లారీ కిందికి దూసుకెళ్లిన బైక్: ఇద్దరి మృతి | two youth dies in mishap in nellore district | Sakshi
Sakshi News home page

లారీ కిందికి దూసుకెళ్లిన బైక్: ఇద్దరి మృతి

Published Fri, Nov 6 2015 8:08 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి లారీ కిందపడటంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా నాయుడుపేట శివారులో శుక్రవారం చోటుచేసుకుంది.

నాయుడుపేట: వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి లారీ కిందపటంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా నాయుడుపేట శివారులో శుక్రవారం చోటుచేసుకుంది.

విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న లారీ 16వ నంబరు జాతీయ రహదారిలోని నాయుడుపేట జంక్షన్ వద్దకు రాగానే వేంగంగా వచ్చిన ద్విచక్రవాహనం లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement