అనంతపురం: హంద్రీ నీవా ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్ రెడ్డి అల్టిమేటం జారీ చేశారు. ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలన్న డిమాండ్తో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వెల్లడించారు. ఇందులో భాగంగా ఈ నెల 20, 21 తేదీల్లో వజ్రకరూర్లో జనజాగరణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు తొలిదశ ఆయకట్టుకు చంద్రబాబు నీరు ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. అలాగే డిస్ట్రిబ్యూటరీ పనులను నిలిపేయడానికి కారణాలు చెప్పాలని విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.
'హంద్రీ నీవా పూర్తికై ఉద్యమం ఉధృతం'
Published Thu, Feb 4 2016 3:45 PM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
Advertisement
Advertisement