రీ పోలింగ్ ప్రశాంతం | Re-polling Closed in Komarada | Sakshi

రీ పోలింగ్ ప్రశాంతం

May 14 2014 3:17 AM | Updated on Sep 2 2017 7:19 AM

రీ పోలింగ్ ప్రశాంతం

రీ పోలింగ్ ప్రశాంతం

మండలంలోని చెక్కవానివలస 192వ నంబరు పోలింగ్ బూత్‌లో మంగళవారం జరిగిన రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ నిలిపివేశారు.

కొమరాడ, న్యూస్‌లైన్ : మండలంలోని చెక్కవానివలస 192వ నంబరు పోలింగ్ బూత్‌లో మంగళవారం జరిగిన రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ నిలిపివేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మంగళవారం రీపోలింగ్ నిర్వహించారు. ఈ బూత్‌లో 217 ఓట్లకుగాను 154 ఓట్లు పోలయ్యూయి. ఎస్‌ఐ ఎ.ధర్మేంద్ర ఆధ్వర్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు.  
 
 పెదచామలాపల్లిలో...
 మెంటాడ : పెదచామలాపల్లిలో 134వ పోలింగ్ బూత్‌లో పార్లమెంటు స్థానానికి సంబంధించి మంగళవారం నిర్వహించిన రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ నెల 7న జరిగిన ఎన్నికల్లో ఇక్కడ ఈవీఎం మొరాయించడంతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రీపోలింగ్ నిర్వహించారు. సీఐ చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement