వచ్చే నెల 29లోపు చంద్రబాబును విచారణ జరుపుతాం | ACB files memo in court on Wednesday in cash For Vote case | Sakshi
Sakshi News home page

వచ్చే నెల 29లోపు చంద్రబాబును విచారణ జరుపుతాం

Published Wed, Aug 31 2016 3:49 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

వచ్చే నెల 29లోపు చంద్రబాబును విచారణ జరుపుతాం - Sakshi

వచ్చే నెల 29లోపు చంద్రబాబును విచారణ జరుపుతాం

కోర్టులో మెమో దాఖలు చేసిన ఏసీబీ

హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ఏసీబీ బుధవారం మెమో దాఖలు చేసింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విచారిస్తామని ఏసీబీ అధికారులు ఆ మెమోలో పేర్కొన్నారు. గతంలో దాఖలు చేసిన ఛార్జ్సీట్ను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో గతంలో దాఖలు చేసిన ఛార్జిషీట్ను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. (ఛార్జ్షీట్ నెంబర్ 15/16గా నమోదు చేసుకుంది)

గతంలో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా విచారణ కొనసాగిస్తామని ఏసీబీ అధికారులు ఈ సందర్భంగా కోర్టుకు విన్నవించారు. సెప్టెంబర్ 29లోపు చంద్రబాబుపై విచారణ జరిపి నివేదిక సమర్పిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నేత రేవంత్ రెడ్డి, ఉదయసింహా, సెబాస్టియన్లను సెప్టెంబర్ 29న విచారణకు హాజరు కావాలని ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement