200 కేజీల గంజాయి పట్టివేత
Published Sun, Jul 12 2015 12:18 PM | Last Updated on Sun, Sep 3 2017 5:23 AM
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా అనంతగిరి సమీపంలో పోలీసులు పెద్ద మొత్తంలో అక్రమంగా తరలిస్తున్నగంజాయిని పట్టుకున్నారు. ఆదివారం పోలీసులు జరిపిన తనిఖీల్లో 200 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణా చేస్తున్న బీహార్, పశ్చిమ బెంగాల్కు చెందిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై కేసు నమోదు చేసి, 2 కార్లను పోలీసులు సీజ్ చేశారు.
Advertisement
Advertisement