పాన్గా గుర్తించారు. పాఠశాలలోకి పురుగుల మందు ఎలా వచ్చింది..? సీసాలో పెట్టి ఉంచినా ఎవరూ ఎందుకు పట్టించుకోలేదని తల్లిదండ్రులు వెంకటేష్, పద్మ ప్రశ్నిస్తున్నారు. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ రవి విచారణ చేపట్టారు. -
కౌలు రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోదా?
30 ఏళ్లుగా కౌలు వ్యవసాయం చేస్తున్న రైతు ప్రైవేటు అప్పులు తెచ్చి పత్తి, మిర్చి సాగు చేసి అప్పుల్లో కూరుకొని ఆత్మహత్య పాలైన ఏడాదిన్నరకు కూడా ప్రభుత్వం బాధిత కుటుంబానికి ఎటువంటి సహాయమూ అందించలేదు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన కౌలు రైతు కొపూరి పున్నారావు (50) 2017 మే 13న ఇంట్లోనే పురుగులమందు తాగారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన సత్తెనపల్లిలోని ఆస్పత్రికి తరలించగా.. 17న చనిపోయారు. సెంటు భూమి లేకపోయినప్పటికీ పున్నారావు కుటుంబం 30 ఏళ్లుగా భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసి జీవనం సాగిస్తున్నారు. 2017లో ఎకరానికి రూ. 25 వేల కౌలు చొప్పున ఆరెకరాల పొలాన్ని కౌలుకు తీసుకున్నారు. రెండెకరాల్లో పత్తి, నాలుగెకరాల్లో మిరప పంటను సాగు చేశారు. పత్తికి తెగుళ్లు ఎక్కువగా సోకడంతో కనీసం పంట పెట్టుబడి కూడా తిరిగి రాలేదు. మిర్చి ధర క్వింటాలు రూ. 2,500కు పడిపోవటంతో రూ. 5 లక్షల అప్పు తీర్చేదారి లేక దిగులుతో ఆత్మహత్య చేసుకున్నారు. పున్నారావుకు భార్య పద్మావతి, కుమార్తెలు శిరీష, రాధ ఉన్నారు. ‘మాకు సెంటు కూడా భూమి లేకపోవడంతో బ్యాంకులు రుణం ఇవ్వలేదు. 17 సవర్ల బంగారం వేరే వారి పేరు మీద బ్యాంకులో కుదువ పెట్టాం. దానికి కూడా రుణమాఫీ వర్తించలేదు. ఇప్పుడు రెక్కల కష్టంపైనే ఆధార పడి జీవిస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదు..’ అని పద్మావతి ఆవేదన చెందుతున్నారు. – ఓ.వెంకట్రామిరెడ్డి, అమరావతి బ్యూరో, గుంటూరు -
మరో యువకుడితో పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారని...
ఒంగోలు / పెద్దారవీడు: ఎదురెదురు ఇళ్లలో నివసించే యువతీయువకుడు రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయారు. కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్న వీరిద్దరూ కొండప్రాంతంలో విగతజీవులుగా కనిపిం చారు. పెద్దారవీడు మండలంలో శనివారం సాయంత్రం ఈ ఘటన వెలుగు చూసింది. సేకరించిన వివరాల ప్రకారం.. యర్రగొండపాలెం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన దూదేకుల హుస్సేన్పీరా (20) సమీపంలోని ఒక ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. వీరింటికి ఎదురుగా ఉండే డి.అరుణబీ (16) యర్రగొండపాలెం సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఇరుగుపొరుగు ఇళ్లలో ఉండటంతోపాటు బంధువులు కూడా అయిన వీరిద్దరూ కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్నారు. హుస్సేన్, అరుణబీ ఇద్దరూ కలిసి తిరుగుతున్నారని తెలిసిన తల్లిండ్రులు వారికి కొద్ది రోజుల కిందట కౌన్సెలింగ్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఇంటి నుంచి వెళ్లిన వీరిద్దరూ ఆ తర్వాత ఆచూకీ లేకుండా పోయారు. ఈ క్రమంలో శనివారం పెద్దారవీడు మండలంలోని దేవరాజుగట్టు సమీపంలోగల సూర్యనారాయణమూర్తి ఆలయం సమీపంలోకి స్థానిక ఉన్నత పాఠశాల విద్యార్థులు వనం–మనం కార్యక్రమంలో భాగంగా వెళ్లారు. కొండపైకి ఎక్కిన సమయంలో దుర్వాసన వెదజల్లడంతో పరిసరాలను పరిశీలించారు. అక్కడ కొండ చక్కల మధ్యన రెండు మృతదేహాలు ఒకదానిపై మరొకటి పడి ఉండటం చూసి ఆందోళన చెందారు. ఈ విషయాన్ని వెంటనే గ్రామాధికారులకు, గ్రామస్తులకు తెలియజేశారు. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న వీఆర్ఓ ఎస్.లక్ష్మయ్య, మార్కాపురం పట్టణ ఎస్ఐ బి.రామకోటయ్యలు ఘటనా స్థలికి చేరుకున్నారు. ముఖాలను గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న మృతదేహాల సమీపంలో లభించిన కూల్డ్రింక్ సీసా, పురుగు మందు డబ్బాలను చూసి, ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు. వీరి వద్దగల సెల్ఫోన్లోని నంబర్లకు కాల్చేసి మృతుల వివరాలు తెలుసుకున్న పోలీసులు, బంధువులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి వచ్చిన హుస్సేన్ పీరా తండ్రి దస్తగిరి కుమారుడి మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని భావిస్తున్నారు. అరుణ్బీకి ఇటీవల ఆమె కుటుంబసభ్యులు మరో యువకుడితో పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ క్రమంలోనే సన్నిహితంగా ఉంటున్న అరుణ్బీ, హుస్సేన్ పీరాలు ఇక్కడి కొండప్రాంతంలోని ఆలయం వద్దకు వచ్చి బలవన్మరణానికి పాల్పడి ఉంటారనే చర్చ జరుగుతోంది. ఆలయ సమీపంలోని కొండపై యువతీయువకుల మృతదేహాలు ఉన్నట్టు తెలియడంతో స్థానికులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పురుగు మందులకు బలవుతున్న రైతులు
సాక్షి, న్యూఢిల్లీ : పంటలకు పురుగు మందులు కొట్టే క్రమంలో ఏటా దేశంలో ఎంతో మంది రైతులు బలైపోతున్నారు. 2017 సంవత్సరంలోనే మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రంలో 50 మంది రైతులు ఈ మందుల ప్రభావంతో మరణించారు. వారిలో ఎక్కువ మంది మనోక్రోటోఫస్ మందులను ఉపయోగించినవారే. వాటిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యంత ప్రమాదకారిగా గుర్తించిన ఫాస్ఫరస్ ఉంటుంది. ఈ మందును ఇప్పటికే ఎన్నో దేశాలు నిషేధించాయి. ప్రపంచంలో పలు దేశాలు నిషేధించిన పురుగు మందుల్లో ఇప్పటికీ భారత్లో రైతులు కనీసం 99 మందులను వాడుతున్నారు. పంటలకు పట్టిన చీడ పీడలను నాశనం చేసేందుకు భారత్లో రైతులు ఉపయోగిస్తున్న 260 మాలిక్యూల్ రకాల పురుగు మందుల్లో 99 మందులను పలు దేశాలు ఎప్పుడో నిషేధించాయి. వీటిని మన రైతులు ఇప్పటికీ వాడుతుండడమే కాకుండా లైసెన్స్లేని నకిలీ మందులను కూడా వాడుతున్నారు. ఈ కారణంగా రైతులు ఎక్కువగా మృత్యువాతకు గురవుతున్నారు. 1968 నాటి ఇన్సెక్టిసైడ్స్ యాక్ట్ కిందనే భారత ప్రభుత్వం పురుగు మందులను ఇప్పటికీ నియంత్రిస్తోంది. ఆధునిక కాలానికి అవసరమైన విధంగా చట్టాన్నిగానీ, విధానాలనుగానీ మార్చుకోలేదు. దేశంలో వ్యవసాయమేమో రాష్ట్రానికి సంబంధించిన అంశం. పురుగు మందులేమో కేంద్రానికి సంబంధించిన విషయం. అయినప్పటికీ ఇరు ప్రభుత్వాలు సమన్వయంతో రైతుల బలిని అరికట్టవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ‘ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్’ విధానం అన్నది ఒకటి ఉంది. దాని ప్రకారం ఎప్పటికప్పుడు రైతులను పురుగు మందుల విషయంలో, ఇతర వ్యవసాయ పద్ధతుల విషయంలో చైతన్యపరచాలి. అందుకోసం రైతులకు ప్రత్యేక తరగతులను నిర్వహించాలి. ఇందుకోసం వ్యవసాయ శాఖ, అధికారులు, సిబ్బంది ఉన్నప్పటికీ రైతులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న దాఖలాలు కనిపించవు. సిబ్బంది కొరత కారణమైని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం కూడా చెబుతోంది. ఉద్యాగాలిస్తామంటూ అధికారంలోకి వచ్చినప్పుడు ఖాళీలను భర్తీ చేసుకోవచ్చుగదా! పెస్ట్ మేనేజ్మెంట్ విధానం ప్రకారం తప్పనిసరి అయినప్పుడు మాత్రమే పురుగు మందులను వాడాలి. పురుగులను నివారించేందుకు సాధ్యమైనంత వరకు సహజ పద్ధతులను పాటించాలి. వర్మీ కంపోజ్, వేప నూనెలు వాడడం, నున్నటి రబ్బరు గొట్టాల ద్వారా చేనుకు పట్టిన పురుగులు పడిపోయేలా చేయడం సహజమైన పద్ధతులు. సహజమైన పద్ధతులన్నీ విఫలమైన సందర్భాల్లో ప్రభుత్వం చూపించిన మోతాదుల్లోనే రసాయనిక మందులను వాడాలి. ప్రభుత్వం విధానం ప్రకారం ఎరువులు అమ్మే వ్యాపారులు కూడా వాటిని ఎలా వాడాలో రైతులకు విడమర్చి చెప్పాలి. కేవలం లాభాపేక్ష కలిగిన ఎరువుల వ్యాపారులు అలా చేయరు. వారి వద్ద శిక్షణ కలిగిన సిబ్బంది కూడా ఉండరు. ఎరువుల షాపుల్లో వ్యవసాయ బీఎస్సీ చదివిన వారిని ప్రమోటర్లుగా పెట్టుకోవాలని, వారు విధిగా రైతులకు సూచనలు ఇవ్వాలంటే గతేడాది కేంద్ర ప్రభుత్వం ఓ చట్టాన్ని తెచ్చింది. ఎక్కడా ఆ చట్టం అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదు. లాభాపేక్షలేని ప్రభుత్వమే రైతుల సంరక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలి. పటిష్ట చట్టాలను పట్టుకురావాలి. -
తీవ్ర విషాదం.. 20 మంది రైతులు మృతి
-
తీవ్ర విషాదం.. 20 మంది రైతులు మృతి
ముంబయి : మహారాష్ట్రలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు ప్రభావంతో 20 మంది రైతులు మృత్యువాతపడ్డారు. మరో 700 మంది రైతులకు తీవ్ర అస్వస్థత ఏర్పడింది. యావత్మాల్ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పురుగుల మందు ప్రభావం కారణంగా మరో 25 మంది రైతులకు కంటి చూపు కూడా పోయిందని తెలుస్తోంది. రోజుకు కేవలం రూ.200 నుంచి రూ.250ల కూలి వస్తుందని, దాంతో తమ జీవనం గడుస్తుందని ఆశతో వ్యవసాయం సాగని రైతులు, విధిలేక పనిబాటపట్టిన రైతులు పత్తి చేలల్లో పురుగుల మందు కొట్టే పనులకు వెళుతున్నారు. విదర్భ, యావత్మాల్ ప్రాంతాల్లోని వారంతా ఈ పనుల్లో నిమగ్నంకాగా ఆ పురుగుల మందు బారిన పడిని అనుకోని మరణాల బారిన పడుతున్నారు. -
నందవరంలో విషాదం
- పొలానికి మందు పిచికారీ చేసేందుకెళ్లి అస్వస్థతకు గురైన భార్యా భర్తలు - చికిత్స పొందుతూ భార్య మృతి - భర్త పరిస్థితి విషమం నందవరం : నందవరంలో విషాదం చోటు చేసుకుంది. పత్తి పంటకు పురుగు మందు పిచికారీ చేయడానికి వెళ్లిన భార్యాభర్త తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒకరి మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. మండలకేంద్ర నందవరంలోని చాకలి గేరిలో నివసించే వీరాంజినేయులు, ఆదెమ్మ భార్య,భర్తలు. వీరికి ఏడాది కుమారుడు ఉన్నాడు. పత్తి పంటకు పురుగుల మందు పిచికారీ చేయడానికి మంగళవారం వారు పొలానికి వెళ్లారు. పంటకు పిచికారీ చేసి సాయంత్రం ఇంటికి ఆలస్యంగా వచ్చారు. భార్య,భర్తలిద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆదెమ్మ (24) తుది శ్వాస విడిచింది. భర్త వీరాంజినేయులు మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ జగన్మోహన్ తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. -
పురుగుమందు తాగి తల్లీ్లబిడ్డ ఆత్మహత్య
త్రిపురాంతకం మండలం రాజుపాలెంలో విషాదం త్రిపురాంతకం : ఆ తల్లికి వచ్చిన కష్టం ఏమిటో తెలియదుగానీ తీవ్ర మనస్తాపంతో బిడ్డకు పురుగుమందు పట్టించి తానూ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర సంఘటన మండలంలోని రాజుపాలెంలో ఆదివారం జరిగింది. ఎస్ఐ త్యాగరాజు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అలవాల విజయసారథిరెడ్డి గుంటూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి గుంటూరులోనే కాపురం ఉండేవాడు. ఇటీవల కుటుంబమంతా గ్రామానికి వచ్చిది. దంపతుల మధ్య జరిగిన గొడవతో ఆయన భార్య కావ్య (25) తీవ్ర మనస్తాపం చెందింది. దీంతో ఆమె పురుగుమందు తాగి కుమారుడు వర్షిత్(2)తో కూడా తాగించింది. బంధువులు గమనించి వారిని చికిత్స కోసం గుంటూరు జిల్లా వినుకొండ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ తొలుత తల్లి మృతి చెందింది. ఆ తర్వాత కొద్దిసేపటికి కుమారుడు కూడా తనువు చాలించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ త్యాగరాజు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. తల్లీకుమారుడు ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
ఆస్తి ఇవ్వలేదని అఘాయిత్యం
- కుటుంబ సభ్యులను చంపి.. తానూ ఆత్మహత్య చేసుకునేందుకు ఓ మహిళ యత్నం – అన్నంలో పురుగు మందు కలిపిన వైనం - దాన్ని తినడంతో అస్వస్థతకు గురైన ఇద్దరు పిల్లలు, సదరు మహిళ – వారిలో ఒకరి పరిస్థితి విషమం ఆలూరు రూరల్ : అత్తా మామ తమకు ఆస్తి పంచివ్వలేదన్న కోపంతో ఓ మహిళ అఘాయిత్యానికి ఒడిగట్టింది. తనతో పాటు భర్త, నలుగురు పిల్లలు చనిపోవాలన్న ఉద్దేశంతో అన్నంలో పురుగు మందు కలిపింది. ఆ అన్నం తిన్న తను, ఇద్దరు పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. భర్త, మరో ఇద్దరు పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన గురువారం హొళగుంద మండలం సుళువాయి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పెద్ద ఉసేన్షా, ఫాతిమా దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద ఉసేన్షాకు 20 ఎకరాల పొలం ఉంది. ముగ్గురు కుమార్తెలకు పెళ్లి చేశాడు. కుమారుడు వన్నూరుసాబ్కు కూడా 13 ఏళ్ల క్రితం కర్ణాటకలోని బండరాళ్ల గ్రామానికి చెందిన షాషాబీతో వివాహం చేశాడు. వివాహం తర్వాత రెండేళ్లకు కుమారుడితో వేరుకాపురం పెట్టించారు. కొడుకు, కోడలు అదే ఇంట్లోనే ఒక భాగంలో వేరు కాపురం ఉంటున్నారు. వారికి కూడా ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె కలిగారు. కాగా..పెద్ద ఉసేన్షా తన భూమిలో ఎకరా చొప్పున ముగ్గురు కుమార్తెలకు మూడెకరాలు రాసిచ్చాడు. హొళగుందలో ఉన్న విలువైన స్థలాన్ని కూడా అమ్మేసి.. వచ్చిన మొత్తాన్ని కుమార్తెలకు ఇచ్చేశాడు. వారి పిల్లలను కూడా మంచి చదువులు చదివించేలా ప్రోత్సహించాడు. దీన్ని జీర్ణించుకోలేని వన్నూరుసాబ్ తన తండ్రితో ఆస్తి విషయమై గొడవ పడుతూ వచ్చాడు. కనీసం పది ఎకరాల భూమినైనా తన పేరుమీద చేసివ్వాలని కోరాడు. ఇందుకు తండ్రి తిరస్కరించాడు. తనకు ఆస్తి ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడన్న బాధతో వారం క్రితం తండ్రితో వన్నూరుసాబ్ గొడవపడ్డాడు. దీంతో పెద్ద ఉసేన్షా హొళగుంద పోలీస్స్టేషన్కు వెళ్లి కుమారుడిపై కేసు నమోదు చేయించాడు. ఈ కేసు విషయంలో రెండు రోజులక్రితం వన్నూరుసాబ్, అతని భార్య షాషాబి, పిల్లలు హొళగుంద స్టేషన్కు వెళ్లారు. జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపారు. పోలీసులు కూడా కుమారునికి ఎంతోకొంత ఆస్తి ఇస్తే పిల్లలు, భార్యను పోషించే అవకాశం ఉంటుందని ఉసేన్షాకు సూచించారు. అయినా అతను వినలేదు. ఆస్తి ఇచ్చేది లేదని తెగేసి చెప్పాడు. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన షాషాబి గురువారం ఉదయం అన్నంలో పత్తి పైరుకు వేసే రిజైంట్ అనే పురుగుమందును కలిపింది. పొలానికి బయలుదేరిన భర్త, మూడో కుమారుడు సుభాన్, కుమార్తె మున్నీకి ఆ అన్నం క్యారియర్ను ఇచ్చి పంపింది. తాను ఆలస్యంగా వస్తానని చెప్పింది. ఇంటిలో ఉన్న పెద్దకుమారుడు ఉసేన్పీరా, చిన్నకుమారుడు ఉసేన్సాబ్కు ఆ అన్నాన్నే పెట్టింది. కాసేపటికి వారు అస్వస్థతకు గురి కాగా.. ఆ వెంటనే తను కూడా తినింది. కడుపులో మంటగా ఉండడం, పిల్లలు అస్వస్థతకు గురై కళ్ల ముందే బాధ పడుతుంటే చూడలేక విషయాన్ని ఇరుగూపొరుగు వారికి చెప్పింది. వారు పొలంలోకి వెళ్లి ఆమె భర్త, ఇద్దరు పిల్లలు పురుగు మందు కలిపిన అన్నం తినకుండా చూశారు. మరి కొందరు షాషాబీని, మిగిలిన ఇద్దరు కుమారులను చికిత్స కోసం ఆలూరు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వీరిలో పెద్దకుమారుడు ఉసేన్పీరా పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. షాషాబి, చిన్న కుమారుడు ఉసేన్సాబ్ ఆరోగ్యం కుదుట పడిందని ఆలూరు ఆస్పత్రి వైద్యసిబ్బంది తెలిపారు. -
కూల్ డ్రింక్ అనుకుని..
పురుగు మందు తాగి బాలుడి మృతి కట్టంగూర్: కూల్ డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగి బాలుడు మృతిచెందాడు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం బొల్లేపల్లి గ్రామానికి చెందిన ముశం నరేశ్ కూరగాయల చెట్లకు మందును పిచికారీ చేసి మిగిలిన మందును కూల్డ్రింక్ బాటిల్లో పోసి ఇంట్లో పెట్టాడు. నరేశ్ కుమారుడు భాను ప్రసాద్ (5) బుధ వారం ఇంట్లో ఉన్న ఆ బాటిల్ను చూసి కూల్ డ్రింక్ అనుకుని తాగాడు. కొద్దిసేపటికే బాలుడు కడుపులో అదో మాదిరిగా ఉంద ని తండ్రితో చెప్పాడు. దీంతో తండ్రి వెంటనే స్థానిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లాడు. పరిస్థితి విషమించటంతో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
వేధింపులతో వివాహిత ఆత్మహత్య
ఆస్పరి: వేధింపులు తాళలేక తంగరడోణ గ్రామానికి చెందిన ఉరకుందమ్మ (28) అనే మహిళ ఆదివారం పొలంలో పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.ఎస్ఐ వెంకటరమణ తెలిపిన వివరాల మేరకు.. పెద్ద కడుబూరు మండలం దొడ్డిమేకల గ్రామానికి చెందిన ఉరుకుందమ్మను, ఆస్పరి మండలం తంగరడోణ గ్రామానికి చెందిన హుసేనితో పది సంవత్సరాలు క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ఉరుకుందమ్మను భర్త హుసేని, అత్త శాంతమ్మ, మామ రామలింగప్ప, మరిది నరసింహులు అదనపు కట్నం తేవాలని వేధింపులకు గురి చేసేవారని ఎస్ఐ తెలిపారు. వేధింపులు తాళలేక మనస్తాపానికి గురైన ఉరుకుందమ్మ పొలంలో పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త, అత్త, మామ, మరిదిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. మృతి దేహన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
జొన్నగిరి ఎస్ఐపై సస్పెన్షన్ వేటు?
తుగ్గలి : జొన్నగిరి ఎస్ఐ మారుతీశంకర్పై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. వారం క్రితం చిగుర్లగుట్ట తండాకు చెందిన జయరాంనాయక్, అతని తల్లిదండ్రులపై అతని భార్య పార్వతి.. జొన్నగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వేధింపులకు గురిచేయడంతో పాటు, ఇటీవల రాజీ అయినట్లు నమ్మించి మోసగించారని భర్త, అత్తమామలపై కేసు పెట్టింది. ఈ కేసుకు సంబంధించి విచారణ పేరుతో ఎస్ఐ మారుతీ శంకర్ స్టేషన్కు పిలిపించి జయరాంనాయక్ను చితకబాదాడు. దీంతో మనస్తాపానికి గురైన జయరాంనాయక్ పురుగుల మందు తాగాడు. కర్నూలులో చికిత్స పొందుతున్న బాధితుడు ఎస్ఐ వేధింపులు భరించలేకే ఈ అఘాయిత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. విచారించిన పోలీసు ఉన్నతాధికారులు మార్చి 31న సస్పెండ్ చేస్తూ శిక్షణలో ఉన్న ఎస్ఐకి ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. -
వ్యక్తి ఆత్మహత్య
- మురుగు కాలువ విషయంలో గొడవ నందవరం: మండల పరిధిలోని టి.సోమలగూడూరు గ్రామానికి చెందిన నరసింహులు(48) అనే వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ జగన్మోహన్ బుధవారం విలేకరులకు తెలిపారు. అదే గ్రామానికి చెందిన శీను, పెద్దయ్య, మల్లన్న, నరసింహులు మధ్య మురుగు కాలువ నీటి విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. నిందితులు.. నరసింహులును నానాదుర్బాషలాడడంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. పురుగు మందు తాగడంతో గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూమృతి చెందాడు. కుమారుడు శ్రీరాములు ఫిర్యాదు మేరకు ముగ్గురి నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
కౌలురైతు ఆత్మహత్య
పాణ్యం : గడివేముల మండలం పెసరవాయి గ్రామ సమీపంలో ఓ కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ రామాంజినేయరెడ్డి వివరాల మేరకు.. నంద్యాల మండలం కొత్తపల్లికి చెందిన వడ్డే ఖాదర్(61) పెసరవాయి గ్రామ పరిధిలో 4.50 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని పంటలు సాగు చేశాడు. పైరు సరిగా లేకపోవడంతో తొలగించి కొర్ర వేశాడు. ఇందుకోసం రూ. 6లక్షల వరకు అప్పు చేశాడు. పొలానికి వెళ్తున్నట్లు చెప్పి శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన ఖాదర్ తర్వాత రాలేదు. శనివారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు ఖాదర్ మృతదేహాన్ని గమనించి కుటుంబీకులకు సమాచారం అందించారు. కుమారుడు శివశంకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
న్యాయమూర్తి మందలించారని..
కొత్తూరు(శ్రీకాకుళం జిల్లా): న్యాయమూర్తి మందలించారని ఓ వ్యక్తి , న్యాయమూర్తి ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. హిర మండలానికి చెందిన చెక్క సోమేశుకు 2009లో వివాహం అయింది. ఆడబిడ్డ పుట్టిన తర్వాత భార్యను వదిలి ఒంటరిగా ఉంటున్నాడు. దీంతో భరణం కోసం కోర్టుకు వెళ్లిన ఆయన భార్యకు నెలకు రూ.600 భరణంగా చెల్లిస్తున్నాడు. అయితే ఈ డబ్బులు సరిపోవడం లేదని నెలకు మూడు వేల రూపాయిలు ఇవ్వాలని భార్య మళ్లీ కోర్టుని ఆశ్రయించింది. కోర్టు భార్య అభ్యర్థన మేరకు రూ.3 వేలు చెల్లించాలని తీర్పు ఇచ్చింది. వ్యవసాయ కూలీ అయిన తాను అంత మొత్తం ఇవ్వలేనని కోర్టులో చెప్పగా జడ్జి మందలించారు. దీంతో మనస్తాపం చెందిన సోమేశు వెంట తెచ్చుకున్న పురుగుల మందు జడ్జి ముందే తాగాడు. అక్కడ ఉన్నవారు వెంటనే కొత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
మహిళ ఆత్మహత్య
గోస్పాడు: మండల పరిధిలోని జూలేపల్లె గ్రామానికి చెందిన ఉమాదేవి(35) ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాల మేరకు కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్న ఉమాదేవి పలు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంది. అయినా ఫలితం లేకపోవడంతో విరక్తి చెంది పురుగు మందు తాగింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కర్నూలుకు తరలిస్తుండగా మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మందు కలిపిన నీటిని తాగి మృతి
గూడూరు: దాహం తీర్చుకోవడంలో భాగంగా పొలం వద్ద మందు కలిపి ఉంచిన నీటిని తాగి ఓ రిటైర్డ్ సీఐ మరణించారు. ఈ ఘటన గూడూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కర్నూలు ట్రాఫ్రిక్ సీఐగా పని చేసిన ఇదూర్ సాహెబ్ (62)కు గూడూరు సమీపంలో పొలం ఉంది. తరచూ పొలం పనులు చూసుకోవడానికి కర్నూలు నుంచి గూడూరుకు వస్తుండేవాడు. ఈ నెల 17న పొలంలో పని చూసుకుంటూ దాహం వేయడంతో గదిలో ఓ డబ్బాలో ఉన్న మందు కలిపిన నీటిని పొరపాటున తాగాడు. తర్వాత కొద్ది సేపటికి అపస్మారక స్థితికి చేరుకోవడంతో కూలీలు గుర్తించి కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. కుమారుడు మాణిక్ బాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పవన్ కుమార్ తెలిపారు. -
పురుగు మందుతాగి వ్యక్తి ఆత్మహత్య
గుంటూరు రూరల్ : పురుగు మందుతాగి ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. నల్లపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని అడవితక్కెళ్ళపాడుకులోగల రాజీవ్ గృహకల్పలో నివశించే షేక్ నాగుల్మీరా(26)కు గత నాలుగేళ్ల కిందట స్థానికంగా నివశించే షబానాతో వివాహమైంది. నాగూల్మీరా ఆటో డ్రైవర్గా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఇంటికి వచ్చి రాత్రి సమయంలో అందరూ నిద్రిస్తుండగా పురుగు మందుతాగాడు. దీంతో వాంతులు చేసుకుంటున్న అతనిని బంధవులు గుర్తించి చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకుగల కారణాలు తెలియవని ఇంట్లో, బయట అందరితో బాగానే ఉంటాడని భార్య తెలిపిందని పోలీసులు తెలిపారు. -
ప్రేమికుల ఆత్మహత్యాయత్నం
- ప్రియురాలు మృతి - ప్రాణాపాయ స్థితిలో ప్రియుడు - కడుపునొప్పి తాళలేక కుమార్తె మృతిచెందినట్లు తల్లి ఫిర్యాదు - కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు మండ్లెం(జూపాడుబంగ్లా): పెద్దలను ఒప్పించలేక..ఇద్దరు ప్రేమికులు పురుగు మందుతాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో ప్రియురాలు మృతి చెందగా..ప్రియుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్లాడతన్నాడు. పోలీసులు, గ్రామస్తులు, కుటుంబసభ్యుల తెలిపిన వివరాల మేరకు...మండ్లెం గ్రామానికి చెందిన మాసుం, మౌలాబీ దంపతుల కుమార్తె జరీనా(15), అదే గ్రామానికి చెందిన సుంకన్న కుమారుడు సుధాకర్(17) ప్రేమించుకున్నారు. తండ్రి మరణించటంతో తల్లి అదుపాజ్ఞలో ఉంటూ జరీనా.. పొలం పనులకు వెళ్లేది. సుధాకర్.. జూపాడుబంగ్లా మోడల్ పాఠశాలలో ఇంటర్ ద్వితీయసంవత్సరం విద్యను అభ్యసిస్తూ తల్లిదండ్రులకు చేదోడు వాడోదుగా అప్పుడప్పుడు పొలం పనులకు వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో జరీనా, సుధాకర్ల మధ్య ఆకర్షణ.. ప్రేమగా మారింది. పెద్దలకు తెలియకుండా ఇద్దరూ.. తిరిగేవారు. మంగళవారం ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇద్దరూ ఒక చోట కలుసుకొని తమ వివాహం గురించి చర్చించుకున్నారు. పెద్దల్ని ఎదిరించి వివాహం చేసుకొనే ధైర్యం లేక మంగళవారం సాయంత్రం పురుగుల మందుతాగి ఇంటికి చేరుకున్నారు. తల్లి గమనించè కపోవటంతో జరీనా మృతిచెందగా సుధాకర్ తల్లిదండ్రులు గమనించటంతో అతన్ని చికిత్సనిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం బయటకు పొక్కితే పరువుపోతుందనే ఉద్దేశంతో మౌలాబీ.. తమ కుమార్తె కడుపునొప్పి తాళలేక పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు. -
వృద్ధురాలి ఆత్మహత్య
డోన్ టౌన్: డోన్ మండలం ధర్మవరం గ్రామంలో ఆదివారం ఓ వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడింది. డోన్ రూరల్ ఎస్ఐ రామసుబ్బయ్య తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన రాములమ్మ (60) శనివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో క్రిమిసంహారక మందు తాగింది. వెంటనే బంధువులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక ఆదివారం మృతిచెందింది. కుమారుడు బోయ రామచంద్రుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కడుపునొప్పి తాళలేక వృద్ధురాలు మృతిచెందినట్లు విలేకరులకు వెల్లడించారు. -
అమ్మా, నాన్న.. క్షమించండి!
– పూడిచెర్ల యువకుడు కాకినాడలో ఆత్మహత్య ఓర్వకల్లు: కష్టపడి చదివి రైల్వే శాఖలో ఎనిమిది నెలల క్రితం ఉద్యోగం సంపాదించిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘ అమ్మ నాన్న క్షమించండి.. నా చావుకు ఎవరూ కారకులు కాదు’ అని సూసైడ్ నోట్ రాశాడు. పూడిచెర్ల గ్రామానికి చెందిన గొల్ల వెంకటరాముడు, లక్ష్మీదేవి దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. కుమారులను ప్రయోజకులను చేయాలని వెంకటరాముడు అప్పులు చేసి చదివించాడు. అప్పుల భారంతో తమకున్న మూడు ఎకరాల భూమిని కూడా అమ్మేశాడు. తల్లిదండ్రుల కష్టాన్ని వమ్ము చేయకుండా పెద్ద కుమారుడు గోపాల్(27) ఏడాది క్రితం ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. తొలి ప్రయత్నంలోనే రైల్వేలో ఎనిమిది నెలల క్రితం ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రైల్వే విభాగంలో ట్రాక్మెన్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో డిసెంబరు 31వ తేదీన పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులకు సమాచారం వచ్చింది. విషయం తెలిసిన వెంటనే కుటుంబీకులు హుటాహుటిన కాకినాడకు చేరుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీసినా ఫలితం లభించలేదు. దీంతో గోపాల్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అక్కడి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిర్వహించారు. మంగళవారం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు చేశారు. ఉద్యోగం చేసి తమ కష్టాలు తీరుస్తారనుకున్న కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
యువకుడి బలవన్మరణం
బానకచెర్ల(పాములపాడు): తల్లిదండ్రులు కుదిర్చిన వివాహం ఇష్టం లేక సయ్యద్ ఫరూక్బాషా(20)అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం మండలంలోని భానకచెర్ల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సయ్యద్ ఫరూక్బాషా ఓర్వకల్లు మండలం కాల్వ గ్రామానికి చెందిన వాడు.నాలుగు నెలల క్రితం కర్నూలు పట్టణానికి చెందిన యువతితో వివాహం చేసేందుకు తల్లిదండ్రులు నిశ్చయించారు. వివాహం ఇష్టం లేక ఈనెల 15న పాములపాడు మండలం భానకచెర్ల గ్రామంలో ఉన్న తన అక్క, బావచాంద్బాషల వద్దకు వచ్చాడు. తనకు కుదిర్చిన వివాహం ఇష్టం లేదని తన అక్క బావలకు తెలిపారు. ఉదయమే ఊరికి వెళ్తున్నానని చెప్పి బయలు దేరాడు. వేంపెంట గ్రామం వద్ద పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని కుటుంబీకులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. స్థలం వివరాలు చెప్పకపోవడంతో కుటుంబ సభ్యులు భానకచెర్ల గ్రామం చుట్టూ గాలించారు. చివరకు సాయంత్రం వేంపెంట వద్ద విగతజీవిగా కనిపించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతుడి తండ్రి ఖాజామొహిద్దిన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రైతు ఆత్మహత్యాయత్నం
వెల్దుర్తి రూరల్: మండల కేంద్రమైన వెల్దుర్తిలో బుధవారం ఉలిందకొండకు చెందిన తెలుగు వెంకటేశ్వర్లు (35) అనే రైతు పురుగు మందు తాగి ఆత్యహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సమీప బంధువుల పొలం 5 ఎకరాలను కౌలుకు తీసుకుని వెంకటేశ్వర్లు వ్యవసాయం చేసేవాడు. ఈ ఖరీఫ్లో వేసిన కంది పంట ఎండిపోయి అప్పుల పాలయ్యాడు. తిరిగి అప్పుచేసి వెల్దుర్తి పరిసర ప్రాంతాల్లో మిరపకాయల వ్యాపారం చేసేవాడు. ఇతనికి రూ.3లక్షల వరకు అప్పులున్నట్లు సమాచారం. బుధవారం ఇంటి నుంచి బయలుదేరి వెల్దుర్తి పాతబస్టాండు సమీపంలోని తెలుగుతల్లి విగ్రహం అకస్మాత్తుగా పడిపోయాడు. అతని చేతుల్లో మద్యం బాటిల్తో పాటు పురుగుమందు డబ్బా కనిపించడంతో ఆత్మహత్యకు యత్నించాడని స్థానికులు గమనించారు. ట్రాఫిక్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు దస్తగిరి.. 108కి ఫోన్ చేయడంతో వాహనంలో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
కూలీల్లేకుండా పన్నెండెకరాల్లో పండ్ల సాగు!
- జీవామృతం, దశపత్ర కషాయాలతోనే సాగు - పనులన్నీ స్వయంగా రైతు సోదరులిద్దరే చేసుకుంటున్న వైనం - ఏడాదికి ఎకరా సాగు ఖర్చు రూ. 2 వేలకన్నా తక్కువే! -12 ఎకరాల పండ్ల తోట నుంచి ఏటా రూ. 3.25 లక్షల నికరాదాయం రసాయనిక ఎరువులు, పురుగుమందుల పేరిట వేలకు వేలు వెచ్చిస్తూ కూడా.. దిగుబడి లేక, ఆదాయం రాక కుంగిపోతున్న పండ్ల తోటల రైతులకు అప్పలస్వామి, నాగేశ్వరరావు సోదరుల ఉమ్మడి ప్రకృతి సేద్య ప్రస్థానం ఒక చక్కని పాఠం. తోటను అనుదినం కనిపెట్టుకొని ఉండి, స్వయంగా చెమటను చిందిస్తున్నారు. కూలీల అవసరం కూడా లేకుండా రైతు కుటుంబాలు అత్యంత తక్కువ ఖర్చుతో పండ్ల తోటను నిర్వహించడం ఎలాగో వీరు నిరూపిస్తున్నారు. పెట్టుబడి లేని ప్రకృతి సేద్యాన్ని కొత్తపుంతలు తొక్కిస్తూ.. మట్టిని నమ్ముకున్న రైతులకు ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. పన్నెండెకరాల పండ్ల తోటను నామమాత్రపు ఖర్చుతో సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు కొరిపల్లి అప్పలస్వామి, నాగేశ్వరరావు సోదరులు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం వెదురుపాక ఆయన స్వగ్రామం. వీరలంకపల్లి శివారు రామకృష్ణా గార్డెన్స్లో గత పదేళ్లుగా 12 ఎకరాలలో పండ్ల తోటలను సాగు చేస్తున్నారు. అది తెల్ల గరప భూమి. రెండు బావులు, ఒక బోరు ఉన్నాయి. మొక్కలు నాటిన మొదట్లో నాలుగేళ్లు రసాయనిక సేద్య పద్ధతులను అనుసరించారు. 30 బస్తాల వరకు రసాయనిక ఎరువులు వేసేవారు. రూ. 50 వేల వరకు ఖర్చు చేసి రసాయనిక పురుగుల మందులు చల్లేవారు. అలా కొన్ని మొక్కలు చనిపోవటం, మొక్కల పెరుగుదల నిలిచిపోవటంతో నాలుగేళ్ల తర్వాత అప్పలస్వామి సోదరులు ప్రకృతి సేద్యం వైపు మళ్లారు. గోమూత్రం, పేడతో వ్యవసాయం చేయడం ఏమిటని చుట్టుపక్కల రైతులు వేళాకోళం చేశారు. అయినా వారు పట్టించుకోలేదు. తొలినాళ్లలో మామిడి, జీడిమామిడి మొక్కలు మాత్రమే ఉన్నాయి. క్రమేణా సపోటా, నారింజ, బత్తాయి, పంపర పనస, పనస, నిమ్మ, దానిమ్మ, జామ, నేరేడు, పైనాపిల్, కొబ్బరి, ఉసిరి, బాదం, సీతాఫలం, రామఫలం, దబ్బ, అంజూర, డ్రాగన్ ఫ్రూట్, ఖర్జూరం వంటి పలు పండ్ల జాతులను ప్రకృతి సేద్యపద్ధతిలో సాగు చేస్తున్నారు. విత్తనాలు లేని నేరుడు, తేనె రుచిలో ఉండే కేరళ పనస, కూరల్లో వాడే సదా పనస.. పులుపు, పీచు ఎక్కువగా ఉండే పచ్చడి మామిడి వంటి ప్రత్యేక రకాల పంటలను సైతం సాగు చేస్తున్నారు. ఏడాదికి ఎకరా సాగు ఖర్చు రూ. 2 వేలు! దాదాపు పన్నెండెకరాల పండ్ల తోటలను ఈ రోజుల్లో నామమాత్రపు ఖర్చుతో సాగు చేయటం అంటే మాటలు కాదు. రసాయన ప్రకృతి సేద్య పద్ధతుల్లో సుదీర్ఘ అనుభవాలతో రాటు తేలిన అప్పలస్వామి సోదరులు ప్రత్యేక పంథాను అనుసరించారు. ప్రకృతి సేద్యం ప్రారంభించినప్పటి నుంచి రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా జీవామృతాన్ని చెట్లకు అందిస్తున్నారు. జీవామృతాన్ని అప్పలస్వామే స్వయంగా తయారు చేస్తారు. తన పొలంలో 200 లీటర్ల సామర్థ్యం గల ఆరు ప్లాస్టిక్ డ్రమ్ములను ఏర్పాటు చేసుకొని.. వాటిల్లో జీవామృతం తయారు చేసుకుంటారు. వారంలో ఆరు రోజులు రోజుకొక డ్రమ్ములోని జీవామృతాన్ని పండ్ల మొక్కలకు పోస్తారు. ఖాళీ అయిన డ్రమ్ములో తిరిగి కొత్తగా జీవామృతం కలుపుతూ ఉంటారు. ఏడాదిలో నికరంగా పది నెలల పాటు చెట్లకు జీవామృతం అందిస్తారు. డ్రమ్ము జీవామృతం తయారీకి పది కిలోల తమ నాటు ఆవు పేడ, 10 లీటర్ల ఆవు మూత్రంతోపాటు కిలో బెల్లం, కిలో శనగపిండి వాడతారు. ఏడాదికి 3 క్వింటాళ్ల శనగపిండి అవసరమవుతుంది. రూ. 16,500 ఖర్చవుతుంది. కిలో నల్ల బెల్లం రూ. 15 చొప్పున ఆరు నెలలకు సరిపడా 180 కిలోల బెల్లానికి రూ. 2,500 వరకు ఖర్చవుతుంది. మరో ఆరు నెలలు బెల్లానికి బదులు తోటలో మిగల పండిన మామిడి, సపోటా పండ్లను జీవామృతం తయారీలో వాడతారు. రూ. 3 లక్షలకు పైగా నికరాదాయం... వీరి తోటలో సపోటా, కొబ్బరి, నిమ్మ, మామిడి చెట్ల నుంచి పండ్ల దిగుబడి వస్తోంది. సపోటా కాయ రూ. 5 చొప్పున అమ్ముతున్నారు. ఏడాదికి రూ. లక్ష ఆదాయం వస్తోంది. కొబ్బరిలో ఏడాదికి రూ. 50 వేల ఆదాయం వస్తోంది. ఎకరాకు 20 మామిడి చెట్లున్నాయి. రసాయన సేద్యంలో పండించిన కాయలు ఒక్కోటి రూ. 15 చొప్పున విక్రయిస్తుండగా ప్రకృతి సేద్యంలో పండించిన వాటిని కాయ రూ. 40 చొప్పున విక్రయిస్తున్నారు. ఏడాదికి రూ. 2 లక్షల ఆదాయం లభిస్తోంది. మొత్తం 12 ఎకరాల సాగుకు అయ్యే రూ. 25 వేల ఖర్చు పోను.. రూ. 3.25 లక్షల నికరాదాయాన్ని అప్పలస్వామి ఆర్జిస్తున్నారు. ప్రయాస లేని మార్కెటింగ్.. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన నాణ్యమైన పండ్లు కావడంతో స్థానికంగానే వీటికి మంచి గిరాకీ ఏర్పడింది. ఇవి రుచి బావుండటం, కాయలు పెద్దగా ఉండటంతోపాటు ఎక్కువ రోజులు నిల్వ ఉంటున్నాయి. పండ్ల నాణ్యతను గుర్తించిన వినియోగదారులు పొలం వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. అడపాదడపా హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే, నిమ్మకాయలను మాత్రం మార్కెట్లో మామూలు కాయలతో పాటే సాధారణ ధరకే అమ్ముకోవాల్సి వస్తోందని అప్పలస్వామి తెలిపారు. నిమ్మకాయలు ఇతర పండ్లలా విడిగా రుచి చూసేవి కాకపోవటంతో.. ఆర్గానిక్ అన్నా ప్రత్యేకంగా కొనేందుకు ఎవరూ ముందుకు రావటం లేదని ఆయన చెప్పారు. ఆ క్షేత్రం.. ప్రయోగాలకు ఆలవాలం.. మామిడి మొక్కలు గుప్పెడు లావు వూరే వరకు కర్రతో ఊతం ఏర్పాటు చేశారు. మామిడి చెట్టుకు కొమ్మలు అస్తవ్యస్తంగా పెరగనిస్తే.. చెట్టు కాండం లావు వూరదు. దీన్ని నివారించేందుకు ఐదడుగుల మేర ఎలాంటి కొమ్మలు ఉంచరు. యాభై ఏళ్లు పెరిగిన మామిడి చెట్టును అమ్ముకుంటే.. కలప ద్వారానే రైతుకు రూ. లక్ష ఆదాయం వస్తుందని అప్పలస్వామి చెప్పారు. ఈ తోటలో 20 ఏళ్ల పనస చెట్టుకు నాలుగేళ్ల నుంచి కాపు పూర్తిగా నిలిచిపోయింది. చెట్టును నరికివేయాలనుకున్న పరిస్థితుల్లో స్నేహితుడి సూచన మేరకు.. ఇసుక నింపిన 5 బస్తాలను చెట్టు కొమ్మలపై ఉంచారు. దాంతో కాపు వచ్చి 13 కాయలు కాశాయి. ఈ ఏడాది దీనిపై మరింత పరిశోధన చేయనున్నట్టు ఆయన తెలిపారు. తోటలో ప్రత్యేకంగా పెంచిన గిరిపుష్పం (గ్లైరీసీడియా) చెట్ల కొమ్మలను నరికి చెట్ల పాదుల్లో ఆచ్ఛాదనగా వేస్తారు. దీనివల్ల పాదుల్లో తేమ నిల్వ ఉంటుంది. నత్రజని తదితర పోషకాలతో కూడిన ఆకులు భూమిలో కలిసిపోయి భూసారాన్ని పెంపొందిస్తాయి. తన ఆవులు, గిత్తలను రోజుకో చెట్టుకు చొప్పున కట్టేసి ఉంచుతారు. వాటి పేడ, మూత్రం పాదుల్లో పడి చెట్లకు మంచి ఎరువుగా ఉపయోగపడుతున్నది. ఈ పద్ధతిని అనుసరిస్తున్నందు వల్ల పండ్ల చెట్లకు ప్రత్యేకంగా ఘన జీవామృతం తయారు చేసి వేయాల్సిన అవసరం లేదని అప్పలస్వామి చెప్పారు. సూక్ష్మజీవుల కోసం శాస్త్రీయ సంగీతం..! భూమికీ ప్రాణం ఉంటుంది. సుఖం, దుఃఖం, సంతోషం, బాధ వంటి భావోద్వేగాలుంటాయన్నది అప్పలస్వామి ప్రగాఢ నమ్మకం. పొలంలో మైక్ ఏర్పాటు చేసి ప్రవచనాలు, భగవద్గీత, శాస్త్రీయ సంగీతాన్ని వినిపిస్తున్నారు. దీనివల్ల మట్టిలోని సూక్ష్మజీవులు చైతన్యవంతమై భూమిలో జీవం తొణికిసలాడుతుందని ఆయన అంటారు. తద్వారా పంట దిగుబడులు కూడా పెరుగుతున్నాయంటారు అప్పలస్వామి. చినజీయర్స్వామి, ప్రకృతి వ్యవసాయంపై ప్రభుత్వ సలహాదారు పి.విజయ్కుమార్, అప్పలస్వామి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి అభినందించారు. ప్రకృతి వ్యవసాయంపై నెల్లూరు, తిరుపతికి చెందిన రైతులకు ఈ తోటలో శిక్షణ ఇవ్వడం విశేషం. - లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి ప్రతినిధి, కాకినాడ ఇన్పుట్స్: కోన శ్రీనివాస్, సాక్షి, గోకవరం, తూ. గో. జిల్లా అతి తక్కువ ఖర్చు ఇలా సాధ్యం.. ఏడాదికి పదిసార్లు జీవామృతం, దశపత్ర కషాయాలను పిచికారీ చేస్తారు. విడతకు 5 లీటర్ల చొప్పున ఏడాదికి 50 లీటర్ల పెట్రోలుకు గాను రూ. 3,500 ఖర్చవుతుంది. శనగపిండి, బెల్లం, పెట్రోల్ అన్నింటికీ కలిపి పన్నెండెకరాల పండ్ల తోటకు ఏడాదికి రూ. 22,500 ఖర్చవుతుంది. అంటే ఏడాది సాగు ఖర్చు ఎకరాకు రూ. 2 వేల క న్నా తక్కువేనన్నమాట! ఒక మనిషి రోజుకొక టీ తాగడానికి ఏడాదికి హీన పక్షం రూ. 2 వేలకు పైగా ఖర్చవుతుంది. ఈ పరిస్థితుల్లో సాగు వ్యయాన్ని ఒడుపుగా తగ్గిస్తూ పన్నెండెకరాల్లో పండ్ల తోటలను అప్పలస్వామి సోదరులు పొందికగా సాగు చేస్తుండడం విశేషం. మొక్కల వయసును బట్టి చెట్టుకు 5-10 లీటర్ల చొప్పున జీవామృతం పోస్తారు. ఇలా 12 ఎకరాల తోటలోని మొక్కలన్నింటికి ఒక విడత జీవామృతం పోయటానికి నెల సమయం పడుతుంది. రసాయన సేద్యంలో ఎంత లేదన్నా ఎకరాకు ఎరువులు, పురుగుమందులకు ఏడాదికి రూ. 10 వేలకు తక్కువ ఖర్చు కాదు. జీవామృతం తయారీకి అవసరమైన గట్టు మన్ను, ఆవు పేడ, మూత్రం పొలంలోనే లభిస్తాయి. 50 కిలోల బెల్లం, శనగ పిండిని కొనుగోలు చేస్తారు. నాణ్యమైన శనగ పిండి కోసం శనగపప్పును కొని మర పట్టిస్తారు. విడతకు ఎకరాకు చీడపీడల నివారణకు 200 లీటర్ల జీవామృతం, 10 లీటర్ల గో మూత్రం, 5 లీటర్ల దశపత్ర కషాయం కలిపి... చెట్లు మొత్తం తడిచేలా పిచికారీ చేస్తారు. చెట్లు పూత, కాత మీదున్నప్పుడు 15 రోజులకోసారి పిచికారీ చేస్తారు. మిగిలిన రోజుల్లో మాత్రం చీడపీడలు, తెగుళ్లు ఆశించినప్పుడు మాత్రమే పిచికారీ చేస్తారు. తోటలో ఏ పనైనా స్వయంగానే.. జీవామృతం మొక్కలకు బకెట్లతో స్వయంగా అప్పలస్వామే పోస్తారు. పిచికారీ కూడా స్వయంగా తానే చేస్తారు. పొలానికి నీరు పారగట్టటం, కాయలు కోయటం, కషాయాల తయారీ వంటి పనులను తమ్ముడు నాగేశ్వరరావుతో కలిసి స్వయంగా చేసుకుంటారు. కూలీలను పెట్టరు. మరీ అవసరమైతే ఇంటి ఆడోళ్లు పనుల్లో సహాయ పడతారని అప్పలస్వామి తెలిపారు. ఉచిత విద్యుత్ కావటంతో కరెంటు బిల్లు కట్టే అవసరం లేదు. పొలాన్ని దున్నాల్సిన అవసరం లేదు. పెరిగిన గడ్డిని ఎప్పటికప్పుడు ఆవులు మేసేస్తుంటాయి. దీంతో దుక్కికి అయ్యే ట్రాక్టర్ / అరకల ఖర్చు తప్పింది. పెట్టుబడి లేని ప్రకృతి సేద్యంలో పండ్ల దిగుబడి, రుచి పెరిగింది! రసాయన సేద్యంలో కన్నా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేపట్టాకే దిగుబడితో పాటు కాయల రుచి పెరిగింది. ఖర్చు పెద్దగా లేదు. రసాయన వ్యవసాయంలో వచ్చే పంట ఉత్పత్తులతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. ఆసుపత్రులు, వైద్యులు డబ్బుగడిస్తున్నారు. ప్రకృతి సేద్యాన్ని ఆచరిస్తే రైతు కుటుంబాలకు, ప్రజలకు హాస్పిటళ్ల గుమ్మం తొక్కే అవసరం ఉండదు. రసాయనాలతో పండించిన ఆహారం తిన్న మనిషిలాగే చెట్లకు కూడా రసాయనిక ఎరువులు, పురుగుమందుల వల్ల జబ్బు చేస్తుంది. కానీ, చెట్లు చెప్పలేవు.. మనిషి చెపుతాడు.. అంతే తేడా! - కొరుపల్లి అప్పలస్వామి (96661 50374) ప్రకృతి వ్యవసాయదారుడు, వెదురుపాక, గోకవరం మండలం, తూ.గో. జిల్లా -
పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం
టీడీపీ నాయకుల వేధింపులే కారణమంటున్న కుటుంబ సభ్యులు ఆలూరు: పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటన హాలహర్వి మండలం కుర్లేహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలోని శివాలయానికి చెందిన మాన్యం సర్వే నంబర్50/బిలో 2.43 ఎకరాల వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన రైతు శంభలింగ గత కొన్నేళ్లు నుంచి సాగుచేస్తున్నారు. ఈ భూమిని ఎలాగైనా శివాలయంలో ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్న ఉమాపతిస్వామికి ఇప్పించాలని అధికార తెలుగు దేశం పార్టీకి చెందిన నాయకులు దేవాదాయశాఖ అధికారులు, హాలహర్వి పోలీసులపై ఒత్తిడి తీసుకోవచ్చారు. దీంతో ఈ వ్యవసాయ భూమిపై తనకు హక్కులను రెవెన్యూ అధికారులు కల్పించారని రైతు శంభలింగ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణలో ఉండగానే సోమవారం రాత్రి హాలహర్వి పోలీసులు మాన్యం భూమిని వదిలేయాల్సిందిగా రైతును హెచ్చరించారు. దీంతో మానసిక ఒత్తిడికిగురైన శంభలింగ మంగళవారం ఉదయం పురుగుల మందును తాగి ఇంట్లో స్పృహ తపి్ప పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు బంధువుల సహాయంతో వైద్యం కోసం ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి డాక్టర్లు ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడు ఇక్కడ చికిత్స పొందుతున్నాడు. టీడీపీ నాయకుల వేధింపులు తాళలేకనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు శంభలింగం సూసైడ్ నోటు రాసినట్లు అతడి బంధువులు విలేకరులకు తెలిపారు. -
కుమార్తెలకు పురుగుల మందు తాపి..
ఆత్మహత్యకు యత్నించిన తల్లి – అపస్మారక స్థితిలో బాధితురాలు – చిన్నారుల పరిస్థితి విషయం – చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలింపు ఆదోని టౌన్: క్షణికావేశంతో ఓ తల్లి తన కుమార్తెలకు పురుగుల మందు తాపి..తానూ తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన బుధవారం ఆదోని పట్టణం శిల్పా సౌభాగ్యనగర్లో చోటు చేసుకుంది. టౌ టౌన్ సీఐ గంటా సుబ్బారావు, బాధితురాలి తండ్రి ఈరన్న తెలిపిన వివరాలు మేరకు..పట్టణంలోని ఆస్పరి రోడ్డు శిల్పా సౌభాగ్యనగర్లో నివాసం ఉంటున్న సంజమ్మ, తిప్పన్నలకు ముగ్గురు కుమారులు. వారి పెద్ద కుమారుడు వీరేష్కు ఆదోని మండలం పెసలబండ గ్రామానికి చెందిన గొల్ల సుజాత అలియాస్ ఉమాదేవితో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కుమార్తెలు ఇంద్రజ (3), వాణి(2)లకు పురుగు మందు తాపి..ఉమాదేవి సైతం తాగింది. ఇరుగు పొరుగు గమనించి కుటుంబ సభ్యలకు తెలియజేయడంతో ఆదోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.తల్లితోపాటు ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు కర్నూలుకు రెఫర్ చేశారు. బాధితురాలి తండ్రి ఈరన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నట్లు సీఐ గంటా సుబ్బారావు తెలిపారు. ఉమాదేవి భర్త పెద్దకడుబూరు మండలం కల్లుకుంటలో బేల్దారి పని చేస్తూ వారానికి ఒక సారి ఇంటికి వచ్చి పోయేవాడని సీఐ చెప్పాడు. కుటుంబ సమస్యల కారణంగానే ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోందన్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేపడితే వాస్తవాలు తేలుతాయన్నారు. -
యువకుడి బలవన్మరణం
టి.నరసాపురం: పొలం పనులు సరిగా చేయడం లేదని తల్లితండ్రులు మందలించారనే కోపంతో మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన టి.నరసాపురం మండలం బొర్రంపాలెంలో గురువారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. బొర్రంపాలానికి చెందిన కలపర్తి గంగరాజు కుమారుడు గోవర్దన (19) గురువారం ఉదయం పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు అతడ్ని జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రికి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఏలూరు తరలించారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొం దుతూ గోవర్దన మృతిచెందాడు. ఈ మేరకు ఆస్పత్రి నుంచి సమాచారం రావడంతో ఎస్సై కె.నాగేంద్రప్రసాద్ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. -
పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య
ఏలూరు అర్బన్ : ప్రమాదంలో గాయపడి వికలాంగుడైన ఓ వ్యక్తి కుటుంబ సభ్యులకు భారం కాకూడదనే భావనతో పురుగు మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. లింగపాలెం మండలం ధర్మాజీగూడెంకు చెందిన పామర్తి లక్షీ్మనారాయణ ( 37) కల్లుగీత కార్మికుడుగా గతంలో పనిచేసేవాడు. నాలుగేళ్ల క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వికలాంగుడుగా మారి ఏ పనీ చేయలేక ఇంటికే పరిమితమయ్యాడు. కుటుంబ సభ్యులకు భారంగా మారుతున్నాననే బాధతో మనోవ్యథకు గురయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దీనిని గమనించిన కుటుంబసభ్యులు బాధితుని ఏలూరు ్రçపభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో సోమవారం ఉదయం మరణించాడు. ధర్మాజీగూడెం ఎస్ఐ క్రాంతికుమార్ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తాగిన మైకంలో ఒకరి ఆత్మహత్య
జామాతండ (నెల్లికుదురు) : గుడంబాకు బానిసైన ఓ గిరిజనుడు తాగిన మైకంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని జామతండ శివారు తారాసింగ్ బావితండాలో శుక్రవారం రాత్రి జరిగింది. ఎస్సై గోదారి రాజ్కుమార్ కథనం ప్రకారం.. తండాకు చెందిన గుగులోతు వీరు నాయక్(35) తనకున్న రెండెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందుల తో గుడుంబాకు బానిసై ఇంట్లోఎవరూ లేని సమయంలో ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారంఅతడి భార్యపద్మఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.మృతుడికిఇద్దరు కుమారులు ఉన్నారు. -
అతిగా పిరికారీ చేస్తే అనర్థం
పురుగుమందుల కొనుగోలు, వాడకంపై జాగ్రత్తలు పాటించాలి జహీరాబాద్ ఏడీఏ వినోద్కుమార్ జహీరాబాద్ టౌన్: తెగుళ్ల నుంచి పంటలను కాపాడుకోవడానికి పురుగు మందులు పిచికారీ చేస్తాం. అయితే, వాటి కొనుగులుతో పాటు వాడకంలోనూ రైతులు జాగ్రత్తలు పాటించాలని జహీరాబాద్ వ్యవసాయ శాఖ ఏడీఏ వినోద్కుమార్(ఫోన్: 72888 94426) పేర్కొన్నారు. పంటలకు విచక్షణ రహితంగా పురుగు మందులు పిచకారి చేసినా ప్రమాదకరమని హెచ్చరించారు. మందులు కొనుగోలు చేసే ముందు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మందుల కొనుగోలులో మెలకువలు లైసెన్సు కలిగిన అధీకత డీలర్ వద్దే పురుగుమందులు కొనుగోలు చేయాలి. మందుల ప్యాకింగ్, డబ్బాలపై తయారీ తేది, గడువు పరిశీలించాలి. గడువు దాటిన ముందులను ఎట్టి పరిస్థితిల్లో తీసుకోవద్దు. నిర్ణీత ప్యాకింగ్, సీల్ ఉన్న ముందులనే కొనుగోలు చేయాలి. లీకేజీతో ఉన్న డబ్బాలను తీసుకోవద్దు. కొనుగోలు చేసే ముందు రశీదు, బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి. బిల్లులో మందు పేరు, కంపెనీ వివరాలు, బ్యాచ్ నంబర్, రైతు సంతకం మొదలైనవి ఉండాలి. రైతు నష్టపోయినప్పుడు నష్టపరిహారం పొందడానికి ఈ బిల్లు ఉపయోగపడుతుంది. మార్కెట్లోకి కొత్తగా వచ్చిన మందులను కొనేముందు వ్యవసాయ అధికారులను సంప్రదించడం ఉత్తమం. పిచికారీలో జాగ్రత్తలు సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించి, సిఫార్సు చేసిన మందులను మాత్రమే పంటలకు పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టే మందులను మందులు వాడాలి. తక్కువ కాలంలో విష ప్రభావం కోల్పోయే సస్యరక్షణ మందులు, బయోఫెస్టిసైడ్ మందులను మాత్రమే వాడాలి. వ్యవసాయ అధికారులు సూచించిన మోతాదులో, సరైన సమయంలో, సరైన స్ర్పేయర్ ఉపయోగించాలి. పంటలను కోసే ముందు సాధ్యమైనంత వరకు సస్యరక్షణ మందులను పిచికారీ చేయరాదు. పురుగు మందులను చల్లిన చోట పశువులను మేతకు తీసుకెళ్లరాదు. పురుగుమందు ఉపయోగించిన స్ప్రేయర్లను తాగు నీటి చెరువులు, కుంటల్లో శుభ్రం చేయరాదు. -
వేర్వేరుచోట్ల ముగ్గురి బలవన్మరణం
గణపురం : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు వ్యక్తులు ఆత్మç ßæత్యకు పాల్పడ్డారు. గణపురం మండలంలోని బస్వరాజ్పల్లి గ్రా మానికి చెందిన రిటైర్డ్ సింగరేణి కార్మికుడు బట్టు సమ్మయ్య అలి యాస్ అయిలయ్య(60) క్రిమిసంహారక మందు తాగి బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సమ్మయ్య ఇటీవల తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో నిత్యం భార్యతో గొడవపడేవాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం కూడా తాగొచ్చి భార్యతో గొడవపడి క్రిమిసంహారక మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ములుగు ప్రభుత్వాస్పత్రికి తరలించగా బుధవారం పరిస్థితి విషమించడంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, నలుగురు కుమారులు ఉం డగా, వారిలో ముగ్గురు మృతిచెందారు. ఒకరు ఉన్నారు. పోలీ సులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నపెండ్యాలలో ఉపాధ్యాయురాలు.. చిన్నపెండ్యాల(స్టేçÙన్ఘన్పూర్) : భర్త వేధింపులు భరించలేక ఓ ఉపాధ్యాయురాలు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని చిన్నపెండ్యాలలో మంగళవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... ఘన్పూర్కు చెదిన గుంటి లింగయ్య, ఎల్లమ్మ దంపతుల కూతురు రజిత(25)కు మండలంలోని చిన్నపెండ్యాలకు చెందిన బుల్లె అయిలయ్య, ఐలమ్మ దంపతుల కుమారుడు రవితో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి సంతానం లేకపోవడంతో గొడవలు మొదలయ్యాయి. ప్రతీ రోజు ఏదో ఒక విధంగా వేధిస్తుండడంతో రజిత అదే గ్రామంలోని శ్రీగాయత్రి పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేరింది. అయినా రాత్రి వేళలో వేధించేవాడు. దీంతో మనోవేదనకు గురైన రజిత మంగళవారం రాత్రి క్రిమిసంహారక మందుతాగింది. చుట్టుపక్కల వారు గమనించి వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. కేసు దర్యాప్తుచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శంకరాజుపల్లిలో వృద్ధురాలు.. ఏటూరునాగారం : వృద్ధాప్యంలో తనను చూసుకునేవారు లేకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన ఓ వృద్ధురాలు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని శంకరాజుపల్లిలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన గోనె సమ్మక్క(90) కొన్ని సంవత్సరాలుగా ఒంటరిగా జీవిస్తోంది. ఆమె ఆలనపాలన చూసే వారు లేకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుం ది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు. -
వేర్వేరుచోట్ల ముగ్గురి బలవన్మరణం
గణపురం : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు వ్యక్తులు ఆత్మç ßæత్యకు పాల్పడ్డారు. గణపురం మండలంలోని బస్వరాజ్పల్లి గ్రా మానికి చెందిన రిటైర్డ్ సింగరేణి కార్మికుడు బట్టు సమ్మయ్య అలి యాస్ అయిలయ్య(60) క్రిమిసంహారక మందు తాగి బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సమ్మయ్య ఇటీవల తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో నిత్యం భార్యతో గొడవపడేవాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం కూడా తాగొచ్చి భార్యతో గొడవపడి క్రిమిసంహారక మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ములుగు ప్రభుత్వాస్పత్రికి తరలించగా బుధవారం పరిస్థితి విషమించడంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, నలుగురు కుమారులు ఉం డగా, వారిలో ముగ్గురు మృతిచెందారు. ఒకరు ఉన్నారు. పోలీ సులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పురుగు మందు తాగి వ్యక్తి బలవన్మరణం
జిన్నూరు (పోడూరు) : జిన్నూరులో పురుగు మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. జిన్నారు గ్రామానికి చెందిన రావి యోహాను (54) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతని భార్య గల్ఫ్లో ఉంటుంది. ఏడేళ్లుగా ఆమె స్వగ్రామానికి రాలేదు. ఈ నేపథ్యంలో గల్ఫ్ నుంచి వచ్చేయాలని యోహాను కొంతకాలంగా భార్యను ఒత్తిడి చేస్తున్నాడు. అయినా ఆమె రాకపోవడంతో మనస్తాపం చెంది పురుగు మందు తాగాడు. స్థానికులు అతడ్ని పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. మృతునికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య
పరకాల: కడుపు నొప్పి భరించలేక ఓ వివాహిత పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని వెంకటేశ్వర్లపల్లిలో శనివారం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ కట్టయ్య కథనం ప్రకారం.. ఎరుకుల సుశీల, జయపాల్ దంపతుల కుమార్తె ప్రవళిక(26)ను అదే గ్రామానికి చెందిన గోనె రాజుకు ఇచ్చి ఏడేళ్ల క్రితం పెళ్లి చేశారు. ప్రవళిక, రాజు దంపతులకు ముగ్గురు కుమారులున్నారు. ప్రవళిక కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతోంది. ఈక్రమంలో శనివారం మధ్యాహ్నం కడుపు నొప్పి తీవ్రం కావడంతో భరించలేక, ఇంట్లో ఉన్న పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి జయపాల్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పురుగుమందు తాగి యువకుడి ఆత్మహత్య
ఇబ్రహీంపూర్(రఘునాథపల్లి) : మండలంలోని ఇబ్రహీంపూర్లో సుద్దాల రమేష్(25) అనే యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రమేష్ తండ్రి కొమురయ్య చిన్నతనంలోనే చనిపోవడంతో తల్లి లక్ష్మి కూలీనాలీ చేస్తూ కుటుంబాన్ని పోషించింది. నాలుగేళ్ల క్రితం రమేష్కు వివాహం జరిపించింది. రమేష్ దంపతుల మధ్య మూడేళ్ల క్రితం తగాదాలు తలెత్తాయి. దీంతో భార్య విడాకులు తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. మనోవేదనకు గురైన రమేష్ మద్యానికి బానిసయ్యాడు. సోమవారం రాత్రి మద్యం తాగి ఇంటికొచ్చి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారుజామున అతడిని నిద్రలేపేందుకు తల్లి వెళ్లగా, మృతిచెంది కనిపించాడు. ఎస్సై రంజిత్రావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కుమారుడి మృతిని తట్టుకోలేక తల్లి ఆత్మహత్య
పరకాల : కుమారుడి మృతిని తట్టుకోలేక ఓ తల్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పట్టణంలో జరిగింది. ఎస్సై రవీందర్ కథనం ప్రకారం.. పట్టణంలోని మాదారం కాలనీకి చెందిన గూడెల్లి సరోజన(45) చిన్నకుమారుడు రవి నెల రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. కుమారుడు మృతిచెందినప్పటి నుంచి సరోజన తాను కూడా చనిపోతానని రోదించేది. మతిస్థిమితం కోల్పోయినట్లు ప్రవర్తించేది. ఈ క్రమంలో ఈ నెల 8వ తేదీన దామెర చెరువు కట్ట వద్ద ఉన్న గౌడ కమ్యూనిటీ హాల్ వద్ద పురుగుల మందు తాగి పడిపోయింది. గమనించిన స్థానికులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ బుధవారం మృతిచెందింది. మృతురాలి పెద్దకుమారుడు సదయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
తహసీల్దార్ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం
దాయాదుల మధ్య భూ వివాదమే కారణం బాధితుడి పరిస్థితి విషమం బుద్ధారం సాదాబైనామాల గ్రామ సభలో ఘటన గణపురం : తనకు చెందిన భూమిని తనకు కాకుండా కొందరు గ్రామపెద్దలు అడ్డుపడుతున్నారని మనోవేదనకు గురైన ఓ రైతు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన మండలంలోని బుద్ధారంలో బుధవారం జరిగింది. సాదాబైనామాల పరిశీలన కోసం ఏర్పాటు చేసిన గ్రామసభలో తహసీల్దార్ జీవాకర్రెడ్డి సమక్షంలోనే ఈ ఘటన జరగడం కలకలం సృష్టించింది. బాధితుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. బుద్ధా రం గ్రామానికి చెందిన చెలుమల్ల బాబురావు, చెలుమల్ల రాజేందర్ మధ్య కొన్నాళ్లుగా భూవివాదం ఉంది. రాజేందర్కు చెందిన భూమిని బాబురావు చాలాకాలం నుంచి ఆక్రమించుకుని దున్నుతున్నాడు. ఈ విషయమై రాజేందర్ గ్రామపెద్దలకు ఫిర్యాదు చేసి పంచాయితీ పెట్టాడు. ఇరువర్గాల పెద్దమనుషులు రెండెకరాల భూ మిలో ఎకరం రాజేందర్కు, ఎకరం బాబురావుకు కేటాయిస్తూ తీర్మానం చేశారు. దాని ప్రకారం తనకు రావాల్సిన ఎకరం భూమిని సాదాబైనామాల గ్రామసభలో పహణీలో చేర్చాలని రాజేందర్ గ్రామసభకు వచ్చాడు. అక్కడే ఉన్న సర్పంచ్ భర్తతో రాజేందర్కు ఘర్షణ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన రాజేందర్ గ్రామంలోకి వెళ్లి క్రిమిసంహరక మందు కొనుగోలు చేసి తిరిగి గ్రామపంచాయతీకి వచ్చాడు. అందరి ముం దే తన భూమి తనకు కాకుండా అడ్డుపడుతున్నవారి మూలంగా ఆత్మహత్య చేసుకుంటున్నానని అంటూనే మందు తాగాడు. సర్పంచ్ భర్త మునుకుంట్ల సంగయ్య, ఉపసర్పంచ్ గండ్ర మాధవరావు, సీహెచ్ బాబురావు, సురేందర్, రవీందర్ తదితరులు కారణమని తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్, సీఎంను సంబోధిస్తూ లేఖ కూడా రాశాడు. తహసీల్దార్కు లేఖ అందించి రాజేందర్ మందు తాగాడు. దీంతో వెంటనే అతడిని గణపురం ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. తహసీల్దార్ దగ్గర ఉండి వైద్యం చేయించారు. కాగా బాధితుడి తల్లి ఉదయమ్మ, భార్య మమత ఫిర్యాదు మేరకు గణపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పరిహారం ఇస్తారా.. ప్రాణాలు తీసుకోమంటారా?
పురుగుల మందుతో తహసీల్ ఎదుట రైతు కుటుంబం బైఠాయింపు జైనథ్: తనకు రావాల్సిన పరిహారం మరో రైతుకు ఇచ్చారంటూ ఓ రైతు కుటుంబంతో సహా మంగళవారం తహసీల్ ఎదుట పురుగుల మందు డబ్బాలతో బైఠాయించాడు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం గూడ గ్రామ పంచాయతీ పరిధి రాంపూర్కు చెందిన గోదారి చిన్నయ్య తనకున్న మూడు ఎకరాల 16 గుంటల(సర్వే నంబరు 57) భూమిని కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్నాడు. ఈయన భూమి నుంచి పెన్గంగా కాలువ వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, గోదారి చిన్నయ్య కాస్తు చేస్తున్న భూమి, అతని పట్టాలో ఉన్న భూమి ఒకటి కాదని అధికారులు గోదారి చిన్నయ్యకు తెలిపారు. ఈ భూమి 57 సర్వే నంబరులో కొనుగోలు చేసిన గోదారి చిన్నయ్య పొరపాటుగా రికార్డుల ప్రకారం 56 సర్వే నంబరులో కాస్తు చేస్తున్నాడని, 56 సర్వే నంబరులో భూమిని కొనుగోలు చేసిన అదే గ్రామానికి చెందిన ముకినేపల్లి చిన్నయ్య 57 నంబరులో కాస్తులో ఉన్నాడని అధికారులు నిర్ధారించారు. ఇదే క్రమంలో ప్రభుత్వం నుంచి రూ.13.52 లక్షలు పరిహా రాన్ని అధికారులు ముకినేపల్లి చిన్నయ్యకు అందజేశారు. దీంతో మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట గోదారి చిన్నయ్య కుటుంబసభ్యులతో కలసి పురుగుల మందు డబ్బాలతో బైఠాయించాడు. డిప్యూటీ తహసీల్దార్ సమీర్, ఇతర అధికారులు, తహసీల్దార్ బొల్లెం ప్రభాకర్ వారిని సముదాయించారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చి.. ఆందోళన విరమింపజేశారు. -
వృద్ధురాలి ఆత్మహత్య
మొగుళ్లపల్లి : మండలంలోని రంగాపురం గ్రామానికి చెందిన బల్గూరి సుగుణమ్మ(75) పురుగుల మందు తాగి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు, పోలీ సుల కథనం ప్రకారం.. రంగాపురం గ్రామానికి చెందిన బ ల్గూరి సుగుణమ్మ గత మూడేళ్లుగా క్యానర్ వ్యాధితో బాధపడుతోంది. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె సో మవారం క్రిమిసంహారక మందు తాగింది. గమనించిన కు టుంబ సభ్యులు అస్పత్రికి తీసుకవెళ్లగా చికిత్సపొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతురాలికి ఒక కుమారుడు ఉన్నాడు. -
పురుగుమందు తాగిన మూడేళ్ల చిన్నారి
కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలింపు టేకులపల్లి : ఇంట్లో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు మూడేళ్ల చిన్నారి పురుగు మందు తాగిన సంఘటన ఆదివారం మండలంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని వాగొడ్డుతండాకు చెందిన నాగేశ్, స్వరూప దంపతుల మూడేళ్ల చిన్నారి సంజన ఇంట్లో ఆడుకుంటూ ఇంటి బయట ఉన్న పురుగుమందు డబ్బా తీసుకుని అందులోని మందును ప్రమాదవశాత్తు తాగింది. ఇది గమనించిన తల్లిదండ్రులు 108లో కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
పురుగు మందు తాగి యువతి ఆత్మహత్య
పట్నంబజారు(గుంటూరు): యువతి ఆత్మహత్యకు పాల్పడడంపై కేసు నమోదైంది. అరండల్పేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బొంగరాలబీడుకు చెందిన కొల్లిపర శాంతి (21) గతంలో వసంతరాయపురానికి చెందిన ప్రభుదేవను ప్రేమించింది. ప్రభుదేవకు వివాహమైందని తెలుసుకున్న శాంతి పురుగుల మందు తాగగా విషయం తెలుసుకున్న ప్రభుదేవ సైతం పురుగుల మందు తాగాడు. ఈ క్రమంలో ప్రభుదేవ మతి చెందగా, శాంతి ప్రాణాలతో బయటపడింది. అప్పటి నుంచి శాంతి తల్లిదండ్రులు ప్రభుదేవ చనిపోయిన విషయం తనకు తెలియకుండా దాచిపెట్టారు. ఇటీవల విషయం తెలుసుకున్న శాంతి శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ఎవరూ లేనప్పుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి కుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
లైసెన్స్ రద్దు చేయమన్నా.. స్పందించరేం!
కర్నూలు(అగ్రికల్చర్): నిబంధనలకు విరుద్ధంగా పురుగుమందుల వ్యాపారాన్ని నిర్వహిస్తున్న హైదరాబాద్ కెమికల్స్ లైసెన్స్ రద్దు చేయాలని అంతర్జిల్లా స్క్వాడ్ సూచనలను వ్యవసాయాధికారులు పట్టించుకోవడం లేదు. కర్నూలులో అంతర్ జిల్లా స్క్వాడ్ రెండు రోజుల పాటు ఎరువులు, పురుగుమందుల దుకాణాలు, విత్తన కంపెనీలను తనిఖీ చేసింది. హైదరాబాద్ కెమికల్స్ పురుగుమందుల కంపెనీ నెల రోజుల క్రితం వరకు నంద్యాల కేంద్రంగా వ్యాపారాన్ని చేపట్టింది. ఇటీవలనే కర్నూలుకు వ్యాపారాన్ని మార్చింది. ఇందుకు అనుగుణంగా లైసెన్స్ తీసుకున్నారు. అయితే ప్రిన్స్పుల్ సర్టిఫికెట్లో కర్నూలు గోదామును చూపకుండా నంద్యాల పేరుతోనే వ్యాపారం నిర్వహిస్తుండటాన్ని స్క్వాడ్ అధికారులు తప్పు పట్టారు. గోదాములో ఉన్న కోటి రూపాయల విలువ చేసే పురుగుమందుల అమ్మకాలను నిలిపివేస్తు లైసెన్స్ను కూడ రద్దు చేయాలని జిల్లా వ్యవసాయాధికారులను ఆదేశించారు. అదే విధంగా కర్నూలు కొత్త బస్టాండు సమీపంలోని రాజశేఖర్రెడ్డి ఫర్టిలైజర్లో లైసెన్స్లో మూడు కంపెనీల ఎరువుల అమ్మకాలకు ఓ పామ్ ఇంక్లూజన్ లేకపోవడంతో రూ.46 లక్షల విలువ ఎరువుల అమ్మకాలను నిలిపివేవారు. ఈ షాపు ౖలñ సెన్స్ రద్దు చేయాలని స్క్వాడ్ ఆదేశించింది. మరో షాపు లైసెన్స్ రద్దు చేయాలని ఆదేశించింది. వ్యవసాయాధికారులు హైద్రాబాద్ కెమికల్స్ లైసెన్స్తో పాటు షాపుల లైసెన్స్లు రద్దు చేయడానికి చొరవ చూపడం లేదు. -
బాలిక కిడ్నాప్.. అత్యాచారం
- పురుగులమందు తాగించి.. తనూ తాగిన నిందితుడు శంషాబాద్ : బాలికను అపహరించిన ఇద్దరు వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేశారు. ఆపై ఆమెకు పురుగులమందు తాగించారు. అందులో ఓ నిందితుడు కూడా ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. తీవ్ర కలకలం సృష్టించిన ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సాతంరాయి కాలనీ శివారులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కాలనీ పక్కనే ఉన్న జేఎన్ఎన్యూఆర్ఎం గృహాల్లో నివాసముండే ఓ ఆటో డ్రైవర్ కుమార్తె (16) స్థానికంగా ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతుంది. అదే కాలనీలో నివాసముంటూ ఫిల్టర్ నీళ్లు ఆటోలో సరఫరా చేసే జంగయ్య అలియాస్ జంగ్లీ (21)తోపాటు మరో వ్యక్తి కలిసి శనివారం రాత్రి 7 గంటలకు ఆ బాలికను నమ్మించి, బైక్పై ఎక్కించుకొని నిర్మానుష్య ప్రాంతంలోని ఓ గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై అత్యాచారం చేసిన దుండగులు, అనంతం ఆమెకు పురుగులమందు తాగించారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం వీరి నుంచి తప్పించుకొని వచ్చిన సదరు బాలిక సమీపంలోని రాళ్లలో పడిపోయింది. ఉదయం 10 గంటలకు కట్టెల కోసం వెళ్లిన స్థానికులు ఆమెను గమనించి ఆరాతీశారు. మెల్లగా.. తన తండ్రి ఫోన్ నంబరు చెప్పిన ఆ బాలిక వెంటనే స్పృహ కోల్పోయింది. దీంతో వారు బాలిక కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చి వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వివరాలు సేకరించిన పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి చూడడంతో.. ఆ గది పక్కనే స్పృహ కోల్పోయి ఉన్న జంగయ్య కనిపించాడు. భయంతో అతడు కూడా పురుగుల మందు తాగినట్టు గుర్తించిన పోలీసులు అతడిని కూడా ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. జంగయ్య వెంట ఉన్న మరో వ్యక్తి ఎవరనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అతడు పరారీలో ఉన్నాడు. బాలికతోపాటు నిందితుడు కూడా స్పృహలోకి రాకపోవడంతో పోలీసులు పూర్తి సమాచారాన్ని రాబట్టలేకపోయారు. కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. -
ఈ జీవితం వద్దనుకుని..
అన్ని జన్మల్లోకెల్లా మానవజన్మ ఎంతో గొప్పదంటారు. ఈ విషయాన్ని చాలా మంది మరచిపోతున్నారు. చిన్నచిన్న విషయాలకే తల్లడిల్లిపోతూ బలవంతంగా తనువు చాలిస్తున్నారు. అయిన వారిని అనాథలను చేసి వెళ్లిపోతున్నారు. తాజాగా జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం ఇద్దరు బలవన్మరణానికి పాల్పడగా, మరో ఇద్దరు ఆత్మహత్యాయత్నం చేశారు. వారి నిర్ణయం వెనక కారణాలు ఏమైనా.. కష్టాలు వచ్చినోళ్లందరూ చస్తూ పోతుంటే బతకడానికి మనిషి అనే వాడు ఉండడు కదా? గుత్తి : ఆర్ఎస్లోని దుర్గమ్మ వీధిలో నివాసముంటున్న వివాహిత పార్వతి (35) ఆదివారం రాత్రి ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పార్వతి భర్తకు దూరంగా నివసిస్తోంది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో తరచూ కలహాలు చోటు చేసుకునేవి. భర్త దూరం కావడం, మతిస్థిమితం సరిగా లేకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతో యువకుడు.. వజ్రకరూరు: మండలంలోని పీసీ.పెద్దప్యాపిలి గ్రామానికి చెందిన ప్రకాష్ (18) అనే యువకుడు కుటుంబ కలహాలతో విషపుగుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ జనార్దన్ నాయుడు తెలిపారు. ఆదివారం ఉద యం ఇంట్లో విషపు గుళికలు మింగడంతో ప్రకాష్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కుటుంబసభ్యులు వెంటనే గమనించి ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని అక్కడి వైద్యులు సూచించడంతో బంధువులు అనంతపురం ఆసుపత్రికి తీసుకు వెళ్లినట్లు ఎస్ఐ తెలిపారు. అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందినట్లు ఆయన తెలిపారు. వివాహిత ఆత్మహత్యాయత్నం సోమందేపల్లి: సోమందేపల్లి ఎస్సీ కాలనీకు చెందిన పుష్పలత(30) అనే వివాహిత కిరోసిన్ పోసుకుని ఆదివారం ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఎస్ఐ గౌస్ మహమ్మద్ తెలిపారు. వెంటనే ఆమెను హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. రెక్కమానులో విద్యార్థి.. కదిరి టౌన్ : హాస్టల్కు వెళ్లి బుద్ధిగా చదువుకోవాలని తల్లిదండ్రులు మందలించినందుకు మనస్థాపంతో పురుగుల మందు సేవించి విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం రెక్కమానులో చోటు చేసుకుంది. వివరాలు.. నంబులపూలకుంట మండలం రెక్కమానుకు చెందిన రామకృష్ణ కుమారుడు హరి 9వ తరగతి చదువుతున్నాడు. ఇదివరకు స్వగ్రామంలోనే ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుకునేవాడు. అయితే తన తండ్రి ఇదే మండలం పూలకుంటలో ఉన్న సంక్షేమ హాస్టల్లో హరిని చేర్పించాడు. దీంతో తనకు ఇష్టం లేకున్నా హాస్టల్లో చేర్పిస్తున్నారనే కారణంతో మనస్థాపం చెందిన హరి ఇంట్లోనే ఉన్న పురుగుల మందు తాగి అపస్మారకస్థితికి చేరుకున్నాడు. ఇది గమనించిన కుటుంబీకులు వెంటనే కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
భర్త మద్యానికి బానిసయ్యాడని.. భార్య ఆత్మహత్య
వీపనగండ్ల : భర్త మద్యానికి బానిసయ్యాడని, దీంతో కుటుంబ పోషణ భారమవుతుందని భావించిన భార్య ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. వీపనగండ్ల మండలంలోని అమ్మాయిపల్లికి చెందిన మం గమ్మ (55), రాచూరి బీరయ్య దంపతులు వృత్తిరీత్యా వ్యవసాయ కూలీలు. వీరికి ముగ్గు రు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా, కొన్ని నెలలుగా భర్త పని చేయకుండా మద్యానికి బానిసయ్యాడు. దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందని భార్య మనోవేదను గురైంది. దీంతో ఆమె గురువారం అర్ధరాత్రి ఇంట్లోనే పురుగుమందు తాగింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యం లోనే మృతి చెందింది. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ విషయమై శుక్రవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ సాయిచంద్రప్రసాద్ కేసు దర్యాప్తు జరుపుతున్నారు. -
పురుగుల మందు తాగబోయిన ముద్రగడ
తనను అరెస్టు చేసే సమయంలో ముద్రగడ పద్మనాభం నిజంగానే పురుగుల మందు తాగబోయారు. తుని ఘటనలో అరెస్టు చేసినవారిని విడుదల చేయాలని, అక్రమంగా పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయన నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనను అరెస్టు చేసేందుకు సీఐడీ పోలీసులు వెళ్లగా.. ఆయన తలుపులు వేసుకుని, లోపల పురుగుల మందు డబ్బా పట్టుకుని, అరెస్టు చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. తర్వాత పోలీసులు తలుపులు బద్దలుకొట్టి మరీ ఆయనను అరెస్టుచేశారు. ఈ సమయంలో నిజంగానే పురుగుల మందు తాగేందుకు ఆయన డబ్బా ఓపెన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అప్పటికే లోపలకు వెళ్లిన పోలీసులు డబ్బాను లాగేయడంతో ఆ మందు ఆయన చొక్కా మీద పడినట్లు తెలిసింది. మొత్తానికి ముద్రగడ పురుగుల మందు తాగబోతుంటే పోలీసులు అడ్డుకుని మరీ ఆయనను రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి సీఐడీ కార్యాలయానికి ఆయనను తీసుకెళ్తారని సమాచారం. -
పురుగుల మందు ప్రభావంతో జింక మృతి
పొలానికి వేసిన పురుగుల మందులు ఓ జింక ప్రాణాన్ని బలితీసుకున్నాయి. కర్నూలు జిల్లా రుద్రవరం మండలం నక్కలదిన్నె, ఆర్.నాగులవరం గ్రామాల మధ్య పొలంలో జింక మృతిచెంది ఉండగా బుధవారం స్థానిక రైతులు గుర్తించారు. అటవీ అధికారులు వచ్చి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. రైతులు పొలానికి విషపు గుళికలు చల్లడంతో ఆ గడ్డి తిని, అక్కడి నీరు తాగడం వల్ల మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. -
ఆహారాన్ని విషపూరితం కానివ్వొద్దు!
హైదరాబాద్: అనారోగ్యాల పాలు కాకూడదంటే ఆహారం విషపూరితం కాకుండా నివారించుకోండి. సంక్రాంతి పండుగ పిండి వంటలు సిద్ధమవుతున్నాయి. వంటగదికి కొత్త సామగ్రి వస్తోంది. చక్కిలాలు, నువ్వుల అప్పాలు, కట్టె అప్పాలు, మురుకులు వంటి ఎన్నో వంటకా లు తయారవుతున్నాయి. కానీ పరిశుభ్రంగా లేకపోతే ఆహారం విషపూరితమవుతుంది. ఆహారం విషపూరితం కావడానికి కారణం మురికిగా ఉండే చేతులు, మురికి నీరు మాత్రమే కాదు అపరిశుభ్రమైన వంట గది కూడా కారణమే. వంట గది శుభ్రంగా లేకపోతే బొద్దింకలు వస్తాయి. నీటి పైపులు, మురికినీటి కాలువల ద్వారా హానికరమైన క్రిములు, బ్యాక్టీరియాను మోసుకువస్తాయి. ఆహారాన్ని, వంట పాత్రలను కలుషితం చేస్తాయి. మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే... ఇంటిని శుభ్రం చేసేటప్పుడు వంటగదిలో క్రిమిసంహారక మందులు వేయండి. బొద్దింకలను చంపేయండి. బొద్దింకలు లేకపోతే ఆహారం విషపూరితం కాదు. దాంతో మీ పండుగ ఉత్సవాలు ఆరోగ్యవంతంగా, ఆనందభరితంగా ఉంటాయి. ఈ సంక్రాంతి నాడు విషపూరితం అవుతుందనే భయం లేకుండా రుచికరమైన ఆహారాన్ని ఇష్టంగా తినేయండి. -
స్ప్రైట్ అనుకుని విషం తాగిన చిన్నారులు
మంచిర్యాల టౌన్ (ఆదిలాబాద్) : పాఠశాలకు వెళ్తున్న ఇద్దరు చిన్నారులకు రోడ్డు పక్కన స్ప్రైట్ బాటిల్ కనిపించింది. దీంతో ఇద్దరు చిన్నారులు అందులో స్ప్రైట్ ఉందనుకొని తీసుకొని తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆ స్ప్రైట్ బాటిల్లో పురుగుల మందు ఉండటంతోటే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లా దహెగాం మండలంలోని తిమ్మాపూర్లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆకుల ఆంజనేయ ప్రసాద్(11), సోమిశెట్టి అజయ్(11) అనే ఇద్దరు చిన్నారులు స్థానిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం పాఠశాలకు వెళ్తున్న సమయంలో రోడ్డు పక్కన స్ప్రైట్ బాటిల్ కనిపంచడంతో ఇద్దరు తాగారు. దీంతో వారి పరిస్థితి విషమంచింది. ఇది గుర్తించిన స్థానికులు వారిని మంచిర్యాలలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా.. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
పంట ఎండిపోయిందని.. ప్రాణం తీసుకున్నాడు..
ఎండిన పంట చూసి.. ఓ అన్నదాత ప్రాణాలు విడిచాడు.. ఈ ఘటన నల్లగొండ జిల్లా మఠం పల్లి లో జరిగింది. వివరాలు.. మఠంపల్లి మండలం కాలువపల్లితండాలో బానోత్ రాంలాల్(26) అనే యువరైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న నాలుగు ఎకరాల్లో వేసిన పంట ఎండిపోవడం, అప్పులు తీర్చే మార్గం కనపడక తీవ్ర మనస్తాపం చెందాడు. ఉదయం పొలానికి వెళ్లి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాంలాల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్నగర్ ప్రభుత్వానికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య
జూలూరుపాడు మండలం రాజారావుపేట గ్రామంలో ఆదివారం పసుపులేటి రాంబాబు(23) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబకలహాలతో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్య
కుటుంబ కలహాలతో భార్యా భర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం చిక్కడపల్లి గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దంపతులు నక్క చిన్నప్ప(54), భూమవ్వ(48)ల మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో చిన్నప్ప తండ్రితో వీరికి ఆస్తికి సంబంధించిన విషయంపై వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన భార్యాభర్తలు బుధవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. -
క్రిమిసంహారక మందు తాగిన కవలలు
-
పత్తిరైతు ఆత్మహత్య
అప్పుల బాధ తాళలేక పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదం ఆదిలాబాద్ జిల్లా లో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అదిలాబాద్ జిల్లా నేరేడుగొండ మండలం తేజాపూర్ గ్రామానికి చెందిన బద్దం కిష్టారెడ్డి(50)తనకున్న 12ఎకరాల భూమిలో పత్తి సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో పెట్టుబడుల కోసం, బోర్లు వేయడం కోసం రూ. 9 లక్షలు అప్పు చేశాడు. దీంతో వాటిని తీర్చే దారి కానరాక తన పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. -
ఎండిన పంట.. రైతు ఆత్మహత్య
అప్పుల బాధ తాళలేక ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కుంతాల మండలం రాజాపూర్ తండాలో జరిగింది. రాజాపూర్ తండాకు చెందిన ఆడి రవి (45) తనకున్న రెండున్నర ఎకరాల్లో రెండు సార్లు బోరు బావి తవ్వించినా నీళ్లు పడలేదు. దీనికి తోడు ఈ ఏడాది మరో మూడు ఎకరాలు కౌలుకి తీసుకుని పంట వేశాడు. వర్షాలు లేక పంటలు ఎండిపోయి, అప్పులు మిగిలాయి. రవికి ఆరుగురు కుమార్తెలు. పెద్ద అమ్మయికి పెళ్ళి చేశాడు. రెండో అమ్మాయికి దీపావళి తరువాతన పెళ్చి చేసేందుకు నిశ్చితార్ధం చేశాడు. ఈ నేపథ్యంలో వేసిన పంట ఎండిపోవడం, చేసిన అప్పులు, పిల్ల పెళ్ళి రవిని కుంగదీశాయి. దీంతో మనస్థాపం చెందిన అతను తన పొలానికి వెళ్లి అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పొలానికి వెళ్లిన వ్యక్తి ఎంతకీ ఇంటికి రాకపోవడంతో రవి తండ్రి తన పొలానికి వెళ్లి చూడగా.. అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే రవిని భైంసా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొంతుదూ అతడు బుధవారం మరణించాడు. -
అన్నదాత ఆత్మహత్య
ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం కిష్టారంలో అప్పుల పాలైన ఓ అన్నదాత ఆత్మహత్య చేసుకున్నాడు. చింతా రమేష్ నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. ఇందుకోసం రూ.లక్ష వరకు అప్పు చేశాడు. పత్తి పంటలో పిందెలు రాకపోవడంతో మనస్తాపం చెందిన రమేష్ సోమవారం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. -
రైతు ఆత్మహత్య
అప్పుల బాధతో మరో అన్నదాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం కోయగూడెంలో ఆదివారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన నాగేశ్వర్ రావు(32) తనకున్న నాలుగెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గతేడాది పంట దిగుబడి రాకపోవడంతో పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు తీర్చలేకపోయాడు. ఈ ఏడాది కూడా పంట ఆశించిన విధంగా లేకపోవడంతో.. మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. -
రైతు ఆత్మహత్య
పంట ఎండిపోవడంతో గుండె చెదిరిన రైతన్న ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా అవనిగడ్డ శివారు కొత్తపేటకు చెందిన రైతు అప్పికట్ల నరసింహారావు (44)కు మాచవరం సమీపంలో ఒకటిన్నర ఎకరాలు భూమి ఉంది. ఈ ఏడాది సాగుకు నీరందక పోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. నాలుగు రోజులుగా సాగునీటి కోసం ప్రతిరోజూ పొలానికి వెళ్లి.. నీరు అందక నిరశగా ఇంటికి రావడం చేస్తున్నాడు. చేసిన అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతన్ని కుటుంబసభ్యులు హుటాహుటిన అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువచ్చారు. చికిత్స పొందుతూ నరసింహారావు బుధవారం మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
ఎనిమిది మంది రైతుల బలవన్మరణం
సాక్షి నెట్వర్క్: అప్పుల బాధతో సోమవారం ఎనిమిది మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం గణేశ్పాడ్కు చెందిన కొర్ర భాను (40) తనకున్న రెండు ఎకరాల్లో సాగు చేశాడు. ప్రైవేట్గా రూ.3 లక్షల వరకు ఉన్న అప్పుల వడ్డీ పెరిగిపోతుండడంతో ఆదివారం రాత్రి క్రిమిసంహారక మందు తాగాడు. కనగల్ మండలం జి.యడవల్లికి చెందిన గడ్డం హరిబాబు(38) సాగుకు చేసిన అప్పులు సుమారు. రూ.8 లక్షలు ఎలా తీరుతాయోనని దిగులు చెంది పురుగుల మందు తాగాడు. చందంపేట మండలం బొల్లారం గ్రామానికి చెందిన నేనావత్ బీల్యా(48) గత ఏడాది కూతురు పెళ్లికి చేసిన అప్పుతో పాటు వ్యవసాయానికి తెచ్చిన అప్పులు రూ.నాలుగున్నర లక్షలకు చేరాయి. అప్పులు తీరే మార్గం కానరాక చెట్టుకు ఉరివేసుకున్నాడు. మహబూబ్నగర్ జిల్లా పెబ్బేరు మండలవ తాటిపాములలో శేఖర్ రెడ్డి(52) తనకున్న ఆరుఎకరాల్లో వేరుశనగ, పత్తి పంటలను సాగు, కుటుంబ అవసరాల కోసం సుమారు రూ.10 లక్షల దాకా అప్పుచేశాడు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక దిగులు తో ఉరేసుకున్నాడు. వరంగల్ జిల్లా భూపాలపల్లి కాశీంపల్లికి చెందిన తూటి తిరుపతి(32), మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన ఎల్కటూరి శంకర్(50), లింగాలఘణపురం మండలం చీటూరులో ఐల కుమార్(30) ఆర్థిక ఇబ్బందులు తాళలేక క్రిమిసంహారక మందు తాగారు. నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం తిర్మన్పల్లికి చెందిన రైతు శివశెట్టి భూమప్న(47) రూ.4 లక్షల అప్పు తీర్చలేక పురుగుల మందు తాగాడు.