హైదరాబాద్ : నగరంలోని సుల్తాన్ షాహీ ప్రాంతంలోని గాజు పరిశ్రమల్లో పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ పని చేస్తున్న 20 మంది బాల కార్మికులను పోలీసులు విముక్తి కల్పించారు. వారంతా బీహార్ రాష్ట్రానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. వారందరిని సాధ్యమైనంత త్వరగా బీహార్ పంపేందుకు ఏర్పాట్లు చేస్తామని పోలీసులు వెల్లడించారు. గాజు పరిశ్రమలకు చెందిన ఇద్దరు యజమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.