న్యూఢిల్లీ: దొంగచాటుగా తీసుకువచ్చేందుకు యత్నించిన కిలో బంగారాన్ని ఢిల్లీ విమానాశ్రయం అధికారులు పట్టుకున్నారు. హర్యానాకు చెందిన ఇద్దరు యువకలు బ్యాంకాక్ నుంచి బుధవారం సాయంత్రం విమానంలో వచ్చారు. వారి లగేజిని పరిశీలించిన అధికారులు పిల్లల స్కూటర్ హ్యాండిల్లో దాచి ఉంచిన కిలో బరువైన బంగారం స్పింగ్ను కనుగొన్నారు. దీని విలువ రూ. 27 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని అధికారులు తెలిపారు.
బొమ్మ స్కూటర్లో కిలో బంగారం..
Published Thu, Aug 3 2017 4:13 PM | Last Updated on Mon, Sep 11 2017 11:11 PM
Advertisement
Advertisement