Cash for vote case
-
May Be.. బాబుగారికి ఆయనంటే ఎంతో స్పెషల్!
నేను కత్తి వాడడం మొదలు పెడితే నాకన్నా ఎవరూ గొప్పగా వాడలేరు అనేది మిర్చి సినిమాలో ప్రభాస్ చెప్పే డైలాగ్. అదే.. అధికారులను వాడకం మొదలు పెడితే నా కన్నా గొప్పగా ఎవరూ వాడలేరు అనేది ఇప్పటికే చంద్రబాబు ఎన్నోసార్లు రుజువు చేశారు. పోలీసుల మొదలు.. రాజకీయ నాయకులు, న్యాయాధికారులు.. ఇలా ఒకరేమిటి చంద్రబాబు తలచుకుంటే ఎవరినైనా వాడేయగలరు. ఆ వాడకం తర్వాత వారికి సముచిత స్థానం కల్పిస్తూ రుణం తీర్చుకోగలరు... తాజాగా ఏపీ ప్రభుత్వం నలుగురు సలహాదారులను నియమించించుకుంది. వారిలో గౌరవ సలహాదారుగా డీఆర్డీవో మాజీ చీఫ్ జి.సతీష్ రెడ్డి, ఏపీ స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారుగా ఇస్రో మాజీ చీఫ్ సోమనాథ్, చేనేత, హస్తకళల అభివృద్ధికి గౌరవ సలహాదారుగా భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్లా, ఏపీ ఫోరెన్సిక్ గౌరవ సలహాదారుగా కేపీసీ గాంధీని నియమించారు. వీరికి కేబినెట్ హోదా కల్పిస్తూ వాహనం.. ఆఫీసు.. అదే స్థాయిలో వ్యక్తిగత సిబ్బంది జీతభత్యాలు కూడా చెల్లిస్తారు. అయితే ఇందులో మొదటి ముగ్గురు సంగతి పక్కన పెడితే నాలుగో వ్యక్తి అయిన కేపీసీ గాంధీ గురించి కాస్త ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఫోన్లో బేరాలు మాట్లాడి అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు.. ఆ కేసునుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ అంటూ ఆయన మాట్లాడిన వాయిస్ రికార్డ్ అప్పట్లో రాజకీయ సంచలనం అయింది. ఆఘటన తరువాత రాత్రికి రాత్రి ఆయన ఏపీ తెలంగాణ ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ వదిలి విజయవాడ వచ్చేశారు. ఆయన ఊరు వదిలి వచ్చేసినా తెలంగాణ ప్రభుత్వం పెట్టిన కేసులు మాత్రం వదలలేదు. ఆయన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన వాయిస్ రికార్డర్ను ఫోరెన్సీక్ లాబరేటరీ పంపించారు. అందులో ఉన్న గొంతు చంద్రబాబుదా కాదా అన్నది తేల్చడం ఆ ల్యాబ్ బాధ్యత. అదిగో ఆ టైంలో ఆ ల్యాబ్కు డైరెక్టర్గా ఉన్నారు కేపీసీ గాంధీ. ‘‘ఆ వాయిస్ చంద్రబాబుది అని చెప్పలేం. మిమిక్రీ కూడా కావొచ్చు’’ అని ఓ రిపోర్ట్ రాసి పడేశారాయన. దీంతో ఆ కేసు అక్కడితో ఆగిపోయింది. కట్ చేస్తే.. గాంధీ 2014-19 మధ్య కూడా ప్రభుత్వంలో సలహాదారు పాత్ర ఇచ్చారు. ఆ రుణం తీర్చుకోలేదని అనుకున్నారో ఏమో.. ఇప్పుడు కూడా ఆయన్ని గౌరవ సలహాదారుగా కేబినెట్ హోదాలో నియమించారు. మునుముందు ఫోరెన్సిక్ సంబంధ అంశాల్లో ఆయన ప్రభుత్వానికి సలహాలు ఇస్తారట. ఆ సలహాలు ఎవరికి పనికొస్తాయన్నది పెద్ద ప్రశ్నార్థకం. అన్నట్లు.. గతంలో అధికారంలో ఉన్నపుడు తను డీజీపీ స్థాయి అధికారిని అనే సంగతి కూడా మరిచిపోయి టీడీపీకి ఏబీ వెంకటేశ్వర రావు ఊడిగం చేశారనే చర్చ నడిచింది. అయితే.. మళ్ళీ అధికారంలోకి రాగానే పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు. అలాగే.. మంత్రి అచ్చెన్నాయుడు సోదరుడు ప్రభాకర్ నాయుడిని విజిలెన్స్ విభాగంలో ఓఎస్డీగా నియమించారు. ఇలా ఎంతోమంది అనుయాయులను అడ్డగోలుగా పోస్టింగ్స్ ఇచ్చి సొంత పనులు..రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి ఉపయోగిస్తున్నారని చర్చ చాలాకాలంగా నడుస్తోంది. ఈ తరుణంలో ఇప్పుడు కేపీసీ గాంధీ నియామకం కూడా అదే కోవలోకి వస్తుందనే టాక్ బలంగా వినిపిస్తోంది.:::సిమ్మాదిరప్పన్న -
TG: ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
హైదరాబాద్, సాక్షి: ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా పడింది. బుధవారం విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు తదుపరి విచారణను నవంబర్ 14వ తేదీకి వాయిదా వేసింది. జడ్జీ లీవ్లో ఉండటంతో కోర్టు కేసును వాయిదా వేసింది. ఇవాళ.. విచారణకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డి సహా ఇతర నిందితులను గత నెల 24న కోర్టు ఆదేశించింది. గత నెల 24న విచారణకు మత్తయ్య హాజరుకాగా, మిగతా నిందితులు గైర్హాజరు అయ్యారు. నేటి విచారణకు సీఎం రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, వేం కృష్ణ కీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్లు హాజరు కావాల్సి ఉండగా.. కేవలం సండ్ర వెంకట వీరయ్య మాత్రమే హాజరయ్యారు. మరోవైపు.. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కోర్టుకు హాజరు కాకపోతే.. కోర్టు ముందు నిరాహార దీక్ష చేస్తానని మంగళవారం మత్తయ్య మీడియాతో అన్నారు.ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఈ కేసు దర్యాప్తు అయ్యే అవకాశం ఉందని, కాబట్టి కేసును మధ్యప్రదేశ్కు బదిలీ చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్రెడ్డి సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్పై ఇటీవల సుప్రీం కోర్టు కీలకత తీర్పు వెల్లడించింది. ‘‘కేవలం అనుమానం పైనే పిటిషన్ వేశారు. అందుకే ఈ పిటిషన్లో మేం జోక్యం చేసుకోలేం. భవిష్యత్తులో సీఎం గనుక జోక్యం చేసుకుంటే మళ్ళీ కోర్టును ఆశ్రయించండి’’ అని స్పష్టం చేసింది.చదవండి: బాబు, రేవంత్ మరోసారి కుమ్మక్కయ్యారు: ఎమ్మెల్యే ఆర్కే -
16న విచారణకు హాజరుకండి
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ఓటుకు కోట్లు’కేసు విచారణకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గైర్హాజరు కావడంపై నాంపల్లి కోర్టు అసహనం వ్యక్తం చేసింది. తదుపరి విచారణ జరిగే అక్టోబర్ 16న న్యాయస్థానం ఎదుట తప్పకుండా హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో మంగళవారం జరిగిన విచారణకు మత్తయ్య ఒక్కరే హాజరయ్యారు. రేవంత్రెడ్డి, వేం కృష్ణ కీర్తన్, ఉదయ్ సింహ, సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్ హాజరుకాలేదు. ఒకరోజు విచారణకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ నిందితులు వేసిన పిటిషన్లను కోర్టు అనుమతించింది. అయితే అభియోగాల నమోదుపై విచారణ కోసం వచ్చే నెల 16న మాత్రం హాజరుకావాల్సిందేనని రేవంత్ సహా నిందితులందరికీ స్పష్టం చేసింది. ఏసీబీ, ఈడీ విచారణలతో.. 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను టీడీపీ అభ్యరి్థకి మద్దతు ఇవ్వాలంటూ రూ.కోట్లు ఆశచూపిన ఆరోపణలపై నాటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్పై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. స్టీఫెన్సన్ ఇంట్లో రేవంత్ డబ్బు సంచులతో ఉన్న వీడియోలు అప్పట్లో తీవ్ర సంచలనంగా మారాయి. ఈ కేసులో రేవంత్ జైలుకు వెళ్లి, తర్వాత బెయిల్పై బయటికి వచ్చారు. రేవంత్ను అదుపులోకి తీసుకునే సమయంలో ఆయన వద్ద రూ.50 లక్షల నగదును ఏసీబీ స్వా«దీనం చేసుకుంది.ఈ నగదు అక్రమ మార్గాల్లో వచి్చందన్న ఏసీబీ ఆరోపణలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కేసు నమోదు చేసింది. ఏసీబీ, ఈడీ రెండు విచారణలు సుదీర్ఘంగా కొనసాగుతున్నాయి. ఈ వ్యవహారంలో నిందితులు మంగళవారం విచారణకు గైర్హాజరవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. తదుపరి విచారణకు హాజరు కా వాలని రేవంత్తో పాటు సెబాస్టియన్, ఉదయ్ సింహ, మత్తయ్య జెరూసలేం, సండ్ర వెంకట వీరయ్య, వేం కృష్ణ కీర్తన్లను ఆదేశించింది. -
ఓటుకు నోటు కేసు.. విచారణకు రావాలని సీఎం రేవంత్కు కోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి కోర్టులో ఓటుకు నోటు వ్యవహారానికి సంబంధించిన ఈడీ కేసులో విచారణ జరిగింది. ఈ కేసులో అక్టోబర్ 16న విచారణకు హాజరుకావాలని సీఎం రేవంత్రెడ్డిని న్యాయస్థానం ఆదేశించింది. నేటి విచారణకు ముత్తయ్య మినహా మిగతా నిందితులందరూ గైర్హాజరు అయ్యారు. సీఎం రేవంత్, ఉదయ్ సింహా, వేం కృష్ణ కీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ గైర్హాజరుపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది.అయితే ఇవాళ్టి విచారణకు మినహాయింపు ఇవ్వాలన్న నిందితుల అభ్యర్థనకు అంగీకరించిన కోర్టు.. అక్టోబరు 16న విచారణకు హాజరు కావాలని రేవంత్ సహా నిందితులందరికీ నాంపల్లి కోర్టు ఆదేశించింది.చదవండి: పార్టీ మారిన ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్టాండే : కేటీఆర్ -
ఓటుకు నోటు కేసులో జోక్యం చేసుకోవద్దు
సాక్షి, న్యూఢిల్లీ: ఓటుకు నోటు కేసు విచారణలో ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోవద్దని ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణకు సంబంధించి ఏసీబీ డైరెక్టర్ జనరల్ ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వరాదని, ఆయనకు రిపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదని స్పష్టం చేసింది. ట్రయల్ కోర్టు పారదర్శకంగా విచారణ జరపాలని సూచించింది.ఈ కేసు విచారణను తెలంగాణ నుంచి భోపాల్కు బదిలీ చేసేందుకు నిరాకరించింది. ఓటుకు నోటు కేసు విచారణను హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్లోని భోపాల్ కోర్టుకు బదిలీ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్రెడ్డితో పాటు మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ జరిపింది. నిష్పక్షపాత విచారణ సాధ్యం కాదన్న పిటిషనర్లు రేవంత్రెడ్డి నేతృత్వంలోని తెలంగాణలో ఈ కేసుపై నిష్పక్షపాత విచారణ సాధ్యం కాదని పిటిషనర్లు పేర్కొన్నారు. వారి తరఫున సీనియర్ న్యాయవాది సీఏ సుందరం వాదనలు వినిపిస్తూ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హోం శాఖ బాధ్యతలు కూడా చూస్తున్నందున ఏసీబీ కేసులు నేరుగా ఆయన అ«దీనంలోనే ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కేసు విచారణను తెలంగాణ నుంచి భోపాల్కు మార్చాలని విన్నవించారు.సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి దీనిని పర్యవేక్షించేలా ఆదేశాలివ్వాలని కోరారు. అయితే ఈ పిటిషన్ రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని రేవంత్రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టుకు తెలిపారు. ఈ కేసు విచారణ సగంలో ఉందని.. విచారణను గత ప్రభుత్వంలో నియమించిన ప్రాసిక్యూటరే నిర్వహిస్తున్నారని చెప్పారు. సుప్రీం విశ్రాంత జడ్జి పర్యవేక్షణకు నో వాదనల అనంతరం కేసు విచారణపై సుప్రీంకోర్టు విశ్రాంత జడ్జి పర్యవేక్షణను జస్టిస్ గవాయ్ ధర్మాసనం నిరాకరించింది. ఈ కేసులో విధంగానూ జోక్యం చేసుకోకూడదని రేవంత్రెడ్డిని ఆదేశించిన ధర్మాసనం..భవిష్యత్తులో ఈ కేసు విచారణలో రేవంత్రెడ్డి జోక్యంపై ఆధారాలుంటే కోర్టుకు వెళ్లొచ్చునని సూచించింది. రాష్ట్ర హోంశాఖ బాధ్యతలు కూడా చూస్తున్న రేవంత్రెడ్డికి ఏసీబీపై ప్రత్యక్ష నియంత్రణ ఉంటుందని, బ్యూరో డైరెక్టర్ నేరుగా ఆయనకు జవాబుదారీగా ఉంటారన్న పిటిషనర్ల ఆందోళనను పరిగణనలోకి తీసుకుంటున్నామని, ప్రాసిక్యూషన్ పనితీరులో ఏ విధంగానూ జోక్యం చేసుకోవద్దని రెండవ ప్రతివాదికి ఆదేశిస్తున్నామని బెంచ్ తెలిపింది. ఒక విచారణను ఉపసంహరించుకోవాలని ఆయన (రేవంత్రెడ్డి) ప్రాసిక్యూషన్ను ఆదేశిస్తే, అప్పుడు తాము జోక్యం చేసుకుంటామని స్పష్టం చేసింది.కోర్టు ఆదేశాలపై వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలిఅంతకుముందు ఈ కేసును విచారిస్తున్న సమయంలోనే, ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేసినప్పుడు సీఎం రేవంత్రెడ్డి చేసిన కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలను తాము గమనించామని ధర్మాసనం పేర్కొంది. అయితే ఈ విషయంలో రేవంత్రెడ్డి ఇప్పటికే తమ ముందు క్షమాపణలు చెప్పినందున ఈ అంశంలో మ రింత ముందుకు వెళ్లాలని తాము భావించడం లేదని తెలిపింది. రాజ్యాంగంలోని మూడు విభాగాలు ఒకరి పనితీరు పట్ల మరొకరు పరస్పర గౌరవాన్ని చూపించాలని సూచించింది. తీర్పులపై న్యాయమైన విమర్శలను ఎప్పుడూ స్వాగతించవచ్చని, అయితే పరిమితులను అతిక్రమించరాదని స్పష్టం చేసింది. కోర్టులు జారీ చేసే ఆదేశాలపై వ్యాఖ్యలు చేసేటప్పుడు తగినంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. -
సర్వోన్నత న్యాయస్థానం అంటే గౌరవం లేదా?
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం ఓటుకు నోటు కేసు విచారణ సందర్భంగా.. కవిత బెయిల్ తీర్పుపై ఆయన చేసిన వ్యాఖ్యలను ధర్మాసనం ప్రస్తావించింది.ముఖ్యమంత్రి బాధ్యతగా ఉండాలి కదాఇలా ఎలా మాట్లాడతారు ?రాజకీయ నాయకులను సంప్రదించి మేము ఆదేశాలు ఇస్తామా ?మేము ఎవరి వ్యాఖ్యలు పట్టించుకోంమేము మా విధి నిర్వహిస్తాంమేము ప్రమాణ పూర్వకంగా పని చేస్తాంమేము ఎవరి పనుల్లో జోక్యం చేసుకోంసర్వోన్నత న్యాయస్థానం అంటే గౌరవం లేదా ?వ్యవస్థల పట్ల గౌరవంగా ఉండాలిఇలాంటి ప్రవర్తన ఉంటే ఓటుకు నోటు విచారణ రాష్ట్రం బయటే నిర్వహిద్దాం.. అని జస్టిస్ గవాయ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది.అంతకు ముందు.. తెలంగాణ ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిందితుడిగా ఉన్నఈ కేసులో సుప్రీం కోర్టు కీలకాదేశాలు జారీ చేసింది. ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ గవాయి ధర్మాసనం.. విచారణకు స్పెషల్ ప్రాసిక్యూటర్ను నియమిస్తున్నట్లు తెలిపింది. మధ్యాహ్నాం మరోసారి విచారణ చేపట్టిన ధర్మాసనం.. స్వతంత్ర ప్రాసిక్యూటర్ను నియమించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే రేవంత్ తాజా వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసు విచారణ సోమవారానికి సెప్టెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది.కవిత బెయిల్పై రేవంత్ ఏమన్నారంటే..ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ పరిణామంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ‘‘కవిత బెయిల్ కోసం ఎంపీ సీట్లు బీఆర్ఎస్ త్యాగం చేసింది నిజం. బీఆర్ఎస్ – బీజేపీ ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ వచ్చింది. సిసోడియా, కేజ్రీవాల్కు రాని బెయిల్ 5 నెలల్లోనే కవితకు ఎలా వచ్చింది? మెదక్, సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్లో బీజేపీకి మెజారిటీ ఇచ్చింది నిజం కాదా? ఏడు చోట్ల డిపాజిట్ కోల్పోయి, 15 చోట్ల మూడవ స్థానం వచ్చేంత బలహీనంగా బీఆర్ఎస్ ఉందా?” అని రేవంత్ అన్నారు. ఓటుకు నోటుపై పిటిషన్లో..తెలంగాణలో 2015 ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అప్పటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఓటుకు నోటు వ్యవహారం నడిచింది. ఈ కేసులో పట్టుబడ్డ రేవంత్ రెడ్డి అరెస్టై జైలుకు వెళ్లారు కూడా. అయితే.. రేవంత్ ఇప్పుడు సీఎంగా ఉండడంతో ఈ కేసు విచారణను మధ్యప్రదేశ్కు బదిలీ చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ వాదనలుకేసులో నిందితుడు రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ సీఎంగా ఉన్నారని, దర్యాప్తు సంస్థ ఏసీబీ చూసే హోం శాఖ కూడా ఆయన వద్దే ఉందని జగదీష్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా మహబూబ్ నగర్లో జరిగిన ర్యాలీల్లో పలుమార్లు పోలీసులపై బెదిరింపు ధోరణి ప్రదర్శించారని జగదీష్ రెడ్డి తరుఫు న్యాయవాది తెలిపారు. సీఎంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తేనే కేసుపై ప్రభావం ఎలా ఉందో తెలుస్తుందని, ప్రభుత్వం దాఖలు చేసే కౌంటర్ అఫిడవిట్లో కూడా వైఖరి మారిందన్నారు. జస్టిస్ గవాయ్ ఏమన్నారంటే..కేవలం అపోహలతో విచారణ బదిలీ చేస్తే మన న్యాయ వ్యవస్థపై నమ్మకం లేదన్నట్టే అవుతుంది. ట్రయల్ జరిగే విషయంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నందున.. ఈ కేసు విచారణకు ఇండిపెండెంట్ ప్రాసిక్యూటర్ ని నియమిస్తాం. విశ్వసనీయతను పెంచేందుకే స్వతంత్ర ప్రాసిక్యూటర్ను నియమిస్తాం. 2024 ఎన్నికల తర్వాతే మీరు కోర్టుకు వచ్చారు.. ఎందుకు?. మా న్యాయ వ్యవస్థపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. అందరి అనుమానాలను నివృత్తి చేసేందుకు స్పెషల్ ప్రాసిక్యూటర్ నియమిస్తాం. ఏపీ లేదంటే తెలంగాణ నుంచి ఒకరిని స్పెషల్ ప్రాసిక్యూటర్గా నియమిస్తాం. ప్రతి ఒక్కరి మనస్సులో విశ్వాసం ఉండేలా, మీకు అభ్యంతరం లేకుండా ప్రత్యేక ప్రాసిక్యూటర్ను నియమిస్తాం. తెలంగాణకు చెందిన మా సహచరులను సంప్రదించి.. ఈ నియామకాన్ని మేమే పర్యవేక్షిస్తాం. ప్రత్యేక ప్రాసిక్యూటర్ని నియమించే వ్యవహారాన్ని సుప్రీం కోర్టు నిర్ణయిస్తుందని జస్టిస్ గవాయ్ అన్నారు. కుదరని ఏకాభిప్రాయంఓటుకు నోటు పిటిషన్పై మధ్యాహ్నాం మరోసారి విచారణ జరిపిన న్యాయస్థానం.. ప్రత్యేక ప్రాసిక్యూటర్ నియామకం కోసం ప్రయత్నించింది. ఇరు వర్గాల నుంచి ఇద్దరి పేర్లను తీసుకుంది. అయితే ఉమామహేశ్వర్రావు, అశోక్ దేశాయ్ పేర్లపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో సోమవారం విచారణ నాడే ఆ ప్రక్రియను ధర్మాసనం పర్యవేక్షించే అవకాశం ఉంది. -
ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
న్యూఢిల్లీ, సాక్షి: సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్లతో కూడిన ధర్మాసనం రెండు వారాలకు వాయిదా వేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓటుకు నోటు కేసులో నిందితుడైన ఎనుముల రేవంత్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారని, కాబట్టి ఈ కేసు విచారణ వేరే (వీలైతే మధ్యప్రదేశ్)కు బదిలీ చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్రెడ్డి పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ పిటిషన్పై సుప్రీం నుంచి నోటీసులు అందుకున్న తెలంగాణ ప్రభుత్వం, రేవంత్రెడ్డి.. తాజాగా కౌంటర్ దాఖలు చేశారు. ఈ కౌంటర్ను ఇవాళ పరిశీలించిన కోర్టు.. రిజాయిండర్ దాఖలు చేసేందుకు పిటిషనర్కు రెండు వారాల సమయం ఇచ్చింది. -
ఓటుకు కోట్లు కేసులో సీఎం రేవంత్కు సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందున, కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ దాఖ లైన పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది. సీఎం రేవంత్రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తదితరులకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలుకు ఆదేశించింది. బీఆర్ఎస్ మాజీ మంత్రులు జగదీశ్రెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ల తరఫున అడ్వొకేట్ ఆన్ రికార్డ్స్ పి.మోహిత్రావు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఓటుకు కోట్లు సంబంధిత కేసులను తెలంగాణలోని ఏసీబీ కోర్టు విచారణ జరుపుతోందని తెలిపారు. రేవంత్రెడ్డి సీఎంగా ఉన్నందున రాష్ట్రంలో న్యాయపరమైన విచారణ సాధ్యం కాదని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ లేదా ఛత్తీస్గఢ్ల్లోని తత్సమాన కోర్టుకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ను శుక్రవారం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్ధ దవే, దామా శేషాద్రినాయుడులు వాదనలు విన్పించారు. ...వారినే విచారించాల్సిన పరిస్థితి తెలంగాణలో 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు అనుకూలంగా ఓటు వేసేందుకు గాను నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రేవంత్రెడ్డి రూ.కోట్లు లంచం ఆశ చూపి అడ్వాన్స్గా రూ.50 లక్షలు ఇవ్వజూపారనేది ప్రధాన ఆరోపణ అని తెలిపారు. రేవంత్రెడ్డి మాజీ బాస్, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. అయితే స్టీఫెన్సన్కు లంచం ఇస్తుండగా తెలంగాణ పోలీసులు, ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా రేవంతర్రెడ్డి తదితరుల్ని పట్టుకున్నారని, స్టీఫెన్సన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కాగా తదనంతర పరిణామాల్లో భాగంగా రేవంత్రెడ్డి 2017లో కాంగ్రెస్ పార్టీ లో చేరారని తెలిపారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, ఈ కేసులో నిందితుడైన రేవంత్రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారని, కీలకమైన హోంశాఖ కూడా ఆయన వద్దే ఉందని వివరించారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో న్యాయపరమైన విచారణ సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఏసీబీ అధికారులు ఎవరి నియంత్రణలో ఉంటారో, ఎవరికి సమాధానం చెప్పాలో వారినే విచారించాల్సిన పరిస్థితి ఉందన్నారు. రేవంత్పై పెండింగ్లో 88 కేసులు తెలంగాణలోని వేర్వేరు కోర్టుల్లో రేవంత్రెడ్డిపై 88 కేసులు విచారణలో ఉన్నాయని, ఆయన నేర నేపథ్యం ఎక్కువగా ఉన్నట్లు వీటిని బట్టి స్పష్టమవుతోందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక తేల్చుకుంటామంటూ తెలంగాణలోని సీనియర్ పోలీసు అధికారుల్ని రేవంత్రెడ్డి అనేక సందర్భాల్లో బెదిరించారని కోర్టు దృష్టికి తెచ్చారు. అంతేకాకుండా విచారణ జాప్యం చేయడానికి నిందితులు ఏదో ఒక సాకుతో 2015 నుంచి పలు పిటిషన్లు వేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఓటుకు కోట్లు కేసు విచారణను తెలంగాణ వెలుపల మధ్యప్రదేశ్ లేదా ఛత్తీస్గఢ్లకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలమని, రేవంత్ మాజీ బాస్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా ఈ కేసులో ఆరోపణలు ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఈ పిటిషన్ ఎందుకు విచారించకూడదో తెలియజేయాలంటూ సీఎం రేవంత్సహా ఇతర ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. -
ఓటుకు కోట్లు కేసులో కీలక పరిణామం
సాక్షి, ఢిల్లీ: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాలు సమాధానం చెప్పాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి , ప్రతివాదులను సర్వోన్నత న్యాయస్థానం నోటీసుల్లో పేర్కొంది. ఓటుకు కోట్లు కేసును తెలంగాణ ఏసీబీ కోర్టు నుంచి పొరుగు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్ లేదంటే ఛత్తీస్గఢ్కు బదిలీ చేయాలంటూ పిటిషన్ దాఖలైంది. బీఆర్ఎస్ నేతలైన గుంతకండ్ల జగదీష్రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, ఎమ్మెల్సీ సత్యవతి రాథోథ్, మహమ్మద్ అలీలు ఈ పిటిషన్ వేశారు. రేవంత్రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నందున.. దర్యాప్తు పారదర్శకంగా జరగదనే అనుమానాల్ని పిటిషన్లో వ్యక్తం చేశారు. శుక్రవారం ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. తెలంగాణ ప్రభుత్వానికి, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. నేటి తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.. 2015లో టీడీపీలో ఉండగా ఈ కేసు నమోదు అయ్యింది. చంద్రబాబు ఆదేశాల మేరకు ఎల్విస్ స్టీఫెన్సన్కు రూ.50లక్షల లంచం ఇస్తుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఇదిలా ఉంటే.. తన ‘మాజీ బాస్’, మాజీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకే ఈ తతంగం నడిచిందంటూ బీఆర్ఎస్ నేతలు సైతం పిటిషన్లో ప్రస్తావించడం గమనార్హం. -
నాడు ద్రోహం.. నేడు మోసం
సాక్షి, అమరావతి: ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకు కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టి రైతులకు ద్రోహం చేసిన చంద్రబాబు ఇప్పుడు సాగు, తాగునీళ్లు దక్కకుండా ప్రాజెక్టులపై ఎన్జీటీలో కేసులు దాఖలు చేయించి అఖిలపక్షం డిమాండ్తో మరో నాటకానికి సిద్ధమయ్యారు. నాడూ నేడూ రైతులకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు కృష్ణా జలాల వివాదంపై ప్రధాని మోదీ వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేయడాన్ని నీటిపారుదలరంగ నిపుణులు తప్పుబడుతున్నారు. ఈ వివాదం ఏర్పడటానికి మూలకారకుడు చంద్రబాబేనని గుర్తు చేస్తున్నారు. ఈ పాపం ఎవరిది బాబూ? విభజన నేపథ్యంలో కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా కృష్ణా బోర్డును ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం బోర్డు పరిధి, వర్కింగ్ మ్యాన్యువల్ను ఖరారు చేయలేదు. ప్రాజెక్టుల నిర్వహణకు మధ్యంతర ఏర్పాట్లు చేసింది. ఎవరి భూ భాగంలో ఉన్నవాటిని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించుకునేలా ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలాన్ని ఆంధ్రప్రదేశ్, నాగార్జునసాగర్ను తెలంగాణ సర్కార్ నిర్వహించేలా 2014లో ఏర్పాటు చేసింది. దీని ప్రకారం నాగార్జునసాగర్ ప్రాజెక్టును తెలంగాణ సర్కార్ పూర్తిగా తన అధీనంలోకి తీసుకుంది. ఏపీ భూభాగంలో ఉన్న సాగర్ కుడి కాలువకు నీటిని సరఫరా చేసే రెగ్యులేటర్ను కూడా తెలంగాణ ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుంది. మరోవైపు శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం తన భూభాగంలో ఉందంటూ దాన్ని కూడా తెలంగాణ సర్కార్ తన నియంత్రణలోకి తీసుకుంది. ఏపీ ప్రభుత్వ అధీనంలో ఉన్న పులిచింతల ప్రాజెక్టులో జలవిద్యుత్కేంద్రం తమ భూభాగంలో ఉందనే సాకుచూపి దాన్ని కూడా తెలంగాణ సర్కార్ స్వాధీనం చేసుకుంది. కొబ్బరి చిప్పల సిద్ధాంతంతో.. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ ఉనికిని కాపాడుకునేందుకు రెండు కళ్లు, కొబ్బరిచిప్పల సిద్ధాంతంతో ఈ అక్రమంపై నాటి సీఎం చంద్రబాబు నోరుమెదపలేదు. దీంతో అప్పటి నుంచి ఇప్పటిదాకా కృష్ణా బోర్డు ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం బేఖాతర్ చేస్తూ యథేచ్ఛగా ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలం దిగువకు నీటిని వదిలేస్తోంది. ఫలితంగా శ్రీశైలంలో నీటి మట్టం అడుగంటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు సాగు, తాగునీరు అందించలేని దుస్థితి నెలకొంది. బలగాలను వెనక్కి రప్పించిన బాబు.. నాగార్జునసాగర్ కుడి కాలువకు కృష్ణా బోర్డు కేటాయించిన జలాలు పూర్తి స్థాయిలో విడుదల కాకున్నా 2015 ఫిబ్రవరి 12న తెలంగాణ సర్కార్ అర్థాంతరంగా ఆపేసింది. ఈ క్రమంలో ఆంధప్రదేశ్ భూ భాగంలో ఉన్న సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను స్వాధీనం చేసుకుని రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు నాటి జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, అధికారులు పోలీసు బలగాలతో మరుసటి రోజు నాగార్జునసాగర్ వద్దకు చేరుకున్నారు. తెలంగాణ సర్కార్ను అస్థిరపరిచేందుకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో టేపులతో దొరికిపోయిన నాటి సీఎం చంబ్రాబుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓటుకు నోటు కేసు నమోదు చేసింది. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను స్వా«ధీనం చేసుకోవడానికి వెళ్లిన రాష్ట్ర అధికారులను చంద్రబాబు వెనక్కి రప్పించారు. దీంతో సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ తెలంగాణ సర్కార్ అధీనంలోనే ఉండిపోయింది. కృష్ణా బోర్డు నీటిని కేటాయించినా తెలంగాణ సర్కార్ సాగర్ కుడి కాలువకు నీటిని సక్రమంగా విడుదల చేయకపోవడం వల్ల రైతులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడంలో విఫలం.. శ్రీశైలంలో 800 అడుగుల నుంచే రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 90, రోజుకు 0.5 టీఎంసీ చొప్పున 30 టీఎంసీలు తరలించేలా డిండి ఎత్తిపోతలను తెలంగాణ సర్కార్ అక్రమంగా చేపట్టింది. వీటితోపాటు కేసీ కెనాల్కు నీళ్లందించే సుంకేశుల బ్యారేజీ జలవిస్తరణ ప్రాంతం నుంచి 5.44 టీఎంసీలు తరలించేలా తుమ్మిళ్లను, పాలేరు రిజర్వాయలోకి 5.54 టీఎంసీల ఎత్తిపోతలకు భక్త రామదాస, మిషన్ భగీరథ ప్రాజెక్టులను అక్రమంగా తెలంగాణ చేపట్టింది. నెట్టెంపాడు, ఎస్సెల్బీసీ, కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యం పెంచింది. ఈ ఎనిమిది ప్రాజెక్టుల ద్వారా 178.93 టీఎంసీలను అక్రమంగా తరలించేలా 2015లోనే పనులు ప్రారంభించింది. ఈ అక్రమ ప్రాజెక్టులను నిరసిస్తూ 2016లో మే 16 నుంచి 18 వరకూ కర్నూలులో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి జలదీక్ష చేశారు. నాటి సీఎం చంద్రబాబు దీనిపై స్పందించలేదు. చివరకు తెలంగాణ అక్రమంగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను అడ్డుకోవాలని కృష్ణా డెల్టా రైతులు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో 2016 సెప్టెంబరు 21న నాటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అపెక్స్ కౌన్సిల్ తొలి సమావేశాన్ని నిర్వహించారు. కేటాయింపులకు మించి ఒక్క చుక్క నీటిని కూడా అదనంగా పాలమూరు–రంగారెడ్డి, డిండి ద్వారా వాడుకోబోమని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ సమావేశంలో చెప్పారు. కానీ తెలంగాణ అప్పటికే కేటాయించిన నీటి కంటే ఎక్కువగా వాడుకుంటోందని, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా చేపట్టిన ఆ ప్రాజెక్టులను నిలుపుదల చేయాలని డిమాండ్ చేయడంలో నాటి సీఎం చంద్రబాబు విఫలమయ్యారు. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడానికే అపెక్స్ కౌన్సిల్లో రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణ సర్కార్కు చంద్రబాబు తాకట్టు పెట్టారని స్పష్టమవుతోంది. ఫలితంగా పాలమూరు–రంగారెడ్డి, డిండి తదితర అక్రమ ప్రాజెక్టులను తెలంగాణ నిర్విఘ్నంగా కొనసాగిస్తోంది. తుమ్మిళ్ల, భక్తరామదాస, కల్వకుర్తి, నెట్టెంపాడు, మిషన్ భగీరథలను ఇప్పటికే పూర్తి చేసింది. సొంత జిల్లా ప్రజలకు వెన్నుపోటు.. కండలేరు జలాలను తరలించి చిత్తూరు జిల్లా తూర్పు ప్రాంతాన్ని, గాలేరు–నగరి, హంద్రీ–నీవాలను అనుసంధానం చేసి పశ్చిమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేలా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాగునీటి ప్రాజెక్టుల పనులను చేపట్టారు. అయితే ఈ ప్రాజెక్టులను నిలుపుదల చేయాలంటూ టీడీపీ నేత, చిత్తూరు జిల్లా పంచాయతీ సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు జి.గుణశేఖర్నాయుడుతోపాటు మరో 13 మంది పార్టీ నేతలతో ఎన్జీటీలో చంద్రబాబు కేసు వేయించి తన నైజాన్ని చాటుకున్నారు. హక్కుల పరిరక్షణకు నిర్మాణాత్మక చర్యలు.. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించేందుకు ముఖ్యమంత్రి జగన్ నిర్మాణాత్మక చర్యలు చేపట్టారని నీటిపారుదలరంగ నిపుణులు పేర్కొంటున్నారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సాగు, తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రాయలసీమ ఎత్తిపోతల చేపట్టారని, బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపులను వినియోగించుకునేందుకే ఆర్డీఎస్ కుడి కాలువ పనులను చేపట్టారని స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులపై తెలంగాణ సర్కార్ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వివాదాన్ని పరిష్కరించేందుకు గతేడాది అక్టోబర్ 6న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశాన్ని నిర్వహించారు. కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా తెలంగాణ చేపట్టిన 8 ప్రాజెక్టులను నిలుపుదల చేయాలని అపెక్స్ కౌన్సిల్లో సీఎం వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకే రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టామని స్పష్టం చేశారు. తక్షణమే కృష్ణా బోర్డు పరిధిని నోటిఫై చేసి అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెచ్చి రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించాలని కోరారు. శ్రీశైలంలో యథేచ్ఛగా విద్యుదుత్పత్తితో కృష్ణా జలాలు వృథాగా కడలిలో కలిసేలా చేస్తూ తెలంగాణ సర్కార్ సాగిస్తోన్న అక్రమాన్ని అడ్డుకోవాలని ఇప్పటికే రెండు సార్లు ప్రధాని మోదీ, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి షెకావత్లకు లేఖ రాశారు. -
ఏసీబీ స్పెషల్ కోర్టులో ఓటుకు కోట్లు కేసు విచారణ
సాక్షి, హైదరాబాద్ : ఏసీబీ స్పెషల్ కోర్టులో సోమవారం ఓటుకు కోట్లు కేసు విచారణ జరిగింది. ఉదయ్సింహా, సెబాస్టియన్ విచారణకు హాజరయ్యారు. విచారణ సందర్భంగా ఏసీబీ కోర్టు స్టీఫెన్సన్ గన్మెన్ల వాంగ్మూలాన్ని నమోదు చేసింది. రేపు రేవంత్రెడ్డి అప్పటి గన్మెన్లను విచారించనుంది. -
తుది దశకు ఓటుకు కోట్లు కేసు
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు విచారణ తుది దశకు చేరుకుంది. ఈ నెల 8న తుది విచారణ నేపథ్యంలో ఈ కేసులో ఫిర్యాదుదారైన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్, అతడి మిత్రుడు, కేసులో ప్రధాన సాక్షి మాల్కం టేలర్లు సోమవారం ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. తెలంగాణలో బలం లేకున్నా 2015 మేలో ఎమ్మెల్సీ బరిలో దిగిన టీడీపీ.. పలువురు ఎమ్మెల్యేల కొనుగోలుకు తెరలేపింది. ఈ విషయం కాస్తా ఏసీబీకి లీకవడంతో రహస్యంగా సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించారు. మే 31న ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ఆయన మిత్రుడు మాల్కం టేలర్ ఇంట్లో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి రూ.50 లక్షలు లంచం ఇస్తుండగా రెడ్ çహ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఇది అప్పట్లో జాతీయ రాజకీయాలను కుదిపేసింది. మొదట అలాంటిదేమీ లేదంటూ బుకాయించిన టీడీపీ నేతలు.. రేవంత్రెడ్డి రూ.50 లక్షలిస్తూ స్టీఫెన్సన్ను మభ్యపెడుతున్న వీడియోలు, స్టీఫెన్సన్తో చంద్రబాబు మాట్లాడిన ఆడియో టేపులు బయటికి రావడంతో ఆత్మరక్షణలో పడిపోయారు. ఈ కేసులో రేవంత్రెడ్డి, హ్యరీ సెబాస్టియన్, ఉదయసింహా, జెరుసలేం మత్తయ్యలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. కొంతకాలం దర్యాప్తు బాగానే సాగినా.. తర్వాత ఈ కేసుపై తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. అయితే నేతలపై ఉన్న కేసుల విచారణ వేగవంతం చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఈ కేసు విచారణ తిరిగి ప్రారంభమైంది. ఐదున్నర గంటలపాటు మాక్ డ్రిల్ స్టీఫెన్సన్, మాల్కం టేలర్లు మంగళవారం ఏసీబీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు అధికారులు వీరికి పలు సూచనలు ఇచ్చారు. ఆ రోజు ఏం జరిగింది? ప్రత్యర్థి లాయర్లు ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశముంది తదితర అంశాలపై క్రాస్ ఎగ్జామినేషన్లో లాయర్లు ప్రశ్నించే అవకాశముంది. ఆ సమయంలో స్టీఫెన్సన్, మాల్కం టేలర్ తడబడకుండా.. తగిన సూచనలు ఇచ్చారు. దీనిపై మాక్ డ్రిల్ నిర్వహించినట్లు సమాచారం. ఈ మాక్డ్రిల్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అశోక్రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేందర్రావు పాల్గొన్నట్లు తెలిసింది. ఈ కేసులో మొత్తం 418 పేజీల చార్జిషీటును ఏసీబీ దాఖలు చేసింది. కేసు దర్యాప్తు అధికారితో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఫిర్యాదుదారులు, ప్రధాన సాక్షులు ప్రభావితం కూడా వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు మాక్డ్రిల్స్ చేపడుతున్నారు. బాబే సూత్రధారి అని మత్తయ్య వాంగ్మూలం ఈ వ్యవహారంలో ఈడీ కూడా విచారణ చేస్తోంది. స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన రూ.50 లక్షలు ఎవరు సమకూర్చారన్న దానిపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ విషయంలో టీడీపీ నేత వేం నరేందర్రెడ్డిని గతంలోనే విచారించిన ఈడీ గతేడాది డిసెంబర్లో ఓటుకు కోట్లు కేసు లో ఏ–4 నిందితుడిగా ఉన్న మత్తయ్య వాంగ్మూలం తీసుకుంది. తాను ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని మత్తయ్య మీడియాకు విడుదల చేశాడు. అందులో మొత్తం వ్యవహారానికి సూత్రధారి అప్పటి ఏపీ సీఎం చంద్రబాబేనని, గండిపేటలో మహానాడు వేదిక వెనుక గదిలో రేవంత్రెడ్డి, చంద్రబాబును కలిశానని, స్టీఫెన్సన్ను టీడీపీకి అనుకూలంగా ఓటేసేలా ఒప్పిస్తే.. రూ.50 లక్షలు ఇస్తామని ఆశ జూపారని అందుకే, ఈ పనికి అంగీకరించానని పేర్కొన్నాడు. -
ఓటుకు కోట్లు కేసు: రేవంత్రెడ్డికి వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎంపీ రేవంత్రెడ్డి ప్రత్యేక కోర్టు విచారణకు సోమవారం హాజరు కాకపోవడంపై న్యాయమూర్తి సాంబశివరావునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులపై కేసులను సత్వరం విచారించాలన్న సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కోర్టు విచారణకు నిందితులు తప్పనిసరిగా హాజరుకావాల్సిందే నని తేల్చిచెప్పారు. మంగళవారం నిందితులపై అభియోగాలు నమోదు చేయనున్న నేపథ్యంలో నిందితులంతా తప్పనిసరిగా హాజరుకావాలని, లేకపోతే అరెస్టు వారంట్ జారీ చేస్తానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మంగళవారం రేవంత్రెడ్డి, సెబాస్టియన్, రుద్ర ఉదయసింహాతో పాటు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలు ప్రత్యేక కోర్టు ముందు హాజరుకావాల్సి ఉంది. వాదనలు వినిపించాలని కోరే హక్కు లేదు.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమాస్తులపై ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ దివంగత ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్లో వాదనలు వినిపించేందుకు తమకు అనుమతివ్వాలంటూ చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్ను ఏసీబీ ప్రత్యేక కోర్టు సోమవారం తిరస్కరించింది. వాదనలు వినిపిస్తామని కోరే హక్కు (లోకస్) చంద్రబాబుకు లేదని న్యాయమూర్తి సాంబశివరావునాయుడు స్పష్టం చేశారు. అయితే ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను సత్వరం విచారించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో.. చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన వ్యవహారంపై ఏసీబీ దర్యాప్తు కోరుతూ లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్పై ఉత్తర్వులు ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాది అభ్యర్థించారు. ఇప్పటికే పలు పర్యాయాలు ఉత్తర్వులు ఇస్తామంటూ గత ఏడాదిన్నరగా న్యాయస్థానం వాయిదా వేస్తుండటంపై తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని, ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు స్పందించిన న్యాయమూర్తి తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేశారు. చదవండి: రేవంత్ పిటిషన్ కొట్టివేత.. -
ఏసీబీ కోర్టులో రేవంత్రెడ్డికి చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: ఏసీబీ కోర్టులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డికి చుక్కెదురైంది. ఓటుకు కోట్లు కేసు ఏసీబీ పరిధిలోకి రాదన్న రేవంత్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఓటుకు కోట్లు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందన్న కోర్టు.. ఇప్పటికే మరో ముగ్గురు నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లను కొట్టేవేసింది. గతంలో హైకోర్టు.. సండ్ర, ఉదయసింహా, సెబాస్టియన్ పిటిషన్లను కొట్టివేయగా, ఇప్పుడు రేవంత్రెడ్డి పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. చదవండి: పార్టీ మారడం లేదు: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఓటుకు కోట్లుకు సంబంధించి అన్ని ఆధారాలున్న ఉన్నాయని ఏసీబీ తెలిపింది. ఆడియో, వీడియో టేపులతో సహా అన్ని ఆధారాలున్నాయని పేర్కొంది. రూ.50లక్షలు ఇస్తూ రెడ్హ్యాండెడ్గా నిందితులు పట్టుబడ్డారని ఏసీబీ తెలిపింది. ఏసీబీ వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు.. అభియోగాల నమోదు కోసం విచారణ ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. ఫిబ్రవరి 8న నిందితులు హాజరుకావాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. చదవండి: బీజేపీ, టీఆర్ఎస్పై ఉత్తమ్ ధ్వజం -
ఓటుకు కోట్లు కేసు విచారణ నేటికి వాయిదా..
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసును విచారించే పరిధి ఈ కోర్టుకు లేదని మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డి తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ఏసీబీ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. ప్రజాప్రతినిధులపై నమోదు చేసే కేసులను విచారించే పరిధి ఈ కోర్టుకు లేదంటూ రేవంత్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తి సాంబశివరావు నాయుడు సోమవారం మరోసారి విచారించారు. ఎంపీ, ఎమ్మెల్యేలపై నమోదు చేసిన ఈ కేసును విచారించే పరిధి ఎన్నికల కమిషన్కు మాత్రమే ఉంటుందని సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. తదుపరి విచారణను న్యాయమూర్తి మంగళవారానికి వాయిదా వేశారు. -
ఓటుకు కోట్లు కేసులో ప్రమాణానికి సిద్ధమా?
పొందూరు: ‘ఓటుకు కోట్లు కేసులో ఫోన్ రికార్డ్లో నీ గొంతు కాదని దబాయిస్తే.. కాణిపాకంలోని విఘ్నేశ్వరుని ముందు ప్రమాణం చేద్దాం రా?’ అని చంద్రబాబుకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సవాల్ విసిరారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలోని నందివాడలో ఇళ్ల పట్టాల పంపిణీలో ఆయన మాట్లాడారు. మనుషుల్లో దేవుడిని చూసే గొప్ప మానవతావాది సీఎం జగన్ అని, అలాంటి వ్యక్తిపై నిందలు మోపడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల, మతాల మధ్య చిచ్చురేపే స్వార్థ, నీచ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. -
కీలక పరిణామం; బాబు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో నిందితుడైన జెరూసలేం మత్తయ్య ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చాడు. చంద్రబాబు సమక్షంలోనే ఒప్పందం కుదిరిందని స్పష్టం చేశాడు. స్టీఫెన్సన్కు రూ.5 కోట్లు ఇస్తామని అడ్వాన్స్గా రూ.50లక్షలు ఇస్తానని.. చంద్రబాబు తనతో చెప్పారని పేర్కొన్నాడు. టీడీపీ మాజీ నేత, కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్రెడ్డి నోట్లకట్టలతో కనిపించిన వీడియో, ఈ కేసుకు సంబంధించి పలు ఆడియో రికార్డులను సైతం ఈడీ ముందు ధృవీకరించాడు. అదే విధంగా ఓట్లుకు కేసు విషయంలో తనకేమీ కాకుండా, ఏసీబీ అధికారులను మేనేజ్ చేస్తానని చంద్రబాబు తనయుడు నారా లోకేష్ హామీ ఇచ్చారని, వెంటనే విజయవాడకు వెళ్లిపోవాలని తనకు సలహా ఇచ్చినట్లు మత్తయ్య ఈడీకి చెప్పాడు.(చదవండి: ‘ఓటుకు కోట్లు’ కేసులో కీలక పరిణామం) ఈ మేరకు.. ‘‘నేను చాలాకాలంగా చంద్రబాబుకు తెలుసు. టీడీపీకి అనుకూలంగా పనిచేశాను. పలు సందర్భాలలో చంద్రబాబును కలిశాను. అయితే 2015 మహానాడు సందర్భంగా చంద్రబాబు, రేవంత్రెడ్డి నన్ను కలవాలనుకుంటున్నారని.. జిమ్మీబాబు నాకు చెప్పాడు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి.. కీలకమైన విషయం మాట్లాడటానికి వాళ్లిద్దరు నన్ను రమ్మన్నారు. దీంతో హిమాయత్సాగర్లో జరుగుతున్న మహానాడుకు వెళ్లాను. జిమ్మీబాబు నన్ను చంద్రబాబు దగ్గరికి తీసుకెళ్లాడు. మహానాడు జరుగుతుండగానే చంద్రబాబునాయుడిని కలిశాను. అక్కడే ఆయన సమక్షంలోనే రేవంత్రెడ్డి నాతో ఈ డీల్ మాట్లాడారు. స్టీఫెన్సన్ టీడీపీకి అనుకూలంగా ఓటు వేసేవిధంగా ఒప్పించే బాధ్యత నాకు అప్పజెప్పారు. ఇందులో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటేస్తే.. స్టీఫెన్సన్కు రూ.5కోట్లు ఇస్తామని చంద్రబాబు సమక్షంలో రేవంత్రెడ్డి చెప్పారు. ఓటింగ్కు గైర్హాజరైతే రూ.3కోట్లు ఇస్తామని చెప్పమన్నారు. ఈ ఒప్పందం కుదిరిస్తే నాకు రూ.50లక్షలు ఇస్తామని చంద్రబాబు సమక్షంలో రేవంత్ చెప్పాడు. డీల్కు స్టీఫెన్సన్ ఒప్పుకుంటే.. ముందుగా రూ.50లక్షలు అడ్వాన్స్ ఇస్తామని చంద్రబాబే చెప్పారు. ఈ విషయంలో నేను వెళ్లి స్టీఫెన్సెన్తో మాట్లాడాలని నాకు చెప్పారు. అతడిని ఒప్పిస్తే నన్ను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. చంద్రబాబు, రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు నేను వెళ్లి స్టీఫెన్సన్తో చర్చించాను. వాళ్లిద్దరు ఆఫర్ చేసిన డీల్ గురించి స్టీఫెన్సన్కు చెప్పాను, అయితే తాను రేవంత్రెడ్డితో నేరుగా కలుస్తానని స్టీఫెన్సన్ నాతో చెప్పారు. ఈ విషయం రేవంత్రెడ్డికి చెప్పాలని సెబాస్టియన్కు చెప్పాను. చంద్రబాబు ఆదేశాలతో రేవంత్రెడ్డి డబ్బులతో స్టీఫెన్సన్ దగ్గరు వెళ్లారు. ఆ తరువాత రేవంత్రెడ్డి నేరుగా వెళ్లి స్టీఫెన్సన్కు బ్యాగులో డబ్బులు ఇచ్చారు. రేవంత్రెడ్డి డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఆయనను రెడ్హాండెడ్గా అరెస్టు చేశారు. రేవంత్రెడ్డి అరెస్టు అయిన రెండో రోజు రహస్యంగా బంజారాహిల్స్లోని టీడీపీ కార్యాలయానికి వెళ్లాను. హైదరాబాద్లోని టీడీపీ కార్యాలయంలో నారా లోకేష్ను కలిశాను. నీకేమీ కాదని ఏసీబీ అధికారులను మేనేజ్ చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. విజయవాడకు వెళ్లిపొమ్మని నాకు సూచించారు’’ అని మత్తయ్య తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పాత్రపై స్పష్టమైన ఆధారాలు లభించడంతో ఈడీ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. కాగా, 2015లో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి అప్పటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెడుతూ రూ. 50 లక్షలతో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల అనంతరం రేవంత్ రెడ్డితో పాటు వేం నరేందర్ రెడ్డి కూడా టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
‘ఓటుకు కోట్లు’ కేసులో కీలక పరిణామం
సాక్షి, న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు నాయుడిని ముద్దాయిగా చేర్చాలంటూ దాఖలైన పిటిషన్ని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది. వేసవి సెలవుల తర్వాత వచ్చే ఏడాది జూలై 14న దీన్ని విచారణ చేస్తామని కోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ‘ఓటుకు కోట్లు కేసు ఛార్జ్షీట్లో చంద్రబాబు పేరును 37 సార్లు ప్రస్తావించారు. అయినా ఆ కేసులో ఏసీబీ చంద్రబాబును ముద్దాయిగా చేర్చలేదు’ అని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కేసులో చంద్రబాబు పేరు చేర్చి సీబీఐ దర్యాప్తు జరపాలని కోర్టును అభ్యర్ధించారు. రాజకీయ నేతల కేసులను త్వరితగతిన విచారణ జరపాలని ఇటీవలే సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. (ఓటుకు కోట్లు కేసు: ఉదయ్సింహ అరెస్టు) -
ఓటుకు కోట్లు కేసు: ఉదయ్సింహ అరెస్టు
సాక్షి, హైదరాబాద్: ఏళ్లుగా నలుగుతున్న ఓటుకు కోట్లు కేసులో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ-3 గా ఉన్న ఉదయ్సింహను ఏసీబీ అధికారులు నేడు అరెస్టు చేశారు. ఇప్పటికే పలువురు నిందితుల డిశ్చార్జ్ పిటీషన్లు కొట్టివేసిన ఏసీబీ ప్రత్యేక కోర్టు అభియోగాలపై విచారణ ప్రారంభించింది. విచారణకు హాజరుకాని మరో నిందితుడు ఉదయ్సింహపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. నాన్ బెయిలబుల్ వారెంట్ను అమలు చేసిన ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. ఏసీబీ కోర్టులో ఉదయ్సింహను గురువారం హాజరుపరచనున్నారు. కాగా, ఈ కేసులో ఆడియో, వీడియో టేపుల ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కీలకం కానుంది. నిందితులపై నమోదైన అభియోగాలపై విచారణ ప్రారంభం కావటంతో కీలక సూత్రదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. (చదవండి: ఏసీబీ కోర్టులో ఓటుకు కోట్లు కేసు విచారణ..) -
ఓటుకు కోట్లు కేసుపై విచారణ
సాక్షి, హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో సెబాస్టియన్ డిశ్చార్జ్ పిటిషన్పై ఏసీబీ కౌంటరు దాఖలు చేసింది. సెబాస్టియన్ ఫోన్తో కుట్రలో కీలక వివరాలు బయటపడ్డాయని ఏసీబీ తెలిపింది. సెబాస్టియన్ డిశ్చార్జ్ పిటిషన్ కొట్టివేయాలని ఏసీబీ కోర్టును కోరింది. విచారణ జాప్యం చేసేందుకే ఒకరి తర్వాత ఒకరు పిటిషన్లు దాఖలు చేశారని ఏసీబీ పేర్కొంది. ఓటుకు నోటు కేసుపై శుక్రవారం మరో సారి కోర్టులో వాదనలు జరగనున్నాయి. -
ఓటుకు కోట్లు కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. బుధవారం ఏసీబీ న్యాయస్థానంలో ఈ కేసు విచారణకు రాగా.. డిశ్చార్జ్ పిటిషన్లపై హైకోర్టును ఆశ్రయించినందున గడువు ఇవ్వాలని సండ్ర వెంకటవీరయ్య, రుద్ర ఉదయ్సింహా కోరారు. అయితే వారి అభ్యర్థనపై ఏసీబీ అభ్యంతరం తెలిపింది. డిశ్చార్జ్ పిటిషన్లపై అప్పీల్ పేరుతో గడువు ఇవ్వొద్దని కోర్టును కోరింది. ఈ నేపథ్యంలో ఈ నెల 16న ఓటుకు కోట్లు కేసులో అభియోగాల నమోదు ప్రక్రియ ప్రారంభించాలని కోర్టు నిర్ణయించింది. అభియోగాల నమోదుకు మరింత గడువు ఇవ్వాలని నిందితులు కోరగా కోర్టు నిరాకరించింది. ఈ నెల 16న నిందితులు రేవంత్ రెడ్డి, సండ్ర, ఉదయ్ సింహా, సెబాస్టియన్లు కచ్చితంగా విచారణకు హాజరు కావాలని ఏసీబీ న్యాయస్థానం ఆదేశింది. చదవండి : ‘ఓటుకు కోట్లు’ కుట్రకు ఆధారాలున్నాయి -
‘ఓటుకు కోట్లు’ కుట్రకు ఆధారాలున్నాయి
సాక్షి, హైదరాబాద్: 'ఓటుకు కోట్లు' కేసులో కుట్రకు ప్రాథమిక ఆధారాలున్నాయని ఏసీబీ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. ఈ దశలో నిందితులను కేసు నుంచి తొలగించలేమని (డిశ్చార్జ్) చేయలేమని, తుది విచారణ (ట్రయల్) చేపట్టాల్సిందేనని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో నిందితులు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, రుద్ర ఉదయసింహలు దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్లను కొట్టేసింది. ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఉద్దేశపూర్వకంగా తమను ఇరికించారన్న వారిద్దరి వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు ప్రత్యేక కోర్టు ప్రధాన న్యాయమూర్తి సాంబశివరావునాయుడు సోమవారం తీర్పునిచ్చారు. నిందితులపై అభియోగాల నమోదు కోసం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు. ఈ కేసు విచారణలో భాగంగా రేవంత్రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య తదితరులు సోమవారం ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. మహానాడు వేదికగా కుట్ర... టీడీపీ 2015లో నిర్వహించిన మహానాడులో ఓటుకు కోట్లు కుట్ర జరిగిందని ఏసీబీ ప్రత్యేక కోర్టుకు నివేదించింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను డబ్బుతో ప్రలోభపెట్టి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్రెడ్డిని గెలిపించేందుకు కుట్ర చేశారని తెలిపింది. రేవంత్రెడ్డి, మత్తయ్య తదితరులతో కలసి సండ్ర కూడా కుట్రలో భాగస్వామిగా మారారని, శంషాబాద్ నోవాటెల్లో ఇదే అంశంపై రేవంత్రెడ్డి, సెబాస్టియన్, సండ్ర సమావేశమయ్యారని పేర్కొంది. రేవంత్రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహ ఫోన్కాల్స్, వాయిస్ కాల్స్లోనూ సండ్ర ప్రమేయం స్పష్టమైందని వివరించింది. సండ్ర పాత్రను నిరూపించేందుకు అన్ని సాంకేతిక ఆధారాలు ఉన్నాయని తెలిపింది. రేవంత్ అనుచరుడు ఉదయ్సింహకు కూడా ఈ కుట్రలో కీలకపాత్ర ఉందని ఏసీబీ తెలిపింది. స్టీఫెన్సన్ సూచించిన అపార్ట్మెంట్కు 2015 మే 31న మధ్యాహ్నం 4:40 గంటలకు రేవంత్రెడ్డి, సెబాస్టియన్ ఒకే కారులో వచ్చారని, కొద్దిసేపటికి ఉదయసింహ వెర్నా కారులో రూ. 50 లక్షలున్న డబ్బు సంచి తీసుకొని అదే అపార్ట్మెంట్కు వచ్చారని ఏసీబీ వివరించింది. సీఫెన్సన్కు ఇచ్చేందుకు వేం కృష్ణకీర్తన్రెడ్డి నుంచి సికిం ద్రాబాద్ సమీపంలోని మెట్టుగూడ చౌరస్తా వద్దకు వెళ్లి రూ. 50 లక్షలు నగదు తీసుకురావాలని రేవంత్రెడ్డి ఉదయ్సింహకు సూచించారని తెలిపింది. ఈ కేసులో ఉదయసింహ పాత్రను నిరూపించేందుకు స్పష్టమైన ఆధారాలున్నాయని వివరించింది. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి... వారిద్దరి డిశ్చార్జ్ పిటిషన్లను కొట్టివేశారు. -
ఓటుకు కోట్లు కేసు: ‘నాకు ప్రాణహాని’
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో పెనుదుమారం రేపిన ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ కోర్టు మంగళవారం విచారణ కొనసాగించింది. వాదనలు విన్న ధర్మాసనం విచారణను ఏప్రిల్ 20కి వాయిదా వేసింది. ఈ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న సెబాస్టియన్ కోర్టుకు హాజరయ్యారు. (తెరపైకి మరోసారి ఓటుకు కోట్లు కేసు) కోర్టుకు హాజరయిన అనంతరం సెబాస్టియన్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. తనను ఈ కేసులో అన్యాయంగా ఇరికించి.. అసలు దోషులను వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రాణ ఉందని.. రక్షణ కల్పించాలని కోరారు. బెదిరింపులు, దాడులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. టీడీపీ తనను ఈ కేసులో ఇరికించిందన్నారు. ఆడియో టేపుల ఫోరెన్సిక్ రిపోర్ట్పై విచారణ జరిగితే కీలక వ్యక్తులు వెలుగులోకి వస్తారని చెప్పారు. స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన నగదు ఎక్కడ నుంచి వచ్చిందో విచారణ జరగాలన్నారు. ఈ కేసులో అసలు సూత్రధారి ఎవరో ప్రజలందరికి తెలుసన్నారు. నిజనిజాలన్ని కోర్టుకు తెలుపుతానని అందుకే సూత్రధారులతో ప్రాణహాని ఉందని సబాస్టియన్ పేర్కొన్నారు. (రేవంత్ మెడ చుట్టూ బిగుస్తున్న కేసుల ఉచ్చు) -
తెరపైకి మరోసారి ఓటుకు కోట్లు కేసు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. కేసుకు సంబంధించి ఐదుగురు నిందితులు కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. ఈ కేసులో ఏ1 గా ఉన్న రేవంత్రెడ్డి డ్రోన్ కేసులో ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉండటంతో ఆయనను నేడు ఏసీబీ కోర్టుకు హాజరుపరుస్తారా? లేదా? అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. 2015లో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెడుతూ రూ. 50 లక్షలతో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.(రేవంత్ మెడ చుట్టూ బిగుస్తున్న కేసుల ఉచ్చు) ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించిన ఏసీబీ.. మొత్తం 960 పేజీలతో చార్జిషీట్ దాఖలు చేసింది. అందులో ఈ కేసులో నిందితుల పాత్ర, అసలు సూత్రధారుల సంబంధించి కీలక విషయాలను పొందుపరిచారు. స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది. ఎవరు సమకూర్చారు అనే అంశం కీలకంగా మారింది. ఇప్పటికే కోర్టుకు ఆడియో టేపుల ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులు చేరాయి. ఓటుకు కోట్లు కేసు విచారణ ఏసీబీ కోర్టులో వేగంగా సాగుతుంది. త్వరలోనే ఈ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. (చర్లపల్లి జైలుకు రేవంత్..) (రేవంత్ నేరాల పుట్ట బయటపడింది) -
తెరపైకి మరోసారి ఓటుకు కోట్లు కేసు
-
మరోసారి తెరపైకి ఓటుకు కోట్లు కేసు
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి మంగళవారం ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. దీంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. ఈ కేసులో ఏ1 గా ఉన్న రేవంత్రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉండటంతో ఆయనను రేపు ఏసీబీ కోర్టుకు హాజరుపరుస్తారా? లేదా? అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించిన ఏసీబీ.. మొత్తం 960 పేజీలతో చార్జిషీట్ దాఖలు చేసింది. అందులో ఈ కేసులో నిందితుల పాత్ర, అసలు సూత్రధారుల సంబంధించి కీలక విషయాలను పొందుపరిచారు. త్వరలోనే కీలక పరిణామాలు..! మరోవైపు ఈ కేసుకు సంబంధించిన ఆడియో టేపుల ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కోర్టుకు చేరింది. ఈ కేసులో స్టీఫెన్సన్కు రేవంత్రెడ్డి ఇవ్వజూపిన డబ్బు ఎక్కడినుంచి వచ్చిందనేది కీలకం కానున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ కేసులో కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కాగా, 2015లో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెడుతూ రూ. 50 లక్షలతో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల అనంతరం రేవంత్ రెడ్డితో పాటు వేం నరేందర్ రెడ్డి కూడా టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
ఓటుకు కోట్లు కేసును శీఘ్రంగా విచారించాలి
ఇది వినాల్సిన కేసు (ఓటుకు కోట్లు). పూర్తిస్థాయిలో విచారణ జరుపుతాం. త్వరితగతిన విచారణకు వచ్చేలా చూస్తాం.. – 2017 మార్చి 6న జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్య సాక్షి, న్యూఢిల్లీ: ‘ఓటుకు కోట్లు’ కేసులో అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయాల్సిందిగా అభ్యర్థిస్తూ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును మరోసారి ఆశ్రయించారు. కేసును 2019 ఫిబ్రవరిలో విచారిస్తామంటూ 2018 నవంబర్లో సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చినా ఇప్పటివరకు కేసు విచారణకు రాలేదని, శీఘ్రగతిన విచారించాలని అభ్యర్థించారు. ఆళ్ల తరపున న్యాయవాది అల్లంకి రమేష్ సోమవారం ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ఏడాది క్రితం సుప్రీం ఉత్తర్వులు.. ఓటుకు కోట్లు కేసుకు సంబంధించి ప్రధాన పిటిషన్లో ప్రతివాదులైన నాటి సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు, తెలంగాణ ప్రభుత్వానికి 2017 మార్చి 6న సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. తర్వాత ఈ పిటిషన్ విచారణకు రాలేదు. త్వరగా విచారించాలని కోరుతూ ఆళ్ల తొలిసారి శీఘ్ర విచారణ పిటిషన్ దాఖలు చేయగా 2019 ఫిబ్రవరిలో విచారణ జరుపుతామని జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ ఎ.ఎం.ఖన్విల్కర్, జస్టిస్ రామయ్యగారి సుభాష్రెడ్డితో కూడిన ధర్మాసనం 2018 నవంబరు 2న ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఇప్పటి వరకు పిటిషన్ విచారణకు రాలేదు. 2017లో నోటీసులు జారీ చేసినా... ‘ఓటుకు కోట్లు’ కేసులో ఏసీబీ దర్యాప్తు సక్రమంగా లేదని, చంద్రబాబు పాత్రపై అధికారులు దర్యాప్తు చేయడం లేదని పేర్కొంటూ 2016 ఆగస్టు 8న ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై లోతైన దర్యాప్తు జరపాలని అదే ఏడాది ఆగస్టు 29న ఏసీబీని ఆదేశిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ చంద్రబాబు 2016 సెప్టెంబర్ 1న హైకోర్టును ఆశ్రయించగా ఏసీబీ న్యాయస్థానం ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఆళ్ల సుప్రీం కోర్టును ఆశ్రయించగా జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం 2017 మార్చి 6న ప్రతివాదులైన తెలంగాణ ప్రభుత్వం, నాటి సీఎం చంద్రబాబుకు నోటీసులిచ్చింది. ఇది వినాల్సిన కేసని.. త్వరితగతిన విచారణకు వచ్చేలా చూస్తామని పేర్కొంటూ ఆ సమయంలో నోటీసులు జారీ చేసింది. విచారణకు రాని పిటిషన్ 2017 మార్చి 6న సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చిన నాటి నుంచి చంద్రబాబు ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయలేదని, తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ కేసుపై తగినంత ఆసక్తి చూపడంలేదని, ప్రతివాదులు పలుకుబడి కలిగిన వారైనందున ఆలస్యమైతే సాక్షులను ప్రభావితం చేయవచ్చని పిటిషనర్ తొలిసారి శీఘ్ర విచారణ కోరిన సమయంలో నివేదించారు. వీటితోపాటు మరో కొన్ని అంశాలను జోడిస్తూ తాజాగా రెండోసారి శీఘ్ర విచారణ పిటిషన్ దాఖలుచేశారు. 2019 ఫిబ్రవరిలో విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసినా ఇప్పటివరకు కేసు లిస్ట్ కాలేదని... పిటిషనర్, ఆయన తరపు న్యాయవాదులు రిజిస్ట్రీలో విచారించినా ఫలితం లేదన్నారు. దీన్ని విచారణ కేసుల జాబితాలో చేర్చకపోవడానికి కారణాలు తెలియడం లేదని నివేదించారు. -
ఓటుకు కోట్లు: తాజా వీడియోపై ఈడీ ప్రశ్నలు..!
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ మిత్రుడు మాల్కం టేలర్ను శుక్రవారం విచారించింది. ఈ కేసుకు సంబంధించి వెలుగుచూసిన మరో వీడియో క్లిప్పింగ్పై ఈడీ ప్రశ్నలు సాగినట్లు సమాచారం. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న మాల్కం టేలర్ను తమ ఎదుట హాజరుకావాలంటూ ఈడీ ఈ నెల 5న నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి హాజరైన మాల్కం టేలర్ను అధికారులు దాదాపుగా 3.30 గంటలపాటు విచారించారు. రేవంత్రెడ్డిని అరెస్టు చేసిన సమయంలో ఇస్తానన్న రూ. 50 లక్షలు ఎక్కడ నుంచి తెచ్చారు? మిగిలిన రూ. 4.50 కోట్లు ఎక్కడ నుంచి తీసుకురావాలనుకున్నారు? వాటిని ఎక్కడ పెట్టారు? అని అడినట్లు తెలిసింది. వీడియోలో ‘బాబు’ప్రస్తావనపైనా ఈడీ అధికారులు ఆరా తీశారు. ‘బాబు’డబ్బులు ఎందుకు ఇస్తానన్నారు? అని ఆరా తీసినట్లు సమాచారం. (‘ఓటుకు కోట్లు’ కేసులో మరో సంచలన వీడియో..!) ఏసీబీ వీడియోలతో కలిపి పరిశీలన... రేవంత్రెడ్డిని అరెస్టు చేసే సమయంలో పలుచోట్ల రహస్య కెమెరాలతో ఏసీబీ పోలీసులు చిత్రీకరించిన వీడియోలను, మరోవైపు మాల్కం టేలర్ మొబైల్ నుంచి బయటకు వచ్చిన వీడియోను ఈడీ పరిశీలించినట్లు తెలుస్తోంది. ఇంతకాలం ఈ వీడియోను ఎందుకు బయటపెట్టలేదు? అని ప్రశ్నించినట్లు సమాచారం. ఏపీ పోలీసుల సంచారం.. ఈడీ కార్యాలయం వద్ద ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు శుక్రవారం ఉదయం నుంచే తచ్చాడుతూ కనిపించారు. మాల్కం టేలర్ ఈడీ విచారణకు హాజరై తిరిగి వెళ్లే దాకా అక్కడే నిఘా పెట్టారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేయడం కనిపించింది. లోపల ఏం జరిగింది? ఏం ప్రశ్నలు వేశారు అంటూ పలువురు మీడియా ప్రతినిధులకు ఫోన్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇవి చదవండి : దొరికిన దొంగ చంద్రబాబు; సంచలనం ‘ఓటుకు కోట్ల’కు.. ‘మే’ ముహూర్తం! -
ఓటుకు కోట్లు : ఏది జరిగినా మీరే బాధ్యులు..!
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో గురువారం మరో వీడియో బయటపడింది. స్పై కెమెరాలకు సమాంతరంగా ఏసీబీ ఏర్పాటు చేసిన ఫోన్ కెమెరాలో తాజా వీడియో రికార్డయింది. 2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చేందుకు టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే, ఆంగ్లో ఇండియన్ ఎల్విస్ స్టీఫెన్సన్ను కొనుగోలు చేసేందుకు రూ.5 కోట్లకు బేరం కుదిరినట్టు ఈ వీడియో లో స్పష్టమైంది. టీడీపీ నేత సెబాస్టియన్, స్టీఫెన్సన్తో.. ‘తొలుత బాబు గారు 3.5 కోట్లు ఇవ్వడానికే ఒప్పుకున్నారు. నా ఒత్తిడి మేరకు రూ. 5 కోట్లు ఇవ్వడానికి సరేనన్నారు’ అని మాట్లాడారు. అదే సమయంలో.. రేవంత్రెడ్డి బయటకు వెళ్లిన తర్వాత స్టీఫెన్సన్కు ముట్టజెప్పే సొమ్ములో తన కొచ్చే కమీషన్ గురించి కూడా సెబాస్టియన్ మాట్లాడినట్టు తెలుస్తోంది. (సార్ ఎవరు? ) ఈ వ్యవహారంలో మధ్యవర్తులు ఉన్నట్టు వారి మధ్య జరిగిన సంభాషణ ద్వారా వెల్లడైంది. అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు రేవంత్ను అదుపులోకి తీసుకోవడంతో ఈ వీడియో ముగుస్తుంది. కాగా, ఈ డీల్ సమయంలో స్టీఫెన్సన్కు ఇచ్చిన రూ.50 లక్షల సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందనేది తేలాల్సి ఉంది. ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలపై ఎన్ఫోర్స్మెండ్ డెరెక్టరేట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కొనుగోలు వ్యవహారంలో మధ్యవర్తిత్వం వహించినది ఎవరేనేది కూడా విచారణలో తేలనుంది. గత నాలుగేళ్లుగా నలుగుతున్న ఈ కేసులో తాజా వీడియోతో విచారణ వేగం కావొచ్చని పలువురు భావిస్తున్నారు. (‘ఓటుకు కోట్లు’ కేసులో మరో సంచలన వీడియో..!) కాగా,‘ఓటుకు కోట్లు’ కేసులో ఈడీ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వేం నరేందర్ రెడ్డిపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెడుతూ రూ. 50 లక్షలతో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన రూ. 50 లక్షలతో పాటు మరో నాలుగున్నర కోట్లు ఎక్కడ అంటూ నరేందర్ రెడ్డిపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల అనంతరం రేవంత్ రెడ్డితో పాటు వేం నరేందర్ రెడ్డి కూడా టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. (ఆ 50 లక్షలు హవాలా సొమ్మా?) తాజా వీడియో ఆధారంగా సంభాషణ.. స్టీఫెన్సన్ : లెటస్ గో టు ది డీల్.. సెబాస్టియన్ : నిజానికి బాబు ముందు 3.5 కోట్లు మాత్రమే ఇస్తానని చెప్పారు. నా ఒత్తిడి మేరకు రూ.5 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. రేవంత్ రెడ్డిని మీరు నమ్ముతున్నారు. బాబు నన్ను నమ్ముతున్నారు. మీరు రేవంత్ రెడ్డిని నమ్మడంతో ఆయన తెరమీదకు వచ్చారు. ఏది జరిగినా మీరే బాధ్యులు.. ఓకే సార్. సంబధిత వార్తలు.. దొరికిన దొంగ చంద్రబాబు; సంచలనం ‘ఓటుకు కోట్ల’కు.. ‘మే’ ముహూర్తం! ఓటుకు కోట్లు కేసు; సుప్రీం ఆదేశాలు -
ఆడియోలో ఉన్నది చంద్రబాబు గొంతే..
-
ఆ కేసులో చంద్రబాబే ప్రధాన ముద్దాయి
సాక్షి, హైదరాబాద్ : ఓటుకు కోట్లు వ్యవహారం దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మఅన్నారు. ఈ కేసులో చంద్రబాబే ప్రధాన ముద్దాయని ఆరోపించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి చంద్రబాబు నాయుడు బేరసారాలకు దిగారని, ఈ విషయం ఈ రోజు బయటపడ్డ వీడియోలో స్పష్టంగా కనబడుతుందన్నారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు రెడ్హ్యండెడ్గా పట్టుబడినా..నాలుగేళ్లుగా తప్పించుకు తిరుగుతున్నారని విమర్శించారు. టీడీపీ చేసిన తప్పులను ఏపీ, తెలంగాణ సమస్యగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. (‘ఓటుకు కోట్లు’ కేసులో మరో సంచలన వీడియో..!) ఓటుకు కోట్లు ఇస్తూ ఆడియో, వీడియోలో అడ్డంగా దొరికినా.. ఆ విషయంపై ఇప్పటికీ చంద్రబాబు సమాధానం చెప్పలేకపోతున్నారని విమర్శించారు. రూ.కోట్లు కుమ్మరించి రేవంత్ టీమ్ ఎమ్మెల్యేను కొనేందుకు చూశారన్నారు. తన స్వార్థం కోసం చంద్రబాబు దేనికైనా తెగబడతారని ఆరోపించారు. చివరకు ఏపీ ప్రజల ఓట్లు కొనేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దీనికి ఐటీ గ్రిడ్స్ డేటా చోరీయే నిదర్శనమన్నారు. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యలను తారుమారు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నీతిమాలిన రాజకీయాలను, కుంభకోణాలను ప్రజలు గమనిస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో ఆయనను కచ్చితంగా ఓడిస్తారని ధీమా వ్యక్తం చేశారు. (దొరికిన దొంగ చంద్రబాబు) -
‘ఓటుకు కోట్లు’ కేసులో మరో సంచలన వీడియో..!
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసు విచారణ కీలక మలుపు తిరుగుతోంది. ఓటుకు కోట్లు కేసులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయని ఇంగ్లిష్ డెయిలీ డెక్కన్ క్రానికల్ ప్రచురించిన కథనం సంచలనం రేపుతోంది. ఈ కేసులో అసలు సూత్రధారులు ఎవరన్న కోణంలో దర్యాప్తు సాగుతున్న నేపథ్యంలో.. తార్నాకలోని మాల్కం టేలర్ అనే వ్యక్తి ఇంట్లో తీసిన వీడియో బయటికొచ్చింది. 11 నిముషాల నిడివి గల ఈ వీడియోలో టీడీపీ నేత సెబాస్టియన్, టీఆర్ఎస్ నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను రూ.5 కోట్లకు కొనుగోలు చేసేందుకు బేరసారాలు నడిపారు. 2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు సెబాస్టియన్ స్టీఫెన్సన్తో బేరం మాట్లాడినట్టు ఈ వీడియో ద్వారా తెలిసింది. (సార్ ఎవరు?) అడ్వాన్స్గా రూ.50 లక్షలు ఇవ్వడానికి నాటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి వస్తాడని సెబాస్టియన్ చెప్పినట్టు ఈ వీడియోలో స్పష్టమైంది. తొలుత 3.5 కోట్లకే బాబు ఒప్పుకున్నారని, కానీ తన సిఫారసుతో 5 కోట్లకు డీల్ ఓకే అయిందని సెబాస్టియన్ స్టీఫెన్ సన్తో చెప్పిన విషయం వెల్లడైంది. మిగతా సొమ్ముకు తనదే బాధ్యత అంటూ సెబాస్టియన్ హామీయిచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఈ వీడియో ఓటుకు కోట్లు కేసులో ప్రధాన సూత్రధారి ఎవరనే విషయం తెలియనుంది. ఇప్పటికే ఈ కేసులో ఏ1 రేవంత్రెడ్డి, ఏ2 సెబాస్టియన్, ఉదయసింహ, వేం నరేందర్రెడ్డి విచారణ ఈడీ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలకమైన చంద్రబాబు– స్టీఫెన్సన్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ టేపును ప్రఖ్యాతి గాంచిన చండీగఢ్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. స్టీఫెన్సన్తో మాట్లాడింది చంద్రబాబేనని ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా నిర్ధారించింది. అయినా ఇప్పటివరకు ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగలేదు. నాలుగేళ్లుగా నలుగుతున్న ఈ కేసులో తాజాగా బయటపడిన వీడియో ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి..! (ఆ 50 లక్షలు హవాలా సొమ్మా?) సంబధిత వార్తలు : దొరికిన దొంగ చంద్రబాబు; సంచలనం ‘ఓటుకు కోట్ల’కు.. ‘మే’ ముహూర్తం! ఓటుకు కోట్లు కేసు; సుప్రీం ఆదేశాలు -
మిగిలిన రూ. 4.5 కోట్లకు ఎవరు హామీ ఇచ్చారు?
-
ఆ 50 లక్షలు హవాలా సొమ్మా?
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఏ–1 నిందితుడైన రేవంత్రెడ్డిని మంగళవారం 8 గంటలపాటు విచారించి ప్రశ్నలవర్షం కురిపించింది. ఉదయం 11.30కు ఈడీ కార్యాలయానికి హాజరైన రేవంత్ను రాత్రి 7.30 దాకా విచారించింది. ఈ వ్యవహారంలో హవాలా జరిగిందా అనే విషయాలపై అధికారులు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ఈ కేసులో వేం నరేందర్రెడ్డి, ఆయన కుమారులు, ఉదయసింహాను విచారించిన ఈడీ.. వారి సమాచారం ఆధారంగా రేవంత్ కోసం ప్రత్యేక ప్రశ్నావళిని రూపొందించినట్లు తెలిసింది. రేవంత్ చెప్పే సమాధానాలను సరిపోల్చుకునేందుకు ఐటీతోపాటు గతంలో ఈ కేసును విచారించిన ఏసీబీ అధికారులు విచారణకు హాజరయ్యారు. వారూ రేవంత్ను డబ్బు విషయంపై ప్రశ్నలు అడిగారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన రూ.50 లక్షలు ఎక్కడ నుంచి సేకరించారు? ఎవరిచ్చారు? ఆ డబ్బు హవాలా డబ్బా? లేక స్థానికంగా ఎవరైనా సర్దుబాటు చేశారా? అనే విషయాలపైనే ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. మిగిలిన రూ. 4.5 కోట్లకు ఎవరు హామీ ఇచ్చారు? ఒకవేళ ఆ డబ్బు ముందుగానే సిద్ధం చేసి ఉంటే.. దాన్ని ఎవరి వద్ద ఉంచారు? అంత డబ్బు ఇచ్చేందుకు ఒకరే సహకరించారా? ఒకరికన్నా ఎక్కువమంది సహకరించారా? అనే విషయాలపై రేవంత్ను ప్రశ్నించినట్లు తెలిసింది. తెలియదు.. గుర్తులేదు.. ఈ కేసులో చాలా విషయాలకు రేవంత్ సరైన సమాధానాలు ఇవ్వలేదని సమాచారం. చాలా ప్రశ్నలకు తనకు గుర్తులేదని, తెలియదని, మిగిలిన విషయాలు తన లాయర్ మాటాడతారని సమాధానమిచ్చారని తెలిసింది. రేవంత్కు సహకరించేందుకు పలువురు చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆయన వెంట వచ్చారు. ఇదంతా కక్ష సాధింపే: విచారణ అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు. ‘అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చా. రేపు కూడా రమ్మన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నాయి. శాసనసభ ఎన్నికల సమయంలో ఐటీని పంపారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈడీని ప్రయోగిస్తున్నారు. ఇది వరకే ఏసీబీ విచారణ పూర్తి చేసిన కేసుపై ఈడీ విచారణ ఎందుకు? నాపై పోటీ చేసిన నరేందర్రెడ్డి వద్ద రూ. 51 లక్షలు దొరికినా ఈడీ, సీబీఐకి ఎందుకు ఇవ్వడంలేదు.’అని రేవంత్ ఆరోపించారు. కాగా బుధవారం మరోసారి విచారణకు రావాలని రేవంత్ను అధికారులు ఆదేశించారు. -
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేయకూడదు
-
కేసీఆర్ నన్ను ప్రలోభపెట్టారు..
విజయవాడ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జరుసలెం మత్తయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటుకు కోట్లు కేసులో రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడిన చంద్రబాబును వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడాలని అన్నారు. మత్తయ్య శనివారం విజయవాడలో మాట్లాడుతూ..ఈ కేసుపై ఎన్నికలకు ముందే దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో తనను బలవంతంగా ఇరికించారని, అంతేకాకుండా రాజకీయంగా తనకు న్యాయం జరగలేదని అన్నారు. హైకోర్టు కూడా తనను నిర్దోషిగా పేర్కొందన్న ఆయన.. సుప్రీంకోర్టులో తాను వేసిన కేసులో ఉదయసింహ ఎలా ఇంప్లీడ్ అవుతారని ప్రశ్నించారు. అయితే ఉదయసింహాతో పాటు, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కూడా ఇంప్లీడ్ అవ్వాలన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనను ప్రలోభాలకు గురి చేశారని మత్తయ్య ఆరోపించారు. ఓటుకు కోట్లు కేసును సీబీఐ, ఎన్ఐఏతో దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఈ నెల 11వ తేదీన ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన చేపడుతున్నట్లు తెలిపారు. -
సుప్రీం కోర్టులో ఓటుకు కోట్లు కేసు విచారణ
-
సుప్రీం కోర్టులో ఓటుకు కోట్లు కేసు విచారణ
సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసుపై సుప్రీం కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ కేసులో నిందితుడైన ఉదయ్ సింహ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన జస్టిస్ లావునాగేశ్వర్ రావు ధర్మాసనం.. తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. అయితే వ్యక్తిగత కారణాలతో తాను నేడు కోర్టుకు హాజరు కాలేనని, తనకు రెండు వారాల పాటు సమయం కావాలని ఉదయ్ సింహ తరపు న్యాయవాది సిద్దార్థ లూత్రా న్యాయమూర్తికి లేఖ రాశారు. సిద్దార్థ అభ్యర్థనను సమ్మతించిన ధర్మాసనం కేసు విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. మరోవైపు ఉదయసింహ దాఖలుచేసిన ఇంప్లీడ్ పిటిషన్ను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఈ పిటిషన్తో కేసు విచారణ ఆలస్యం చేయాలనే రకరకాల ఎత్తుగడులను ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వ సీనియర్ న్యాయవాది హరేన్ ధావల్ వాదించారు. మరో నిందితుడైన మత్తయ్య పేరును ఈ కేసు నుంచి తొలగించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ఏసీబీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో.. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెడుతూ రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన విషయం తెలిసిందే. 2015 మే 30న వెలుగులోకి వచ్చిన ‘ఓటుకు కోట్లు’ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా స్టీఫెన్సన్తో సాగిన సంభాషణల్లోని గొంతు చంద్రబాబుదేనని ధ్రువీకరిస్తూ చండీగఢ్కు చెందిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక కూడా ఇచ్చింది. అయితే రాజకీయ అవసరాల కోసమే ఈ కేసును ఆలస్యం చేస్తున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. -
‘ఓటుకు కోట్లు’ తర్వాత బాబు నోరు మెదపలేదు
సాక్షి, అమరావతి: ‘ఓటుకు కోట్లు’ కేసులో ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ రాజీ పడ్డారని రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకు వెళ్లకుండా, బ్రీఫ్డ్ మి కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ ముందుకు వెళ్లకుండా పరస్పరం అంగీకారానికి వచ్చారని చెప్పారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతోపాటు గవర్నర్ నరసింహన్ ఇద్దరు సీఎంల మధ్య రాజీ కుదిర్చారని, కేసీఆర్ షరతులకు చంద్రబాబు అంగీకరించాల్సి వచ్చిందని వెల్లడించారు. ‘నవ్యాంధ్రతో నా నడక’ పేరుతో రచించిన పుస్తకంలో ‘అవర్ పీపుల్ బ్రీఫ్డ్ మి..’ అధ్యాయం పేరుతో అప్పటి పరిస్థితులను ఐవైఆర్ వివరించారు. అందులోని అంశాలపై ‘సాక్షి’ అందిస్తున్న సిరీస్ కథనాల్లో భాగమిది. గొంతు బాబుది కాదంటూనే ట్యాపింగ్ అక్రమమన్నారు.. ‘2015 జూన్ 1వతేదీ సాయంత్రం టీవీ చూస్తుండగా ‘‘అవర్ పీపుల్ బ్రీఫ్డ్ మి..’’ ఉదంతం ప్రసారమమవుతోంది. ఈ సంభాషణ వినగానే నాకు మతిపోయినట్లయింది. ఒక సీఎం ఎన్నికల అక్రమాలను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు రావడం, రుజువుగా గొంతు కూడా వినిపించడంతో ఆయన ప్రతిష్ట దెబ్బ తింటుందనే అనిపించింది. నాడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్రెడ్డి.. స్టీఫెన్సన్ ఇంటికి వెళ్లి శాసనమండలి ఎన్నికల్లో తమ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసేందుకు డబ్బులు ఇవ్వజూపినట్లు అప్పటికే టీవీల్లో చూపించారు. తరువాత ఏకంగా ముఖ్యమంత్రే ఫోన్లో మాట్లాడినట్లు చూపించారు. సాయంత్రానికల్లా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ టీవీల ముందుకు వచ్చి జరిగిన దాన్ని ఖండించారు. దీనిపై రాజ్యాంగపరమైన, చట్టపరమైన, న్యాయపరమైన, రాజకీయపరమైన అన్ని చర్యలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. ఆడియో టేపులో వినిపిస్తున్న గొంతు చంద్రబాబుది కాదన్నారు. ఒకవైపు స్టీఫెన్సన్తో మాట్లాడిన గొంతు చంద్రబాబుది కాదంటూనే మరోవైపు ట్యాపింగ్ అక్రమమని అన్నారు. ఇది జరిగిన రెండో రోజు జూన్ 2న విజయవాడలో మహాసంకల్ప దీక్షకు ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు లోకేశ్, పరకాల ప్రభాకర్తో కలసి ప్రత్యేక విమానంలో వెళ్లాం. ఆ సమయంలో ముఖ్యమంత్రి ముఖంలో నెత్తుటి చుక్క లేనట్లు కనిపించింది. ఆయన మౌనంగా ఏదో ఆలోచిస్తూ కనిపించారు. విమానంలో పరకాలను లోకేశ్ అభినందించారు. అనంతరం మహా సంకల్ప దీక్షలో పాల్గొన్న సీఎం పరధ్యానంగానే కనిపించారు. అక్కడి నుంచి స్టేట్ గెస్ట్ హౌస్కు వెళ్లి అధికారులను కలిశాం. డీజీపీ, నేను, కొంతమంది ముఖ్యులు అందులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో కూడా సీఎం ఇంకా తేరుకోనట్లు కనిపించారు. ఆయన ముఖంలో చాలా అలసట, బడలిక కనిపించాయి. అంతా కలిసి చర్చించిన తర్వాత తమ ఫోన్ల ట్యాపింగ్ జరిగిందనే అంచనాకు వచ్చారు. ఫోన్ ట్యాపింగ్పై కేసు వేసి వారిని ముద్దాయిలుగా చేస్తే అవతలి పక్షం ఆత్మరక్షణలో పడుతుందని భావించారు. విజయవాడలో కేసు ఫైల్ చేయాలని నిర్ణయించారు. రెండు విషయాల్లో సీఎంల మధ్య అవగాహన.. మహా సంకల్ప దీక్ష బహిరంగ సభలో మాత్రం కేసీఆర్ కయ్యానికి కాలు దువ్వుతున్నారని, కేసులు పెడితే భయపడేది లేదని చంద్రబాబు చెప్పారు. తాను నిప్పులాంటి మనిషినన్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని, కేసీఆర్కు తమను విమర్శించే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. కేసీఆర్, జగన్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. మర్నాడు కేసీఆర్ కూడా గట్టిగా సమాధానం ఇచ్చారు. కేసుల్లో చంద్రబాబును తాము ఇరికిస్తే ఇరికేంత అమాయకుడు కాదని, ఆయన గోతులు తీయగల సమర్ధుడని వ్యాఖ్యానించారు. ‘‘పట్టపగలు దొరికిన దొంగ.. నిన్నెవరూ కాపాడలేరు’’ అని చంద్రబాబును హెచ్చరించారు. ఇద్దరు సీఎంల మధ్య యుధ్ధం ఢిల్లీ దాకా వెళ్లింది. ఫోన్ ట్యాపింగ్ అక్రమమంటూ కౌంటర్ దాఖలు చేయడం, రచ్చ చేయడంతో చంద్రబాబుకు ప్రయోజనం చేకూరింది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఇద్దరి మధ్య రాజీ కుదర్చాలని భావించడం వల్ల ఓటుకు కోట్లు కేసు ప్రాముఖ్యం కోల్పోయింది. విషయాన్ని అక్కడికక్కడే ముగించి ఇద్దరి మధ్య అవగాహన కుదర్చాలని కేంద్రం నిర్ణయించినట్లు కనిపించింది. గవర్నర్ నరసింహన్ కూడా ఢిల్లీ వెళ్లి జరిగిన విషయాలను హోంమంత్రికి వివరించారు. సీఎంల మధ్య సంధి కుదర్చమని కేంద్రం కోరే ఉంటుంది. ఇద్దరి మధ్య రెండు విషయాల్లో మాత్రం అవగాహన ఏర్పడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబుకు కొంత వెసులుబాటును కేసీఆర్ కల్పిస్తారు. టెలిఫోన్ ట్యాపింగ్ అంశంపై చంద్రబాబు న్యాయస్థానంలో ముందుకు వెళ్లరు. కేసీఆర్ మరికొన్ని షరతులు కూడా విధించి ఉంటారు. ‘‘మీరు (టీడీపీ సర్కారు) హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాలి. మొత్తం సచివాలయాన్ని తరలించి కట్టుబట్టలతో వెళ్లాలి. తెలంగాణ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. మిగిలినవి నేను చూసుకుంటా. వెళ్లిపోండి..’’ అని కేసీఆర్ చెప్పి ఉంటారు. కౌంటర్ కేసు వేయటం చంద్రబాబుకు ఉపయోగపడింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో ఆయన తదుపరి చర్యలు తీసుకోలేదు. దానికి కాలదోషం పట్టింది. ఇక ఓటుకు కోట్లు కేసు కూడా తెరమరుగవుతుందనే అనుకుంటున్నా. తెలంగాణలో టీడీపీ నాయకత్వాన్ని కేసీఆర్ తన వైపు తిప్పుకున్నారు. హైదరాబాద్లో టీఆర్ఎస్ బలపడేలా చేసుకున్నారు. ఇక ఆ తరువాత బాబు నోరు మెదపలేదు... ఓటుకు కోట్లు కేసు తర్వాత చంద్రబాబు చాలా బలహీనపడ్డారు. ఆయన మొదట్లో కేసీఆర్ గురించి తేలికగా మాట్లాడేవారు. 2015 జూన్ 2 తర్వాత ఇక నోరు విప్పలేదు. జూన్ 2కు ముందు చంద్రబాబు ఒక మనిషి కాగా ఆ తర్వాత ఆయన మరో మనిషిలా మారారు. ఓటుకు కోట్లు కేసు చంద్రబాబు ఆత్మవిశ్వాసం, మనోస్థైర్యం, విషయాలను డీల్ చేసే విధానాన్ని పూర్తిగా దెబ్బ తీసింది. ఈ కేసులో విచారణ వెంటనే సాగి ఉంటే సాక్ష్యాధారాలు మరింత బయటపడేవి. ఎక్కడి నుంచి ఎక్కడకు డబ్బు వెళ్లింది? ఎవరు విత్ డ్రా చేశారు? ఎవరు ఎవరికి డబ్బులు చెల్లించారు? అనే విషయాలు అంతా తెలిసేవి. మనీ ట్రయిల్ కూడా బయటపడేది. ముఖ్యమంత్రిదే కాకుండా మరికొందరు ముఖ్యుల ఫోన్ సంభాషణలు కూడా రికార్డు చేశారని విన్నా. ఏమైనా విచారణ ఆగిపోయింది. ఫోరెన్సిక్ నివేదిక మాత్రం ఒక కొలిక్కి వచ్చిందని సమాచారం. అదే సమయంలో ఫోరెన్సిక్ నిపుణుడు గాంధీని సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో నియమించుకున్నారు. ఓటుకు కోట్లు కేసు వెలుగు చూసిన సమయంలోనే గాంధీ అవసరం ఎందుకు గుర్తుకొచ్చిందో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలి’ -
చంద్రబాబు స్వార్థానికి రాష్ట్రం బలి
సాక్షి, అమరావతి: ఓటుకు నోటు కేసుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి గొంతు జీరబోయిందని, ఆయన బలహీన పడి బతుకు జీవుడా అంటూ హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలివచ్చారని, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దెబ్బతీశారని విభజన అనంతరం రాష్ట్ర తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఎదురైన సమస్యలు, వాటిని పరిష్కరించడానికి అవలంభించిన విధానాలతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహార శైలిని ‘నవ్యాంధ్రతో నా నడక’ పేరిట తాను రచించిన పుస్తకంలో ఐవైఆర్ కృష్ణారావు వివరించారు. ఆదివారం విడుదల చేసిన ఈ పుస్తకంలో ఆయన ఇంకా ప్రస్తావించారంటే... ‘‘హైదరాబాద్లోనే ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడుతానని తొలుత చెప్పిన చంద్రబాబు తెలంగాణలో కేసీఆర్ సర్కారును దెబ్బతీసేందుకు తెరవెనుక పన్నాగాలు పన్ని దొరికిపోయారు. ఓటుకు నోటు వ్యవహారం బయటపడడంతో బతుకు జీవుడా అంటూ విజయవాడకు తరలివచ్చారు. తరువాత హైదరాబాద్కు వెళ్లడం తగ్గించేశారు. విజయవాడలో రాజధాని గురించి భారీ ఎత్తున ప్రచారం చేసి, ఒక ఊపు సృష్టించి దానిపై బిల్డప్ ఇవ్వడం మొదలు పెట్టారు. హైదరాబాద్లో ఉండలేని తన నిస్సహాయత బయటపడకుండా విజయవాడలోనే ఉండిపోవడానికి రాజధాని పేరుతో బలమైన కారణాలు సృష్టించుకోవడం ప్రారంభించారు. ఒక ప్రతికూల పరిస్థితిని తన మీడియా సహాయంతో అనుకూలంగా మలుచుకున్నారు. ఇలాంటివి చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. సొంత గడ్డపై నుంచే పరిపాలన ఉత్తమం అనే కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇదంతా ఓటుకు నోటు కేసు మహత్యమేనని వేరే చెప్పనక్కరలేదు. ఈ కేసు తరువాత చంద్రబాబు ఆత్మరక్షణలో పడటంతో విభజన సమస్యలపై సీఎస్గా నేను ముఖ్యమంత్రికి పంపించిన ఫైళ్లు తిరిగి వచ్చేవి కావు. తెలంగాణ ప్రభుత్వంతో సంఘర్షణకు పూనుకోవడం చంద్రబాబుకు ఇష్టం లేదని అప్పుడు నాకు తెలిసింది. ఒక వ్యక్తి సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినడం స్పష్టంగా కనిపించింది. ఓటుకు నోటు కేసుతో కేంద్ర ప్రభుత్వం దృష్టిలోనూ ఏపీ ప్రభుత్వం చులకనగా మారింది. ఓటుకు నోటు కేసు తరువాత ముఖ్యమంత్రి ఆగమేఘాలపై విజయవాడకు వెళ్లిపోవడంతో సచివాలయ ఉద్యోగులు పడిన అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఓటుకు నోటు కేసు వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు దెబ్బతిన్నాయి. చంద్రబాబుకు సమస్య వచ్చినందు వల్లే సచివాలయ ఉద్యోగులందరికీ తీవ్ర సమస్య తెచ్చిపెట్టారు. అసలు ఏమాత్రం సన్నాహాలు చేయకుండానే సచివాలయాన్ని అమరావతికి తరలించారు. ఇది మరీ ఘోరం. తెలంగాణకు విద్యుత్ను ఏకపక్షంగా నిలిపేశారు చంద్రబాబు తొలుత హైదరాబాద్లోనే ఉండిపోవాలన్న బలమైన ఆకాంక్షను వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం పట్ల ప్రత్యర్థి వైఖరిని అవలంభించారు. రెండు రాష్ట్రాలకు వర్తించే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను గౌరవించే బదులు వాటిని రద్దు చేసి అదనపు విద్యుత్ను తెలంగాణతో పంచుకోకూడదని నిర్ణయించారు. ఒప్పందాలను రద్దు చేసి, ఏపీ నుంచి తెలంగాణకు విద్యుత్ సరఫరా కాకుండా చూశారు. ఈ ఒక్క నిర్ణయమే రెండు రాష్ట్రాల మధ్య ఎక్కువ అగాథాన్ని సృష్టించింది, సంబంధాలను దెబ్బతీసింది’’ అని ఐవైఆర్ కృష్ణారావు తన పుస్తకంలో వివరించారు. -
ఓటుకు కోట్లు కేసు; సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
-
ఓటుకు కోట్లు కేసు: ఫిబ్రవరి నుండి పూర్తిస్తాయి విచారణ
-
ఓటుకు కోట్లు కేసు; సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. టీడీపీ అధికార దాహానికి ప్రతీకగా నిలిచిన ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేపట్టి, త్వరితగతిన పూర్తి చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఈ పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రాజకీయ శత్రుత్వంతోనే రామకృష్ణా రెడ్డి పిటిషన్ వేశారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది సిద్ధార్థ వాదించారు. ఇరువర్గాల వాదనలు పరిశీలించిన అనంతరం ఈ కేసును ఫిబ్రవరిలో విచారణకు లిస్ట్ చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ నేపథ్యంలో.. ఫిబ్రవరి, మార్చిలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఉంటాయని సిద్దార్థ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై స్పందించిన జస్టిస్ మదన్బీ లోకూర్.. ఆ విషయంలో తామేమీ చేయలేమని, ఫిబ్రవరిలో విచారణ జరుగుతుందని స్పష్టం చేశారు. సుప్రీం ఆదేశాలను స్వాగతిస్తున్నాం : ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఓటుకు కోట్లు కేసులో సత్వర విచారణ కోసం తాను చేసిన విఙ్ఞప్తిని సుప్రీం కోర్టు అంగీకరించిందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికలు ఉన్నాయని, విచారణను వాయిదా వేయాలన్న చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది సిద్దార్థ అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చిందని తెలిపారు. కాగా టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో.. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెడుతూ రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన విషయం తెలిసిందే. 2015 మే 30న వెలుగులోకి వచ్చిన ‘ఓటుకు కోట్లు’ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా స్టీఫెన్సన్తో సాగిన సంభాషణల్లోని గొంతు చంద్రబాబుదేనని ధ్రువీకరిస్తూ చండీగఢ్కు చెందిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక కూడా ఇచ్చింది. -
సిట్.. ఒక కీలుబొమ్మ
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిన ప్రతీసారి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) తెరపైకి తీసుకొస్తోంది. అధికార పార్టీ పెద్దలు, ప్రజాప్రతినిధుల అవినీతి, అక్రమాలు.. నేరాలపై చర్యలు తీసుకోకుండా ‘సిట్’ పేరిట కాలయాపన చేస్తూ తప్పించుకుంటోంది. కుంభకోణాలు, సంచలన çఘటనలపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించడం.. ఆ తర్వాత నివేదికలను బుట్టదాఖలు చేయడం, విచారణను అటకెక్కించడం పరిపాటిగా మారింది. విశాఖ ఎయిర్పోర్టులో వైఎస్ జగన్పై జరిగిన హత్యాయత్నంపై విచారణకు ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. అయితే, ఈ ఘటన జరిగిన ఆరు రోజులు గడిచినా ఇప్పటిదాకా ‘సిట్’ తేల్చిందేమీ లేకపోవడం గమనార్హం. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం కూలీల కాల్చివేత, విశాఖలో భూ కుంభకోణం, కాల్మనీ సెక్స్ రాకెట్, విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుపై భూకబ్జా కేసు, హైదరాబాద్లో సీఎం చంద్రబాబుపై ఓటుకు కోట్లు కేసులో ఫోన్ ట్యాపింగ్, తాజాగా విశాఖ మన్యంలో మావోయిస్టులు చేసిన జంట హత్యలు వంటి కీలక ఘటనలపై సిట్ దర్యాప్తులతో ఎలాంటి ఫలితంలేదు. ప్రత్యేక దర్యాప్తు బృందాలు ప్రభుత్వ పెద్దల చేతుల్లో కీలుబొమ్మలుగా మారుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. (కాల్డేటాను దాటని విచారణ) ► శేషాచలం అడవుల్లో 2015 ఏప్రిల్ 7న ఏపీ టాస్క్ఫోర్స్ పోలీసుల కాల్పుల్లో 20 మంది ఎర్రచందనం కూలీలు మరణించారు. ఈ ఘటనపై పౌరహక్కుల సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం కావడంతో రాష్ట్ర సర్కారు 2015 ఏప్రిల్ 24న సీనియర్ ఐపీఎస్ అధికారి ఎస్.రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేసింది. ఈ దర్యాప్తు అసలు నేరస్తుల పాత్ర బయటపడలేదు. ► తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఓటును టీడీపీ అభ్యర్థికి వేయించుకోవడానికి రూ.50 లక్షలు ఇస్తుండగా, 2015 మే నెలలో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డిని ఏసీబీ అధికారులు ఆధారాలతో సహా పట్టుకున్నారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం తెలంగాణ సీఎం కేసీఆర్తోపాటు పలువురిపై ఏపీలో 88 ఫోన్ ట్యాపింగ్ కేసులు నమోదు చేయించింది. ఫోన్ ట్యాపింగ్పై విచారణకు 2015 జూన్ 17న సిట్ ఏర్పాటు చేసింది. ఈ విచారణ అడ్రసు లేకుండా పోయింది. ► విశాఖపట్నం రూరల్లో అధికార టీడీపీ ముఖ్యనేతల కనుసన్నల్లోనే భూ కుంభకోణం జరగిందనే ఆరోపణలు గుప్పుమన్నాయి. దీంతో గతేడాది జూన్లో గ్రేహౌండ్స్ డీఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. భూ కుంభకోణంలో టీడీపీ మంత్రులు, నేతలదే ప్రధాన పాత్ర అని తేలడంతో ‘సిట్’ విచారణ అటకెక్కేసింది. ► విశాఖ ఏజెన్సీలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మట్టుబెట్టేందుకు మావోయిస్టులకు స్థానిక టీడీపీ నేతలే ఉప్పందించారని పోలీసులు నిర్ధారించి అరెస్టులు కూడా చేశారు. కానీ, సిట్ అధికారులు ఎక్కడా బహిరంగంగా మాట్లాడకుండా, నివేదిక ఇవ్వకుండా అర్ధంతరంగా వదిలేశారు. ► విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుపై భూ కబ్జా కేసుతో టీడీపీ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఈ నేపథ్యంలోనే విశాఖ తరహాలోనే విజయవాడ, గుంటూరులలో భూ వివాదాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసి, అసలు వివాదాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేసింది. ► రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడలోని కాల్మనీ సెక్స్రాకెట్పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ చేసిన దర్యాప్తు మూడేళ్లు దాటినా అతీగతీ లేదు. థర్ట్పార్టీ దర్యాప్తు ఎందుకంటే.. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే పని చేసే ప్రత్యేక దర్యాప్తు బృందాలపై నమ్మకం సన్నగిల్లుతోంది. అధికార పార్టీ నేతల అరాచకాలను ఇప్పటివరకు ఏ ఒక్క సిట్ కూడా తేల్చలేకపోయింది. ఒక్కరికైనా శిక్ష పడేలా ఆధారాలను సంపాదించలేదు. తాజాగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర డీజీపీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఘటన జరిగిన రోజే వారు చేసిన వ్యాఖ్యలు దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేని ఏదైనా కేంద్ర దర్యాప్తు సంస్థతో(థర్డ్ పార్టీ) విచారణ జరిపిస్తేనే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు. -
ఐటీ అధికారుల ముందుకు రేవంత్రెడ్డి ..!
సాక్షి, హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసు, ఆదాయానికి మించిన ఆస్తులు, డొల్ల కంపెనీల లావాదేవీలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, అతని సన్నిహితుల నివాసాలపై ఐటీ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. సోదాల అనంతరం పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు విచారణకు హాజరవాల్సిందిగా వారికి నోటీసులు జారీచేశారు. ఇప్పటికే రేవంత్ను ఐటీ అధికారులు రెండుసార్లు సుదీర్ఘంగా విచారించారు. కాగా, ఈ విచారణ రెండో దశకు చేరుకుంది. ఇప్పుడు మరోసారి రేవంత్కు ప్రశ్నలు సంధించనున్నారు. మరికొద్దిసేపట్లో ఆయన ఐటీ అధికారుల ముందు హాజరుకానున్నట్లు సమాచారం. మరోవైపు రేవంత్ రెడ్డితో పాటు పద్మనాభరెడ్డి, ఉదయసింహ, శ్రీసాయి మౌర్యా సంస్థ డైరెక్టర్లు, ఆడిటర్లు, కేఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ సంస్థ ప్రతినిధులు కూడా విచారణకు హాజరు కానున్నారని తెలిసింది. -
‘ఓటుకు కోట్లు కేసు’లో ఇరుక్కున్నా సిగ్గులేదా?: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉన్న ఆంధ్రా వాళ్ల పాలిట శని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడేనని టీఆర్ఎస్ అధినేత, ఆపద్దర్మ సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఎన్నికల ప్రణాళిక కమిటీతో సమావేశం అనంతరం మీడియా సమావేశంలో పాక్షిక మేనిఫెస్టోను ప్రకటించారు. పూర్తి మేనిఫెస్టో సిద్ధమయ్యేలోగా ఇప్పటికే నిర్ణయించిన కొన్ని ముఖ్యమైన హామీలతో ప్రజల దగ్గరికి వెళ్లాలని టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మేనిఫెస్టో ప్రకటించిన అనంతరం టీడీపీ-కాంగ్రెస్ కూటమిపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయడు వైఖరిని ఎండగట్టారు. ఇంకా ఏమన్నామరంటే ఆయన మాటల్లోనే.. వాళ్లు తెలంగాణ పౌరులే ‘తెలంగాణలో చంద్రబాబు పార్టీకి డిపాజిట్లు వస్తాయా? చంద్రబాబు తెలంగాణలో రాజ్యమేలుతాడా? ఇప్పటికే ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కున్నా సిగ్గులేదా? నువ్వు వ్యక్తివి, రాజకీయ నేతవి కాబట్టి బరాబర్ అంటాం. చంద్రబాబునంటే ఆంధ్రా వాళ్లను అన్నట్టు కాదు. చంద్రబాబు పోతే కబ్జాలు, జూదాలు, పేకాటక్లబ్లు పోయాయి. తెలంగాణలో ఉన్న ఆంధ్రా వాళ్ల పాలిట శని చంద్రబాబు. ఆంధ్రా నుంచి ఎప్పటి నుంచో వచ్చి ఇక్కడ ఉంటున్నారు. మేం 15 మందికి కార్పొరేట్ టికెట్లు ఇస్తే 12 మంది ఆంధ్రా వాళ్లు గెలిచారు. ఏడెనిమిది ఆంధ్రావాళ్లకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చాం. ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు. వాళ్లు తెలంగాణ పౌరులే. మాకైతే పొత్తు అవసరం లేదు. పోయి పోయి చంద్రబాబుతో పొత్తా? (టీఆర్ఎస్ పాక్షిక మేనిఫెస్టో ఇదే) ఆయనకు వయసు పైబడింది డిసెంబర్లో చాలా పెద్ద పరిణామాలు ఉంటాయి. గడ్డం ఉంచుకునేవారెవరో..గీసుకునేవారెవరో తెలస్తుంది. అన్ని సర్వేలు టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్తున్నాయి. సుస్థిరమైన రాజకీయ వ్యవస్థ తెలంగాణకు అవసరం. వంద సీట్లు దాటడమే మా టార్గెట్. గతంలో ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే అన్ని స్ధానాలు గెలుచుకున్నాం. ఇప్పుడు ఐదారు జిల్లాలో అన్ని స్థానాలు కైవసం చేసుకుంటాం. గతంలో హైదరాబాద్, ఖమ్మంలో ఒకో సీటు వచ్చాయి. ఇప్పుడు పుంజుకున్నాం. ఎమ్మెల్యే టికెట్ ఆశించడం తప్పుకాదు. ఒక్క అభ్యర్థిని కూడా మార్చేది లేదు. జైపాల్రెడ్డి వయసు పైబడి బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్నారు. నూటికి నూరు శాతం గెలుస్తాం. గతంలో జరిగిన అవినీతిని బయటపెడతాం’అంటూ కేసీఆర్ పేర్కొన్నారు. (కేసీఆర్పై గద్దర్ పోటీ) -
రేవంత్ రెడ్డి విచారణపై ఏపీ ప్రభుత్వం ఆరా!
సాక్షి, అమరావతి : ‘ఓటుకు కోట్లు కేసు’ లో ఏ1 నిందితుడు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ఆదాయపు పన్ను శాఖ అధికారుల బుధవారం విచారించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారన దాదాపు ఐదు గంటల పాటు కొనసాగింది. ఈ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కూడా సంబంధం ఉన్న విషయం తెలిసిందే. దీంతో రేవంత్ విచారణ పరిణామాలపై ఏపీ ప్రభుత్వం ఆరా తీసుస్తోంది. ఐటీ కార్యాలయ పరిసరాల్లో ఏపీ ఇంటలిజెన్స్, ఎస్బీ అధికారులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఐటీ సోదాలు, విచారణను గమనిస్తున్న ఏపీ ప్రభుత్వ పెద్దలు భయాందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
ముగిసిన రేవంత్ విచారణ
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు కేసు’లో ఏ1 నిందితుడు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ఆదాయపు పన్ను శాఖ అధికారులు విచారణ ముగిసింది. బుధవారం ఉదయం 11 గంటలకు ఐటీ కార్యాలయంలో ప్రారంభమైన విచారణ దాదాపు ఐదు గంటల పాటు కోనసాగింది. రేవంత్తో పాటు ఈ కేసులో మరో నిందితుడు ఉదయ్ సింహాలను కలిపి ఐటీ అధికారులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్కు ఇవ్వజూపిన రూ.50 లక్షలతో పాటు, ఇస్తామని ఆఫర్ ఇచ్చిన నాలుగున్నర కోట్ల రూపాయల గురించి అధికారులు ఆరా తీస్తున్నారని సమాచారం. అంతేకాకుండా ఈ కేసు గురించి ఏం చెప్పదల్చుకున్నాడో లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని రేవంత్ను కోరారు. ఆదాయ వ్యయాలు, వ్యాపార లావాదేవీలు, ఆస్తుల డాక్యుమెంట్లు, ఎన్నికల అఫిడవిట్స్లు ఐటీ అధికారులు రేవంత్ ముందుంచి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రేవంత్తో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురిని కూడా ఐటీ అధికారులు విచారిస్తున్నారు. (గుట్టు తేలితే బాబుపైనే నజర్!) చదవండి: ఓటుకు ‘కోట్లు’ ఎక్కడివి? రేవంత్పై.. నేనే ఫిర్యాదు చేశా -
ఓటుకు కోట్లు కేసులో దూకుడు పెంచిన అధికారులు
-
రేవంత్ రెడ్డి మామను విచారించిన ఐటీ అధికారులు
సాక్షి, హైదరాబాద్: గత కొద్ది రోజులుగా రాజకీయ నాయకుల ఇళ్లపై ఐటీ దాడులు పొలిటికల్గా హాట్ అండ్ హీట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ‘ఓటుకు కోట్లు కేసు’ కు సంబంధించి జరిగిన సోదాల్లో పలు కీలకపత్రాలు, సమాచారం లభించిందని ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం తెలిపింది. ఇప్పటికే ఈ కేసులో ఏ1 గా ఉన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో సహా, అయన బంధవులకు, అనుచరులకు నోటీసులు జారీ చేసింది. దీనిలో భాగంగా రేవంత్ రెడ్డి మామ పద్మనాభ రెడ్డి సోమవారం ఐటీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘గత నెల 28న నా ఇంటిపై అధికారులు సోదాలు చేసి ఐటీ కార్యాలయాలకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. దానిలో భాగంగా విచారణ నిమిత్తం ఐటీ అధికారులు ముందు హాజరయ్యాను. రేవంత్ రెడ్డి ఆస్తులకు సంబంధించిన వివరాలు అడిగారు. దీంతో పాటు ‘ఓటుకు కోట్లు కేసు’ వివరాలు అడిగారు. ఆ వివరాలు నాకు తెలియదని చెప్పాను. రేవంత్ రెడ్డికి మా కూతురును ఇవ్వక ముందే నేను ఐటీ రిటర్న్స్ కట్టేవాడిని. ప్రస్తుతం రేవంత్ ఉంటున్న ఇల్లు నా కూతురుదే. మళ్లీ కొన్ని ప్రశ్నలతో కూడిన నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులపై ఈ నెల 20లోపు వివరణ ఇవ్వాలని ఐటీ అధికారులు కోరారు’అంటూ విచారణ వివరాలను పద్మనాభ రెడ్డి మీడియాకు తెలిపారు. -
క్షీణ సంస్కృతికి ఆనవాళ్లు!
మన వైఖరి మనం ఎక్కడున్నామనే అంశంపైన ఆధార పడి ఉంటుందని దక్షిణాఫ్రికా స్వాతంత్య్ర సమరయోధుడు నెల్సన్ మండేలా అనేవారు.'Where you stand depends on where you sit.' కొంతకాలంగా రాజకీయా లను పరిశీలిస్తున్నవారికి మండేలా మాటలు అక్షరసత్యా లుగా అగుపిస్తాయి. ప్రధాని నరేంద్రమోదీ గురించి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్డీఏ భాగ స్వామిగా ఉండగా ఏమని అన్నారో, ఎన్డీఏ నుంచి నిష్క్రమించిన తర్వాత ఏమంటున్నారో గమనిస్తే మండేలా ఆంతర్యం సులభంగా అర్థం అవుతుంది. ఎన్డీఏ భాగస్వా మిగా ఇద్దరు టీడీపీ మంత్రులు కేంద్ర ప్రభుత్వంలో, ఇద్దరు బీజేపీ మంత్రులు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నంత కాలం మోదీ సమర్థుడైన నేత. తెగతెంపులు చేసుకున్నట్టు ప్రపంచాన్ని నమ్మించాలి కనుక ఇప్పుడు మోదీ ఆంధ్రులకు ఎనలేని ద్రోహం చేసిన పరమదుర్మార్గుడు. కేంద్రస్థాయిలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నరసింహారావు, రాష్ట్ర స్థాయిలో బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు ప్రభృతులు చంద్రబాబు నిజస్వరూపం ఇప్పుడే తెలుసుకున్నట్టు విమర్శలు గుప్పిస్తున్నారు. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో ‘మోదీ దొంగ’ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ అభివర్ణిస్తే ‘రాహుల్ అబద్ధాలకోరు’ అంటూ మోదీ జవాబు చెప్పారు. దిగజారిన రాజకీయ సంస్కృతి అన్ని రాష్ట్రాలలో మాదిరే తెలుగు రాష్ట్రాలలోనూ కనిపిస్తున్నది. కంపరం కలిగి స్తున్నది. ఇప్పుడు వార్తలలోని వ్యక్తి రేవంత్రెడ్డి ఎవరు? ఒక మాజీ శాసనసభ్యుడు. టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత విశ్వాసపాత్రుడు. రేవంత్రెడ్డి పేరు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ మార్మోగడానికి ఆయన చేసిన ఘన కార్యం ఏమిటి? ‘ఓటుకు కోట్లు’ కేసులో టీఆర్ఎస్ శాసన సభ్యుడు ఎల్విస్ స్టీఫెన్సన్కు రూ. 50 లక్షల నగదు లంచంగా ఇస్తూ కెమేరాకు దొరికిపోయారు. కుమార్తె వివా హానికి ముహూర్తం పెట్టుకున్న తరుణంలో ఈ అనైతిక వ్యవహారంలో ఇరుక్కొని జైలుకు వెళ్ళవలసి వచ్చింది. శాసనమండలి ఎన్నికలలో వేం నరేంద్రరెడ్డి అనే టీడీపీ అభ్యర్థిని గెలిపించుకునే వ్యూహంలో భాగంగా మొత్తం అయిదు కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి బయానాగా రూ. 50 లక్షలు చెల్లించిన సందర్భం. ఈ వ్యవహారంలో వ్యూహకర్త, సూత్రధారి చంద్రబాబే అన్నది బహిరంగ రహస్యం. ఏసీబీ ద్వారా రేవంత్ని పట్టించింది, స్టీఫె న్సన్తో ‘మా వాళ్ళు బ్రీఫ్డ్ మీ’ అంటూ చంద్రబాబు ఫోన్లో మాట్లాడిన మాటలను రికార్డు చేయించిందీ తెలం గాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) అనే విషయంలో సైతం ఎవ్వరికీ అనుమానాలు లేవు. ఇద్దరు చంద్రుల మధ్య జరిగిన ఆధిపత్యపోరులో కేసీఆర్ విజయం సాధించారు. చంద్రబాబు హైదరాబాద్ నుంచి పలాయనం చిత్తగించారు. టేపులో గొంతు తనది కాదని చెప్పలేదు (ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా అది చంద్రబాబు స్వర మేనంటూ ధ్రువీకరించింది). ‘మీకు పోలీసులు ఉంటే మాకూ పోలీసులు ఉన్నారు. మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటే మాకూ ఉన్నది’ అంటూ ‘ఓటుకు కోట్లు’ వ్యవహా రాన్ని రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మార్చి దబాయిం చడానికి ప్రయత్నించారు. రేవంత్రెడ్డిపైన తెలంగాణ ఏసీబీ అభియోగపత్రం దాఖలు చేసింది. అందులో చంద్ర బాబు పేరు అనేక విడతలు రాశారు. తన ఫోన్ సంభాష ణను ట్యాప్ చేసినందుకు తెలంగాణ ప్రభుత్వంపైన చంద్రబాబు కేసు పెట్టారు. ఈ వ్యవహారాన్ని దర్యాప్తు చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ఏసీబీని ఆదేశించారు. రేవంత్ కుమార్తె వివాహానికి సకుటుంబ సమేతంగా హాజరై తన శిష్యుడికి పూర్తి మద్దతు ప్రకటించారు. రేవంత్కి సీబీఐ కోర్టు బెయిల్ నిరాకరించింది. హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ రద్దు చేయవలసిందిగా తెలంగాణ ఏసీబీ చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత రేవంత్ విజయోత్సవ సభ నిర్వహించారు. కేసీఆర్పైన తీవ్రపదజాలంతో దాడి చేశారు. ఆయన మళ్ళీ వెనక్కు తిరిగి చూడలేదు. పని చేయని చట్టం నిగూఢమైన కారణాలు వల్ల ‘ఓటుకు కోట్లు కేసు’ ఒక దశలో ఆగిపోయింది. ఎవరో పెద్దలు చంద్రబాబుకీS, కేసీఆ ర్కీ మధ్య రాజీ కుదిర్చారని వదంతులు వినిపించాయి. యదార్థంగా ఏమి జరిగిందో తెలియదు. చట్టం తన పని తాను చేసుకొనిపోవడం లేదని మాత్రం తెలుసు. లేకపోతే స్పష్టమైన దృశ్యశ్రవణ ఆధారాలు ఉన్న ఈ కేసులో రేవంత్ రెడ్డికీ, మరికొందరికీ శిక్షలు పడేవి. చంద్రబాబు అభిశం సన అనివార్యమయ్యేది. కథ అంత దూరం వెళ్ళలేదు. ఈ లోగా టీడీపీ టిక్కెట్టుపైన తెలంగాణ శాసనసభకు గెలిచిన వారిలో చాలామంది టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. రేవంత్రెడ్డి మాత్రం కాంగ్రెస్లోకి అట్టహాసంగా ప్రవేశిం చారు. ఒక కేసులో ప్రథమ నిందితుడిగా ఉన్న రాజకీయ నాయకుడికి కాంగ్రెస్ ఎర్రతివాచీ పరిచి ఎందుకు ఘన స్వాగతం చెప్పింది? ఆ పార్టీకి విలువల పట్ల గౌరవం లేదు. కనీసం గౌరవం ఉన్నట్టు నటించాలన్న స్పృహసైతం లేదు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి ప్రభుత్వానికి దూరంగా ఉన్న మేధావులూ, వివిధ వృత్తు లలో పని చేసినవారూ, రాజకీయాలలో ఆసక్తి ఉన్నవారూ చాలా మంది ఉన్నారు. వారిలో ఒక్కరిని కూడా పార్టీలో చేర్చుకునే ప్రయత్నం కాంగ్రెస్ నేతలు చేయలేదు. యువ తీయువకులకు పార్టీలోకి స్వాగతం చెప్పి వారికి ప్రాధా న్యం ఇవ్వాలన్న ఆలోచన కూడా లేదు. పదేళ్ళు కాంగ్రెస్ పాలనలో వివిధ పదవులు అనుభవించి, అందినంత సంపాదించుకున్నవారు గత నాలుగున్నర సంవత్సరాలుగా పార్టీని బలోపేతం చేసేందుకు ఒక్క రూపాయి ఖర్చు చేయ డానికి ముందుకు రాలేదు. చంద్రబాబుకి కాంగ్రెస్తో రహస్యానుబంధం తొలి నుంచీ కొనసాగుతూనే ఉన్నది. రాహుల్గాంధీకి సలహాదారులుగానో, సన్నిహితులుగానో చెలామణి అవుతున్నవారితో మాట్లాడి దేనికైనా ఒప్పించ గల సౌలభ్యం ఉంది. చంద్రబాబుతో కలసి పని చేయాలని కోరుకునే కాంగ్రెస్ నాయకులు ఆంధ్రప్రదేశ్లో కంటే తెలం గాణలో ఎక్కువ ఉన్నారు. వారికి సహచరులపైన విశ్వాసం లేదు. ఒకరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంగీకరించడానికి మరొకరు ఇష్టపడరు. అందుకు తాము మాత్రమే సమర్థుల మంటూ త్రికరణశుద్ధిగా భావిస్తున్నవారు కనీసం అరడ జను మంది ఉన్నారు. రేవంత్ను పార్టీలోకి ఆహ్వానించడం అంటే చంద్రబాబు అండదండలు అందుకోవడమే అన్న అవగాహన తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఉంది. టీఆర్ఎ స్ను ఎదుర్కోవడంలో నిధుల కొరతతో బెంగటిల్లుతున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు చంద్రబాబుతో స్నేహం కొండంత బలం. ఆయన అన్ని విధాలా ఆదుకుంటారన్న ఆశ. తమ పార్టీని భూస్థాపితం చేయడమే లక్ష్యంగా ఆవి ర్భవించిన టీడీపీతో ఎన్నికల పొత్తు పెట్టుకోవడానికి కాంగ్రెస్ నాయకులు సంకోచించలేదు. తమ అధినేత సోనియాగాంధీని అనరాని మాటలు అంటూ కాంగ్రెస్ను ముక్కలు ముక్కలుగా నరకాలంటూ టీడీపీ శ్రేణులను ప్రేరేపించిన చంద్రబాబు పరిష్వంగం వారికి అభ్యంతర కంగా తోచలేదు. ఎట్లాగైనా టీఆర్ఎస్ను ఓడించి అధి కారం హస్తగతం చేసుకోవాలి. అందుకోసం అడ్డదారులు తొక్కినా పర్వాలేదు. ఇదే సూత్రాన్ని రాహుల్తో చెప్పి ఒప్పించి ఉంటారు. అందుకే రేవంత్రెడ్డిని టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడిగా నియమించారు. ఆ విధంగా చంద్ర బాబుకి ‘మహాకూటమి’లో నిర్ణాయక పాత్ర ఇచ్చారు. సుమన్ ధ్వజం సీట్ల సర్దుబాట్లు చేసుకొని, ఎన్నికల ప్రణాళిక రూపొందిం చుకొని సమరశంఖం పూరించేందుకు సన్నాహాలు చేస్తున్న తరుణంలో గురువారంనాడు రేవంత్రెడ్డి నివాసంపైనా, ఆయన బంధువుల ఇళ్ళపైనా, వ్యాపార సంస్థలపైనా ఆదా యంపన్ను శాఖ అధికారులు దాడులు ఆరంభించారు. శనివారం సాయంత్రం వరకూ సోదాలు సాగాయి. అధికా రులు ఎటువంటి ప్రకటన చేయకపోయినా రకరకాల కథ నాలు మీడియాలో వస్తున్నాయి. సోదాలలో లభించే నిధులు చంద్రబాబువేన నీ, రేవంత్ టీడీపీ అధినేత బినామీ అనీ వ్యాఖ్యలు వినిపించాయి. ప్రధానినీ, ముఖ్యమంత్రినీ, మీడియానూ దుయ్యపడుతూ రేవంత్ చెలరేగిపోయారు. అంతే కటువుగా, అంతకంటే మొరటుగా టీఆర్ఎస్ లోక్ సభ సభ్యుడు బాల్క సుమన్ స్పందించారు. ఎంత రెచ్చ గొట్టినా కేసీఆర్ రేవంత్తో ముఖాముఖికి దిగరు. అది తన స్థాయి కాదని ఆయన అభిప్రాయం. అందుకని సుమన్ను ప్రయోగించారు. ఆదాయంపన్ను అధికారులు దాడులు చేయడాన్ని కాంగ్రెస్ నాయకులు ఖండించారు. ఇది మోదీ, కేసీఆర్ కలిసి కుట్రపన్ని చేసిన పని అంటూ దుయ్య పట్టారు. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఇదే విధంగా చేస్తున్నా రనీ, ఉత్తరప్రదేశ్లో, తమిళనాడులో, కర్ణాటకలో ఇదే మాదిరి దాడులు జరిపించారనీ చంద్రబాబు మోదీని నిందిస్తూ రేవంత్రెడ్డికి తన మద్దతు మరోసారి స్పష్టంగా ప్రకటించారు. ‘ఓటుకు కోటు’ కేసును సీబీఐ చేత దర్యాప్తు చేయాలని కొంతకాలం విజ్ఞప్తి చేసిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఆ కేసులో పాత్రధారికి పార్టీలో పెద్దపీట వేసి సూత్రధారితో గొంతుకలుపుతున్నారు. మండేలా చెప్పి నట్టు కాంగ్రెస్, టీడీపీలు దగ్గరైన నేపథ్యంలో ‘ఓటుకు కోట్లు’ కేసులో నిందితులు కాంగ్రెస్కు మిత్రులైనారు. ఈ దాడులకు మరోకోణం ఉంది. గుజరాత్, కర్ణాటక శాసన సభ ఎన్నికలు జరిగినప్పుడు చంద్రబాబు కాంగ్రెస్కి నిధులు సమకూర్చినట్టు మోదీకి సమాచారం ఉందట. ఆ నిధులను రేవంత్ సంబంధీకుల ద్వారా చేరవేసినట్టు తెలు సుకున్నారట. ఈ నిధుల ప్రవాహానికి అడ్డుకట్ట వేసే ఉద్దేశం తోనే దాడులు జరిగాయంటూ ఒక కథనం ప్రచారంలో ఉంది. అంతులేని నిధులు చంద్రబాబు చేతుల్లోకి ఎట్లా వచ్చాయో తెలుసుకోవాలన్న అభిలాష మోదీకి ఉన్నట్టు లేదు. బీజేపీ సైతం ఎన్నికలలో అపారమైన నిధులు ఖర్చు చేసింది. చేయబోతోంది. అంతలేసి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో ఊహించడం కష్టం కాదు. ఎన్నికల వేళ తమని విమర్శించినా ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత చంద్ర బాబు సహకారం అవసరం కావచ్చుననే ముందు చూపుతో మోదీ, అమిత్షాలు వ్యవహరిస్తున్నట్టు చెబుతున్నారు. రియల్పొలిటిక్ (అధికార రాజకీయం)లో అందెవేసిన చెయ్యి కనుక ఇప్పుడు విమర్శిస్తున్న బీజేపీతో ఎన్నికల తర్వాత మళ్ళీ స్నేహం చేసేందుకు చంద్రబాబుకి ఎటు వంటి అభ్యంతరం, సంకోచం ఉండబోవని బీజేపీ అధిష్ఠా నానికి తెలుసు. క్షీణ సంస్కృతి చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రకాశం జిల్లాలోని దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి పెద్దఎత్తున అధికార దుర్వినియోగం చేసి, భారీ ఖర్చు చేసి ఎన్నికలలో ధనప్రభావం విపరీ తంగా పెరగడానికి కారకులైనారు. డబ్బు ఉన్నవారికే టిక్కెట్టు. ఎన్నికైన చట్టసభ సభ్యులు ఎన్నికలలో ఖర్చు చేసిన మొత్తాన్నీ, రాబోయే ఎన్నికలలో ఖర్చు చేయవలసిన మొత్తాన్నీ సంపాదించడం కోసం అడ్డదారులు తొక్కడం రివాజుగా మారింది. పార్టీలూ, నాయకులూ ఎవరైనా దాదాపుగా అదే సంస్కృతి దేశం అంతటా కొనసాగు తోంది. ఈ సంస్కృతికి ప్రతినిధి రేవంత్రెడ్డి. యువకుడూ, ఉత్సాహవంతుడూ, ధైర్యవంతుడూ, ధాటిగా మాట్లాడే శక్తి కలిగినవాడూ అయిన రేవంత్ ఈ కాలపు రాజకీయ ప్రతి నిధి. కండబలం, ధనబలం, కులబలం ఉంటేనే రాజకీయా లలో మనుగడ సాధ్యమని విశ్వసించే రాజకీయులకు ప్రతీక. రేవంత్పైన ఆదాయంపన్ను శాఖ దాడులను ఖండించిన చంద్రబాబు వైఎస్ జగన్మోహన్రెడ్డిపైన కాంగ్రెస్ నేతలతో షరీకై బూటకపు కేసులు బనాయింప జేశారు. అప్పుడు చట్టం తన పని తాను చేసుకొనిపోతుం దంటూ గడుసుగా వ్యాఖ్యానించిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు రేవంత్ని చూసి విలవిలలాడుతున్నారు. చంద్ర బాబుని మెప్పించేందుకు రేవంత్ జగన్మోహన్రెడ్డి గురించి ఎంత దారుణంగా మాట్లాడారో అందరికీ తెలుసు. పరిస్థితులు మారినప్పుడు వైఖరులూ మారుతాయి. తనను అరెస్టు చేస్తారంటూ చంద్రబాబు బేలగా మాట్లా డటం కూడా ఆయన మానసిక స్థితికి అద్దం పడుతుంది. తాను చేసిన అక్రమాలు ఏమిటో ఆయన అంతరాత్మకు తెలుసు. చట్టం నిజంగానే తన పని తాను చేస్తుందనే భయం చంద్రబాబుని అప్పుడప్పుడు అశాంతికి గురి చేస్తున్నది. రేవంత్కి శిక్ష పడితే తన పరిస్థితి ఏమిటనే ప్రశ్న నిరంతరం వేధిస్తున్నది కాబోలు. కె. రామచంద్రమూర్తి -
నేరగాడైన ముఖ్యమంత్రికి శిక్ష ఉండదా?
సాక్షి, హైదరాబాద్: ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి, అరాచకాలకు అంతేలేదు. చంద్రబాబు గొప్ప అవినీతి చక్రవర్తిగా మారిపోయారు. ఆయన రాష్ట్రంలో రూ. నాలుగున్నర లక్షల కోట్లు దోచుకున్నారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణలో రేవంత్రెడ్డిపై జరుగుతున్న దాడుల్లో బయట పడుతున్న ఆస్తులు ఎవరివని ప్రశ్నించారు. రేవంత్రెడ్డి సీఎం చంద్రబాబు బినామీ అని ఆరోపించారు. భూమన శుక్రవారం హైదరాబాద్ లోటస్పాండ్లో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దేశ విదేశాల్లో చంద్రబాబు దాచుకున్న సొమ్ము ఇంకా ఎంత ఉందోనని ఆశ్చర్య వ్యక్తం చేశారు. రేవంత్రెడ్డి పార్టీ మారడం డ్రామా అని అన్నారు. నేరగాడైన ముఖ్యమంత్రికి శిక్ష ఉండదా? అతడు చట్టానికి అతీతుడా? అని నిలదీశారు. ‘రేవంత్రెడ్డి ఇంట్లో ఐటీ దాడులు జరిగితే ఎల్లో మీడియా హడావుడి చేస్తూ చంద్రబాబును కాపాడేందుకు ప్రయత్నిస్తోంది. ఓటుకు కోట్లు కేసులో ఆడియో, వీడియో టేపులతో సహా దొరికిపోయిన దొంగలను రక్షించేందుకు ఎందుకంత తాపత్రయపడుతున్నారు? రేవంత్రెడ్డిని ఎందుకు సమర్థిస్తున్నారు? ఇలాంటి ఐటీ దాడులు ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ జరగలేదా? ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ పోలీసులు చంద్రబాబును ఎందుకు విచారణకు పిలవడం లేదు? దీనివెనుక ఉన్న మతలబు ఏమిటి? నేరగాడైన సీఎంకు శిక్ష ఉండదని వదిలేస్తున్నారా? (ముగిసిన సోదాలు.. మూడు సూట్కేసుల్లో డాక్యుమెంట్లు..!) బాబుకు ఆ ధైర్యం ఎక్కడినుంచి వచ్చింది ఏపీలో 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను సంతలో పశువులను కొన్నట్లుగా కొనడానికి చంద్రబాబు ఆయనకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? తాను ఏం చేసినా ప్రశ్నించేవారు లేరని బాబు అనుకుంటున్నారు. దేశంలో అమల్లో ఉన్న చట్టం, న్యాయం, రాజ్యాంగం అన్నవి చంద్రబాబుకు వర్తించవా? ఆయన ఎన్ని అక్రమాలు చేసినా, ఆస్తులు కూడబెట్టినా, ప్రజల సొమ్మును ఎంతగా దోచుకున్నా, విదేశాల్లో ఎంతైనా దాచుకున్నా విచారణ ఉండదా? చంద్రబాబు కోసం కొత్త చట్టం ఏదైనా వచ్చిందా? ఓటుకు కోట్లు వ్యవహారం బయటపడి మూడేళ్లవుతున్నా చంద్రబాబును ఎందుకు అరెస్టు చేయట్లేదు? అడిగేవారు లేరనుకుంటున్నారు చంద్రబాబు లాంటి గజదొంగను వదిలేస్తున్నారు. అందుకే ఈ రోజు కొలంబియా విశ్వవిద్యాలయం, ఐక్యరాజ్యసమితి అంటూ అమెరికాలో నానా చెత్త మాట్లాడే ధైర్యం ఆయనకు వచ్చింది. చేయని పనులన్నీ తానే చేశానంటూ విర్రవీగి మాట్లాడుతున్నారు. చంద్రబాబు భార్య పేరిట అధికారికంగా రూ.1,200 కోట్ల ఆస్తులు, ఆయన కుమారుడు లోకేశ్ పేరిట అధికారికంగా రూ.500 కోట్లు, మనవడి పేరిట ఉన్న రూ.కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఎన్ని అక్రమాలు చేసినా తమను ప్రశ్నించే నాథుడే లేడన్న ధీమా చంద్రబాబులో అణువణువునా జీర్ణించుకుపోయింది. ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేసుకునే సామర్థ్యం తనకుందని, ఎన్ని తప్పులు చేసినా, దోపిడీ చేసినా, రాష్ట్రాన్ని లూటీ చేసినా ఆక్షేపించేవారు లేరని అనుకుంటున్నారు. (‘ఓటుకు కోట్లు’ కొలిక్కి వచ్చేనా?) పచ్చ చొక్కాలకు ఇంటెలిజెన్స్ ఊడిగం ఓటుకు కోట్లు కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులందరినీ వెంటనే హైదరాబాద్ వదిలి అండర్ గ్రౌండ్కు వెళ్లమని మంత్రి లోకేశ్ చెబుతున్నాడు. తన రాజకీయ భవిష్యత్తు కోసం ఎవరినైనా అవినీతిపరులను చేయడానికి వెనుకంజ వేయని వ్యక్తి చంద్రబాబు. రాష్ట్రంలో ప్రభుత్వ ఇంటెలిజెన్స్ అధికారులు కేవలం పచ్చ చొక్కాలకు ఊడిగం చేయడానికే పనికొస్తున్నారు. చంద్రబాబు దుర్మార్గాలను కాపాడడానికే ఇంటెలిజెన్స్ విభాగం పని చేస్తోంది. చంద్రబాబు సాగిస్తున్న గనుల దోపిడీ వల్లే గిరిజన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్యకు గురయ్యారు. బాబు అరాచకాలు అంతం కాక తప్పదు. చంద్రబాబు పాలన ముగింపు దశకు చేరుకోవడం వల్లే రాష్ట్రంలో అవినీతి, అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది’ అని భూమన కరుణాకర్రెడ్డి ధ్వజమెత్తారు. (రేవంత్పై.. నేనే ఫిర్యాదు చేశా) -
రేవంత్రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత
-
రేవంత్ రెడ్డి ఇంటి వద్ద టెన్షన్.. టెన్షన్
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. గురువారం ఉదయం నుంచి రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఓటుకు కోట్లు కేసుతో పాటు, అక్రమాస్తుల ఆరోపణలపై ఐటీ అధికారులు నిన్న సాయంత్రం నుంచి రేవంత్ను విచారిస్తున్నారు. రెండో రోజు కూడా రేవంత్ ఇంట్లో సోదాలు జరుగుతుండటంతో శుక్రవారం ఉదయం నుంచి ఆయన ఇంటివద్దకు అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. వారిని అదుపు చేయడం కోసం రేవంత్ నివాసం వద్ద భారీ పోలీసు బలగాలను మొహరించారు. దీంతో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని ప్రచారం జరగడంతో.. తాము అరెస్టు చేయడానికి రాలేదని కేవలం భద్రత కోసమే వచ్చామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. (చదవండి: రేవంత్ ఇంటి వద్ద భారీ పోలీసు భద్రత) కాగా, శుక్రవారం సాయంత్రం వరకు కూడా రేవంత్ విచారణ కొనసాగడంతో.. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు ఆయనకు లోపల ఏం జరుగుతోందని నినాదాలు చేయడం ప్రారంభించారు. రేవంత్ను మీడియా ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకురాలు సీతక్క మాట్లాడుతూ.. రేవంత్కు ప్రాణహాని ఉందని.. విచారణను లైవ్ టెలికాస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్పై ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు. కార్యకర్తలు ఒక్కసారిగా పోలీసులను దాటుకోని ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించడంతో వారి మధ్య తోపులాటు చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కార్యకర్తలను శాంతపరచడానికి పోలీసులు రేవంత్ను బయటకు తీసుకువచ్చారు. గేట్ ముందుకు వచ్చిన రేవంత్ కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేసి వెంటనే ఇంట్లోకి వెళ్లిపోయారు. సీతక్కతోపాటు పలువురి అరెస్ట్: రేవంత్ నివాసం వద్ద ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ మహిళ నేతలు సీతక్క, హరిప్రియ నాయక్లను పోలీసులు అరెస్ట్ చేశారు. రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్ అధికారులు రేవంత్కు మద్దతుగా నినాదాలు చేస్తున్న కార్యకర్తలను, అభిమానులను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. రేవంత్ నివాసం వద్ద మీడియా మినహా మిగతా వారినందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
దుర్మార్గపు పనులకు కేరాఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డి
-
‘రేవంత్ రెడ్డి దేశ ద్రోహి’
సాక్షి, హైదరాబాద్: హవాలా దందా చేసి వేల కోట్లు సంపాదించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి దేశ ద్రోహి అంటూ టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డిపై ఐటీ దాడుల గురించి ఆయన మాట్లాడారు. తెలంగాణ వనంలో రేవంత్ రెడ్డి కలుపు మొక్కని అభివర్ణించారు. ‘ఓటుకు కోట్లు కేసు’లో రేవంత్ అడ్డంగా దొరికాడని, అక్కడ దొరికిన 50 లక్షలపై ఆరా తీస్తే డొంకంత కదిలిందని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అడుగు జాడల్లో నడిచి రేవంత్ వేల కోట్లు సంపాదించారన్నారు. దేశ భక్తుడినని చెప్పుకునే ఉత్తమ్.. హవాలా మార్గంలో డబ్బులు సంపాదించిన రేవంత్ను ఎందుకు సమర్థిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. (రేవంత్ ఇంట్లో సోదాలు) రేవంత్ రెడ్డిపై ఐటీ దాడుల విషయంలో కాంగ్రెస్ నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్నారు. రేవంత్ను కాంగ్రెస్ నుంచి బహిష్కరించి రాహుల్ గాంధీ తన సచ్చీలతను నిరూపించుకోవాలన్నారు. తెలంగాణ కాంగ్రెస్ స్టువర్ట్ పురం దొంగల ముఠాగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలవి అని కుంభకోణాలమయమని దుయ్యబట్టారు. 40 ఏళ్లుగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్న జానారెడ్డి, జైపాల్ రెడ్డి మీద సోదాలు జరగడం లేదని.. కేవలం అక్రమంగా సంపాదించిన రేవంత్ రెడ్డిపైనే ఐటీ దాడులు జరుగుతున్న విషయాన్ని కాంగ్రెస్ గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఐటీ దాడులకు టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధంలేదని టీఆర్ఎస్ ఎంపీ స్పష్టం చేశారు. చదవండి: రేవంత్కు అరెస్ట్ భయం..! ఐటీ దాడులు: ‘ఓటుకు కోట్లు’కేసు లెక్క తేలేనా? -
రేవంత్ ఇంటి వద్ద భారీ పోలీసు భద్రత
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం ప్రారంభమైన తనిఖీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 15 గంటలుగా రేవంత్ రెడ్డితో వన్ టు వన్గా ఐటీ అధికారులు విచారిస్తున్నారు. విచారణలో భాగంగా ‘ఓటుకు కోట్లు కేసు’లో మరో నిందితుడైన ఉదయ్ సింహతో కలిపి ఇద్దరిని ఒకేసారి విచారించారు. కొన్ని కీలక డాక్యుమెంట్లకు సంబంధించి ఉదయ్ను కూడా ప్రశ్నించేందుకు పిలిచినట్లు సమాచారం. శుక్రవారం ఉదయం ఐటీ అధికారులు రేవంత్ రెడ్డి భార్య గీతను రహస్యప్రదేశానికి తీసుకెళ్లి విచారించారు. అనంతరం గీతను బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయడానికి తీసుకెళ్లారు. అయితే రేవంత్ రెడ్డి నివాసం వద్ద భారీ పోలీసు బలగాలను మోహరించారు. దీంతో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతుండంతో ఆయన నివాసం వద్దకు కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున చేరుకుంటున్నారు. అయితే అరెస్టు చేయడానకి రాలేదని కేవలం భద్రత కోసమే వచ్చామని పోలీసు ఉన్నతవర్గాలు తెలిపాయి. (రేవంత్ ఇంట్లో సోదాలు) రెండో రోజు కూడా రేవంత్ రెడ్డిపై ఐటీ, ఈడీ దాడులు కోనసాగుతండటంతో కాంగ్రెస్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. శుక్రవారం ఉదయమే కాంగ్రెస్ నేతలు డికే అరుణ, సీతక్కతో సహా పలువురు నాయకులు, కార్యకర్తలు రేవంత్ ఇంటికి చేరుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూరితంగానే ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. చదవండి: ఓటుకు కోట్లు కేసులో బాబును ఎందుకు వదిలేస్తున్నారు? రేవంత్ ఇంట్లో కీలకపత్రాలు స్వాధీనం -
లోకేష్ పేరున 500 కోట్ల ఆస్తులెక్కడివి?
-
ఓటుకు కోట్లు కేసులో బాబును ఎందుకు వదిలేస్తున్నారు?
సాక్షి, హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో రేవంత్రెడ్డి, అతని సన్నిహితుల నివాసాలపై ఐటీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఈ కేసులో ఇంతగా హడావుడి చేస్తున్న అదికారులకు చంద్రబాబు నాయుడు కనబడడం లేదా అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర రెడ్డి ప్రశ్నించారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్పై జరుగుతున్న దాడుల్లో బయటపడుతున్న ఆస్తులు ఎవరివని.. అనుమానం వ్యక్తం చేశారు. రేవంత్పై ఐటీ అధికారుల దాడులపై హడావుడి చేస్తున్న ఎల్లో మీడియా.. చంద్రబాబుపై మౌనం వహించడానికి కారణాంలేటని నిలదీశారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబుపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడానికి మతలబు ఏమిటని ప్రశ్నించారు. నేరగాడైన మఖ్యమంత్రికి శిక్షలు ఉండవా అని ధ్వజమెత్తారు. చంద్రబాబు చట్టానికి అతీతుడా అని ధ్వజమెత్తారు. అమెరికా వెళ్లి చంద్రబాబు అనర్గళంగా అబద్ధాలు చెప్తున్నారనీ, చేయని పనులు తానే చేశానని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు భార్య పేరుమీద రూ.1200 కోట్ల ఆస్తులు ఎక్కడివి? లోకేష్ పేరుమీద రూ.500 కోట్ల ఆస్తులు ఎక్కడివి? ఓటుకు కోట్లు కేసులో ఉన్న నిందితులను హైదరాబాద్ వదిలి.. అండర్ గ్రౌండ్కు వెళ్లాలని లోకేశ్ చెప్పారనే ప్రచారం జరుగుతుంది చంద్రబాబు బినామా ఆస్తులు రేవంత్రెడ్డి వద్ద ఉన్నాయి. రాష్ట్రంలో దాదాపు 4.5 లక్షల కోట్ల రూపాయలు టీడీపీ పాలకులు దోచుకున్నారని విమర్శలు గుప్పించారు. అవినీతి డబ్బుతోనే 23 మంది ఎమ్మెల్యేలను, ఇద్దరు ఎంపీలను చంద్రబాబు కొనుగోలు చేశారని ఆరోపించారు. చంద్రబాబు మైనింగ్ దోపిడివల్లే కిడారి సర్వేశ్వరరావు, శివేరి సోమ బలయ్యారని ధ్వజమెత్తారు. (చదవండి: రేవంత్ ఇంట్లో సోదాలు) (చదవండి : ఐటీ దాడులు: ‘ఓటుకు కోట్లు’కేసు లెక్క తేలేనా?) -
ఐటీ సోదాలు: రేవంత్ ఇంట్లో కీలకపత్రాలు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు నోటు’, మనీలాండరింగ్ కేసులలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మెడకు ఉచ్చు బిగుస్తున్నట్లు కనిపిస్తోంది. రేవంత్ రెడ్డికి సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలపై ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం తనిఖీలు చేస్తోంది. నిన్న ఉదయం ప్రారంభమైన తనిఖీలు శుక్రవారం కూడా కొనసాగుతున్నాయి. రేవంత్ రెడ్డిని 10 గంటలకు పైగా విచారించారు. ఐటీ అధికారులు రేవంత్ రెడ్డి ఇంటి నుంచి కోటి రూపాయలు, కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా రేవంత్ రెడ్డి బంధువుల, సన్నిహితులకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ, ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. (రేవంత్కు అరెస్ట్ భయం..!) కొండాల్ రెడ్డి ఇంట్లో ముగిసిని సోదాలు: రేవంత్ రెడ్డి తమ్ముడు కొండాల్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు మగిసాయి. కొండాల్ రెడ్డి భార్యను ఏడు గంటలకుపైగా రహస్య ప్రదేశంలో విచారించారు. పలు కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్లోని రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చదవండి: రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు -
ఓటుకు కోట్లు కేసు: సెబాస్టియన్, ఉదయ్లకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు నోటు కేసు’ కు సంబంధించిన నిందితుల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు కొనసాగుతునే ఉన్నాయి. గురువారం ఉదయం ప్రారంభమైన తనిఖీలు 23 గంటలుగా కొనసాగుతున్నాయి. ఈ కేసులో ఏ2గా ఉన్న సెబాస్టియన్కు ఐటీ యాక్ట్ కింద నోటీసులు జారీ చేశారు. అక్టోబర్ 1లోగా బషీర్బాగ్లోని ఆయకార్ భవన్లో వ్యక్తిగతంగా హాజరుకావాలని అధికారులు ఆదేశించారు. ఇచ్చిన గడువులోగా హాజరకాకపోతే సెక్షన్ 271ఏ ఐటీ యాక్ట్ కింద జరిమాన విధిస్తామని నోటీసులో పేర్కొన్నారు. (రేవంత్ ఇంట్లో సోదాలు) ఉదయ్ సింహ ఇంట్లో ముగిసిన సోదాలు: ఓటుకు నోటు కేసులో మరో నిందితుడు ఉదయ్ సింహ ఇంట్లో నిన్న సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైన సోదాలు శుక్రవారం ఉదయం ఐదు గంటల వరకు కొనసాగాయి. ఉదయ్ సింహా ఇళ్లు, కార్యాలయాలు, ఆయన బంధువులకు సంబంధించిన మూడు నివాసాల్లోనూ ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ఇస్తూ పట్టుబడ్డ 50 లక్షలతో పాటు డీల్ భాగంగా ఇతరు నగదు ఎలా సమీకరించాలనుకున్నారని ఉదయ్ సింహను ప్రశ్నించారు. అంతేకాకుండా ఉదయ్కు చెందిన ఆస్తులు, ఆదాయం, రాబడుల వ్యవహారాలపై కూడా ఐటీ అధికారులు కూపీ లాగారు. సెక్షన్ 131 ఆదాయపన్ను చట్టం 1961 ప్రకారం ఉదయ్కు ఐటీ అధికారులు నోటీసుల ఇచ్చారు. అక్టోబర్ 1ను విచారణ సిద్దంగా ఉండాలని నోటీసులో పేర్నొన్నారు. చదవండి: రేవంత్కు అరెస్ట్ భయం..! కదులుతున్న డొంక -
దమ్ములేకనే.. కేసులు పెడుతున్నారు
-
దమ్ములేకనే.. కేసులు పెడుతున్నారు : డీకే అరుణ
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ అవినీతి పాలనను ప్రశ్నించిన వారిని, ప్రజల్లోకి తీసుకెళ్లిన వారిని కేసులు పెట్టి వేధిస్తున్నారని కాంగ్రెస్ తాజా మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ ఆరోపించారు. ఓటుకు కోట్లు కేసులో ఏ-1గా నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి, అతని సన్నిహితుల ఇళ్లలో గురువారం ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు చేస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం జూబ్లిహిల్స్లోని రేవంత్ ఇంటికి చేరుకున్న అరుణ ఆయనకు మద్దతుగా నిలిచారు. రాజకీయంగా రేవంత్ను ఎదుర్కొనే దమ్ము లేకనే కేసులు పేరుతో కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని టీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు. (చదవండి : రేవంత్ ఇంట్లో సోదాలు) -
ఓటుకు నోటు కేసు: ఉదయ్ సింహా ఇంట్లో సోదాలు
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన ఉదయ సింహ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. చైతన్యపురి పరిధిలోని హరిపురి కాలనీలో ఉన్న ఆయన నివాసంలో ఐదుగురు సభ్యుల ఐటీ శాఖాధికారుల బృందం తనిఖీలు చేస్తున్నారు. అధికారులు ఆయన ఇంటికి వచ్చినపుడు ఉదయ సింహ తల్లి మాత్రమే ఉంది. దీంతో అధికారులు ఉదయ సింహాకు ఫోన్ చేసి ఇంటి రావాలని చెప్పారు. దీంతో ఆయన హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న వెంటనే ఆయన సమక్షంలోనే ఐటీశాఖాధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పలు కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. -
రేవంత్కు అరెస్ట్ భయం..!
సాక్షి, కోస్గి(వికారాబాద్): టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి అరెస్ట్ భయం పట్టుకున్నట్టుగా కనబడుతోంది. ఓటుకు కోట్లు కేసులో ఏ-1గా ఉన్న రేవంత్ రెడ్డి, ఏ-2 సెబాస్టీయన్ ఇళ్లతోపాటు, రేవంత్ సన్నిహితుల ఇళ్లలో గురువారం ఉదయం నుంచి ఐటీ అధికారు సోదాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఐటీ సోదాలు నిర్వహిస్తున్నా.. రేవంత్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో అధికారులు ఆయనకు ఫోన్ చేసి వెంటనే హైదరాబాద్కు రావాలని చెప్పారు. కుటుంబ సభ్యులతో సహా హైదరాబాద్కు రావాలని ఆదేశించారు. దీంతో కోస్గిలో కాంగ్రెస్ ప్రచార కార్యక్రమంలో ఉన్న రేవంత్ అక్కడి నుంచి హైదరాబాద్కు బయలుదేరారు. హైదరాబాద్కు బయలుదేరే ముందు రేవంత్ తన అనుచరులతో మాట్లాడుతూ.. ‘ఓటుకు కోట్లు కేసులో ఇప్పటికే 32 రోజులు జైల్లో పెట్టారు. మీరు అండగా ఉన్నారనే ధైర్యంతోనే హైదరాబాద్కు వెళ్తున్నాను. నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇదే నా అఖరి ప్రసంగం కావొచ్చ’ని తన సన్నిహితుల వద్ద ఆందోళనను వ్యక్తపరిచారు. ఒకవేళ అరెస్ట్ చేస్తే జైలు నుంచే నామినేషన్ దాఖలు చేస్తానని రేవంత్ తెలిపారు. తనను ఏమీ చేయలేకే.. ఐటీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ‘జైల్లో తిన్న చిప్పకుడు మీద ఒట్టేసి చెబుతున్న.. కేసీఆర్ కుటుంబాన్ని గద్దె దించేవరకు నిద్రపోన’ని శపథం చేశారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత కొడంగల్ ప్రజలదేనని అన్నారు. గతంలో రాజకీయాల్లో కలకలం రేపిన ఓటుకు కోట్లు కేసులో అప్పటి టీడీపీ నేత రేవంత్ రెడ్డి ముద్దాయిగా ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు 50 లక్షలు ఇస్తూ రేవంత్ రెడ్డి పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ-1గా ఉన్న రేవంత్కు 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై ఐటీ శాఖకు తెలంగాణ ఏసీబీ ఈ నెల 13వ తేదీన లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఐటీ దాడులు జరగడం గమనార్హం. -
రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు
-
మరికాసేపట్లో రేవంత్రెడ్డి మీడియా సమావేశం
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అక్రమాల కేసు, ఓటుకు కోట్లు కేసు ఉచ్చు బిగుస్తున్నట్టు కనిపిస్తోంది. గురువారం ఉదయం నుంచి రేవంత్ రెడ్డికి సంబంధించిన సన్నిహితులు, బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం రేవంత్ రెడ్డికి సంబంధించని అన్ని పత్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. అనుమానం ఉన్న ప్రతి విషయం, పత్రాలపై అందుబాటులో ఉన్నవారి నుంచి ఆరా తీస్తోంది. రేవంత్ రెడ్డికి సంబంధించిన పాత ఇంటి తాళాలు పగలగొట్టి కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈడీ అధికారులు రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి భార్యను కార్లో ఎక్కించుకొని వెళ్లి రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. అయితే ప్రచారంలో భాగంగా సొంత నియోజకవర్గానికి వెళ్లిన రేవంత్ రెడ్డిని కుటుంబసభ్యులతో సహా వెంటనే తమ ముందు హాజరుకావాలని ప్రత్యేక అధికారుల నుంచి ఫోన్ వెళ్లినట్టు సమాచారం అందుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో మరికాసేపట్లో రేవంత్రెడ్డి మీడియా ముందుకువచ్చి మాట్లాడే అవకాశముందని తెలుస్తోంది. దీంతో కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో ఎన్నికల ప్రచారంలో ఉన్న రేవంత్రెడ్డి మరికాసేపట్లో విలేకరుల సమావేశం నిర్వహించబోతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. రేవంత్ మరికాసేపట్లో అధికారుల ముందు హాజరుకానున్నారు. (ఐటీ దాడులు: ‘ఓటుకు కోట్లు’కేసు లెక్క తేలేనా?) రేవంత్కు నాకు ఎలాంటి సంబంధం లేదు ‘ఓటుకు కోట్లు’కేసులో ఏ2 నిందితుడు సెబాస్టియన్ ఐటీ అధికారుల సోదాల అనంతరం మీడియాతో మాట్లాడారు. మౌర్య కేసుకు, రేవంత్ రెడ్డికి తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. ఓటుకు కోట్లు కేసులో ముద్దాయిగా ఉన్న కేసులోనే ఆదాయపు పన్ను శాఖ సోదాలు చేస్తున్నారని వివరించారు. తన సంస్థలకు సంబంధించిన అన్ని పత్రాలు క్లియర్గా ఉన్నాయని, ఐటీ రిటర్స్న్ కూడా క్లియర్గా ఉన్నాయన్నారు. ఈ రకంగా ప్రభుత్వం దాడులు చేయించడం భావ్యం కాదన్నారు. చదవండి: బ్రేకింగ్: రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు రేవంత్ రెడ్డి ఇంటి ముందు తీవ్ర ఉద్రిక్తత -
‘ఆయన గాడ్సే కంటే దుర్మార్గుడు’
సాక్షి, తిరుపతి : మహాత్మాగాంధీని హత్యచేసిన గాడ్సే కంటే దారుణమైన వ్యక్తి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అని తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్తో పాటు ఆయన వెనుకున్న ప్రతి ఒక్కరినీ చంపించిన చరిత్ర చంద్రబాబుదంటూ ఆరోపించారు. చిత్తూరు పర్యటనలో ఉన్న మోత్కుపల్లి తిరుపతిలో గురువారం మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు మహానేత ఎన్టీఆర్ గుర్తురారని, నందమూరి కుటుంబం చంద్రబాబు చుట్టు తిరగాల్సిన పరిస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చంద్రబాబుకు ఎన్టీఆర్ బొమ్మ గుర్తొస్తుందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఓటు వేయకుండా చంద్రబాబుకు ఏపీ ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో చంద్రబాబు బతికిపోయాడు.. తెలంగాణలో తనను అడ్డం పెట్టుకుని చంద్రబాబు బతికిపోయాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కాలుపెట్టిన ప్రాంతం నాశనమేనని చెప్పారు. తాను పెద్ద మాదిగ అని చెప్పిన చంద్రబాబు నోటివెంట దళితుల మాటే లేదన్నది నిజం కాదా అని ప్రశ్నించారు. కాపులు, బీసీల మధ్య చంద్రబాబు చిచ్చుపెట్టి పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. ఎస్సీలు, ఎస్టీలు ఎవరూ జడ్జీలు ఎందుకు కాకుడదో చెప్పాలని ఏపీ సీఎంను డిమాండ్ చేశారు. దళితుడ్ని కాబట్టే నన్ను అవమాన పరిచాడని.. చంద్రబాబుది నోరా.. తాటిమట్టా అంటూ మండిపడ్డారు. తనకు ఎవరి సపోర్ట్ లేదని, అందరికీ నేనే సపోర్ట్ చేస్తున్నానని మోత్కుపల్లి అన్నారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారని పేర్కొన్నారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అప్పటి టీడీపీ నేత రేవంత్రెడ్డికి డబ్బులిచ్చి పంపింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ఆ కేసులో ఇద్దరు ఉన్నారు కాబట్టి పార్టీ నుంచి రేవంత్ను సస్పెండ్ చేయలేదని అభిప్రాయపడ్డారు. జీవితం అంతా నీ కోసం త్యాగం చేశాను, మరి నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేశావ్ అని చంద్రబాబును ప్రశ్నించారు. తాను తప్పు చేస్తే చెప్పాలని, ముక్కును నేలకు రాసుకుంటానని సవాల్ విసిరారు. ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టడానికే అన్నా క్యాంటీన్లను చంద్రబాబు ప్రారంభించారని మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. -
చంద్రబాబు ఉంటే ప్రత్యేక హోదా రానేరాదు
-
దొరికిన దొంగ చంద్రబాబు; సంచలనం
సాక్షి, హైదరాబాద్: పట్టపగలు నేరం చేస్తూ నగ్నంగా దొరికిన దొంగ చంద్రబాబు నాయుడును చట్టపరంగా శిక్షించడంలో జాప్యం చోటుచేసుకుంటున్నది. ‘‘మనవాళ్ళు అదే దే బ్రీఫ్డ్ మీ..’’ అంటూ ఆయన అమలు చేసిన ఓటుకు కోట్లు కుట్ర అమలు జరిగి నేటికి సరిగ్గా మూడేళ్లు. 31మే, 2015న... తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేసేందుకుగానూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి స్వయంగా రూ.50 లక్షలు ఇస్తూ పోలీసులకు దొరికిపోయి, జైలుపాలయ్యారు. కొద్ది గంటల్లోనే స్టీఫెన్సన్తో ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ సంభాషణలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఓటుకు కోట్లు కేసులో ఉమ్మడి హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్న చంద్రబాబు అనంతర కాలంలో హైదరాబాద్పై ఉన్న 10ఏళ్ల హక్కును వదులుకుని పారిపోయే పరిస్థితి తలెత్తింది.అసలేం జరిగింది?: శాసన సభ్యుల ఎమ్మెల్సీ స్థానం కోసం జరిగిన ఎన్నికల్లో బలం లేకపోయినప్పటికీ టీడీపీ తన అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డిని బరిలో నిలిపింది. అక్రమంగా ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ప్రధాన సూత్రధారిగా ఓటుకు కోట్లు కుట్ర రూపొందింది. ఆంగ్లో ఇండియన్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ఇంటికి వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి.. రూ.50లక్షల రూపాయిల నోట్ల కట్టలను అందించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో రేవంత్ మాట్లాడిన మాటలు కూడా అత్యంత కీలకంగా మారాయి. ‘‘ఓటు వేసిన తర్వాత మిగతా డబ్బు అందజేస్తామని చెప్పి మమ్మల్ని బాస్(చంద్రబాబు) పంపించాడు. కావాలంటే మీరు మా బాస్తో డైరెక్ట్ గా మాట్లాడొచ్చు. ఇక్కడ తెలంగాణాలో మీకు ఎలాంటి ప్రాబ్లం వున్నా నేన్ను చూసుకుంటాను..’’ అని రేవంత్ చెప్పడం స్పష్టంగా వినిపిస్తాయి. అప్పటికే కుట్ర సమాచారం అందుకున్న తెలంగాణ ఏసీబీ అధికారులు.. టీడీపీ నేతల్ని రెడ్ హ్యాండెడ్గా దొరకబుచ్చుకున్నారు. స్టీఫెన్సన్-చంద్రబాబుల సంభాషణ స్టీఫెన్సన్ : హలో చంద్రబాబు మనిషి : ఆ యా బ్రదర్ స్టీఫెన్సన్ : సర్ చంద్రబాబు మనిషి : అవర్ బాబు గారు గోయింగ్ టు టాక్ టూ యు , బి ఆన్ ద లైన్ స్టీఫెన్సన్ : ఒకే సర్ చంద్రబాబు : హలో స్టీఫెన్సన్ : సర్ గుడ్ ఈవినింగ్ సర్ చంద్రబాబు : ఆ గుడ్ ఈవినింగ్ బ్రదర్ హౌ ఆర్ యు స్టీఫెన్సన్ : ఫైన్ సర్ థ్యాంక్ యు చంద్రబాబు : మనవాళ్ళు అదే దే బ్రీఫ్డ్ మీ స్టీఫెన్సన్ : యా సర్ చంద్రబాబు : ఐ యాం విత్ యు డోంట్ బాదర్ స్టీఫెన్సన్ : రైట్ చంద్రబాబు : ఫర్ ఎవ్రీ థింగ్ ఐ యాం విత్ యు , వాట్ ఆల్ దే స్పోక్ విల్ హానర్ స్టీఫెన్సన్ : యా సర్ రైట్ చంద్రబాబు : ఫ్రీలి యు కెన్ డిసైడ్ నో ప్రాబ్లం అట్ ఆల్ స్టీఫెన్సన్ : ఎస్ సర్ చంద్రబాబు : దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్ వి విల్ వర్క్ టుగెదర్ స్టీఫెన్సన్ : రైట్ చంద్రబాబు : థ్యాంక్ యు ఏపీకి ఆపాదించే కుట్ర: చంద్రబాబు సంభాషణల వీడియో బయటికి రావడం, ఓటుకు కోట్లు కేసులో ’దొరికిన దొంగ చంద్రబాబు’ అని తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడం లాంటి పరిణామాలతో బెంబేలెత్తిపోయిన చంద్రబాబు.. ఢిల్లీ వెళ్లి అక్కడి పెద్దల కాళ్లావేళ్లాపడి కాపాడాల్సిందిగా వేడుకున్నారు. అటుపై కోర్టును ఆశ్రయించారు. ఈలోపే తన కుట్రలకు మరింత పదునుపెట్టిన చంద్రబాబు.. హైదరాబాద్లో ఆంధ్రులకు రక్షణలేదని, ఉమ్మడి రాజధానిలో సెక్షన్ 8ని అమలుచేయాలని నాటకాలు మొదలుపెట్టారు. టీడీపీ అక్రమ వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహారంగా చిత్రీకరించేందుకు విఫలయత్నం చేశారు. ముఖ్యమంత్రిగా ఉండి అవినీతి వ్యవహారంలో చంద్రబాబు పట్టుబడిన వైనం సంచలనం సృష్టించింది. -
చంద్రబాబును రక్షించాలా? శిక్షించాలా?
-
‘ఓటుకు కోట్ల’కు.. ‘మే’ ముహూర్తం!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఓటుకు కోట్లు’కేసుకు, ఆ కేసులో రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన రేవంత్రెడ్డికి మే నెలతో వివాదాస్పద అనుబంధం ఉందంటూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు పన్నిన కుట్ర మొత్తం మే నెలలోనే సాగినట్టు ఏసీబీ వర్గాలు ధ్రువీకరించాయి. టీడీపీ అభ్యర్థికి ఓటువేయాలని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెడుతూ అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది 2015, మే 30వ తేదీనే. ఈ కేసు దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతూ మూడేళ్ల తర్వాత.. అంటే 2018 మే నెలలోనే మళ్లీ తెరపైకి వచ్చింది. స్టీఫెన్సన్తో సాగి న సంభాషణల్లోని గొంతు చంద్రబాబుదేనని ధ్రువీకరిస్తూ చండీగఢ్కు చెందిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక ఈ నెలలోనే ఏసీబీకి చేరింది. అటు ఏసీబీ కూడా ఈ నెలలోనే తుది చార్జిషీటు దాఖలు చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. మొత్తంగా ‘ఓటుకు కోట్లు’వ్యవహారంలో మే నెల కీలకంగా మారుతోంది. మరోవైపు ఈ కేసులో కీలక నిందితుడైన రేవంత్రెడ్డికి కూడా మే నెల అచ్చివచ్చి నట్టు కనిపించడం లేదు. ఆయనకు రాజకీయంగా 2015 మే 30న తీరని దెబ్బ పడింది. ఇప్పుడదే నెలలో ఆయన ఏకంగా సీఎం అవడం తన లక్ష్యమం టూ వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీలో దుమారం లేపింది. ఇటీవలే కాంగ్రెస్లో చేరిన రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. ఆయన రాజకీయ భవిష్యత్ను ఎటువైపునకు తీసుకెళుతుందోనని రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుండటం గమనార్హం. -
దొంగగా తేలినా... అరెస్టు చేయరెందుకు?
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో సీఎం చంద్రబాబే అసలు ముద్దాయని, చార్జిషీట్లో తక్షణమే ఆయన పేరు చేర్చి అరెస్టు చేయాలని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి డిమాండ్ చేశారు. చండీగఢ్ ఫోరెన్సిక్ లేబొరేటరీ స్పష్టమైన ఆధారాలిచ్చినా చంద్రబాబును కనీసం విచారణకు కూడా పిలవకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. హైదరాబాద్ లోటస్పాండ్లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో భూమన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఫోన్లో మాట్లాడిన వాయిస్ చంద్రబాబుదేనని దేశమంతా నమ్ముతోందని, ఈ కేసులో ఆయనకు శిక్ష పడకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదముందన్నారు. మూడేళ్లపాటు మూలన పడేసిన ఓటుకు కోట్లు కేసును తెలంగాణ ప్రభుత్వం బయటకు తీసిందని, అయితే ఇది చంద్రబాబును రక్షించేందుకు కాదనే విషయంపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. సీబీఐ విచారణ వైపు వెళ్లకుండా చేసే లక్ష్యంతో కాకుండా, చిత్తశుద్ధితో కేసులో భాగస్వామ్యులైన వారికి శిక్షలు పడేలా చూడాలని కోరారు. చంద్రబాబుని ఆ దేవుడు కూడా రక్షించలేరంటూ గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ప్రతిజ్ఞను ఈ సందర్భంగా భూమన గుర్తుచేశారు. చంఢీగడ్ ల్యాబ్ ఇచ్చిన నివేదిక ఆధారంగానైనా కట్టుదిట్టమైన చర్యలు తీసుకువాలని డిమాండ్ చేశారు. దొంగ పట్ల ఉదాశీనతా..! ఒక ఎమ్మెల్యేను కొనేందుకు రూ.5 కోట్లకు బేరమాడి, 50 లక్షలు ఇస్తూ అడ్డంగా దొరికిపోయినా కూడా కేసులు పెట్టకపోవడం అన్యాయన్నారు. ఇది కేసీఆర్ నిబద్ధతను ప్రశ్నించేలా ఉందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబును ముద్దాయిగా చేర్చి అరెస్టు చేయాలన్నారు. లేకుంటే ప్రజల్లో సామాన్యుడికి ఒకన్యాయం, చంద్రబాబుకు మరో న్యాయమా? అన్న అభిప్రాయం కలుగుతుందన్నారు. చంద్రబాబు అవినీతి 15 ఏళ్ల క్రితమే వెలుగు చూసిందని, అప్పట్లో తెహల్కా ఆయన అత్యంత అవినీతి పరుడని నిగ్గుతేల్చిందని భూమన గుర్తు చేశారు. ఇప్పుడు కూడా విచారణ జరగకపోతే.. తనను ఎవరూ ఏమీ చేయలేరని.. తనకు అనేక మంది అండదండలున్నాయంటూ చంద్రబాబు అవినీతిని ఏరులై పారిస్తాడన్నారు. -
ఓటుకు కోట్లు కేసు సీబీఐకి అప్పగించాలి
-
‘ప్రధానులనూ విచారించి.. చంద్రబాబును వదిలేస్తారా’
సాక్షి, విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు కోట్లు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్ధసారధి కోరారు. ఎమ్మెల్యే ఓటు కొనేందుకు రూ.50 లక్షలు చంద్రబాబు ఇప్పించారని, ఆపై ఆడియో టేపుల్లో వాయిస్ ఆయనదేనని తేలిందన్నారు. చంద్రబాబు రాజకీయాలను చూసిన తర్వాత ప్రజలకు రాజ్యాంగంపై నమ్మకం పోయిందన్నారు. విజయవాడలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగ వ్యవస్థలు ఏం చేయలేవనే ధీమాతో టీడీపీ నేతలున్నారని, రాజ్యాంగాన్ని ఖూనీ చేసే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పార్ధసారధి కోరారు. ఓటుకు కోట్లు కేసులో సీబీఐ లేదా ఉన్నత స్థాయి సంస్థతో విచారణ జరపాలన్నారు. ఓటుకు కోట్లు కేసు రెండు రాష్ట్రాల సమస్య కాదని, కానీ ఈ కేసు కారణంగా ఏపీ ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరకడం వల్లే తెలంగాణ సీఎం కేసీఆర్కు మోకరిల్లి హైదరాబాద్ను వదిలిపెట్టి విజయవాడకు పారిపోయి వచ్చారని గుర్తుచేశారు. కేవలం ఈ కేసు భయంతోనే పదేళ్ల రాజధాని హైదరాబాద్ను చంద్రబాబు వదులుకున్నారని తెలిపారు. 5 కోట్ల మంది ఆంధ్రుల హక్కును చంద్రబాబు తాకట్టు పెట్టారని, అనవసరమైన ఆర్థిక భారాన్ని ప్రజలపై ఏపీ సీఎం వేశారని విమర్శించారు. తెలంగాణ అక్రమం ప్రాజెక్టులను కూడా చంద్రబాబు అడ్డుకోలేక పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానులుగా ఉన్నవారిపై ఆరోపణలు వచ్చినప్పుడు కూడా విచారణ చేశారు. అలాంటిది సీఎం చంద్రబాబుపై ఎందుకు విచారణ చేయట్లేదదని ప్రశ్నించారు. కోర్టు చంద్రబాబుకి క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పడం సిగ్గు చేటన్నారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పాత్ర ఉందని స్టీఫెన్సన్ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో స్పష్టంగా చెప్పారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. సీబీఐ కేసులు పెట్టి తనను అరెస్ట్ చేస్తుందనే భయంతోనే నాలుగేళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి బీజేపీకి చంద్రబాబు ఊడిగం చేశారని పేర్కొన్నారు. రాజ్యాంగం అంటే చంద్రబాబుకు పిచ్చిరాతగా ఉంది. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను అధికారంలో ఉన్న చంద్రబాబు కొన్నారని, ఎందుకంటే ఈ రాజ్యాంగం తనను ఏం చేయలేదని ఏపీ సీఎం భావిస్తున్నారని పార్ధసారధి వివరించారు. -
ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబే ముద్దాయి
-
‘అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు’
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే ముద్దాయి అని దేశమంతా నమ్ముతోందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. ఫోన్లో మాట్లాడిన వాయిస్ టేపు రికార్డులో ఉన్న గొంతు చంద్రబాబుదే అన్నది స్పష్టమైందని తెలిపారు. చంద్రబాబును అప్పుడే అరెస్ట్ చేయాల్సి ఉండే, కానీ ఇలా తప్పుడు పనులు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోక పోవడం వల్ల చట్టాలపై ప్రజలకు నమ్మకం పోతుందని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు లాంటి వ్యక్తులు ఉండటం వల్లే ప్రజాస్వామ్యంపై విశ్వాసం సన్నగిల్లుతోందని మండిపడ్డారు. హైదరాబాద్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐ విచారణకు తెలంగాన పోలీసులు చేపట్టిన విచారణ అడ్డుకారాదని పేర్కొన్నారు. ఓటు కోట్లు కేసులో అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు అని, ఛార్జిషీటులో ఆయన పేరు ఇంతవరకూ ఎందుకు చేర్చలేదని భూమన ప్రశ్నించారు. ఇందులో తెలంగాణ సీఎం కేసీఆర్ నిబద్ధతను ప్రశ్నించాల్సి వస్తుందన్నారు. చంద్రబాబు పేరు చేర్చకుంటే వారు కూడా చట్ట వ్యతిరేకులే అన్నారు. సామాన్యుడైనా, సీఎం అయినా చట్టాలు ఒకే తీరుగా ఉంటాయని, దీన్ని అందరూ సమ్మతిస్తారని చెప్పారు. అయినా ఏళ్లు గడుస్తున్నా కోట్లు ఖర్చుపెట్టి ఎమ్మెల్యేల ఓట్లు కొనేందుకు చూసి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన చంద్రబాబును విచారణకు పిలవకపోవడం దారుణమన్నారు. కేసుకు భయపడ్డ చంద్రబాబు.. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ వద్ద సాగిలపడ్డారో.. లేక తెలంగాణలో కేసీఆర్ వద్ద సాగిల పడ్డారోనని, అందుకే ఇన్నాళ్లు ఈ కేసులో నిర్లిప్తత కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. ఒక ఎమ్మెల్యేకి రూ.50 లక్షలు ఇస్తూ అడ్డంగా దొరికిన కేసులు పెట్టరా అని ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసు గురించి భయపడే చంద్రబాబు విజయవాడకు పారిపోయారని ఆరోపించారు. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్న నేపథ్యంలో చంద్రబాబు అకస్మాత్తుగా అమరావతికి మకాం మార్చడం వెనక అసలు ఉద్దేశం ఓటుకు కోట్లు కేసు భయమేనని భూమన కరుణాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. -
చిత్తశుద్ధి ఉంటే బాబును దోషిగా నిరూపించు
హైదరాబాద్: ఓటుకు కోట్లు వ్యవహారంలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు తనను బలిపశువుని చేస్తున్నారని, పావుగా వాడుకుంటున్నారని ఈ కేసులో ఏ–5 ముద్దాయి జెరూసలేం మత్తయ్య ఆరోపించారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో ఫోన్లో మాట్లాడింది ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడే అన్న విషయం యావత్ ప్రపంచానికి తెలుసన్నారు. మంగళవారం హైదరాబాద్ బషీర్బాగ్లోని దేశోద్ధారక భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్కు చిత్తశుద్ధి, దమ్మూధైర్యం ఉంటే ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి దోషిగా నిరూపించాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో తనను ఏ–5గా చేర్చడం బాధ కలిగించిందన్నారు. తాను సుప్రీంకోర్టులో వేసిన అప్రూవ్ పిటిషన్ను కూడా అణగదొక్కే కుట్రలు ఇరు ప్రభుత్వాలు చేస్తున్నాయని ఆరోపించారు. ‘‘గుంటూరు, విజయవాడ వెళ్లినప్పుడు నాకు బెదిరింపు ఫోన్కాల్స్ వచ్చాయి. దీనిపై అక్కడి పోలీసులకు చెబితే వాళ్లు స్పందించారు. అక్కడి పీఎస్లో కేసు పెట్టించారు. ‘నిన్ను బెదిరించినట్లు కేసీఆర్పై కేసు పెట్టు’అని ఒత్తిడి చేశారు. ఏపీ ప్రభుత్వం, అధికారులు నన్ను ఆర్నెల్లపాటు అండర్గ్రౌండ్లో ఉంచి వారికి అనుకూలంగా వాడుకున్నారు’’అని మత్తయ్య పేర్కొన్నారు. -
నిప్పు బాబుకు నిద్రలేని రాత్రులే!
ఓటుకు కోట్లు కేసును సీబీఐకి అప్పగించాలన్న పిటిషన్ సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది. ఏపీలో జరిగిన అవినీతి మీద సీబీఐ విచారణ కావాలని అక్కడి బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్న సమయంలో ఇప్పుడు కేసీఆర్ ఓటుకు కోట్లు కేసు దస్త్రాలను మళ్ళీ ఒకసారి దులిపి బయటకు తీసి చంద్రబాబుకు రాత్రుళ్ళు నిద్ర పూర్తిగా కరువు అయ్యేట్టు చేశారు. పలు కేసులలో స్టేలు తెచ్చుకుని కాలం గడుపుతూ కూడా నా మీద ఒక్క కేసూ లేదు, నేను నిప్పును అని చెప్పుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఓటుకు కోట్లు కేసు వల్ల రానున్న రోజుల్లో నిద్రలేని రాత్రులే శరణ్యం. తెలంగాణా సీఎం కల్వ కుంట్ల చంద్రశేఖర్రావు సోమవారం నాడు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులతో కొన్ని కేసులకు సంబంధించి సుదీర్ఘంగా సమీక్ష జరిపారు. అందులో ప్రధానమయిన కేసు మూడేళ్ళ కింద ఓటుకు కోట్లు కేసుగా బాగా ప్రచారం పొందింది. ఏపీ సీఎం చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారన్న అభియోగం ఎదుర్కొం టున్న కేసు కావడంతో ఇది బాగా ప్రచారంలోకి వచ్చింది. అంతే కాదు రాష్ట్ర విభజన చట్టంలో కల్పిం చిన వెసులుబాటు ఆధారంగా పదేళ్ళ పాటు హైదరాబాద్ను తమ రాజధానిగా కూడా ఉపయోగించుకునే పరిస్థితి ఉన్నా, హడావుడీ లేకుండా ప్రశాంతంగా కొత్త రాజధాని నిర్మించుకునే పరిస్థితి ఉన్నా రాత్రికి రాత్రి చంద్రబాబు పరిపాలనను విజయవాడకు తరలించడం వల్ల కూడా బాగా ప్రచారంలోకి వచ్చింది. గాలివానకు ఊగే నిర్మాణాలే రాజధానా? తెలంగాణాలో తనను నమ్ముకుని నివసిస్తున్న ఆంధ్ర ప్రాంత ప్రజలను నట్టేట ముంచి, అపార అనుభవంతో తమను ఉద్ధరిస్తాడనుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను నానా అగచాట్ల పాలుచేసే విధంగా అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి మకాం ఎత్తెయ్యడానికి సరయిన కారణం ఇప్పటి వరకూ ఆయన చెప్పలేక పోయారు. పోనీ ఈ మూడేళ్ళలో గొప్ప రాజధాని నిర్మాణానికి ఏమయినా పని జరిగిందా అంటే అదీ లేదు. కట్టిన తాత్కాలిక భవనాలు కూడా ఒక్క గాలి వానకు గందరగోళం అయ్యే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలంగాణాలో ఒక్క శాసనమండలి స్థానాన్ని గెలుచుకోవాలన్న కక్కుర్తితో ఒక నామినేటెడ్ ఎంఎల్ఏని 5 కోట్ల రూపాయలకు కొనడానికి ప్రయత్నించి అందులో భాగంగా 50 లక్షలు అడ్వాన్స్ ఇవ్వబోయి దొరికిపోయిన కేసుకు మూడేళ్ళు. ఈ మూడేళ్ళ కాలంలో అనేక సంఘటనలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలూ ముక్కున వేలేసుకుని చూస్తుండిపోయారు. ఒక్కసారి మూడేళ్ళ క్రిందటి రాజకీయ పరిణామాలను గుర్తు చేసుకుంటే ఆ తరువాత జరిగిన పరిణామాలన్నీ ముక్కున వేలేసుకునే విధంగానే ఉన్నాయి మరి. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ నామినేటెడ్ శాసన సభ్యుడు స్టీఫెన్సన్కు 50 లక్షల రూపాయలు లంచం ఇస్తూ అవినీతి నిరోధక శాఖకు అడ్డంగా దొరికి జైలుకు వెళ్ళిన సమయంలోనే బయటపడింది చంద్రబాబు అదే స్టీఫెన్సన్తో జరిపిన ఫోన్ సంభాషణ. ‘మనవాళ్ళు బ్రీఫ్ద్ మీ’ అన్న చంద్రబాబు మాటలు బాగా ప్రచారంలోకి వచ్చాయి ఈ మూడేళ్ళలో. వీడియో, ఆడియో సాక్ష్యాల ఆధారంగా అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబునాయుడు బయటికి తాను నిప్పు అని బుకాయిస్తూ వచ్చినా ఓటుకు కోట్లు కేసు నెత్తి మీద కత్తిలా వేలాడుతున్నదనే భయం వెంటాడుతూనే ఉంది. అవినీతి నిరోధక శాఖ పెట్టిన ఈ ఓటుకు కోట్లు కేసు వివిధ కోర్టుల్లో విచారణ జరగవలసి ఉన్న ఈ సమయంలో ఎందుకు తెలంగాణా ముఖ్య మంత్రి హటాత్తుగా ఈ కేసును సమీక్షించారు అన్న విషయంలో సోమవారం నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఓటుకు నోట్లు కేసులో ఇరుక్కున్నట్లే! తెలంగాణా ముఖ్యమంత్రి ఇప్పుడు ఓటుకు కోట్లు కేసు మీద సమీక్ష జరపడానికి సంబంధించి పలు వాదనలు వినిపిస్తున్నాయి. ఎంఎల్ఏ స్టీఫెన్సన్తో జరిపిన ఫోన్ సంభాషణలో గొంతు తనది కాదని ఈ నాటి వరకూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా చెప్పనప్పటికీ ఆ గొంతు ఆయనదా కాదా తేల్చుకునేందుకు జరిపించిన ఫోరెన్సిక్ పరీక్షా ఫలితం వచ్చి, ఆ గొంతు చంద్రబాబుదేనని నిర్ధా రణ జరిగింది కాబట్టి తదుపరి చర్యలను గురించి సమీక్ష జరిపారన్నది ఒక వాదన. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇదివరకే ప్రైవేటు ఫోరెన్సిక్ పరీక్ష జరిపించి అది చంద్రబాబు గొంతేనని తేల్చి న్యాయస్థానాల దృష్టికి తీసుకువెళ్ళిన విషయం తెలిసిందే. కాగా చంద్రబాబు ఈ కేసు నుండి రక్షించడం కోసం దాన్ని నీరు కార్చి ఆయనను విముక్తుడిని చెయ్యడం కోసం కేసీఆర్ మిత్ర ధర్మంలో భాగంగా ఈ సమీక్ష జరిపారన్నది రెండవ వాదన. విభజన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల బాగు కోసం ఇద్దరూ కలిసి చెయ్యాల్సిన పని ఒక్కటీ చెయ్యక పోయినా ఇతరేతర అవసరాల కోసం ఇద్దరు చంద్రుల మధ్య స్నేహ బంధం తిరిగి నెలకొన్నదని ప్రచారం. ఈ ప్రచారానికి బలం చేకూర్చే విధంగానే ఉన్నాయి ఈ మూడేళ్ళలో జరిగిన పరిణామాలు. తెలంగాణా ముఖ్యమంత్రి తన వ్యవసాయ క్షేత్రంలో మహా చండీ యాగం తలపెడితే Sఏపీ ముఖ్యమంత్రి దానికి హాజరు అవుతారు. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని నిర్మాణం పేరిట ఏర్పాటు చేసిన శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణా ముఖ్యమంత్రి వెళతారు. ఇవన్నీ మామూలు పరిస్థితుల్లో జరిగితే ఎవరూ అభ్యంతర పెట్టాల్సిన పనిలేదు. ఇరుగు పొరుగు రాష్ట్రాల, అందునా కొత్తగా విడిపోయిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సఖ్యంగా ఉండకూడదని ఎవరయినా ఎందుకు అనుకుంటారు? అయితే ‘‘చంద్రబాబూ నిన్ను బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు, ఓటుకు కోట్లు కేసులో నువ్వు జైలుకు పోవ డం ఖాయం అని కేసీఆర్.. నాకూ ఏసీబీ ఉంది, నాకూ పోలీసులు ఉన్నారు నీ అంతు చూస్తా అని చంద్రబాబు ఒకరి మీద ఒకరు విరుచుకుపడ్డ కొద్ది రోజులకే ఇవన్నీ జరగడం విడ్డూరం. అంతేకాదు హటాత్తుగా ఓటుకు కోట్లు కేసు మరుగునపడిపోవడం, ఎవరయినా గుర్తు చేస్తే చట్టం తన పని తానూ చేస్తుంది అన్న రొటీన్ డైలాగ్ వినిపించడం అనేక అనుమానాలకు తావు ఇచ్చాయి. తెలంగాణాలో టీడీపీని ఖాళీ చేసినా చంద్రబాబు నోరు మెదపకపోవడం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే జాతీయ పార్టీగా చెప్పుకునే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం కూడా ఆ అనుమానాలకు తోడయ్యాయి. అక్కడి నుండి ‘‘బాబు నాకు మంచి మిత్రుడు ఆయనతో నేను మాట్లాడుతాను’’ అని చంద్రశేఖర్రావు ఇటీవల తాను సారథ్యం వహిస్తానని చెపుతున్న కొత్త రాజకీయ కూటమిలోకి బాబును తీసుకొస్తానని చెప్పడం కూడా ఇద్దరు చంద్రుల మధ్య మైత్రి కొనసాగుతున్న సంకేతాలనే పంపుతున్నది. ఈ మైత్రికి మరో కారణం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న ఉద్యమం ఒత్తిడి కారణంగా బీజేపీని వీడి కాంగ్రెస్ పంచన చేరాలని చూస్తున్న చంద్రబాబు తెలంగాణాలో కూడా ఆ పని చేస్తే వచ్చే ఎన్నికల్లో తమకు అదనంగా జరగబోయే నష్ట నివారణ కోసం కూడా కేసీఆర్ ఈ ఓటుకు కోట్లు కేసు ఫైల్ దుమ్ము దులిపారని కూడా చర్చ జరుగు తోంది. తెలుగుదేశం శాసన సభ్యులందరూ తన పంచన చేరినా తెలంగాణాలో ఆ పార్టీ రేపు 2019 ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిస్తే తనకు నష్టం తప్పదన్న విషయం కేసీఆర్కు బాగా తెలుసు. ఇప్పటికే టీఆర్ఎస్కు రానున్న ఎన్నికలు గడ్డు కాలమే అని సొంత నివేదికలే చెపుతున్న కారణాన టీడీపీని కట్టడి చెయ్యడానికి కేసీఆర్ వచ్చే ఏడాది పాటు ఈ కేసును వార్తల్లో సజీవంగా ఉంచుతారని అర్థం అవుతున్నది. ఓటుకు కోట్లు కేసు సమీక్ష మతలబు! హటాత్తుగా సోమవారం నాడు కేసీఆర్ ఓటుకు కోట్లు కేసును సమీక్షించడం గురించి మరో చర్చ కూడా జరుగుతున్నది. ఈ కేసును సిబీఐకి అప్పగించాలన్న పిటిషన్ సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది. ఒక వేళ అత్యున్నత న్యాయస్థానం ఆ మేరకు ఆదేశాలు జారీ చేస్తే ఇక ఇద్దరు చంద్రుల చేతుల్లో చెయ్యడానికి ఏమీ ఉండదు కాబట్టి ఈ కేసును రాష్ట్ర స్థాయిలో మేమే డీల్ చెయ్యగలమని నివేదించే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉండొచ్చు. అసలే బీజేపీతో తెగతెంపులు చేసుకున్నప్పటి నుంచి వరుసగా ఏపీలో జరిగిన అవి నీతి మీద సీబీఐ విచారణ కావాలని అక్కడి బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్న సమయంలో ఇప్పుడు కేసీఆర్ ఓటుకు కోట్లు కేసు దస్త్రాలను మళ్ళీ ఒకసారి దులిపి బయటకు తీసి చంద్రబాబుకు రాత్రుళ్ళు నిద్ర పూర్తిగా కరువు అయ్యేట్టు చేశారు. తమ సహాయంతో ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చి, కేంద్రంలో దాదాపు నాలుగేళ్ళు అధికారం అనుభవించి ఇప్పుడు బీజేపీని ఓడించండంటూ కర్ణాటక ఎన్నికల్లో బహిరంగంగా ప్రచారం చేయిస్తున్న, బావమరిదితో ప్రధానమంత్రిని అసభ్యంగా తిట్టించిన చంద్రబాబునాయుడు ఓటుకు కోట్లు కేసు సీబీఐ చేతుల్లోకి పోతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇంకా ఏం కావాలి? కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్టు బీజేపీ వారి కోరిక కేసీఆర్ లేదా సుప్రీం కోర్టు తీర్చవచ్చునేమో. పలు కేసులలో స్టేలు తెచ్చుకుని కాలం గడుపుతూ కూడా నా మీద ఒక్క కేసూ లేదు, నేను నిప్పును అని చెప్పుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఓటుకు కోట్లు కేసు వల్ల రానున్న రోజుల్లో నిద్రలేని రాత్రులే శరణ్యం. దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
‘ఓటుకు కోట్లు’ కేసులో చంద్రబాబే ఏ–1
-
రేవంత్ను నేను జైలుకు పంపిస్తే..
సాక్షి, వరంగల్ అర్బన్ : కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని తాను జైలుకు పంపిస్తే టీడీపీలో ఉన్నప్పుడు ఎందుకు ఫిర్యాదు చేయలేదని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశ్నించారు. వరంగల్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తన ఇంటికి ఆ సమయంలో రేవంత్ ఎందుకు వచ్చారని అడిగారు. టీడీపీ నుంచి తాను పార్టీ మారలేదని, టీడీపీని టీఆర్ఎస్లో విలీనం చేశానని చెప్పుకొచ్చారు. తనపై ఆరోపణలు చేయడానికి రేవంత్ అనే బ్రోకర్ను, బఫూన్ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సినిమాల్లో మాదిరిగా ఒక ఐటెం సాంగ్ వేస్తున్నట్లు కాంగ్రెస్ సభల్లో రేవంత్ స్వీచ్లు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు విచక్షణ మరచి స్పీకర్పై, తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర రాష్ట్రాలలో అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసింది ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్టం ఏర్పడిందని వ్యాఖ్యానించారు. కండ్లు తెరిచి చూస్తే పాలకుర్తిలో అభివృద్ధి కాంగ్రెస్ నేతలకు కనిపిస్తుందని అన్నారు. -
ఓటుహక్కును వదులుకున్న చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసు, అనంతర పరిణాలతో ఉమ్మడి రాజధాని(హైదరాబాద్)పై హక్కులను కాదనుకుని వెళ్లిపోయిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా ఓటు హక్కును కూడా వదులుకున్నారు. తెలంగాణలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లుగా ఉన్న నారావారు.. ఇప్పుడు ఏపీలోని మంగళగిరి నియోజకవర్గానికి బదిలీ అయ్యారు. చంద్రబాబుతోపాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణిలు కూడా తమ ఓట్లను బదిలీచేయించుకున్నారు. కృష్ణా నది ఉండవల్లి కరకట్ట వద్ద తాత్కాలిక అధికారిక నివాసం(హౌస్ నంబర్ 3-781/1)లో ముఖ్యమంత్రి నివసిస్తున్నారు. అది తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తుండటంతో ఆమేరకు దరఖాస్తు చేసుకోగా, అధికారులు దర్యాప్తుచేసి, ధృవీకరించారు. 2014 ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బాబు ఓటు హక్కును వినియోగించుకోకపోవడం తెలిసిందే. ఓటరు జాబితాలో బాబు కుటుంబం పేలుతున్న జోకులు : కాగా, కొత్త ఓటరు జాబితాకు సంబంధిత ఫొటోలు వైరల్ కావడంతో సీఎం చంద్రబాబు, మరీ ముఖ్యంగా మంత్రి నారా లోకేశ్లపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ‘ఓటుహక్కు లేనోళ్లు కూడా ఇక్కడి సమస్యలపై మాట్లాడతారా?’ అన్న లోకేశ్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. ‘‘శభాష్ లోకేశ్.. ఇప్పటికైనా రాష్ట్ర సమస్యలపై మాట్లాడే హక్కును సాధించావ్..’ అని జోకులు వినిపిస్తున్నాయి. ఓటుకు కోట్లు కేసుకు భయపడి విభజన హక్కును కేంద్రానికి తాకట్టుపెట్టారనే విమర్శలు ఎదుర్కొంటున్న చంద్రబాబును ఉద్దేశించి.. ‘తెలంగాణలో ఉన్న చివరి హక్కునూ వదులుకురు..’ అనే అర్థంలో కామెంట్లు పేలాయి. -
టీడీపీ కష్టాల్లో ఉంది.. ఓటుకు కోట్లు వల్లే ఈ దుస్థితి
-
‘ఉరితాడు వేసుకుని చంద్రబాబుకు సహకరించా’
సాక్షి, హైదరాబాద్ : సమున్నత ఆశయాలతో నాడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు భ్రష్టుపట్టిపోయిందని టీటీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ప్రస్తుతం టీడీపీ పీకల్లోతు కష్టాల్లో ఉందని, నాయకత్వలోపంతో కొట్టుమిట్టాడుతున్నదని, ఓటుకు కోట్లు కేసు వల్లే ఈ దుస్థితి దాపురించిందని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడిన ఆయన.. గత ఎన్నికల్లో గణనీయమైన సీట్లు సాధించినా, తర్వాతి కాలంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా పార్టీని వీడినా అడిగే దిక్కులేకుండాపోయిందని, పరిస్థితి మారాలంటే చంద్రబాబు నాయుడే స్వయంగా తెలంగానలో తిరగాలని సూచించారు. ఉరితాడు వేసుకుని బాబుకు సహకరించా : తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడిచిన సమయంలో టీడీపీ రెండు నాల్కల విధానంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా, నాయకులు సైతం తిట్టిపోసినా పట్టించుకోకుండా చంద్రబాబు వెంటే నడిచానని మోత్కుపల్లి చెప్పారు. ‘‘ఉద్యమానికి మద్దతు ఇవ్వనికారణంగా నన్ను చంపడానికి కొందరు నన్ను చంపాలనుకున్నారు. మా ఇంటిని రెక్కీ కూడా చేశారు. అయినాసరే నేను భయపడలేదు. నా జీవితాన్ని బలిచేసి, ఉరితాడు వేసుకుని మరీ చంద్రబాబుకు అండగానిలబడ్డాను. కానీ.. నా త్యాగాలకు విలువలేకుండా పోయిందిప్పుడు. అసమర్థులు, ద్రోహుల చేతికి చంద్రబాబు పార్టీని అప్పగించారు. ఆ నీతిమాలిన, బజారు మనుషుల పక్కనే నేనూ కూర్చోవాల్సి వచ్చింది. అయినాసరే, చంద్రబాబు నాయకత్వాన్నే సమర్థించాను. కానీ ఆయనేం చేశారు? నన్ను పిలవకుండా హైదరాబాద్లో మీటింగ్ పెట్టారు. ఇది నన్ను దారుణంగా బాధించింది.. ఓటుకు కోట్లు కేసే కారణం : గడ్డు పరిస్థితుల్లోనూ టీడీపీ గత ఎన్నికల్లో 24 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. అయితే, ఓటుకు కోట్లు కేసు తర్వాత అంతా తలకిందులైంది. డబ్బు సంచులతో పట్టుపడ్డ రేవంత్ రెడ్డిని ఆనాడే పార్టీ నుంచి బహిష్కరించేదుంటే పార్టీ బతికుండేది. అలా జరగకపోవడం వల్ల ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక్కొక్కరుగా పార్టీ నుంచి జారుకున్నారు. పార్టీనే నమ్ముకుని ఉన్న కార్యకర్తలకు దిక్కులేకుండా పోయింది. స్వయంగా చంద్రబాబు తిరిగితేగానీ తెలంగాణలో మేం బాగుపడం’’ అని మోత్కుపల్లి అన్నారు. టీఆర్ఎస్తోనే టీడీపీ : ‘తెలంగాణలో పార్టీ బతకాలంటే పొత్తులు తప్పనిసరి. ఏ పార్టీతో అన్నది సమయం వచ్చినప్పుడు నిర్ణయిస్తాం’అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై మోత్కుపల్లి స్పందించారు. కాంగ్రెస్, బీజేపీలతో ఎట్టిపరిస్థితుల్లోనూ కలవబోము కాబట్టి టీఆర్ఎస్తోనే టీడీపీ పొత్తు పెట్టుకుంటుందని, చాలా కాలం నుంచే తానీ ప్రతిపాదన చేస్తున్నానని ఆయన గుర్తుచేశారు. -
‘ఓటుకు కోట్లు’ కేసులో వాస్తవాలన్నీ చెబుతా
-
‘ఓటుకు కోట్లు’ కేసులో వాస్తవాలన్నీ చెబుతా
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో వాస్తవాలన్నీ చెబుతానని, ఈ కేసులో తన వాదనలు తానే వినిపించుకుంటానని, ఇందుకు అనుమతినివ్వాలని కోరుతూ జెరుసలేం మత్తయ్య శుక్రవారం సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ ఇన్ పర్సన్ (న్యాయవాదితో సంబంధం లేకుండా)గా ఈ కేసులో హాజరయ్యేందుకు అనుమతి మంజూరు చేయాలని ఆయన తన పిటిషన్లో సుప్రీంకోర్టును కోరారు. ఆ తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాను ఈ పిటిషన్ దాఖలు చేయడానికి దారి తీసిన పరిస్థితులను వివరించారు. వారిద్దరి ప్రతీకారాలకు వాడుకున్నారు... ‘‘నాతో మాట్లాడిన ఏపీ టీడీపీ ప్రభుత్వం, తెలం గాణ పోలీసులు గానీ ఈ కేసు గురించి సమాచారం ఇవ్వలేదు. మీడియాలో తెలుసుకుని ఒకవేళ వాయి దాకు రాకపోతే నాకు అరెస్టు వారెంటు జారీ అవు తుందేమోనని వచ్చా. హైకోర్టులో కేసు ఉన్నప్పుడు గంట గంటకు, రోజు రోజుకు వచ్చి అప్డేట్స్ అన్నీ ఇచ్చి హైకోర్టులో నా కేసు క్వాష్ అయ్యేవరకు నా వెంబడి ఉన్నవాళ్లు ఈరోజు సుప్రీంకోర్టుకు వస్తే నా వాయిదా డేట్ గురించి కూడా చెప్పడం లేదు. వారెంట్ జారీ అయితే నేను, నా కుటుంబ సభ్యులు జైలు పాలు కావడానికి ఏమైనా కుట్ర జరుగుతుందా అని ఆందోళనగా ఉంది. చంద్రబాబు, కేసీఆర్ ఏకమై చేస్తున్నారా అని భయంగా కూడా ఉంది. పార్టీ ఇన్ పర్సన్గా నేను హాజరై జరిగిన వాస్తవాలన్నీ చెబుతానని, నాకు జరిగిన నష్టాన్ని చెబుతానని, వారిద్దరూ నన్ను ఏ రకంగా వారి ప్రతీకారాలకు వాడుకున్నదీ, ఇద్దరు ఒకరిపై ఒకరు కేసులు పెట్టించుకుని నన్ను ఎలా వేదనకు గురిచేస్తున్నారో చెబుతానని ప్రధాన న్యాయమూర్తికి తెలియచేశాను. ఈ కేసులో నా నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకుంటానని, నాకు, నా కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని వేడుకున్నా..’’అని చెప్పారు. ఏపీ పోలీసులు నన్ను సైలెంట్గా ఉండమన్నారు.. ‘‘ఓటుకు కోట్లు కేసులో రేవంత్ డబ్బులతో పట్టుబడ్డ నాటి నుంచి మొన్నటివరకు.. అంటే గత 2017 జూన్, జూలై వరకు వాళ్ల లాయర్లు నాతో మాట్లాడారు. ఆరు నెలలుగా ఏ సమాచారం ఇవ్వడం లేదు. 23వ తేదీన వాయిదా ఉందని తెలుసుకుని వచ్చా. వాయిదాకు రాకపోతే ఒక ముద్దాయికి శిక్ష పడుతుందని, వారెంట్ జారీ అవుతుందని వచ్చాను. అప్పుడు కేసులో పట్టుబడ్డవాళ్లు ఒక వర్గం వాళ్లు. ఒక వర్గం వాళ్లు పెట్టిన సాక్ష్యం చెల్లదు కాబట్టి.. తటస్థంగా ఉన్న ఒకరి సాక్ష్యం తీసుకోవాలని చెప్పి నా పేరు పెట్టారని తెలంగాణ ఏసీబీ డీఎస్పీ అశోక్కుమార్ చెప్పారు. నన్ను సాక్షిగా తీసుకుని వాళ్లను ఇరికించాలని కుట్రపన్నారు. దానికి నేను ఒప్పుకోలేదు. నాకు సంబంధం లేదని హైకోర్టు జడ్జి క్లీన్ చిట్ ఇచ్చారు. వాళ్లు పన్నిన పన్నాగానికి నేను లొంగలేదని కేటీఆర్ డ్రైవర్, గన్మెన్ ఫోన్ నుంచి నాకు ఫోన్ చేసి నన్ను బెదిరించారు. క్లాక్టవర్ దగ్గరికి రా.. వచ్చి మాట్లాడు అని ఫోన్ చేశారు. కేసున్నప్పుడు ముగ్గురు దొరికారు. వాళ్లపై కేసు ప్రూవ్ కావాలంటే తటస్థంగా ఉన్నవాడిగా నన్ను పెట్టాలని చూశారు. ఆ సీన్లో నేను లేను. డబ్బులు ఇచ్చినప్పుడు నేను లేను. నేను లొంగకపోవడంతో నన్ను తిట్టారు. నేను విజయవాడకు పోయాక నాకు ఫోన్ వచ్చింది. ఈ ఫోన్పై విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్లు కాల్డేటా తీశారు. ఆ ఫోన్ కాల్స్ కేటీఆర్ గన్మెన్, డ్రైవర్ ఫోన్ల నుంచి వచ్చాయని తేలింది. దీంతో ఏపీ పోలీసులు వాళ్లకు నోటీసులు ఇచ్చి తెలంగాణ క్యాంప్ ఆఫీస్కు వెళ్లారు. ఆ ఆధారాల కోసం వాళ్లు కేసు పెట్టించుకున్నారు. వీళ్ల కోసం వీళ్లు కేసు పెట్టించుకున్నారు. హైకోర్టు వరకు బాగానే ఉన్నారు. నన్ను వేధించారు కదా వాళ్లపై కేసు పెట్టరా అని ఏపీ పోలీసులను అడిగాను. వాళ్లు నన్ను సైలెంట్గా ఉండమన్నారు. నా క్రైస్తవ సమస్యల మీద నేనేదో పోరాటం చేసుకుంటుంటే సుప్రీంకోర్టుకు వచ్చారు. అప్పీలుకు వచ్చినప్పుడు హైకోర్టు వరకు ఫాలో అప్ చేస్తున్నవాళ్లు ఇప్పుడు నాకు సమాధానం చెప్పడం లేదు. ఇంతకుముందు ఇంటెలిజెన్స్ వాళ్లు కూడా సమాచారం ఇచ్చేవాళ్లు. ఇప్పుడు ఇవ్వడం లేదు. అందుకే నేను భయపడి ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాను. వ్యక్తిగతంగా హాజరై వాదనలు వినిపిస్తానని వేడుకున్నా’’ అని ఆయన వివరించారు. సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని కోరా... అనంతరం ‘సాక్షి’తో మాట్లాడుతూ... రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగుదేశం, టీఆర్ఎస్ పార్టీలు కలిసిపోయాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ఓటుకు కోట్లు కేసు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కూడా ప్రధాన న్యాయమూర్తిని కోరానని తెలిపారు. సీబీఐ దర్యాప్తు ద్వారానే వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయని వివరించారు. ఈ కేసులో తనకు సమాచారం ఇచ్చే వారెవ్వరూ లేకపోవడంతో వాస్తవాలను తెలుసుకునేందుకు తానే స్వయంగా అప్పు చేసి మరీ ఢిల్లీకి వచ్చానని చెప్పారు. ఇదీ కేసు... 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేస్తే లంచంగా రూ.ఐదు కోట్లు ఇవ్వడానికి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి తదితరులు ప్రయత్నిస్తున్నారంటూ నామినే టెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇందులో రేవంత్రెడ్డి, అనుసంధానకర్త జెరుసలేం మత్త య్య, సెబాస్టియన్ తదితరులను నిందితు లుగా పేర్కొన్నారు. ఏసీబీ అధికారులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ మత్తయ్య 2015 జూన్ 17న హైకోర్టులో పిటి షన్ దాఖలు చేయగా.. మత్తయ్య అరెస్ట్పై స్టే విధించింది. ఆ తరువాత తుది విచారణ జరిపి ఓటుకు కోట్లు కేసులో మత్తయ్యపై ఏసీబీ అధి కారులు నమోదు చేసిన కేసును కొట్టేస్తూ హైకో ర్టు 2016 జూన్ 3న తీర్పునిచ్చింది. దీన్ని సవాలు చేస్తూ తెలంగాణ ఏసీబీ అధికారులు 2016లో సుప్రీంకోర్టు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు వెబ్సైట్ ప్రకా రం పిటిషన్ ఏప్రిల్ 8న విచారణకు రానున్నది. -
ప్రభుత్వాలతో నేను గొడవలు పడను
-
ఓటుకు నోటు.. అస్సలు తప్పించుకోలేరు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ మంత్రి కేటీఆర్పై రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి చెబుతున్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన రేవంత్రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు, రేవంత్రెడ్డి తప్పించుకోలేరని ఆయన చెప్పారు. చంద్రబాబు తప్పు చేసినట్లు ప్రపంచం మొత్తానికి తెలుసన్నారు. రేవంత్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేయటం ఒక డ్రామాగా ఆయన అభివర్ణించారు. తెలంగాణ అసెంబ్లీకి చెందిన లేఖను ఆంధ్రప్రదేశ్ సీఎంకు ఇస్తే ఏం లాభమని ఆయన ప్రశ్నించారు. రేవంత్కు దమ్ముంటే రాజీనామా లేఖను తెలంగాణ స్పీకర్కు సమర్పించాలని డిమాండ్ చేశారు. కొడంగల్లో ఎప్పుడు ఉప ఎన్నిక జరిగినా టీఆర్ఎస్ గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, కేటీఆర్పై రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. -
‘ఓటుకు కోట్లు’ బాధ్యుడు ఆయనే!!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై అదే పార్టీ పొలిట్బ్యూరో సభ్యులు మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్రెడ్డి పార్టీలోకి అడుగుపెట్టిన నాటి నుంచే టీడీపీ దెబ్బతింటూ వచ్చిందని, సంచలనాత్మక ‘ఓటుకు కోట్లు’ కేసు బాధ్యుడు కూడా రేవంత్ రెడ్డేనని నర్సింహులు ఆరోపించారు. టీటీడీపీ ముఖ్యనేతల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఓటుకు కోట్లు’ బాధ్యుడు అతనే : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఓటుకు కోట్లు’ కేసులో బాధ్యుడు ‘ఎవరో’ కాదని, రేవంత్రెడ్డేనని మోత్కుపల్లి చెప్పారు. ‘‘రేవంత్ అడుగుపెట్టిన నాటి నుంచి టీడీపీ బలహీన పడింది. ఎకాఎకి ముఖ్యమంత్రి కావాలనేది ఆయన ఆలోచన. ఆ దూకుడు భరించలేకే ఎర్రబెల్లి దయాకర్రావు లాంటి సీనియర్లు పార్టీ నుంచి వెళ్లిపోయారు. తన సొంత లబ్ధికోసం పార్టీని భ్రష్టుపట్టించేవాళ్లను చూస్తూ ఊరుకోబోం’’ అని నర్సింహులు వ్యాఖ్యానించారు. యనమల, పరిటాలను తిట్టే హక్కు ఎవడిచ్చాడు? : ఏపీ మంత్రులు యనమల రామకృష్ణుడు, పరిటాల సునీతలకు తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులతో ఆర్థిక సంబంధాలున్నాయంటూ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మోత్కుపల్లి ఫైరయ్యారు. ‘యనమల, పరిటాలను తిట్టే హక్కు రేవంత్కు ఎవరిచ్చారు?’ అని ప్రశ్నించారు. యనమల దగ్గరి బంధువుకు రూ.2వేల కోట్ల కాంట్రాక్టు. పరిటాల సునీతకు బీర్ ఫ్యాక్టరీ ఏర్పాటులో సీఎం కేసీఆర్ సహకరించారని రేవంత్ ఆరోపించిన సంగతి తెలిసిందే. చంద్రబాబును అడిగే రాహుల్ని కలిశాడా? : ఇటీవల ఢిల్లీ వెళ్లిన రేవంత్రెడ్డి.. అక్కడ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారన్న వార్తలపై మోత్కుపల్లి స్పందిస్తూ.. ‘మేం ఏది అడిగినా చంద్రబాబుతోనే మాట్లాడుతానని రేవంత్రెడ్డి సమాధానం చెప్పిండు. ఏం, చంద్రబాబును అడిగే ఆయన రాహుల్ గాంధీని కలిసిండా? ఢిల్లీలో ఎవరెవరితోనో మాట్లాడి, ఇక్కడికొచ్చి మా పార్టీకే చెందిన ఏపీ మంత్రులపై విమర్శలు చేస్తడా? అందుకే, సమాధానం చెప్పమని గట్టిగా అడిగాం’’ అని మోత్కుపల్లి వివరించారు. టీఆర్ఎస్తో పొత్తు ఆలోచన ఎవరిది? : టీడీపీలో ప్రస్తుత సంక్షోభానికి అసలు కారణమైన ‘టీఆర్ఎస్తో పొత్తు’ పైనా మోత్కుపల్లి స్పందించారు. ‘‘అసలు టీఆర్ఎస్తో టీడీపీ పొత్తు పెత్తుకుంటుందని నేనేదో అన్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ మొదట పొత్తు మాటెత్తింది నేను కాదు రేవంతే. ఎట్టిపరిస్థితుల్లోనూ టీడీపీ- బీజేపీ అలయెన్స్ ఉంటుంది కాబట్టి ఒకవేళ కలిస్తే గిలిస్తే, టీఆర్ఎస్తో కలిసే అవకాశం ఉంటుందన్నాను. రేవంత్ తన లబ్ధికోసం ప్రార్టీని భ్రష్టుపట్టిస్తున్నాడు’’ అని నర్సింహులు అన్నారు. -
‘ఓటుకు కోట్లు’ బాధ్యుడు ఆయనే!!
-
చంద్రబాబు అందుకే నోరెత్తలేదా?
రాజమహేంద్రవరం: సీఎం చంద్రబాబు ప్రతి చిన్న విషయానికి ముసుగు కప్పే ప్రయత్నం చేస్తున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ ఆరోపించారు. అసెంబ్లీలోకి వర్షపునీరు లీకేజీ వ్యవహారాన్ని కవర్ చేసేందుకు మీడియాను అనుమతించకపోవడం దారుణమని అన్నారు. చంద్రబాబు సీనియర్ అని చెప్పుకుంటున్నారని, టీడీపీలో ఆయన కంటే బుచ్చయ్య చౌదరి సీనియర్ అని గుర్తు చేశారు. చంద్రబాబులో ఏర్పడే ఆత్మన్యునతాభావం రాష్ట్రానికి ప్రమాదమన్నారు. రాహుల్ గాంధీ గుంటూరు వస్తే టీడీపీ నాయకులతో నిరసన వ్యక్తం చేయించడాన్ని ఉండల్లి తప్పుబట్టారు. విభజన జరిగినప్పుడు టీడీపీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, రమేశ్ రాథోడ్ పార్లమెంట్లోనే ఉన్నారని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో నోరెత్తని చంద్రబాబు రాహుల్ ఏపీకి వచ్చినప్పుడు నిరసన వ్యక్తం చేయడాన్ని ఏమనాలని ప్రశ్నించారు. రూ. 4 వేల కోట్లు విద్యుత్ బకాయిలు తెలంగాణ నుంచి రావాల్సివున్నా ఇప్పటివరకు నోరెత్తకపోవడానికి కారణం ఓటు కోట్లు కేసేనా అని నిలదీశారు. -
కేసులు నన్నేమీ చేయలేవు
‘ఓటుకు కోట్లు’ కేసును అసెంబ్లీలో పరోక్షంగా ప్రస్తావించిన సీఎం సాక్షి, అమరావతి: ‘‘ప్రతిపక్ష సభ్యులు శాసనసభలో ఒకే అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఇదే అంశంపై హైకోర్టుకు వెళ్లారు.. సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆ చట్టం(అవినీతి నిరోధక చట్టం) దానికి(ఓటుకు కోట్లు కేసు) వర్తించదని హైకోర్టు చెప్పింది. మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లారు. అది కేసే కాదు.. కేసులు నన్నేమీ చేయలేవు’’ అని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. ప్రపంచ జలదినోత్సవం సందర్భంగా సీఎం శాసనసభలో బుధవారం సాగునీటి ప్రాజెక్టులపై ప్రకటన చేశారు. అందులో అన్నీ అసత్యాలేనంటూ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. అయితే ప్రతిపక్ష నేతకు మాట్లాడేందుకు స్పీకర్ కోడెల అవకాశమివ్వకపోవడంతో వైఎస్సార్సీపీ సభ్యులు పోడియం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. స్పీకర్ మాట్లాడేందుకు అవకాశమివ్వకపోవడంతో ప్రధాన ప్రతిపక్షం సీఎం చంద్రబాబు ప్రకటనను నిరసిస్తూ సభకు ఓ నమస్కారం అంటూ వెలుపలకు వచ్చింది. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ సభలో లేని ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డిపై వ్యక్తిగత విమర్శలకు పాల్పడ్డారు. సీఎం చేతికి మార్పులతో కూడిన రాజధాని డిజైన్స్ ఏపీ రాజధాని నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక డిజైన్స్లో మార్పులతో కూడిన బృహత్తర ప్రణాళికను నార్మర్ ఫోస్టర్ ప్రతినిధులు బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందచేశారు. వెలగపూడి సచివాలయంలో కలిసిన ఈ ప్రతినిధులు డిజైన్ వివరాలను సీఎంకు వివరించారు. గత నెలలో చూపించిన నాలుగు రకాల డిజైన్స్లో రెండింటి డిజైన్స్ మార్పు చేయాలని చంద్రబాబు సూచించగా.. ఆ మేరకు మార్పులు చేసిన డిజైన్స్ను నార్మర్ ఫోస్టర్ ప్రతినిధులు బుధవారం సీఎంకు చూపించారు. ఇందులో 51 శాతం ఆకుపచ్చని ప్రదేశం, 10 శాతం జలభాగం, 14 శాతం రహదారులు, 25 శాతం భవంతుల కట్టడాలకు ఉపయోగించే విధంగా రూపొందించారు. -
టీడీపీ ఎమ్మెల్యే సండ్రకు ఏసీబీ కోర్టు నోటీసులు
-
టీడీపీ ఎమ్మెల్యే సండ్రకు ఏసీబీ కోర్టు నోటీసులు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు ఏసీబీ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 31న విచారణకు హాజరుకావాలని ఎమ్మెల్యే సండ్రను కోర్టు ఆదేశించింది. తెలంగాణలో 2015లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో భాగంగా కోట్ల రూపాయలతో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టిన ఓటుకు కోట్లు కేసులో అరెస్టయిన సండ్ర అనంతరం బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే. ఓటుకు కోట్లు కేసుకు సంబంధించి ఈ టీడీపీ ఎమ్మెల్యే ప్రమేయం ఉన్నట్లు ఏసీబీ వద్ద కీలక ఆధారాలున్నాయి. 13 మంది సాక్షుల వాంగ్మూలాలను ఏసీబీ సేకరించింది. (బాబు బండారం బట్టబయలు) ఈ కేసులో ఏ-1 నిందితుడు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, ఏ-2 నిందితుడు సెబాస్టియన్లతో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఫోన్ సంభాషణలు జరిపిన ఫోన్ రికార్డు ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్)లను ఏసీబీ కోర్టుకు అధికారులు అందజేశారు. 32 సార్లు సెబాస్టియన్తో, 18 సార్లు రేవంత్తో సండ్ర సంభాషించినట్లు ఆ ఫోన్ రికార్డులలో ఉంది. ఏసీబీ అధికారులు ఇటీవల ఈ కేసులో దాఖలుచేసిన అనుబంధ చార్జిషీట్ లో పలు విషయాలు వెలుగుచూశాయి. 2015 మే 29, 30, 31 తేదీల్లో సెబాస్టియన్ –స్టీఫెన్సన్ సంభాషణలపై పదేపదే చార్జిషీట్లో వివరాలను స్పష్టం చేసింది. మొత్తం 15 కాల్స్ ఈ మూడు రోజుల్లో ఉన్నాయని, ఇందులోనే స్టీఫెన్సన్తో చంద్రబాబు మాట్లాడినట్టు సంభాషణల్లో రికార్డయ్యిందని తెలిపింది. -
నాలాంటి అమాయకులను బలిచేయొద్దు: రాజయ్య
వరంగల్: కుట్రపూరిత రాజకీయాలకు కేరాఫ్ చంద్రబాబు నాయుడు అని మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య విమర్శించారు. ఇరు రాష్ట్రాల్లో సంచలంన సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు.. చేసిన తప్పును ఒప్పుకోవాలన్నారు. ఇలాంటి కేసుల్లో తనలాంటి వాళ్లను బలిచేయడం చంద్రబాబుకు సమంజసం కాదని తెలిపారు. అదే విధంగా ఓటుకు కోట్లు విషయంలో తనను ఏ టీడీపీ నేతలు కలవలేదని స్పష్టం చేశారు. చివరివరకు తెలంగాణ రాజన్నలాగే రాజకీయాల్లో కొనసాగుతానని రాజయ్య తెలిపారు. -
చంద్రబాబు బండారం బట్టబయలు
-
బాబు బండారం బట్టబయలు
మహానాడు నుంచే కుట్ర.. ఎమ్మెల్యేల కొనుగోలుకు అక్కడ్నుంచే స్కెచ్ 'ఓటుకు కోట్లు' కేసు అనుబంధ చార్జిషీట్లో సంచలనాత్మక అంశాలు - చంద్రబాబు నేతృత్వంలో కొనుగోలు కమిటీ సమావేశం - ముగ్గురు ఎమ్మెల్యేల కొనుగోలుకు ఆదేశించిన బాబు - ఆ పనిలోనే రేవంత్, సండ్ర, సెబాస్టియన్ బిజీబిజీ - క్యాంప్ కోసం నోవాటెల్లో తొమ్మిది గదులు బుక్ చేసిన ఎర్రబెల్లి - దయాకర్రావు రూంలు బుక్ చేసినట్లు హోటల్ ఫైనాన్స్ డైరెక్టర్ వాంగ్మూలం - మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యను ట్రాప్ చేసిన బాబు వర్గం - రేవంత్ పట్టుబడటానికి ముందురోజు స్టీఫెన్సన్ ఇంట్లో పోలీసుల తనిఖీలు - చంద్రబాబు ఆఫర్ నచ్చిందని సెబాస్టియన్కు చెప్పిన స్టీఫెన్సన్ - సంభాషణల్లో పదేపదే చంద్రబాబు పేరు ప్రస్తావనకు వచ్చిందన్న ఏసీబీ - నిందితుల్లో బాబును ఎందుకు చేర్చరని న్యాయ నిపుణుల ప్రశ్న సాక్షి, హైదరాబాద్ ఓటుకు కోట్లు కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రలో తన పాత్ర లేదని ఒకసారి, తన ఫోన్ ట్యాప్ చేశారని మరోసారి చెప్పుకుంటూ వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడి పాత్రను ఏసీబీ ఎత్తిచూపింది. ఏసీబీ అధికారులు ఇటీవల ఈ కేసులో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేశారు. ఇందులో ఎమ్మెల్యేలు రేవంత్రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య సాగించిన సంభాషణలు, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో సెబాస్టియన్ ఫోన్ ద్వారా చంద్రబాబు మాట్లాడిన సంభాషణ, డీల్ కోసం సెబాస్టియన్–స్టీఫెన్సన్ సాగించిన పూర్తి సంభాషణలను ఏసీబీ కోర్టుకు సమర్పించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 136 పేజీలతో దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్లో అడుగడుగునా చంద్రబాబు పాత్ర ఉన్నట్లు ఏసీబీ స్పష్టం చేసింది. మహానాడు కేంద్రంగా కుట్ర 2015 మే 28న మహానాడు కేంద్రంగా పలువురు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తమ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్రెడ్డిని గెలిపించుకునేందుకు చంద్రబాబు వర్గం స్కెచ్ వేసింది. దీనికి ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యతను అప్పగించింది. మహానాడుకు హాజరవుతూనే టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్, సండ్ర వెంకటవీరయ్యలు ఎమ్మెల్యే కొనుగోలు కోసం ప్రయత్నాలు సాగించారని, ఎప్పటికప్పుడు చంద్రబాబుకు అప్డేట్ ఇస్తున్నారని చార్జిషీట్లో పేర్కొన్న సంభాషణల్లో ఏసీబీ పేర్కొంది. ముగ్గురు ఎమ్మెల్యేలు టార్గెట్ 2015 మే 25న ఎమ్మెల్యేల కొనుగోలుకు చంద్రబాబు ఆదేశించారు. క్రిస్టియన్ ఎమ్మెల్యే కావడంతో స్టీఫెన్సన్ను ట్రాప్ చేసేందుకు టీడీపీ క్రిస్టియన్ సెల్ లీడర్ సెబాస్టియన్ను బాబు వర్గం రంగంలోకి దింపింది. ఇతడితో పాటు జెరూసలెం మత్తయ్య, జిమ్మీ, హెలెన్ బాబు గ్రూప్గా ఏర్పడ్డారు. వీరితో ఎమ్మెల్యేలు రేవంత్రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య టచ్లో ఉండాలని పార్టీ ఆదేశించింది. ఈ విషయాన్ని సంభాషణల్లో సండ్ర, రేవంత్, సెబాస్టియన్లు స్పష్టం చేసుకున్నారు. మే 26 నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారు. మాజీ డిప్యూటీ సీఎంను కూడా.. మహానాడుకు బయలుదేరే ముందు చంద్రబాబు ఇంట్లో సమావేశం ఉంటుందని, అందులో ఎమ్మెల్యేల కొనుగోలుపై చర్చిస్తారని సెబాస్టియన్–సండ్ర మధ్య సంభాషణ జరిగింది. ఇందులో మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్యను ట్రాప్ చేసినట్టు ఎమ్మెల్యే సండ్ర.. సెబాస్టియన్కు స్పష్టం చేశారు. ఇందుకు ప్రత్యేకంగా వరంగల్లోని తమ క్రిస్టియన్ సెల్ పని ప్రారంభించినట్టు సండ్ర సంభాషణలో బయటపడింది. ఇక మరో ఇద్దరిలో ఎమ్మెల్యే స్టీఫెన్సన్ అని, ఇంకొకరు తనకు తెలియదని తెలిపాడు. మే 28న సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్ మధ్య సాగిన సంభాషణలను ఏసీబీ తన చార్జిషీట్లో వివరించింది. ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో ఏ2గా ఉన్న సెబాస్టియన్ మాట్లాడాడు. ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే లాబీయింగ్లో 50 శాతం పని పూర్తయిందని సెబాస్టియన్.. సండ్రకు మెసేజ్ పంపించాడు. అవి ఒరిజినల్ సంభాషణలే.. ఎఫ్ఎస్ఎల్ ధ్రువీకరణ ఏసీబీకి కీలక ఆధారంగా మారిన సెబాస్టియన్ ఫోన్లో ప్రతీఫోన్ కాల్ సంభాషణలు రికార్డయ్యాయి. ఈ ఫోన్ ద్వారానే అటు రేవంత్, సండ్రకు.. ఇటు ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో సాగించిన సంభాషణలను ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్) ద్వారా ఏసీబీ నివేదికలు తెప్పించుకుంది. దీంతో ‘బ్రీఫ్డ్ మీ కథ..’బయటపడింది. సెబాస్టియన్ తన ఫోన్ ద్వారా ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ఫోన్ చేసి ‘బాబు గారు.. మాట్లాడతారు.. లైన్లో ఉండండి..’అని చెప్పిన ఆడియో అసలుదేనని, ట్యాపింగ్ వల్ల రికార్డయ్యింది కాదని, ఎక్కడా కూడా ఎడిటింగ్ లేదని నివేదిక తెలిపింది. అది సెబాస్టియన్ ఫోన్లోనే రికార్డయ్యిందని సమయంతో సహా ఎఫ్ఎస్ఎల్ చెప్పిందని ఏసీబీ తన చార్జిషీట్లో స్పష్టంగా పేర్కొంది. మే 29, 30, 31 తేదీల్లో సెబాస్టియన్ –స్టీఫెన్సన్ సంభాషణలపై పదేపదే చార్జిషీట్లో వివరాలను స్పష్టం చేసింది. మొత్తం 15 కాల్స్ ఈ మూడు రోజుల్లో ఉన్నాయని, ఇందులోనే స్టీఫెన్సన్తో చంద్రబాబు మాట్లాడినట్టు సంభాషణల్లో రికార్డయ్యిందని తెలిపింది. స్టీఫెన్సన్తో బాబు సంభాషణ సెబాస్టియన్, రేవంత్రెడ్డి ఇద్దరూ కలసి మే 30న చంద్రబాబుకు దగ్గరకు వెళ్లినట్టు సండ్ర–సెబాస్టియన్ ఫోన్ సంభాషణలో బయటపడింది. రేవంత్, సెబాస్టియన్ చంద్రబాబు పార్టీ ఆఫీస్లో ఉండగా ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో డీల్ కుదుర్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. సెబాస్టియన్ తన ఫోన్ నుంచి ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ఫోన్ చేశారు. ‘బాబు గారు మాట్లాడతారు..’అంటూ ఫోన్ ఇచ్చినట్టు సంభాషణల్లో స్పష్టమైంది. అదే రోజు స్టీఫెన్సన్ ఇంట్లో సోదాలు మే 30న చంద్రబాబు తనతో మాట్లాడిన రోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తన ఇంట్లో పోలీసులు సోదాలు చేసినట్టు సెబాస్టియన్కు స్టీఫెన్సన్ ఫోన్లో తెలిపారు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చామని, బీరువా, అల్మరాలు చెక్ చేసినట్లు తన భార్య ఫోన్లో చెప్పిందని సెబాస్టియన్కు స్టీఫెన్సన్ తెలిపారు. తనతోపాటు టీఆర్ఎస్లోని పలువురు ఎమ్మెల్యే ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారని సెబాస్టియన్కు వివరించారు. నోవాటెల్లో క్యాంపు.. ఎమ్మెల్సీ ఎన్నికలో గెలిచేందుకు కొనుగోలు చేయాల్సిన ఎమ్మెల్యేలతో క్యాంపు నడిపించేందుకు చంద్రబాబు వర్గం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసినట్టు ఏసీబీ తన చార్జిషీట్లో వివరించింది. రేవంత్రెడ్డి–సెబాస్టియన్ మధ్య సాగిన సంభాషణల్లో క్యాంపు ఏర్పాట్లు, నోవాటెల్ కేంద్రంగా సాగిన వ్యవహారాలు వెలుగులోకి వచ్చినట్టు ఏసీబీ స్పష్టం చేసింది. స్టీఫెన్సన్ను తీసుకొని నోవాటెల్ హోటల్కు రావాలని ఎమ్మెల్యే సండ్ర, రేవంత్... సెబాస్టియన్కు సూచించారు. అయితే స్టీఫెన్సన్ అక్కడకు వచ్చేందుకు ఇబ్బంది పడుతున్నారని, ఇంట్లోనే కలుద్దామంటున్నారని సెబాస్టియన్ వారికి తెలిపాడు. నోవాటెల్ బుక్ చేసిన ఎర్రబెల్లి కొనుగోలు చేస్తున్న ఎమ్మెల్యేల క్యాంపు కోసం పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు నోవాటెల్లో 9 గదులను బుక్ చేసినట్టు ఆ హోటల్ ఫైనాన్స్ డైరెక్టర్ ఏసీబీకి వాంగ్మూలం ఇచ్చారు. మే 30 నుంచి జూన్ 1వ తేదీ 2015 (మూడు రోజులు) 9 గదులు బుక్ చేసినట్టు నోవాటెల్ హోటల్స్ ఫైనాన్స్ డైరెక్టర్ ఏసీబీకి వాంగ్మూలం ఇచ్చారు. 109, 123, 131, 138, 140, 141, 225, 480, 646 నంబర్ రూములను బుక్ చేసినట్టు డైరెక్టర్ వెల్లడించారు. 22 సార్లు బాబు ప్రస్తావన అనుబంధ చార్జిషీట్లో ఏసీబీ 22 సార్లు చంద్రబాబు పేరును ప్రస్తావించింది. రేవంత్రెడ్డి, సెబాస్టియన్, సండ్ర, జెరూసలెం మత్తయ్య, ఎమ్మెల్యే స్టీఫెన్సన్లు తమ సంభాషణల్లో పదే పదే చంద్రబాబు, బాబు, సర్.. అంటూ 22 సార్లు ప్రస్తావించారు. దీంతో ఎమ్మెల్యేల కొనుగోళ్లలో చంద్రబాబు పాత్ర కీలకమన్నది స్పష్టంగా అర్థమవుతోంది. పైగా చంద్రబాబు తనకు హామీ ఇచ్చారని, ఆ మేరకు తాను నడుచుకుంటానని ఎమ్మెల్యే స్టీఫెన్సన్.. సెబాస్టియన్తో మాట్లాడినట్టు సంభాషణల్లో స్పష్టంగా బయటపడింది. ఫిర్యాదుదారుడే స్వయంగా తన వాంగ్మూలంలో... చంద్రబాబు తనతో మాట్లాడారని, తనకు రూ.2 కోట్లతో పాటు ఇబ్బంది వస్తే ఏపీలో నామినేటెడ్ ఎమ్మెల్యే పదవి ఇస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు. దీంతో చంద్రబాబు పాత్రపై స్పష్టమైన ఆధారాలు చిక్కినట్టే అని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. -
‘ఇదేదో చిన్న కేసేలే అని బాబు అనుకుంటున్నారు’
శ్రీకాకుళం: ఓటుకు కోట్లు కేసులో సుప్రీంకోర్టు జారీచేసిన నోటీసుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందన గౌరవంగా లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ఆక్షేపించారు. ప్రజాజీవితంలో ఉన్నవారిపై ఆరోపణలు రావడం సహజమే కానీ నిర్దోషిత్వం నిరూపించుకునే వరకూ పదవి నుంచి తప్పుకోవడం ప్రజాస్వామ్యంలో సంప్రదాయమని గుర్తు చేశారు. చంద్రబాబు కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, కేసులో తన నిర్దోషిత్వం నిరూపితం అయ్యే వరకు తన పార్టీలో అందరూ కోరుకునే వ్యక్తికే బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఆయన బుధవారం శ్రీకాకుళంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. హైకోర్టు తీర్పును పరిశీలించిన ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసు విచారణకు అర్హమైనదిగా భావించిన తర్వాతే చంద్రబాబుకు నోటీసులు జారీ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నట్లుగా ఇదేదో సాధారణమైన, తీసి పారేసే విషయమైతే కాదన్నారు. ఇలాంటి ఫిర్యాదులు తననేమీ చేయవంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడాన్ని ధర్మాన తప్పుపట్టారు. దేశ సర్వోన్నత న్యాయస్థానంలోని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం పరిశీలించి, ఈ కేసును విచారణకు స్వీకరించిందంటేనే అదెంత తీవ్రమైన విషయమో తెలుస్తోందన్నారు. ఇలాంటి కేసు విచారణలో ఉన్నప్పుడు నిందితులెవరైనా రాజ్యాంగపరమైన పదవుల్లో ఉండడానికి అర్హులు కారని చెప్పారు. -
చంద్రబాబును ప్రాసిక్యూట్ చేయాలి
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటు కోటు కేసులో నిష్పక్షపాత విచారణ జరిపించాలని, సీఎం చంద్రబాబును ప్రాసిక్యూట్ చేయాలని సామాన్య జనం కోరుతున్నారు. దోషులను చట్టప్రకారం శిక్షించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్ కు ఆన్ లైన్ పిటిషన్ పంపనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా change.org పేరుతో ఒక పేజీని రూపొందించి సంతకాల సేకరణ చేపట్టారు. దీనికి అనూహ్య స్పందన వస్తోంది. ఈ పేజీని ప్రారంభించిన 24 గంటల్లోనే 5 వేల మందిపైగా సంతకాలు చేయడం విశేషం. సుప్రీంకోర్టులోని అందరు న్యాయమూర్తులకు ఈ పిటిషన్ పంపనున్నారు. ఓటుకు కోట్లు కేసులో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి వేసిన పిటిషన్ పై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సామాన్యులు తమ గళం వినిపించేందుకు ముందుకు వచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తమ వంతు ప్రయత్నం మొదలు పెట్టారు. డబ్బు, అధికారం ఉంటే కేసులు నుంచి తప్పించుకోవచ్చన్న భావన సమాజంలో ఉందని.. ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని గళం విప్పారు. చాలా కేసుల్లో నిందితుడిగా ఉన్న చంద్రబాబు కోర్టుల నుంచి స్టే తెచ్చుకుని విచారణ ముందుకు సాగకుండా చూసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భారతదేశ పౌరులుగా ఇలాంటి పరిణామాలు తమకు ఆందోళన కలిగిస్తున్నాయని, ఓటుకు కోట్లు కేసులో నిష్పక్షపాత విచారణ జరగాలని కోరుకుంటున్నట్టు ఆన్ లైన్ పిటిషన్ (change.org) లో పేర్కొన్నారు. దోషులను తగిన విధంగా శిక్షించాలని సుప్రీంకోర్టును కోరుతున్నారు. గత రెండు రోజులుగా ఈ ఆన్ లైన్ పిటిషన్ పై సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న ఈ సంతకాల సేకరణ ఊపందుకుంది. -
సుప్రీం నోటీసులు.. పెద్ద విషయం
-
ఓటుకు కోట్లు కేసా?.. ఏమీ కాదులెండి!
-
సుప్రీం నోటీసులు.. పెద్ద విషయం
- ఓటుకు కోట్లు కేసుపై జగన్ వ్యాఖ్య - దృష్టి మళ్లించేందుకే బాబు ప్రెస్మీట్ సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిందనే విషయం తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉలికిపాటుకు లోనయ్యారని, ఈ అంశం నుంచి ప్రజల దృష్టిని, మీడియా దృష్టిని మళ్లిం చేందుకే అసెంబ్లీ ముగిసిన అరగంటకే విలేకరుల సమావేశం నిర్వహించి సుదీర్ఘంగా మాట్లాడారని ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. ఆయన సోమవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయమని, ఈ విషయం చంద్రబాబుకూ తెలుసు, మనకూ తెలుసన్నారు. విలేకరులు ప్రశ్నించినపుడు అదేదో చాలా తేలికైన విషయం అన్నట్లుగా చంద్రబాబు తోసిపుచ్చారన్నారు. తనపై 26 కేసులు పెట్టారని ఏమీ కాలేదని చంద్రబాబును మీడియా అడిగినపుడు చెప్పారని అయితే ఏ కేసు కూడా విచారణ దశ వరకు వెళ్లలేదనే విషయం మాత్రం చెప్పలేదని జగన్ విమర్శించారు. చంద్రబాబు తన చాకచక్యం, పలుకుబడి వినియోగించి చాలా కష్టపడి స్టేలు తెచ్చు కుంటారని జగన్ అన్నారు. తొలిరోజు అసెంబ్లీలో ఉదయం 11.06 గంటలకు ముహూర్తం గవర్నర్ చేత ప్రసంగాన్ని ప్రారంభింప జేస్తే 11.10 గంటకు సుప్రీంకోర్టు చంద్రబాబుకు నోటీసులు జారీ చేసిందని, ఇదేమి గ్రహబలమోనని జగన్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేను కొనుగోలు చేసే యత్నంలో నల్లధనం ఇస్తూ అడ్డంగా దొరికి పోయినా రాజీనామా చేయకుండా ఉన్న ముఖ్యమంత్రి దేశం మొత్తం మీద చంద్రబాబు ఒక్కరేనని జగన్ అన్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వం చాలా అసహనంతో వ్యవహరిస్తోంది. వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే అక్రమంగా కేసులు పెట్టి వేధింపు చర్యలకు పాల్పడుతోంది. దిద్దుకుంటే ప్రజాస్వామ్యంలో నాయకులవుతారు. కళ్లు నెత్తికెక్కిన వారికి ప్రజాస్వామ్యం కచ్చితంగా పాఠం నేర్పుతుంది’ జగన్ పేర్కొన్నారు. -
ఆ కేసు ఏమీ కాదులెండి
- సుప్రీంకోర్టు నోటీసులపై చంద్రబాబు వ్యాఖ్య - వాళ్లకు ఈ కేసులేయడం కొత్తకాదు... - 26 కేసులు వేశారు.. ఏమయ్యాయి? - మంత్రివర్గంపై చెప్పింది చేయను... చేసేది చెప్పను... సాక్షి, అమరావతి: ‘‘ఆ కేసు ఏమీ కాదులెండి. వదిలేయండి. అలా కేసులు వేస్తుండడం వారికి అలవాటే. ఇది ఇప్పుడు కొత్తకాదు. ఒకటి అయ్యాక ఇంకొకటి వేస్తూనే ఉంటారు. 26 కేసులు వేశారు. ఏమయ్యాయి?’’ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఓటుకు కోట్లు కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన కేసును సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించి చంద్రబాబుకు నోటీసులు జారీచేయడంపై ఆయన పైవిధంగా స్పందించారు. వెలగపూడి కొత్త తాత్కాలిక అసెంబ్లీ భవనాల్లోని కమిటీ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన అంశాన్ని గుర్తుచేయగా అప్పటివరకు ఎంతో ఉత్సాహంగా మీడియాకు ఇతర సమాచారాన్ని వివరిస్తున్న ఆయన ముఖకవళికలు మారిపోయాయి. లిప్తకాలంపాటు తత్తరపడి తేరుకుని ‘‘వాళ్లు కేసులు వేయడం ఇప్పుడు కొత్త కాదు. ఇప్పటికే నాపై 26 కేసులు వేశారు. కొన్నిటిని కోర్టులే కొట్టేశాయి. అయినా వేస్తూనే ఉన్నారు. వారికిదో అలవాటు. గతంలో నాపై ఎక్సైజ్ కేసు వేస్తే 12 ఏళ్లపాటు కొనసాగింది. కేసులు ఏమీ కావు. ఇంతకు ముందు కూడా సుప్రీంకోర్టులో వాళ్లు కేసులు వేయగా న్యాయస్థానం వారికి మొట్టికాయలు కూడా వేసింది. అయినా తీరు మారలేదు. వాళ్లంతే. అవన్నీ వదిలేయండి’’ అని చెప్పారు. ఓటుకు కోట్లు కేసు గురించి మరింత స్పష్టమైన వివరణ కోసం సాక్షి ప్రతినిధి ప్రయత్నించగా... ‘‘ఎవరేం చేస్తున్నారో తెలుసు. మీరే చేయిస్తున్నారు. నువ్వు అక్కడ చేరి ఏం చేస్తున్నావో తెలుసు’’ అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ప్రతిభ ఉందనే లోకేశ్కు పదవి ప్రతిభను గుర్తించే నారా లోకేశ్కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినట్లు చంద్రబాబు చెప్పారు. లోకేశ్కు ఎమ్మెల్సీ పదవి గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్పుడు ‘‘లోకేష్తో సహా ప్రస్తుతం ఎమ్మెల్సీ పదవులకు ఎంపికైన వారంతా ఆ పదవులకు అర్హులే. వారి ప్రతిభ మీదనే పదవులు ఇచ్చాను. ఎవరు పని చేస్తున్నారో వారికి పదవులు వస్తాయి. పార్టీ కోసం పనిచేస్తున్నందునే లోకేశ్, అర్జునుడులకు పదవులు ఇచ్చాను. గతంలో అనివార్య కారణాల వల్ల పదవులు ఇవ్వలేకపోయాను. వారంతా పార్టీకి సహకరించారు. పార్టీ పట్ల విధేయత, సమర్థతలను గుర్తించి ఇప్పుడు కొందరికి ఇచ్చాం. అన్ని వర్గాల వారికి ప్రాధాన్యం కల్పించాలనుకున్నాం. ప్రతి ఒక్కరికీ అవకాశం వస్తుంది’’ అని చంద్రబాబు వివరించారు. మంత్రివర్గంలోకి తీసుకుం టారా? అని ప్రశ్నించగా ‘‘ఎప్పుడైనా నేను ముందుగా చెప్పానా? మీకు ముందుగా చెప్పానా? అయినా నేను ఎప్పుడైనా చెప్పింది చేశానా... చేసేది చెపుతానా...’’ అంటూ నవ్వుతూ దాటవేశారు. -
పూర్తిస్థాయిలో విచారించాల్సిందే
ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబుకు సుప్రీంకోర్టు నోటీసులు - ఆరోపణలపై ఏపీ సీఎం వివరణ ఇవ్వాలన్న సర్వోన్నత న్యాయస్థానం - తెలంగాణ ఏసీబీకి కూడా నోటీసులు.. కౌంటర్ల దాఖలుకు ఆదేశం - చంద్రబాబు తప్పించుకోలేరు: న్యాయవాది పొన్నవోలు - క్రిమినల్ చట్టంలో లోకస్స్టాండీ అనే పదం ఎక్కడా లేదు: ఆర్కే సాక్షి, న్యూఢిల్లీ, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు సోమవారం చంద్రబాబును ఆదేశించింది. ఇందులో భాగంగా ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఆయనతోపాటు తెలంగాణ ఏసీబీకి సైతం నోటీసులు ఇచ్చింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలను కౌంటర్ల రూపంలో తమ ముందుంచాలని వారిని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే, జస్టిస్ లావు నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఓటుకు కోట్లు వ్యవహారానికి సంబంధించిన ఈ కేసులో పూర్తిస్థాయి విచారణ జరుపుతామని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పాత్రపై విచారణ జరిపించాలంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి (ఆర్కే) దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించింది. విచారణ జరపాలన్న ఏసీబీ కోర్టు... ఓటుకు కోట్లు కేసులో దర్యాప్తు సక్రమంగా సాగడం లేదని, ఏసీబీ అధికారులు చంద్రబాబు పాత్రపై దర్యాప్తు చేయడం లేదంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఆగస్టు 8న ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన ప్రత్యేక న్యాయస్థానం దీనిపై దర్యాప్తు చేయాలని ఏసీబీని ఆదేశిస్తూ గత ఏడాది ఆగస్టు 29న ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రబాబునాయుడు సెప్టెంబర్ 1న హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు, ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాల అమలును నిలిపేస్తూ సెప్టెంబర్ 2న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లో తుది విచారణ జరపాలంటూ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. మొదట్లో వేగంగా చేశారు.. తరువాత పక్కన పట్టేశారు... ఈ నేపథ్యంలో చంద్రబాబు దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ తాళ్లూరి సునీల్ చౌదరి విచారణ జరిపారు. ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ దాఖలు చేసిన చార్జిషీట్లో 22 సార్లు చంద్రబాబునాయుడు ప్రస్తావన వచ్చిందని, అయితే ఆయన పాత్రపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేయడం లేదని ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టుకు నివేదించారు. ఈ కేసు మొదట్లో దర్యాప్తును వేగంగా ప్రారంభించిన ఏసీబీ అధికారులు తరువాత కీలక దర్యాప్తును పక్కనపెట్టేశారన్నారు. దీంతో తాము ఏసీబీ ప్రత్యేక కోర్టు వాస్తవాలను బహిర్గతం చేయాలన్న ఉద్దేశంతో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశామని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ప్రత్యేక కోర్టు తాము తమ ఫిర్యాదులో పేర్కొన్న అంశాల్లో వాస్తవం ఉందో లేదో దర్యాప్తు చేయాలని మాత్రమే ఏసీబీని ఆదేశించిందని వివరించారు. ఏసీబీ అధికారులు చంద్రబాబు స్వర నమూనాల జోలికి వెళ్లలేదని ఆయన తెలిపారు. ఓటుకు డబ్బు అవినీతి కాదు... ఎన్నికల్లో ఓటు వేసేందుకు డబ్బు ఇవ్వడం అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్) పరిధిలోకి రాదని చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా తెలిపారు. ఓటు వేయడమన్నది ప్రజా విధుల్లో భాగం కాదని, అది కేవలం రాజ్యాంగపరమైన బాధ్యత మాత్రమేనని ఆయన తెలిపారు. అంతేకాక ఎన్నికైన వ్యక్తి ప్రజా సేవకుడిగా బాధ్యతలు నిర్వరిస్తున్న సందర్భంలో అవినీతికి పాల్పడితే అప్పుడు మాత్రమే పీసీ యాక్ట్ వర్తిస్తుందని ఆయన వివరించారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సునీల్ చౌదరి డిసెంబర్ 9న తీర్పు వెలువరించారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ను కొట్టేస్తూ ఈ కేసులో జోక్యం చేసుకునే అర్హత అతనికి లేదని తేల్చి చెప్పింది. అంతేకాక చంద్రబాబు ఫోన్ సంభాషణ ఆధారంగా అతన్ని ఈ కేసులో లాగేందుకు ఆ తరువాత నిర్ధిష్టమైన ఆరోపణలు చేశారన్న న్యాయమూర్తి.. అతను స్టీఫెన్సన్కు లంచం ఇవ్వజూపలేదని తేల్చేశారు. ఈ తీర్పును సవాలు చేస్తూ రామకృష్ణారెడ్డి తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 22 సార్లు బాబు పేరు చెప్పి.. ఆయన్ను మాత్రం విచారించలేదు... హైకోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేశారు. నేర విచారణ స్మృతి (సీఆర్పీసీ) సెక్షన్ 39, 190 ప్రకారం తనకు ఈ కేసులో జోక్యం చేసుకొనే అర్హత ఉందని రామకృష్ణారెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. నేరం ఎవరు చేసినా.. ఆ నేరాన్ని చూసిన వ్యక్తి కోర్టును ఆశ్రయించే హక్కు ఉందని చట్టం, సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను రూ. ఐదు కోట్లకు కొనాలని చూశారని, ఇది అవినీతి కిందికే వస్తుందన్నారు. స్టీఫెన్సన్తో చంద్రబాబు స్వయంగా ఫోన్లో మాట్లాడారని తెలిపారు. ఈ ఫోన్ సంభాషణలో ఉన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు గొంతేనని ఫోరెన్సిక్ ల్యాబ్ సైతం నిర్ధారించిందన్నారు. ఏసీబీ అధికారులు సైతం తాము దాఖలు చేసిన చార్జిషీట్లో చంద్రబాబు పేరును 22 సార్లకు పైగా ప్రస్తావించారన్నారు. కానీ అదే ఏసీబీ చంద్రబాబును మాత్రం విచారించలేదన్నారు. ఈ కేసులో పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను నిగ్గుతేల్చే విషయంలో దర్యాప్తు సంస్థ విఫలమైందని వివరించారు. ఈ విషయాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పూర్తిస్థాయిలో విచారణ జరుపుతాం... పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్రెడ్డి, తంగిరాల విజయభాస్కర్రెడ్డిలు హాజరయ్యారు. కేసు విచారణకు రాగానే చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా స్పందిస్తూ... ఈ కేసులో జోక్యం చేసుకునే ఈ కేసులో పిటిషనర్కు జోక్యం చేసుకొనే అర్హత లేదని హైకోర్టు తీర్పు వెలువరించిందని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘ఇది వినవలసిన కేసు. పూర్తిస్థాయిలో విచారణ జరుపుతాం. కేసు త్వరిగతిన విచారణకు వచ్చేలా చూస్తాం’’అని తేల్చి చెప్పింది. ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తున్నట్టు తెలిపింది. ప్రతివాదులుగా ఉన్న చంద్రబాబు నాయుడితో పాటు తెలంగాణ ఏసీబీకి నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ చేసిన ఆరోపణలకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వారిని ఆదేశించింది. చంద్రబాబు తప్పించుకోలేరు.. ఎన్నో కేసుల్లో విచారణ జరక్కుండా స్టేలు తెచ్చుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో తప్పించుకోలేరని పిటిషనర్ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి చెప్పారు. కేసు విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసులో తాము గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘మన వాళ్లు బ్రీఫ్డ్మీ అన్న వాయిస్ చంద్రబాబుదే అని ఫోరెన్సిక్ వ్యాబ్ నిర్ధారించింది. అయితే తెలంగాణ ఏసీబీ ఈ కేసును పక్కన పెట్టేసింది. ప్రభుత్వం దాని పని మరిచినప్పుడు, నిందితులను కాపాడాలని ప్రయత్నిస్తున్నప్పుడు.. కేసుతో సంబంధం లేని మూడో వ్యక్తి ఈ విషయంలో జోక్యం చేసుకొని న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని సమాజ్ పరివర్తన్ సముదాయన్– కర్ణాటక కేసులో (మైనింగ్ సంబంధిత) సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. నేరం అనేది ఎవరి దృష్టి కొచ్చినా.. సీఆర్పీసీ సెక్షన్ 39, 190 ప్రకారం సదరు వ్యక్తి కోర్టును ఆశ్రయించే హక్కు ఉందని ఏఅర్ ఆథూలే– ఆర్ఎస్ నాయక్, బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి– మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ కేసుల్లో కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది’’ అని సుధాకర్రెడ్డి చెప్పారు. సుప్రీంకోర్టు అండగా నిలిచింది: ఆర్కే సాక్షి, అమరావతి: ఆంధ్ర రాష్ట్ర సొత్తు దోచుకుని, అక్రమంగా సంపాదించిన లంచాల సొమ్ముతో అవసరం లేకపోయినా తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలనుకొంటూ ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుపై తాను మూడేళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నానని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) చెప్పారు. తనకు లోకస్ స్టాండీ (కేసు వేసేందుకు అర్హత లేదని) లేదని హైకోర్టు తీర్పు చెబితే సుప్రీంకోర్టు అండగా నిలిచి చంద్రబాబుకు నోటీసులు జారీ చేసిందన్నారు. ఆయన సోమవారం వెలగపూడిలోని అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు ఓటుకు కోట్లు కేసుకు భయపడే ఉమ్మడి రాజధాని హైదరాబాద్ను వదులుకున్నారని విమర్శించారు. గోదావరి, కృష్ణా నదులపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా కడుతున్న ఆనకట్టలపైనా నోరెత్తడం లేదని దుయ్యబట్టారు. అంతేకాకుండా పార్లమెంట్ హామీ, ఆంధ్రుల హక్కు అయిన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. క్రిమినల్ చట్టంలో లోకస్స్టాండీ అనే పదం ఎక్కడా లేదని చెప్పారు. -
ఇప్పుడేమంటారు బాబూ!
ఏదైనా కేసులో ఆరోపణలొచ్చినప్పుడు నింద పడినవారు దాన్నుంచి సాధ్యమైనంత త్వరగా విముక్తం కావాలని, తమ నిర్దోషిత్వం రుజువు కావాలని ఆశిస్తారు. విచారణ పేరుతో ఏళ్ల తరబడి కేసు సాగుతుంటే అది తమకు ఇబ్బందికరనుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరే వేరు. తనపై ఏ కేసు వచ్చినా సాంకేతిక కారణాలు చూపి స్టే తెచ్చుకోవడం ఆయన అలవాటు. ఉభయ తెలుగు రాష్ట్రాలనూ దాదాపు రెండేళ్లక్రితం ఓ కుదుపు కుదిపిన ‘ఓటుకు కోట్లు’ కేసులో ఆయనగారికి అసలు స్టే కోసం ప్రయత్నించాల్సిన అవసరమే లేకపోయింది. ఆ కేసు దర్యాప్తే సక్రమంగా సాగడం లేదు! ఈ నేపథ్యంలో సోమవారం సుప్రీంకోర్టులో చోటుచేసుకున్న పరిణామం కీలకమైనది. ‘ఓటుకు కోట్లు’ కేసులో చంద్రబాబు పాత్రపై విచారణ జరిపించాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించడంతోపాటు చంద్రబాబుకు, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ విచారణార్హం కాదన్న బాబు తరఫు న్యాయవాది వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. 'ఓటుకు కోట్లు’ కేసు పూర్వాపరాలు గమనిస్తే ఇన్నాళ్లుగా దర్యాప్తు అతీగతీ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ దర్యాప్తు ఎలా కొనసాగించాలో, నిందితుల దోషాన్ని ఎలా నిరూపించాలో తలలు బద్దలు కొట్టుకోనవసరం లేదు. కీలక నింది తులు ఆడియో, వీడియోల సాక్షిగా అడ్డంగా దొరికిపోయారు. తెలంగాణ శాసన మండలికి ఎమ్మెల్యేల కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయడానికి జరిగిన ఎన్నికల్లో కరెన్సీ కట్టలను ఎర చూపడం కేసులోని ప్రధానాంశం. ఆ కరెన్సీ కట్టలను టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ దగ్గరకు పట్టుకొచ్చిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి వీడియో కెమెరాలకు చిక్కారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడిన అవాకులు, చవాకులు రికార్డయ్యాయి. ఒక్క ఓటుకు రూ. 5 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడిన ఆ కేసులో సాక్షాత్తూ చంద్రబాబు స్టీఫెన్సన్తో జరిపిన సంభాషణలు సైతం ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం నిజాయితీగా, నిష్పక్షపాతంగా వ్యవహరించి ఉంటే ఈపాటికి నిందితుల దోషం నిరూపణై న్యాయస్థానంలో శిక్ష కూడా పడేది. కానీ జరిగింది వేరు. ‘నా ఫోన్ ట్యాప్ చేయిస్తారా...’ అంటూ ఉగ్రుడైన చంద్రబాబు ‘నాకూ ఏసీబీ ఉంది. నాకూ పోలీసులున్నారు...’ అంటూ హుంకరించారు. ఆ హుంకరింపులే ఆయన దోషాన్ని పట్టి ఇచ్చాయి. ఆయన స్పందన గమనిస్తే ఎవ రికైనా ఆశ్చర్యం కలుగుతుంది. రేవంత్రెడ్డిని తాను పంపలేదని, ఆయన ఇవ్వజూ పిన డబ్బుతో తనకు సంబంధం లేదని చంద్రబాబు అనలేదు. కనీసం స్టీఫెన్సన్తో సాగిన సంభాషణల్లోని గొంతు తనది కాదని కూడా బాబు బుకాయించలేదు. ఆ సంగతలా ఉంచి ఫోన్ సంభాషణ టేపుల్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపి నిజా నిజాలేమిటో నిర్ధారణ చేయించడం తెలంగాణ సర్కారుకు పెద్ద కష్టమేమీ కాదు. చిత్రమేమంటే హైదరాబాద్లోనే ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్కు ఆ టేపులు ఈనాటికీ చేరినట్టు లేవు. ఇలా వ్యక్తుల ఇష్టానుసారం కేసుల దర్యాప్తు సాగడం ప్రజాస్వా మ్యంలో అవాంఛనీయం. ఇదేమీ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సొంత పంచా యతీ కాదు. వారిద్దరూ లాలూచీ పడి ‘గతం గతః’ అనుకుంటే సరిపోదు. పక్క రాష్ట్రం ఎమ్మెల్యేలను డబ్బిచ్చి కొనడానికి... ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేయడానికి సిద్ధపడి ఒక ముఖ్యమంత్రి సంచుల్లో కరెన్సీ కట్టలు పంపిన ఉదం తమిది. ఇందులో నెలల తరబడి సాగలాగేది, చెమటోడ్చి వెలికితీసేది ఏముం టుందో ఎవరికీ అర్ధంకాని విషయం. గత నెలలో ఏసీబీ అదనపు చార్జిషీటు దాఖలు చేసిందంటున్నారు. మంచిదే. మరి చంద్రబాబు జరిపిన ఫోన్ సంభాషణల టేపుల సంగతి ఏంచేశారో ఎవరికీ తెలియదు. ఫోన్లో స్టీఫెన్సన్తో మాట్లాడింది చంద్ర బాబేనని ఒక ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారణగా చెప్పింది. చేతనైతే ఆ ల్యాబ్ నివేదిక తప్పని అయినా తెలంగాణ ఏసీబీ నిరూపించాలి. అది ఆ పనీ చేయలేదు! ఈ కేసులో చంద్రబాబు మొదటినుంచీ వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యం కలి గిస్తుంది. దర్యాప్తు సక్రమంగా సాగడంలేదని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఫిర్యాదు చేసినప్పుడు ఇందులో ఆయన జోక్యం తగదని బాబు తరఫు న్యాయవాది వాదించారు. చివరకు దర్యాప్తు వేగవంతం చేయాలని ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆదేశించినప్పుడు దానిపై బాబు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆయ నకు అనుకూలంగా, ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దుచేస్తూ తీర్పు వెలువడి ఉండొచ్చుగానీ... ఆ సందర్భంగా బాబు వినిపించిన వాదనలు వింత గొలుపుతాయి. ప్రజా ప్రతినిధులుగా ఉంటున్నవారు ఏదైనా ఎన్నికల్లో ఓటేయడం రాజ్యాంగ బాధ్యతే తప్ప అది ప్రజావిధుల్లో భాగం కాదని ఆయన తరఫు న్యాయ వాది వాదించారు. ప్రజావిధుల్లో భాగం కాదుగనుక ఓటేయడానికి డబ్బు తీసు కున్నా నేరం కాదన్నట్టు ఆ వాదన సాగింది. తనపై ఇంతవరకూ 26 కేసులు దాఖలు చేసినా అన్నిటిలోనూ తాను నిప్పునని నిరూపించుకున్నానని బయట నదురూ బెదురూ లేకుండా దబాయిస్తూ న్యాయస్థానాల్లో మాత్రం ఇలాంటి వాదనలు వినిపించడానికి బాబుకు సిగ్గనిపించడం లేదు. ఈ కేసులో పూర్తి స్థాయి విచారణ జరపాలని సుప్రీంకోర్టు నిర్ణయించడం అసాధారణం. ఇది నైతికంగా బాబుకు పెద్ద దెబ్బ. కేసులో తేల్చాల్సిన అంశాలున్నాయని ప్రాథమికంగా భావించబట్టే సుప్రీం కోర్టు ఈ నిర్ణయానికొచ్చింది. కేసు విచారణలో ఎలాంటి సందర్భాల్లో మూడో వ్యక్తి జోక్యం చేసుకోవచ్చునో నేర విచారణ స్మృతి నిబంధనలు చెబుతున్నాయి. ప్రజా ప్రయోజనం ఇమిడి ఉన్న కేసుల్లో ప్రభుత్వాలు కావాలని నిందితులను కాపాడ టానికి ప్రయత్నిస్తుంటే మూడో వ్యక్తి జోక్యం సబబేనని సుప్రీంకోర్టు గతంలో పలు సందర్భాల్లో చెప్పింది. వీటన్నిటినీ గమనించాకైనా ఇది నైతికంగా తనకు పరా జయమని బాబు గుర్తించాలి. సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకున్నది గనుక ఈ కేసు దర్యాప్తు ఇకనుంచి అయినా చురుగ్గా, సక్రమంగా సాగుతుందని... సాధ్య మైనంత త్వరలో దోషులకు శిక్ష పడుతుందని ఆశిద్దాం. -
పొలిటికల్ హీట్
-
సుప్రీం నోటీసులపై స్పందించిన చంద్రబాబు
అమరావతి: ఓటుకు కోట్లు కేసులో సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేయడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. కోర్టుల నుంచి నోటీసులు రావడం సహజమేనని అన్నారు. ఇందులో కొత్తేముందని, చాలాసార్లు నోటీసులు ఇచ్చారని చెప్పారు. అసలు ఓటుకు కోట్లు కేసులో ఏముందని చంద్రబాబు ప్రశ్నించారు. తనపైన గతంలో 26 కేసులు వేశారని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు విచారించింది. ఈ కేసులో చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. వీలైనంత త్వరగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, ఈ కేసును సమగ్రంగా విచారిస్తామని సుప్రీం కోర్టు పేర్కొంది. -
తొలిరోజే చంద్రబాబుకు షాక్ తగిలింది
అమరావతి: రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతిలో తొలిసారి జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల తొలిరోజే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు షాక్ తగిలిందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ రోజు (సోమవారం) ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబుకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసిందని చెప్పారు. తొలిరోజు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మీడియా పాయింట్ వద్ద కోటంరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు తనకు ఇష్టమైన వెన్నుపోటు అనే మాటను అస్త్రంగా చేసుకుని గవర్నర్ ప్రసంగంలో చదివించారని విమర్శించారు. ప్రత్యేక హోదాకు వెన్నుపోటు పొడిచారని అన్నారు. గత ఎన్నికల సమయంలో తిరుపతిలో ఏడుకొండల వెంకన్నస్వామి సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన చంద్రబాబు.. ఎన్నికల్లో గెలిచాక మాట మార్చారని విమర్శించారు. రైతుల రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ హామీలను విస్మరించారని మండిపడ్డారు. -
తొలిరోజే చంద్రబాబుకు షాక్ తగిలింది
-
చంద్రబాబు తప్పించుకోలేరు
న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు కేసు నుంచి టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పించుకోలేరని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పారు. ఈ కేసులో తమకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పారు. ఓటుకు కోట్లు కేసులో సుప్రీం కోర్టు చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. వీలైనంత త్వరగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, ఈ కేసును సమగ్రంగా విచారిస్తామని సుప్రీం కోర్టు పేర్కొంది. అనంతరం పొన్నవోలు మీడియాతో మాట్లాడుతూ.. కేసు తీవ్రతను సుప్రీం కోర్టు గుర్తించిందని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. విచారణ సమయంలో కోర్టుకు వివరాలన్నీ సమర్పిస్తామని చెప్పారు. చంద్రబాబు నిర్దోషి అయితే విచారణకు ఎందుకు భయపడుతున్నారని పొన్నవోలు ప్రశ్నించారు. గతంలో 18 కేసుల్లో విచారణను చంద్రబాబు అడ్డుకున్నారని, ఈ కేసులో మాత్రం దొరుకుతారని చెప్పారు. అవినీతి నిరోధక చట్టం కింద ఎవరయినా కేసు వేయవచ్చన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనని, తప్పు చేస్తే చంద్రబాబుకు శిక్ష పడాల్సిందేనని అన్నారు. బ్రీఫ్డ్ మీ అన్న గొంతు చంద్రబాబుదేనని తేలిందని, ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించామని తెలిపారు. తప్పుచేసిన వాళ్లు ఒకటి, రెండు సార్లు తప్పించుకోవచ్చని, ప్రతిసారీ తప్పించుకోలేరని పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. -
చంద్రబాబుకు సుప్రీం కోర్టు నోటీసులు
-
చంద్రబాబుకు సుప్రీం కోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు కేసులో సుప్రీం కోర్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నోటీసులు జారీ చేసింది. వీలైనంత త్వరగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసును సమగ్రంగా విచారిస్తామని సుప్రీం కోర్టు పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు విచారించింది. ఓటుకు కోట్లు వ్యవహారం అవినీతి నిరోధక చట్టం కిందకు వస్తుందని ఎమ్మెల్యే ఆర్కే సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. తెలంగాణ శాసనమండలి ఎన్నికల సందర్భంగా ఓటుకు కోట్లు కేసు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొందరిని డబ్బుతో కొనేందుకు టీడీపీ ప్రయత్నించింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ఆయన ఇంట్లో ప్రలోభపెడుతూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కెమెరాలకు అడ్డంగా దొరికిపోయారు. అంతేగాక టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. స్టీఫెన్సన్తో నేరుగా మాట్లాడినట్టు ఆధారాలు బయటపడ్డాయి. మనవాళ్లు బ్రీఫ్డ్ మీ అంటూ స్టీఫెన్సన్తో చంద్రబాబు చెప్పినట్టు ఫోన్ రికార్డుల్లో వెలుగుచూసింది. ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షల్లో బ్రీఫ్డ్ మీ అన్న గొంతు చంద్రబాబుదేనని తేలింది. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా ఏసీబీ కోర్టులో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్ దాఖలు చేశారు. సాక్ష్యాల ఆధారంగా చంద్రబాబుపై దర్యాప్తు చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించగా.. చంద్రబాబు హైకోర్టులో సవాల్ చేశారు. ఓటు వేసేందుకు లంచం తీసుకుంటే అవినీతి కిందకు రాదని చంద్రబాబు తరఫు న్యాయవాది వాదించారు. చంద్రబాబుపై ఏసీబీ కోర్టు ఆదేశాలను హైకోర్టు కొట్టివేయగా, ఎమ్మెల్యే ఆర్కే సుప్రీం కోర్టును ఆశ్రయించారు. -
రాజ్భవన్కు ఓటుకు కోట్లు కేసు చార్జిషీట్
-
రాజ్భవన్కు చార్జిషీట్
-
రాజ్భవన్కు చార్జిషీట్
ఓటుకు కోట్లు కేసులో కొత్త కోణం - ప్రభుత్వంలో హాట్ టాపిక్గా మారిన వ్యవహారం - గతనెల 18న అదనపు చార్జిషీట్ దాఖలు చేసిన ఏసీబీ - రిటైర్ అయిన తర్వాత ఆఫీసుకు వెళ్లి కేసుపై ఏసీబీ మాజీ డైరెక్టర్ సమీక్ష - అదేరోజు ఏసీబీ చార్జిషీట్ దాఖలు - అభియోగపత్రాల కాపీలు కావాలని కోరిన రాజ్భవన్ - సర్కారుకు సమాచారం లేకుండా రాజ్భవన్కు వెళ్లి ఇచ్చిన డైరెక్టర్ - తమకు తెలియకుండా ఇచ్చినందుకు ప్రభుత్వం గుర్రు.. డైరెక్టర్పై బదిలీ వేటు - చార్జిషీట్ కాపీలు అందిన తర్వాత గవర్నర్ ఢిల్లీ టూర్ - రాష్ట్రపతి, ప్రధాని, అటార్నీ జనరల్, సీజేఐలతో భేటీ సాక్షి, హైదరాబాద్ ఓటుకు కోట్లు కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు ఇటీవల ఈ కేసులో అదనపు చార్జిషీట్ దాఖలు చేయడం.. ఆ చార్జిషీట్ కాపీ రాజ్భవన్కు చేరడం సంచలనాత్మకంగా మారింది. ఏసీబీ డైరెక్టర్ చారుసిన్హాను నేరుగా రాజ్భవన్కు పిలిపించుకుని అక్కడి అధికార వర్గాలు చార్జిషీట్ కాపీలు తీసుకున్న వైనం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఆలస్యంగా వచ్చింది. కీలకమైన కేసు, పైగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో రాజ్భవన్ వర్గాలు ఎందుకు చార్జిషీట్ తెప్పించుకున్నాయో తెలియక రెండు రాష్ట్ర ప్రభుత్వాలు లోలోన ఆందోళనకు గురవుతున్నాయి. రాజ్భవన్ అదనపు చార్జిషీట్ కాపీ తెప్పించుకున్న ఈ తాజా ఎపిసోడ్ వెనుక కథేంటి? అసలు ఏం జరిగి ఉంటుందన్న కోణంలో పోలీసు ఉన్నతాధికారవర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఏసీబీ డైరెక్టర్ నుంచి చార్జిషీట్ తెప్పించుకున్న కొద్ది రోజులకే గవర్నర్ నరసింహన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం గమనార్హం. చెప్పనందుకే చారుసిన్హాపై వేటు! ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఒక్కరే కావడంతో రాజ్భవన్ నుంచి ఏ ఆదేశాలు వెలువడ్డా పోలీసు ఉన్నతాధికారులు తక్షణం స్పందించాల్సిందే. ఏ వ్యవహారంపైనైనా రాజ్భవన్ వర్గాలు నేరుగా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం ఈ రెండున్నరేళ్లలో చాలాసార్లు జరిగింది. పలుమార్లు పోలీసు ఉన్నతాధికారులను రాజ్భవన్కు పిలిపించుకుని గవర్నర్ సమావేశాలు నిర్వహించిన దాఖలాలు ఉన్నాయి. అదే మాదిరి ఇటీవల రాజ్భవన్ నుంచి ఏసీబీ డైరెక్టర్కు ఫోన్ వచ్చింది. ఓటుకు కోట్లు కేసులో ఇటీవల దాఖలు చేసిన అదనపు చార్జిషీట్ కాపీ కావాలన్న ఆదేశం అందులో ఉంది. దీంతో హుటాహుటిన చార్జిషీట్ కాపీలు తీసుకొని అప్పటి డైరెక్టర్ చారుసిన్హా రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ కార్యాలయంలో అందజేశారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. అసలు ట్విస్ట్ అక్కడే మొదలైంది. రాజ్భవన్ కార్యాలయం కీలకమైన కేసులో చార్జిషీట్ కాపీలు అడిగితే తమకు కనీస సమాచారం ఇవ్వకపోవడం రాష్ట్ర ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. గవర్నర్ అడగడంలో తప్పులేదని, అయితే ఆ విషయాన్ని దాచిపెట్టడమే ఆ అధికారి చేసిన తప్పు అని ఉన్నతాధికార వర్గాలు చెబుతున్నాయి. ఇంకేదైనా విషయంలో కూడా ఇలాగే వ్యవహరిస్తారేమోనని భావించి.. ఏసీబీ డైరెక్టర్ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. మాజీ డీజీ సమీక్ష.. అదేరోజు చార్జిషీట్ ఏసీబీకి గతంలో డైరెక్టర్ జనరల్గా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్ ఈ కేసులో కీలకంగా వ్యవహరించారు. అయితే సర్వీసులో ఉన్నంత వరకే ఆయనకు పర్యవేక్షణ అధికారం ఉంటుంది. పదవీ విరమణ చేసిన తర్వాత ఆయనతో ఆ విభాగానికి ఎలాంటి సంబంధం, కేసులో జోక్యం ఉండకూడదు. కానీ పదవీ విరమణ చేసిన సరిగ్గా నెలన్నర తర్వాత ఖాన్ ఏసీబీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. అప్పటి డైరెక్టర్ చారుసిన్హాకు కనీస సమాచారం లేకుండా కేసుకు సంబంధించి సంబంధిత అధికారులతో రెండున్నర గంటల పాటు సమీక్ష నిర్వహించారు. అదే రోజు సాయంత్రం.. దర్యాప్తు అధికారులు న్యాయస్థానంలో అదనపు చార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ వ్యవహారం తెలుసుకున్న చారుసిన్హా తీవ్ర అసహనానికి గురయ్యారు. ఎంత సీనియర్ ఐపీఎస్ అధికారి అయినా.. పదవీ విరమణ తర్వాత తన ఆధ్వర్యంలో ఉన్న విభాగానికి వచ్చి తనకు తెలియకుండా కీలకమైన కేసులో సమీక్ష చేసి చార్జిషీట్ వేయమని చెప్పడంతో ఆమె అసహనానికి గురయ్యారు. ఇదే వ్యవహారంపై ఉన్నతాధికారుల వద్ద గోడు వెళ్లబోసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. రాజ్భవన్కు కాపీలు అందుకేనా? పదవీ విరమణ పొందిన తర్వాత సీనియర్ ఐపీఎస్ అధికారి వ్యవహరించిన తీరు రాజ్భవన్ దృష్టికి వెళ్లినట్టు తెలిసింది. ఈ వ్యవహారాన్ని రాజ్భవన్ సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే నేరుగా అదనపు చార్జిషీట్ కాపీలు తెప్పించుకొని పరిశీలించి ఉంటారని అటు ఏసీబీ వర్గాలు, ఇటు పోలీస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే సమీక్షకు అప్పటి డైరెక్టర్ సహకరించలేదని ప్రభుత్వానికి మాజీ డీజీ ఫిర్యాదు చేసినట్టు చర్చ జరుగుతోంది. అటు రాజ్భవన్కు కాపీలు పంపడం, ఇటు మాజీ డీజీకి సహకరించకపోవడంతో ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. గవర్నర్ ఢిల్లీ టూర్పై ఆసక్తికర చర్చ ఏసీబీ గతనెల 18న ఓటుకు కోట్లు కేసులో అదనపు చార్జిషీట్ దాఖలు చేసింది. ఆ మరుసటి రోజున రాజ్భవన్కు చార్జిషీట్ కాపీలు వెళ్లాయి. తర్వాత పది రోజులకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. రాష్ట్రపతి, ప్రధాని, అటార్నీ జనరల్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తదితర ప్రముఖులందరితో భేటీ అయ్యారు. దీనితో రెండు ప్రభుత్వాల వర్గాల్లో తీవ్ర ఆందోళన కనిపిస్తోందని పలువురు చెబుతున్నారు. రెండు రాష్ట్రాల సమస్యలతో పాటుగా ఓటుకు కోట్లు కేసులో కూడా కేంద్ర ప్రభుత్వానికి రాజ్భవన్ నుంచి నివేదిక అందించినట్టు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఆ చార్జ్షీట్లో ఏముంది? ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ దాఖలు చేసిన అదనపు చార్జిషీట్లో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ల మధ్య జరిగిన సంభాషణలపై ప్రధానంగా ప్రస్తావించారు. మహానాడు జరిగిన సాయంత్రం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను కలవాలని ఈ సంభాషణలో ఉందని పేర్కొన్నారు. తమ అధినేత చెప్పిన వివరాలను స్టీఫెన్సన్కు తెలిపాలని సంభాషణల్లో వారిరువురు చర్చించుకున్నారని ఏసీబీ ఈ చార్జిషీట్లో పేర్కొంది. అదే విధంగా స్టీపెన్సన్కు నమ్మకం కల్గించాలని, తమ వైపు తిప్పుకొని ఓటు వేసేలా ధైర్యం చెప్పాలని సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్లు చర్చించుకున్న ఆడియో టేపులను ఆధారాలుగా ఏసీబీ తన చార్జిషీట్తోపాటు కోర్టులో దాఖలు చేసింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను సెబాస్టియన్కు పరిచయం చేయడంలో కీలకంగా వ్యవహరించిన జెరూసలేం మత్తయ్య వ్యవహారాన్ని సైతం ఏసీబీ పూసగుచ్చినట్టు చార్జిషీట్లో పేర్కొన్నట్టు ఏసీబీ వర్గాలు తెలిపాయి. పేదరికంలో ఉన్న ఎమ్మెల్యేలను గుర్తించే పనిని మత్తయ్యకు అప్పగించారని, అందులో భాగంగానే స్టీఫెన్సన్ను టార్గెట్ చేసుకొని బేరసారాలు సాగించారని ఏసీబీ పేర్కొన్నట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు. అలాగే వీరిద్దరితో జరిగిన చర్చల సారాంశాన్ని ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే రేవంత్రెడ్డికి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారని ఏసీబీ పేర్కొంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో డీల్, టైమ్ ఫిక్స్ చేయడంలో ఈ ముగ్గురిది కీలక పాత్ర అని ఏసీబీ ఈ చార్జిషీట్లో వివరించింది. -
కీలకమైన తీర్పు
త్రికాలమ్ ప్రజల జీవితాలను శాసించే అంశాలలో కొన్ని సామాజికమైనవి. మరికొన్ని రాజకీయమైనవి. ఇంకా కొన్ని ఆర్థికమైనవి. మిగిలినవి న్యాయపరమైనవి. ఈ నాలుగు రంగాలనూ సంవిధానం (రాజ్యాంగం) శాసిస్తుంది. మొదటి రెండు రంగాలపై సమాజంలో చాలాకాలంగా చర్చ జరుగుతోంది. ప్రజలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆర్థిక, న్యాయపరమైన అంశాలపైన ఇటీవలి వరకూ అవ గాహన అంతగా లేదు. సమాలోచన లేనేలేదు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ధర్మమా అని ఇప్పుడు ఆర్థికాంశాలను అనివార్యంగా తెలుసుకోవలసి వస్తున్నది. గృహిణులూ, రైతులూ, కార్మికులూ అందరూ డిజిటల్ లావాదేవీల గురించి మాట్లాడుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించి డెబిట్ కార్డులూ, ఆన్లైన్ బదలాయింపులూ వగైరా ఆధునిక ప్రక్రియలలో ప్రజలందరికీ తర్ఫీదు ఇవ్వడానికి నడుం బిగించడంతో ఆర్థికాంశాలను తెలుసుకోవడం తప్పనిసరి. అంతే ముఖ్యమైన న్యాయవ్యవస్థ పైన ప్రజల పరిజ్ఞానం దాదాపు శూన్యం. ఎవరైనా తప్పని పరిస్థితులలోనే కోర్టు గడప తొక్కుతారు. న్యాయవాది చెప్పినట్టే నడుచుకుంటారు. తరాలు గడిచినా వ్యాజ్యాలు పరిష్కారం కావు. చట్టాలు తెలుసుకొని నిర్ణయాలు తీసుకునే పరి స్థితి లేదు. లోక్ అదాలత్ వంటి సంస్థలు సరిపోవు. అందుకే న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను ప్రశ్నించకుండా ఆమోదించడం పౌరులకు అలవాటుగా మారింది. న్యాయస్థానాలను ప్రశ్నించకూడదనీ, తీర్పులను శిరసావహించ డమే కానీ విమర్శించడం నేరమనే అభిప్రాయం సామాన్య ప్రజలలో ఉంది. న్యాయమూర్తికి దురుద్దేశాలు ఆపాదించకుండా తీర్పులోని మంచిచెడులను పరిశీలించవచ్చు. ప్రజలు తమ వాదనలనూ, తీర్పులనూ తరచి పరీక్షిస్తారనే స్పృహ ఉన్నప్పుడు న్యాయవాదులూ, న్యాయమూర్తులూ, న్యాయాధికా రులూ మరింత జాగ్రత్తగా ఉంటారు. వారూ మానవమాత్రులే. దైవాంశ సంభూతులు కారు. సంవిధానమే సర్వోన్నతం రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలనీ, సంవిధానం అన్నిటి కంటే ఉన్నత మైనదనీ, చట్టం ఎదుట అందరూ సమానమేననే అభిప్రాయంతో ప్రజలు న్యాయస్థానాలను విశ్వసిస్తారు. తాము కళ్ళతో చూసిన విషయం, చెవులతో విన్న అంశం కోర్టులలో నిగ్గుతేలకుండా తేలిపోతుంటే పౌరులు గందరగోళంలో పడతారు. ఇటువంటి అనుభవం తరచుగా ఎదురైతే న్యాయవ్యవస్థపైనే అవి శ్వాసం కలుగుతుంది. కేసు వాదించే న్యాయవాది లోపమో లేక చట్టాన్ని అన్వ యించడంలో న్యాయమూర్తి వైఫల్యమో తెలియదు. సాక్ష్యాధారాలు సేకరించ డంలో పోలీసు యంత్రాంగం లోపం కావచ్చు. వాటిని సవ్యంగా సమర్పించ డంలో ప్రాసిక్యూషన్ అసమర్థత కావచ్చు. అందుకే హత్య కేసులనూ, దొమ్మీ కేసులనూ సాక్ష్యాధారాలు లేవనే కారణంగా నేరస్థులను నిర్ణయించకుండానే, శిక్ష విధించకుండానే న్యాయస్థానాలు కొట్టివేస్తుంటాయి. ‘ఓటుకు నోటు కేసు’ విష యంలో ఇటువంటి పరిణామాలు చాలా సంభవిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నామినేటెడ్ ఎంఎల్ఏ ఎల్విస్ స్టీఫెన్ సన్కు తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్రెడ్డి నోట్ల కట్టలు ఇవ్వజూపడాన్ని టీవీలలో ప్రేక్షకులు ఒకటికి పదిసార్లు తిలకించారు. రేవంత రెడ్డిని వలవేసి తెలంగాణ ఏసీబీ 2015 మే 31న పట్టుకుంది. ఆ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి స్వరాన్ని పోలిన స్వరం ‘మావాళ్ళు బ్రీఫ్డ్ మీ...’అంటూ మాట్లాడటం టీవీ చానళ్ళే వినిపించాయి. అనంతరం ’చంద్రబాబూ... నిన్ను ఆ బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు’ అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) బహిరంగసభలో హుంకరిస్తూ తర్జని ఊపుతూ హెచ్చరించడం ప్రజలు టీవీలలోనే చూశారు. ‘యూ హావ్ పొలీస్... వియ్ హావ్ పోలీస్. యూ హావ్ ఏసీబీ...వియ్ హావ్ ఏసీబీ... ’అంటూ చంద్రబాబునాయుడు తీవ్రస్వరంతో కేసీఆర్ను సవాలు చేయడం విన్నారు. ఇంత జరిగిన తర్వాత ఆరోపణలపై సత్వరం విచారణ జరుగుతుందనీ, నిజం నిగ్గు తేలుతుందనీ, ఎన్నికలలో అవినీతికి పాల్పడు తున్నవారిని న్యాయవ్యవస్థ అభిశంసిస్తుందనీ, కనీసం ఆక్షేపిస్తుందనీ ఆశించిన వారికి ఆశాభంగం మిగిలింది. శుక్రవారంనాడు హైకోర్టు న్యాయమూర్తి తాళ్ళూరి సునీల్ చౌదరి ఇచ్చిన తీర్పుతో ‘ఓటుకు నోటు కేసు’ మరింత బలహీనపడింది. శాసనమండలి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేయవలసిందిగా కోరుతూ తనకు ముడుపులు ఇవ్వజూపారంటూ స్టీఫెన్సన్ ఫిర్యాదు చేశారు. ఆయన వాగ్మూలం తీసుకొని, ఇతరత్రా ఆధారాలు సేకరించి తెలంగాణ అవినీతి నిరోధక సంస్థ (యాంటీ కరప్షన్ బ్యూరో–ఏసీబీ) అభి యోగపత్రాన్ని (చార్జిషీట్) తెలంగాణ ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది. అందులో చంద్రబాబునాయుడు పేరును 30 కంటే ఎక్కువ సార్లు పేర్కొన్నది. అన్ని సార్లు ప్రస్తావనకు వచ్చిన వ్యక్తిని ఏసీబీ అధికారులు గవర్నర్ అనుమతి తీసుకొని విచారిస్తారనే ఎవరైనా భావిస్తారు. కానీ ఆ పని జరగలేదు. ఎందుకు జరగలేదో ప్రజలకు తెలియదు. చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్రాన్ని వదిలి అమ రావతికి తరలివెళ్ళడంతో రాజకీయ సమీకరణలు మారాయి. ఇద్దరు ముఖ్య మంత్రుల మధ్య రాజీ కుదర్చడంలో బీజేపీ పెద్దల ప్రమేయం ఉందని కూడా సమాచారం ప్రచారంలో ఉంది. ప్రజలలో ఉన్న అనుమానాలు బలపడే విధంగా ఈ కేసులో తెలంగాణ ఏసీబీ దర్యాప్తు మందగించింది. చంద్రబాబునాయుడు స్టీఫెన్సన్తో మాట్లాడినట్టు ఆరోపిస్తున్న స్వరాన్ని తెలంగాణ ఏబీసీ పరీక్షకు పంపించకుండా తాత్సారం చేసింది. ఈ దశలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో చంద్ర బాబునాయుడి పాత్రపై దర్యాప్తు జరపాలంటూ తెలంగాణ ఏసీబీ కోర్టు తెలంగాణ ఏసీబీని ఆదేశించింది. దీన్ని చంద్రబాబునాయుడు హైకోర్టులో సవాలు చేశారు. తెలంగాణ ఏబీసీ కోర్టు ఆదేశంపైన హైకోర్టు 2016 సెప్టెంబర్ 2న తాత్కాలిక స్టే మంజూరు చేసింది. ఆ నిర్ణయాన్ని ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో సవాలు చేశారు. వాదనలు ఆలకించిన సుప్రీం ఈ కేసును నాలుగు వారాలలో పరిష్కరించాలంటూ హైకోర్టును ఆదేశించింది. చంద్రబాబు నాయుడు తరఫున ఢిల్లీ నుంచి దిగ్గజాలవంటి న్యాయవాదులు వచ్చారు. రామ కృష్ణారెడ్డి తరఫున సుధాకరరెడ్డి వాదించారు. నవంబర్ చివరలో వాదనలు ముగిశాయి. తీర్పు శుక్రవారం ఇచ్చారు. తీర్పు పాఠం వంద పేజీలు వచ్చింది. చంద్రబాబునాయుడికి ఊరట లభించింది. రామకృష్ణారెడ్డి మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానంటూ ప్రకటించారు. చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి అనీ, ఆయనకి తెలంగాణ యంత్రాంగం, తెలంగాణ ఏసీబీపై ఎటువంటి నియంత్రణా ఉండదనీ న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఏసీబీని పిటిషనర్ చంద్రబాబునాయుడు ప్రభావితం చేస్తున్నారంటూ ఆళ్ల రామకృష్ణా రెడ్డి చేసిన ఆరోపణ కేవలం కాల్పనికమైనది మాత్రమేనని నిర్థారించారు. ఎవరిపైన అయినా నిరాధారమైన, అర్థం లేని ఆరోపణలు చేయడం సులభ మంటూ వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబునాయుడు పాత్ర పైన దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలంటూ తెలంగాణ ఏసీబీకోర్టు ఏసీబీని ఆదేశించడం న్యాయబద్ధమా, కాదా అన్నదే జస్టిస్ సునీల్ చౌదరి ఎదుట ఉన్న ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడంతో సరిపుచ్చుకోకుండా చంద్రబాబు నాయుడు నిర్దోషి అంటూ తీర్పు ఇవ్వడం విశేషం. మొత్తంమీద జస్టిస్ సునీల్ చౌదరి తీర్పుకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఈ తీర్పు ప్రభావం తెలంగాణ ఏసీబీలో విచారణలో ఉన్న అసలు కేసుపైన పడే అవకాశాలు ఉన్నాయి. ఏసీబీ కోర్టుకు హైకోర్టు తీర్పు మార్గదర్శనం చేస్తుంది. న్యాయమూర్తి అన్ని కోణాల నుంచీ సాక్ష్యాధారాలను జాగ్రత్తగా పరిశీలించే సుదీర్ఘమైన తీర్పు వెలువరించి ఉంటారు. సుప్రీంకోర్టు లోగడ ఇచ్చిన తీర్పులను ఉటంకిస్తూ సాధికారికంగా తీర్పు రచించి ఉంటారు. చట్టపరమైన అంశాల జోలికి వెళ్ళకుండా కేవలం ఇంగితజ్ఞానం వినియోగించి తీర్పు చదివినవారికి కొన్ని సందేహాలు కలుగుతాయి. వాటిలో ప్రధానమైనవి ఇవి: 1) రెండో ప్రతి వాది రామకృష్ణారెడ్డికి తెలంగాణ ఏసీబీకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అర్హత (లోకస్స్టాండీ) లేదని న్యాయమూర్తి నిర్ణయించారు. 2) రెండో ప్రతివాది సమర్పించిన స్వరనమూనాను విశ్వసించడం కష్టం అనీ, అది సేకరించిన విధం సరైనది కాదనీ, ప్రతివాది ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదు ఏసీబీ చార్జిషీట్కు నకలు మాత్రమేననీ వ్యాఖ్యానించారు. 3) కక్షిదారు (పిటిషనర్) చంద్రబాబునాయుడూ, స్టీవెన్సన్ మధ్య జరిగినట్టు చెబుతున్న సంభాషణను సమగ్రంగా పరిశీలించాలి కానీ ఒకటి, రెండు వాక్యాలను చూపించి భాష్యం చెప్పకూడదని అన్నారు. తమ పార్టీకి ఓటు వేయమని కానీ ఓటింగ్ రోజున నగరంలో ఉండకుండా విదేశాలకు వెళ్ళమని కానీ స్టీఫెన్సన్కు చంద్రబాబు నాయుడు చెప్పలేదని న్యాయమూర్తి తెలిపారు. 4) ఒక వ్యక్తికి తెలియకుండా అతని స్వరాన్ని రికార్డు చేసినట్లయితే అది న్యాయస్థానంలో చెల్లనేరదని చెప్పారు. 5) రెండో ప్రతివాది వ్యక్తిగత, రాజకీయ కక్ష సాధింపు కోసం ఈ వ్యాజ్యం తీసుకువచ్చారని అనుకునే అవకాశం లేకపోలేదని అన్నారు. రామ కృష్ణారెడ్డికి నిగూఢమైన లక్ష్యం (హిడెన్ ఎజెండా) ఉన్నదని ఆరోపించారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం పేరుతో వ్యక్తిగత ప్రయోజనాల కోసం న్యాయస్థానాలను వినియోగించుకునేవారిని ఉపేక్షించరాదంటూ ఉద్ఘాటించారు. 6) ఏబీసీ ప్రత్యేక కోర్టు మెదడు ఉపయోగించకుండా ఆదేశాలు జారీ చేసిందంటూ తప్పుపట్టారు. ఈ ఆరు అంశాలలో ఏమైనా వైరుధ్యాలు ఉన్నాయేమో పరిశీలిద్దాం. రాజ్యానిదే బాధ్యత నేరం ఎవరు చేసినా, ఎక్కడ జరిగినా దాన్ని విచారించి దోషులను శిక్షించే బాధ్యత, హక్కు పూర్వకాలంలో రాజులకు ఉండేది. రాజ్యాంగ పాలన అమలులోకి వచ్చిన తర్వాత ఈ తరహా రాజ్యాంగ విధులు నిర్వహించడానికి న్యాయవ్యవస్థ ఏర్పడింది. నేరం జరిగినప్పుడు దాని తాలూకు సమాచారం ఎవరు న్యాయస్థానానికి అందించారన్నది ప్రశ్న కాదు. సమాచారం సరైనదా కాదా అన్నదే పరిశీలనాంశం. ఫిర్యాదు చేసినవారు ఎక్కడివారైనా, ఎవరైనా కావచ్చు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడికి తెలంగాణ ఏసీబీకోర్టులో పిటిషన్ వేసే హక్కు లేదనడం చట్టం ప్రకారం సహేతుకమేమో కానీ చట్టం తెలియని సాధా రణ పౌరులకు సమంజసంగా కనిపించదు. బాధితులు మినహా తక్కినవారికి అర్హతే లేదంటే న్యాయం నిర్ణయించే క్రమానికి అది పరిమితి అవుతుంది. టూజీ స్కాం వంటి నేరాలు ప్రజాప్రయోజన వ్యాజ్యం (పీఐఎల్) కారణంగా వెలుగు లోకి వచ్చినవే. కేవలం ఉత్తరం రాస్తే దాన్ని పిల్గా స్వీకరించిన జస్టిస్ భగవతి వంటి గొప్ప న్యాయమూర్తుల గురించి గర్వంగా చెప్పుకుంటాం. క్రిమినల్ కేసుకూ, ప్రజాప్రయోజనాల వ్యాజ్యానికీ అంతరం ఉన్నది. క్రిమినల్ ప్రోసీజర్ కోడ్ ప్రకారమే వ్యవహరించాలన్న మాట వాస్తవమే. కానీ సంబంధం లేనివారు ఫిర్యాదు చేయకూడదన్నా, పిటిషన్ దాఖలు చేయరాదన్నా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడూ, దాడులు జరిగినప్పుడూ పోలీసులకు సమాచారం అందించడా నికి ఎవ్వరూ ముందుకు రారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మను షులోయ్ అని గురజాడ చెప్పింది రాజ్యానికీ వర్తిస్తుంది. రాజ్యం (స్టేట్) అంటే పౌరులే. పౌరులు తమ సౌలభ్యం కోసం సృష్టించుకున్న రాజ్యాంగ వ్యవస్థల సమాహారమే. ప్రతి పౌరుడికీ ఏ కోర్టులోనైనా పిటిషన్ వేసే స్వేచ్ఛ రాజ్యాంగం ప్రసాదించిందనే భావన అందరిలో ఉంది. స్వరనమూనాపై విశ్లేషణ కోర్టుకు దరఖాస్తు పెట్టుకొని కోర్టు అనుమతితో స్వరనమూనాను తీసుకోవా లన్న మాట నిజమే. రెండో ప్రతివాది ఏదో ఒక విధంగా స్వరనమూనా సంపా దించి ముంబయ్లోని లాబ్లో పరీక్షించడం న్యాయస్థానానికి సాంకేతి కంగా ఆమోదయోగ్యం కాకపోవచ్చు. కానీ తన ఎదుట దాఖలైన స్వర నమూనాను న్యాయస్థానంలో ఉన్న నమూనాతో పోల్చి ప్రతివాది దాఖలు చేసింది దొంగ నమూనా అని నిరూపించవచ్చు. అదే జరిగితే న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టిం చినందుకు చట్టప్రకారం ప్రతివాదిని శిక్షించవచ్చు. రెండు నమూనాలూ ఒకటే అయితే దాన్ని ఆమోదించవచ్చు. ఎన్ని నిబంధనలు పెట్టుకున్నా అంతిమంగా నిజాన్ని నిగ్గు తేల్చడమే కదా న్యాయస్థానాల కర్తవ్యం? స్వరనమూనాకు విలువ లేదంటూనే అందులోని అంశాలపై న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. చంద్ర బాబునాయుడివిగా చెబుతున్న మాటలన్నిటినీ సమ్యక్ దృష్టితో చూడాలని చెబుతూ ‘ఫ్రీలీ యూకెన్ డిసైడ్’ అని చెప్పారు కదా ఎక్కడా ఒత్తిడి చేయలేదు కదా అంటూ న్యాయమూర్తి తర్కించారు (తీర్పు పూర్తి పాఠంలో 153 నుంచి 157వ పేరా వరకూ). వారి తర్కం ప్రకారమే ఆ సంభాషణను మొత్తం స్వీకరిం చాలి లేదా మొత్తం తిరస్కరించాలి. ఒక వ్యక్తికి తెలియకుండా, ఆ వ్యక్తి అనుమతి లేకుండా ఎలక్ట్రానిక్ పరికరంపైన రికార్డు చేసిన స్వరం చట్టం దృష్టిలో ఆమోద యోగ్యం కాదు (Recording voice of an individual on electronic record without his knowledge or consent cannot be treated as his admitted voice) అని తీర్పు 142వ పేరాలో (86వ పేజీ ఎగువ వాక్యాలు) స్పష్టం చేశారు. ఇదే సూత్రం సర్వత్రా అమలు జరిగితే రహస్యంగా రికార్డు చేసే స్వరాలకూ, స్టింగ్ ఆపరేషన్లకూ, తెహల్కా కథనాలకూ చట్టబద్ధత లేనట్టే భావిం చాలి. నీరా రాడియా టేపులకూ విలువ లేదనుకోవాలి. ఇవన్నీ న్యాయమూర్తి చెప్పినట్టు అవినీతి నిరోధక చట్టంలోని 12వ సెక్షన్, భారత శిక్షాస్మృతి 120–బి సెక్షన్ ప్రకారం చెల్లవు. న్యాయమూర్తులు తమ ఎదుట సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించి నిర్ణయాలకు వస్తారు. కక్షిదారుల రాజకీయ విశ్వాసాలనూ, దేశంలో, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులనూ పరిగణనలోకి సాధారణంగా తీసుకోరు. ప్రతి కేసు వెనుకా ఏదో ఒక ప్రయోజనమో, ఆక్రోశమో, ఆందోళనో ఉంటుంది. వాటితో నిమిత్తం లేకుండా తన ఎదుట వినిపించిన వాదనలు ఆలకించి వస్తునిష్ఠంగా న్యాయాన్యాయాలను నిర్ణయిస్తారని న్యాయస్థానాలతో పరిచయం లేనివారు భావిస్తారు. జస్టిస్ సునీల్చౌదరి రాజకీయ నేపథ్యాలను చర్చించారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, పిటిషనర్ తెలుగుదేశం నాయకుడనీ, ప్రతివాది ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి చెందిన శాసనసభ్యుడనీ, పిటిషనర్పైన వ్యక్తిగత, రాజకీయ కక్ష సాధించడం కోసం ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసి ఉండవచ్చుననీ వ్యాఖ్యానిం చారు (130,131వ పేరా). రామకృష్ణారెడ్డి తెలంగాణ శాసనమండలి సభ్యుడు కాదనీ, తెలంగాణలో జరిగిన నేరంతో ఆయనకు సంబంధం ఏమిటనీ ప్రశ్నిం చారు. ప్రజాప్రయోజన వ్యాజ్యం అంటే ఏమిటో న్యాయస్థానానికి తెలుసుననీ, ప్రజాప్రయోజన వ్యాజ్యం ముసుగులో ఎవరైనా రహస్య ఎజెండా పెట్టుకొని వ్యాజ్యం తీసుకొని వస్తే న్యాయస్థానాలు దాన్ని అనుమతించరాదని కూడా న్యాయమూర్తి స్పష్టం చేశారు. కక్షిదారుల రాజకీయ, సామాజిక, ఆర్థిక వ్యవహా రాలతో నిమిత్తం లేకుండా విషయ ప్రాధాన్యం, నిజానిజాల ఆధారంగా న్యాయ స్థానాలు తీర్పు ఇవ్వాలన్న అభిప్రాయానికి ఇది విరుద్ధం. అయినప్పటికీ చట్టం ప్రకారం న్యాయమూర్తి నిర్ణయం సరైనదే కావచ్చు. పరిశోధన ఏబీసీ చేయవలసిందే ఏసీబీ విచారణ సవ్యంగా జరగడం లేదని భావించి, సజావుగా జరిగే విధంగా ఏసీబీని ఆదేశించాలంటూ అభ్యర్థిస్తూనే రెండో ప్రతివాది ఏబీసీ కోర్టును ఆశ్రయించారు. తాను స్వయంగా పరిశోధన చేస్తానంటూ రాలేదు. ఒక వ్యక్తికి అది సాధ్యం కూడా కాదు. కేసు పరిశోధన బాధ్యతను తాను స్వీకరిస్తానంటూ రెండో ప్రతివాది –రామకృష్ణారెడ్డి– ముందుకు వచ్చారని న్యాయమూర్తి అన్నారు (This clearly indicates that the second respondent came forward to showlder the responsibility of investigation-Para 127). పరిశోధ నలో పాల్గొనడానికి ప్రతివాదిని అనుమతిస్తే ఏబీసీ నైతికంగా దెబ్బ తింటుందని వ్యాఖ్యానించారు. ప్రతివాది ప్రతిపాదన అది కాదు. న్యాయమూర్తి స్పష్టం చేసినట్టే అన్ని అంశాలూ సమ్యక్దృష్టితో చూసినప్పుడు రేవంతరెడ్డికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో, స్టీఫెన్సన్కు డబ్బు ఇచ్చి ఆయనను లోబరచు కోవలసిన అవసరం రేవంత్రెడ్డికి ఎందుకు కలిగిందో, స్టీఫెన్సన్కి డబ్బు అప్పజెప్పడం వల్ల, ఆయనను సుముఖుడిని చేసుకోవడం వల్ల ప్రయోజనం ఎవరికో ఆలోచించాలి. ఇది చంద్రబాబునాయుడి నాయకత్వంలోని తెలుగు దేశం పార్టీ రచించిన వ్యూహమనీ, దీని అమలు బాధ్యత టీడీపీ శాసనసభ్యుడు రేవంత్రెడ్డికి అప్పగించారనీ, స్టీఫెన్సన్ను ‘కొనుగోలు’ చేసే ప్రయత్నం తెలుసు కొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏసీబీ వలలో రేవంత్రెడ్డి చిక్కే విధంగా వ్యవహరించారనీ చట్టం తెలియని సాధారణ పౌరులకు అర్థం అవుతుంది. టీవీలో దృశ్యాలను చూసినవారందరికీ ఇది తేటతెల్లమే. ఈ విషయాలు న్యాయ స్థానాలలో ఎప్పటికీ నిర్థారణ కాకపోవచ్చు. అది వేరే సంగతి. ఈ కేసులో న్యాయస్థానాలలో నిర్ణయాలు ఏమైనా జనాభిప్రాయం మాత్రం మారదు. - కె. రామచంద్రమూర్తి -
‘చంద్రబాబుకు వణుకు మొదలైంది’
-
‘చంద్రబాబుకు వణుకు మొదలైంది’
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసు విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇవాళ కూడా న్యాయస్థానం ఎదుట వాదనలు వినిపించారు. కాగా ఓటుకు కోట్లు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు పాత్రపై విచారణ జరపాలంటూ ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఏసీబీ అడ్వకేట్ సోమవారం కోర్టులో వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ ఓటుకు కోట్లు కేసులో సీఎం చంద్రబాబుకు వణుకు మొదలైందని విమర్శించారు. చట్టాలన్నీ తమకు అనుకూలంగా ఉన్నప్పటికీ చంద్రబాబు తరపు లాయర్లు పసలేని వాదన వినిపించారని అన్నారు. 482 క్వాష్ పిటిషన్ చెల్లదని తెలిసి కూడా మొండిగా వాదించారని, గత మూడు రోజులుగా చంద్రబాబు తరఫు న్యాయవాదులపై ధీటైన వాదన వినిపించామన్నారు. ఇక అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన ఏ కేసు విచారణను ఆపడానికి వీల్లేదన్న అంశాన్ని ఆర్కే తరపు లాయర్ పొన్నవోలు సుధాకర్రెడ్డి కోర్టు దృష్టికి తెచ్చారు. 482 క్వాష్ పిటిషన్ చెల్లదని ఆయన కోర్టుకు వివరించారు. 190 పీఆర్పీసీ ద్వారా తమకు వాదన వినిపించే అవకాశం ఉందని తెలిపారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కేసులో ఎంపీలు, పబ్లిక్ సర్వెంట్లు పీసీ యాక్ట్ కింద వస్తారని సుప్రీంకోర్టు ఇప్పటికే తెలిపిందన్న విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్లారు. -
ఓటుకు కోట్లు కేసు విచారణ రేపటికి వాయిదా
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసు విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి సోమవారం కోర్టులో తమ వాదనలు వినిపించారు. ‘ఓటుకు కోట్లు కేసులో నిందితులు రెడ్హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడ్డారు. ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయారు. నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్తో రూ.2.5కోట్లకు టీ.టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నారు. నన్ను బాసే మీ వద్దకు పంపారని రేవంత్ చెప్పారు. ఇంకేమన్నా కావాలంటే చంద్రబాబుతో నేరుగా మాట్లాడవచ్చని, స్టీఫెన్ సన్కు రేవంత్ చెప్పిన మాటలు రికార్డు అయ్యాయి. రేవంత్ చెప్పిన తర్వాత స్టీఫెన్తో చంద్రబాబు నేరుగా మాట్లాడారు. మన వాళ్లు బ్రీఫ్డ్ మి అని స్టీఫెన్తో చంద్రబాబు అన్నారు. ఈ కేసుపై పిటిషనర్కు అర్హత లేదనడం సరికాదు. కీలక దశలో విచారణ ఆగిపోయింది. పురోగతి లేనందునే పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు’ అని పొన్నవోలు ఈ సందర్భంగా న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. వాదనల అనంతరం తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా పడింది. -
ఓటుకు కోట్లు కేసు విచారణ వాయిదా
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసు విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తరఫున సిద్ధార్థ లుథ్రా ఇవాళ కోర్టులో వాదనలు వినిపించారు. వచ్చే సోమవారం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు. ఓటుకు కోట్లు కేసులో పునర్విచారణ జరపాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఏసీబీ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో తనపై విచారణ నిలిపివేయాలంటూ చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా, ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టు ఎనిమిది వారాల పాటు స్టే విధించింది. బాబు స్వర నమూనాలను వివిధ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లలో పరీక్షలకు పంపి, ఆ నివేదికల ఆధారంగా ఆర్కే ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. -
రేపే విచారణకి ఓటుకు కోట్లు కేసు
-
ఈ నెల 27కు ఓటుకు కోట్లు కేసు వాయిదా
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన ఓటుకు కోట్లు కేసును బుధవారం హైకోర్టు విచారించింది. తెలంగాణ ఏసీబీ కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది. తెలంగాణలో శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందేందుకు ఎమ్మెల్యేల కొనుగోలుకు టీడీపీ కుట్ర చేయడం తెలిసిందే. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ఓటు కోసం ప్రలోభపెట్టడంతో పాటు రూ.50 లక్షలు ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి, ఇతరులు.. ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. -
నేడు హైకోర్టులో ఓటుకుకోట్లు కేసు విచారణ
-
మళ్లీ స్పీడ్ అందుకున్న ఓటుకు కోట్లు కేసు
-
'చంద్రబాబు మేనేజ్ చేసినట్లు ఎవరూ చేయలేరు'
-
అవినీతి దర్యాప్తుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
-
ట్రాన్స్కోకు పంగ‘నామా’లు
⇒ నామా నాగేశ్వరరావు విద్యుత్ కంపెనీలకు అడ్డగోలు ప్రయోజనం ⇒ క్విడ్ ప్రో కో కోసం ఏపీ సీఎం నుంచి ఒత్తిడి సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు వ్యవహారంలో ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు డబ్బిచ్చిన వారికి అయాచితంగా ప్రయోజనం చేకూర్చేందుకు చంద్రబాబు సర్కారు రంగం సిద్ధం చేసింది. తెలంగాణకు చెందిన టీడీపీ నేత, ఏపీ సీఎం బినామీగా చెప్పుకొనే నామా నాగేశ్వరరావుకు చెందిన రెండు విద్యుత్ ప్రాజెక్టులకు రూ. వేల కోట్లు దోచిపెడుతున్నారు. నెల్లూరులో ఉన్న సింహపురి, మీనాక్షి సంస్థల నుంచి విద్యుత్ కొనుగోళ్లకు ఒప్పందాలు జరిగాయి. ఈ రెండు ప్రాజెక్టుల నుంచి 12 ఏళ్ల పా టు 600 మెగావాట్లు విద్యుత్ కొనేందుకు పీపీఏ (విద్యుత్ కొనుగోలు ఒప్పందం) చేసుకున్నారు. వాస్తవానికి ఈ తతంగం గత నెల రోజులుగా నడుస్తోంది. అయితే, సదరన్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) దీనిపై తీవ్ర అభ్యంతరాలు చెప్పింది. ఏపీలో ఇప్పటికే మిగులు విద్యుత్ ఉందని, కొత్తగా ప్రైవేటు విద్యుత్ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇదే విషయాన్ని ఏపీ ట్రా న్స్కో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. కానీ నామా సంస్థల నుంచి విద్యుత్ను కొనాల్సిందేన ని సాక్షాత్తూ ఏపీ ముఖ్యమంత్రే ట్రాన్్థకో అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది. దీనివల్ల డిస్కమ్లపై రూ. వేల కోట్ల భారం పడనుంది. ఎక్కువ ధర... దీర్ఘకాలం ఇప్పుడు జరిగిన పీపీఏలు రూ. వేల కోట్లు ఖరీదైనవి. 600 మెగావాట్ల విద్యుత్ను 85 శాతం పీఎల్ఎఫ్తో తీసుకోవాలనేది ఒప్పందం. అంటే రోజుకు 12 మిలియన్ యూనిట్లు విద్యుత్ కొనుగోలు చేస్తారు. దీనికి యూనిట్కు రూ. 4.43 చొప్పున చెల్లిస్తారు. ఈ లెక్కన రోజుకు దాదాపు రూ. 5.31కోట్లు. ఏడాదికి రూ. 1,940 కోట్లు. 12 ఏళ్ల పాటు తీసుకునే ఈ విద్యుత్కు రూ. 23,280 కోట్లు ప్రజల సొమ్ము నామా సంస్థలకు దోచిపెడుతున్నారు. ఈ రెండు విద్యుత్ ప్లాంట్లు కూడా విదేశీ బొగ్గుతో నడిచేవి కావడం మరో విశేషం. అంటే, విదేశీ బొగ్గు దిగుమతిలో తేడాలు వస్తే చర వ్యయం పెరిగే వీలు కూడా ఉంది. ఇప్పటికే ఏపీ డిస్కమ్లు రూ. 4 వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయి. వీటిని పూడ్చుకోవడానికి కొత్తగా ప్రైవేటు విద్యుత్ కొనుగోలు నిలిపివేయాలని కేంద్ర ఇంధనశాఖ స్పష్టం చేసింది. క్విడ్ ప్రో కో కోసం నామాకు దొడ్డిదారిన ప్రయోజనం చేకూర్చేందుకే ఈ ఒప్పందాలు జరిగినట్టు తీవ్రంగా విమర్శలు వినిపిస్తున్నాయి. జెన్కో ఉత్పత్తి నిలిపేసి... డిమాండ్ లేదంటూ ఒక పక్క జెన్కో ఉత్పత్తిని నిలిపివేస్తున్నారు. 1600 మెగావాట్ల సామర్థ్యంగల కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్లో గత రెండు నెలలుగా ఒక యూనిట్లో తరచూ ఉత్పత్తిని నిలిపివేస్తున్నారు. కడపలోని ఆర్టీపీపీలో ప్రతీ రోజు మూడు యూనిట్లను బ్యాకిం గ్ డౌన్ చేస్తున్నారు. డిమాండే లేని పరిస్థితి ఒకపక్క, మిగులు విద్యుత్ను అమ్మలేని పరిస్థితి మరోపక్క ఉంటే... నామా సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం వెనుక దోచిపెట్టడం తప్ప మరోటి లేదని అధికారులు విమర్శిస్తున్నారు. వాస్తవానికి బహిరంగ మార్కెట్లో యూనిట్ రూ. 2లకే లభిస్తోంది. అవసరమైతే జెన్కో థర్మల్ ప్లాంట్లను కూడా తగ్గించి ఈ విద్యుత్ను తీసుకోవాలని అధికారులు సర్కారుకు ప్రతిపాదించారు. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం తన వారి ప్రయోజనం కోసం విద్యుత్ సంస్థలను నిండా ముంచేస్తోంది. -
చంపేస్తామంటూ ఎమ్మెల్యే ఆర్కేకు బెదిరింపు లేఖ
-
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేకు బెదిరింపు లేఖ
గుంటూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సోమవారం ఆగంతకుల నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. ఓటుకు కోట్లు కేసుపై సుప్రీంకోర్టుకు వెళితే చంపుతామని ఆ లేఖలో హెచ్చరికలు జారీ చేశారు. మంగళగిరిలోనే ఆర్కేను చంపేస్తామని బెదిరింపులతో పాటు, అసభ్య పదజాలంతో ఆ లేఖలో హెచ్చరించారు. తనకు వచ్చిన బెదిరింపు లేఖపై ఎమ్మెల్యే ఆర్కే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఓటుకు కోట్లు కేసులో పునర్విచారణ జరపాలని ఎమ్మెల్యే ఆర్కే ఏసీబీ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే తనపై కేసు కొట్టేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయగా, దానిపై న్యాయస్థానం స్టే ఇచ్చింది. -
హైకోర్టును ఆశ్రయించడమంటే తప్పు ఒప్పుకున్నట్లే
సీఎంపై ఉమ్మారెడ్డి ధ్వజం సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో తనపై ఏసీబీ విచారణ జరపరాదని హైకోర్టును ఆశ్రయించడంద్వారా సీఎం చంద్రబాబు తాను తప్పు చేశానని సర్టిఫికెట్ ఇచ్చుకున్నట్లయిందని శాసనమండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. పిటిషన్ వేశారంటేనే స్టీఫెన్సన్తో ఫోన్లో మాట్లాడిన స్వరం తనదేనని చంద్రబాబే నిర్ధారించుకున్నట్లయిందన్నారు. ఉమ్మారెడ్డి గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు గురువారం హడావుడిగా లంచ్మోషన్ద్వారా హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడాన్నిబట్టి దీనిపై ఆయనెంతగా ఆందోళన చెందుతున్నారో అర్థమవుతోందన్నారు. ఈ కేసు సాంకేతికంగా నిలబడదని, చంద్రబాబు స్వరపరీక్షకోసం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపేటపుడు ఏసీబీ అనుమతి తీసుకోలేదని, అసలిది ఏసీబీ పరిధిలోకే రాదని, ఎన్నికల కమిషన్ పరిధిలోనిది కనుక ఏసీబీ విచారణను నిలిపేయాలని రెండురోజులుగా కొన్ని పత్రికల్లో లీకులొస్తున్నాయన్నారు. గతంలో కూడా చంద్రబాబు ఏ విచారణా జరక్కుండా కోర్టులకెళ్లి స్టేలు తెచ్చుకున్నారని ఉమ్మారెడ్డి అంటూ.. ఏలేరు కుంభకోణంలో ఏవిధంగానైతే విచారణ జరక్కుండా స్టే తెచ్చుకున్నారో, ‘ఓటుకు కోట్లు’ కేసులోనూ అలాగే సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ హైకోర్టుకు వెళ్లడం దురదృష్టకరమని అన్నారు. ప్రత్యేక హోదా చర్చలేమిటో వెల్లడించాలి ప్రత్యేకహోదా ఇవ్వకపోతే స్నేహపూర్వకంగానే విడిపోతామని చంద్రబాబు బీజేపీకి అల్టిమేటం ఇచ్చినట్లుగా పత్రికల్లో రెండురోజులుగా లీకులొస్తున్నాయని, ఈ వ్యవహారాన్ని అంత గోప్యంగా ఉంచాల్సిన అవసరమేంటని ఉమ్మారెడ్డి ప్రశ్నించారు. -
తప్పు చేసినట్లు చంద్రబాబే ఒప్పుకున్నారు
-
విచారణకు బాబు భయపడుతున్నడు
-
'వంద శాతం ముద్దాయి చంద్రబాబే'
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన 'ఓటుకు కోట్లు' కేసులో ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వంద శాతం ముద్దాయేనని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటికే ఉన్నతస్థాయి విచారణ జరుగుతున్న ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రస్తుతం చంద్రబాబు అడ్డదారులు తొక్కుతున్నారని విమర్శించారు. అందులో భాగంగానే 'ఓటుకు కోట్లు' కేసు విచారణ నిలిపివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారని చెప్పారు. దమ్మూ, ధైర్యం ఉంటే ఈ కేసు విచారణను ఎదుర్కోవాలన్నారు. కరువు, చంద్రబాబు ఇద్దరూ కవలపిల్లల్లాంటి వాళ్లని ఎద్దేవాచేశారు. ఆయన ఎక్కడుంటే అక్కడ కరువు తాండవిస్తుందని నవీన్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. -
హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు
-
హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గురువారం ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీబీ విచారణను నిలిపివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. గత సోమవారం ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలని ఉన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రత్యేక కోర్టు ఆదేశాలపై ఏసీబీ స్పందించింది. ఓటుకు కోట్లు కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, ఈ కుట్రలో పాత్రధారులెవరో కనిపెట్టే దిశగా దర్యాప్తు చేస్తున్నామని ప్రత్యేక కోర్టుకు ఏసీబీ నివేదించింది. కుట్రను నిరూపించేందుకు అవసరమైన అన్ని ఆధారాలను సేకరిస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు బుధవారం ప్రత్యేక కోర్టులో ఏసీబీ మెమో దాఖలు చేసింది. ఈ కేసులో ప్రధాన పాత్ర పోషించిన చంద్రబాబుపై దర్యాప్తు చేయాలంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు చేయాలంటూ ప్రత్యేక కోర్టు ఆదేశించిందని, అయితే ఇప్పటికే ఈ కేసు దర్యాప్తులో ఉన్న నేపథ్యంలో మరో ఎఫ్ఐఆర్ జారీచేయాల్సిన అవసరం లేదని ఏసీబీ నివేదించింది. దర్యాప్తులో వెగులుచూసిన అంశాల ఆధారంగా అనుబంధ చార్జిషీట్ దాఖలు చేస్తామని స్పష్టం చేసింది. దర్యాప్తు పురోగతిని ఈ మెమో ద్వారా ఏసీబీ కోర్టు దృష్టికి తెచ్చింది. -
’కోట్లు’ కుట్ర....
-
‘ఓటుకు కోట్లు’ కుట్ర తేలుస్తాం
-
చంద్రబాబు నిప్పు అయితే ఎందుకు తప్పించుకుంటున్నారు?
- వైఎస్సార్సీపీ తెలంగాణ నేత కొండా రాఘవరెడ్డి - దర్యాప్తును త్వరగా ముగించాలని కేసీఆర్కు వినతి సాక్షి, హైదరాబాద్: తనకు తాను నిప్పురవ్వ అని ప్రచారం చేసుకునే ఏపీ సీఎం చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో 14 నెలలుగా ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ ప్రశ్నించింది. తాజాగా ఏసీబీ కోర్టు ఓటుకు కోట్లు కేసులో పునర్విచారణకు ఆదేశించినా, దానిపై చంద్రబాబు మాట్లాడకుండా ఏవో సొల్లు కబుర్లు చెబుతూ, దీనిపై తాను స్పందించడమేమిటి.. అడ్వొకేట్లు చూసుకుంటారని చెప్పి తప్పించుకోచూస్తున్నారని.. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి విమర్శించారు. చంద్రబాబు ఒక వ్యక్తి కాదని, ఒక రాష్ట్రానికి సీఎం అని, ఒక ఎమ్మెల్సీ సీటు కోసం తప్పిదం చేసి యావత్ 6 కోట్ల తెలుగు ప్రజలకు తలవంపులు తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. బుధవారం లోటస్పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అధికారులు ఈ కేసును త్వరితంగా దర్యాప్తు చేసి నిందితులను తేల్చేలా కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కేసును పునర్విచారించాలని కోర్టు ఆదేశించిన వెంటనే గవర్నర్ను ముఖ్యమంత్రి కేసీఆర్, ఆ తర్వాత అడ్వొకేట్ జనరల్, ఏసీబీ డీజీ ఏకేఖాన్లు కలుసుకుని వివరాలు తెలియజేసినట్లు వార్తలు వచ్చాయన్నారు. చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని, కేసీఆర్తో లోపాయికారిగా అవగాహనకు వస్తారని ప్రజల్లో జరుగుతున్న ప్రచారానికి ఆస్కారమివ్వకూడదని పేర్కొన్నారు. విచారణలో ఏసీబీకి పూర్తి స్వేచ్ఛనివ్వాలని సీఎం కేసీఆర్ను కోరారు. ఈ కేసులో గతంలోనే ప్రాథమిక విచారణ పూర్తయినందున సెప్టెంబర్ 29 వరకు ఆగకుండా త్వరితంగా విచారణ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 2న ఘనంగా వైఎస్సార్ వర్ధంతి..: ప్రజల మనిషిగా గుర్తింపు పొంది, జనరంజక పాలనను అందించిన డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఏడవ వర్ధంతిని సెప్టెంబర్ 2న ఘనంగా నిర్వహించనున్నట్లు కొండా రాఘవరెడ్డి తెలిపారు. వైఎస్సార్ ఒక ఏపీకో, తెలంగాణకో పరిమితమైన నేత కాదని, యావత్ దేశంపై ఆయన ముద్ర ఉందని చెప్పారు. అన్ని ప్రాంతాల్లో కులాలు, మతాలకు అతీతంగా ఆయన అభిమానులున్నారన్నారు. 2న పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లా, మండలంలో వైఎస్ వర్ధంతి సందర్భంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
‘ఓటుకు కోట్లు’ కుట్ర తేలుస్తాం
- ‘ఓటుకు కోట్లు’పై ప్రత్యేక కోర్టులో ఏసీబీ మెమో - ప్రాథమికంగా నలుగురు నిందితులపై చార్జిషీట్ - దర్యాప్తు పూర్తికాగానే అనుబంధ చార్జిషీట్ సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, ఈ కుట్రలో పాత్రధారులెవరో కనిపెట్టే దిశగా దర్యాప్తు చేస్తున్నామని ప్రత్యేక కోర్టుకు ఏసీబీ నివేదించింది. కుట్రను నిరూపించేందుకు అవసరమైన అన్ని ఆధారాలను సేకరిస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు బుధవారం ప్రత్యేక కోర్టులో ఏసీబీ మెమో దాఖలు చేసింది. దర్యాప్తులో వెలుగుచూసిన అంశాల ఆధారంగా అనుబంధ చార్జిషీట్ దాఖలు చేస్తామని స్పష్టం చేసింది. ఈ కేసులో ప్రధాన పాత్ర పోషించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై దర్యాప్తు చేయాలంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు చేయాలంటూ ప్రత్యేక కోర్టు ఆదేశించిందని, అయితే ఇప్పటికే ఈ కేసు దర్యాప్తులో ఉన్న నేపథ్యంలో మరో ఎఫ్ఐఆర్ జారీచేయాల్సిన అవసరం లేదని ఏసీబీ నివేదించింది. దర్యాప్తులో వెగులుచూసిన అంశాల ఆధారంగా అనుబంధ చార్జిషీట్ దాఖలు చేస్తామని స్పష్టం చేసింది. దర్యాప్తు పురోగతిని ఈ మెమో ద్వారా ఏసీబీ కోర్టు దృష్టికి తెచ్చింది. కుట్రదారుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది ఈ కేసులో పాలుపంచుకున్న కుట్రదారులందరిపైనా దర్యాప్తు సాగుతోందని, వారి పాత్రకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నామని మెమోలో వివరించింది. రేవంత్రెడ్డి, హ్యారీ సెబాస్టియన్, ఉదయ్ సింహల పాత్రకు సంబంధించిన ఆధారాలతో చార్జిషీట్ దాఖలు చేశామని పేర్కొంది. అలాగే వీరి స్వర నమూనాలు, ఇతర ఎలక్ట్రానిక్ ఆధారాలను ఎఫ్ఎస్ఎల్కు పంపామని, వారిచ్చిన నివేదిక ఆధారంగా ఈ చార్జిషీట్ దాఖలు చేశామని మెమోలో వివరించారు. రేవంత్ సహా ముగ్గురికి సమన్లు.. 29న హాజరుకావాలని ఆదేశం ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ దాఖలు చేసిన చార్జిషీట్ను ఏసీబీ ప్రత్యేక కోర్టు విచారణకు (సీసీ నెంబర్ 15/2016...కాగ్నిజెన్స్) స్వీకరించింది. ఈ చార్జిషీట్లో నిందితులుగా ఉన్న రేవంత్రెడ్డి, హ్యారీ సెబాస్టియన్, ఉదయ్ సింహలకు కోర్టు సమన్లు జారీచేసింది. సెప్టెంబర్ 29న ప్రత్యక్షంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి విక్టర్ ఇమాన్యూయేల్ బుధవారం ఆదేశాలు జారీచేశారు. 14 నెలల తర్వాత మళ్లీ కదలిక ఓటుకు కోట్లు కేసులో ఎట్టకేలకు కదలిక వచ్చింది. ఈవ్యవహారంలో గత ఏడాది జూలై 28న నలుగురు నిందితులపై ఏసీబీ చార్జిషీట్ దాఖలు చేసింది. దాదాపు 14 నెలలుగా ఈ కేసు దర్యాప్తులో ఎటువంటి పురోగతి లేదు. ఇక మూసేసిన దశలో ఉన్న ఈ కేసును వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఫిర్యాదుతో మళ్లీ దర్యాప్తు చేయాల్సి వస్తోంది. ఈ కుట్రలో చంద్రబాబునాయుడు పాత్రకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు సమర్పించిన నేపథ్యంలో...ఈ ఫిర్యాదుపై దర్యాప్తు చేయాలని ప్రత్యేక కోర్టు ఏసీబీని ఆదేశించింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో..14 నెలలుగా మూలనపడేసిన ఈ కేసులో ఏసీబీ అనివార్యంగా దర్యాప్తును తిరిగి ప్రారంభించింది. మన వాళ్లు బ్రీఫ్డ్ మీ వాయిస్ చంద్రబాబునాయుడిదేనని ముంబాయికి చెందిన ఫోరెన్సిక్ సంస్థ నిర్ధారించిన నేపథ్యంలో ఈ కుట్రలో ఆయన పాత్ర స్పష్టమైంది. -
చంద్రబాబుకు స్వర పరీక్ష
- నోటీసులు జారీ చేయాలని యోచిస్తున్న ఏసీబీ - సెల్ఫోన్ రికార్డు వాయిస్ వాస్తవమైనదేనని నిర్ధారించిన ఫోరెన్సిక్ ల్యాబ్ - చంద్రబాబు నిరాకరిస్తే అసెంబ్లీ రికార్డ్స్ నుంచి తీసుకునే యోచనలో ఏసీబీ సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) వేగం పెంచింది. ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు పాత్రపై దర్యాప్తు జరి పేందుకు గాను పూర్తిస్థాయిలో దృష్టిసారించిం ది. అందులో భాగంగా చంద్రబాబుకు స్వర పరీక్షలు నిర్వహించాలని యోచిస్తోంది. శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయ డం కోసం ఒక్కొక్క ఎమ్మెల్యేకు రూ.5 కోట్లు లంచం ఇవ్వజూపిన కేసులో సీఎం బాబు పాత్రపై అనేక ఆధారాలు లభ్యమైన సంగతి తెల్సిందే. ఎమ్మెల్యేలతో ఫోన్లో చంద్రబాబు స్వయంగా బేరసారాలు నడిపినట్లు ఆడియో టేపులు వెలుగు చూశాయి. నామినేటెడ్ ఎమ్మె ల్యే స్టీఫెన్సన్తో ఫోన్లో చంద్రబాబు మాట్లాడిన వాయిస్పై ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ(ఎఫ్ఎస్ఎల్) గతంలోనే నివేదిక అందజేసింది. ఆ వాయిస్ నిజమైనదే అని, ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేదని స్పష్టం చేసిం ది. అందులో ఉన్న స్వరం ఏపీ సీఎం చంద్రబాబుదేనని తాజాగా ముంబైకి చెందిన ఒక ల్యాబ్ నివేదిక అందజేసింది. అయితే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుపై ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు... చంద్రబాబుకు స్వర పరీక్షలు నిర్వహించాలని ఏసీబీ భావిస్తోంది. ప్రైవేటు ల్యాబ్ ఇచ్చిన రిపోర్టుతో పాటు కేసు తీవ్రత దృష్ట్యా ఎఫ్ఎస్ఎల్ చేత మరోసారి పరీక్షలు జరిపించాలని నిర్ణయించింది. ఇందుకోసం త్వరలో చంద్రబాబుకు నోటీసులు జారీ చేయాలని భావిస్తోందని అధికారులు అంటున్నారు. ఏడాది కిందటే చేయాలనుకున్న ఏసీబీ.. ఓటుకు కోట్లు కేసులో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు స్వర పరీక్షలు జరిపించాలని ఏడాది కిందటే ఏసీబీ భావించింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో సీఎం చంద్రబాబు సాగించిన సంభాషణ మొత్తం వాస్తవమైనదేనని ఎఫ్ఎస్ఎల్ నివేదిక నిర్ధారించింది. తర్వాత ఆ ఆడియో టేపులోని గొంతు చంద్రబాబు స్వరనమూనాతో సరిపోల్చేందుకు... స్వరపరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. మొదటగా కేసులో నిందితులుగా ఉన్న ఎమ్మెల్యేలు రేవంత్రెడ్డి, సండ్రవెంకట వీరయ్యల స్వర పరీక్షలు పూర్తి చేసింది. అసెంబ్లీ రికార్డుల నుంచి తీసుకున్న ఎమ్మెల్యేల వాయిస్ రికార్డులను, అలాగే ఎమ్మెల్యేల కొనుగోలు కోసం బేరసారాలు సాగించిన ఫోన్ సంభాషణల వాయిస్ రికార్డును సరిపోల్చేందుకు ఎఫ్ఎస్ఎల్కు పంపింది. రెండింటి వాయిస్లు సరిపోలినట్లు ఎఫ్ఎస్ఎల్ నిర్ధారించింది. అలాగే చంద్రబాబు స్వరనమూనాలను కూడా పరీక్షలకు పంపి న్యాయస్థానం ముందు సాక్ష్యాధారాలను ఉంచాలని భావించింది. అయితే గత కొంతకాలంగా ఈకేసు నెమ్మదించింది. తాజాగా న్యాయస్థానం ఆదేశాలతో రంగంలోకి దిగిన ఏసీబీ... చంద్రబాబుకు కూడా ఇపుడు స్వరపరీక్షను పూర్తి చేయాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా చంద్రబాబుకు నోటీసులను పంపించాలని, వాటికి ఆయన స్పందించకపోతే ఆయన స్వరనమూనాలను అసెంబ్లీ రికార్డుల నుంచి తీసుకోవాలని భావిస్తోంది. ఒక వేళ నోటీసులకు స్పందిస్తే గనుక ఆయన వద్దకెళ్లి తాజాగా స్వరనమూనాలను తీసుకొని ఎఫ్ఎస్ఎల్కు అందజేయాలని ఏసీబీ అధికారులు నిర్ణయించారు. -
29లోపు చంద్రబాబును విచారణ జరుపుతాం
-
వచ్చే నెల 29లోపు చంద్రబాబును విచారణ జరుపుతాం
కోర్టులో మెమో దాఖలు చేసిన ఏసీబీ హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ఏసీబీ బుధవారం మెమో దాఖలు చేసింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విచారిస్తామని ఏసీబీ అధికారులు ఆ మెమోలో పేర్కొన్నారు. గతంలో దాఖలు చేసిన ఛార్జ్సీట్ను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో గతంలో దాఖలు చేసిన ఛార్జిషీట్ను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. (ఛార్జ్షీట్ నెంబర్ 15/16గా నమోదు చేసుకుంది) గతంలో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా విచారణ కొనసాగిస్తామని ఏసీబీ అధికారులు ఈ సందర్భంగా కోర్టుకు విన్నవించారు. సెప్టెంబర్ 29లోపు చంద్రబాబుపై విచారణ జరిపి నివేదిక సమర్పిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నేత రేవంత్ రెడ్డి, ఉదయసింహా, సెబాస్టియన్లను సెప్టెంబర్ 29న విచారణకు హాజరు కావాలని ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేసింది. -
'ఓటుకు కోట్లు'లో బాబు నిందితుడే!
-
‘ఓటుకు కోట్లు’ కేసుపై గవర్నర్ ఆరా
- రాజ్భవన్లో సీఎం కేసీఆర్తో సుదీర్ఘంగా మంతనాలు - సీఎం బయటకొచ్చిన కాసేపటికే ఏసీబీ డీజీ, ఏజీతో గవర్నర్ చర్చలు - కేసు పురోగతి, కోర్టు వ్యాఖ్యలను అడిగి తెలుసుకున్న నరసింహన్ సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు పురోగతిపై గవర్నర్ నరసింహన్ ఆరా తీశారు. ఈ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రపై దర్యాప్తు చేయాలని ఏసీబీని ప్రత్యేక కోర్టు ఆదేశించిన నేపథ్యంలో మంగళవారం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీ సమావేశాల నిరవధిక వాయిదా అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు గవర్నర్తో భేటీ అయ్యారు. మంగళవారం మధ్యాహ్నం రాజ్భవన్కు వెళ్లిన సీఎం దాదాపు రెండు గంటల పాటు గవర్నర్తో చర్చలు జరిపారు. ఉభయ సభల్లో జీఎస్టీ బిల్లును ఆమోదించిన విషయాన్ని ఈ సందర్భంగా వివరించారు. అన్ని పక్షాలు ఏకగీవ్రంగా బిల్లును అంగీకరించాయని, అసెంబ్లీ ఆమోదముద్ర వేసి పార్లమెంట్కు చేరవేసినట్లు గవర్నర్కు నివేదించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ అనుమతితో జారీ చేసిన మూడు ఆర్డినెన్స్లను ఇదే సమావేశంలో బిల్లులుగా ప్రవేశపెట్టినట్లుగా వివరించారు. ఓటుకు కోట్లు కేసు దర్యాప్తుపై సీఎం, గవర్నర్ల మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి రాజ్భవన్ నుంచి బయటకు వచ్చిన కొద్దిసేపటికే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఏసీబీ డీజీ ఏకే ఖాన్, అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి గవర్నర్ను కలిసేందుకు వెళ్లడం గమనార్హం. దాదాపు 15 నిమిషాల పాటు వీరిద్దరూ గవర్నర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసు పురోగతి, ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రత్యేక కోర్టు చేసిన వ్యాఖ్యలను గవర్నర్ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. దీంతో మరోసారి ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అలజడి రేపుతోంది. సీఎం కేసీఆర్ వెంట వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ కూడా గవర్నర్ను కలుసుకున్నారు. -
'ఓటుకు కోట్లు'లో బాబు నిందితుడే!
- ఏసీబీ కసరత్తు షురూ - నిందితుల జాబితాలో ఏపీ సీఎం పేరు చేర్చే అవకాశం - న్యాయనిపుణుల సలహా మేరకు నేడు కీలక నిర్ణయం - ప్రత్యేక కోర్టు తీర్పు నేపథ్యంలో ఉన్నతస్థాయి సమావేశం - గవర్నర్తో కేసీఆర్, తెలంగాణ ఏసీబీ డీజీ ఏకే ఖాన్ భేటీ - బాబు పాత్రపై స్పష్టమైన ఆధారాలున్నాయన్న నిపుణులు - ఈపాటికే చేర్చాల్సిందంటున్న రిటైర్డ్ పోలీసు అధికారులు - చార్జిషీట్లో 33 సార్లు చంద్రబాబు పేరు - ఆ గొంతు బాబుదేనన్న ముంబై ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రపై విచారణ జరపాల్సిందిగా ఏసీబీని ఆదేశిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దర్యాప్తు ప్రక్రియ వేగం పుంజుకుంది. న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలు మంగళవారం అందడంతో ఏసీబీ కసరత్తు ముమ్మరమయ్యింది. ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేసి సెప్టెంబర్ 29లోగా నివేదిక అందజేయాలని న్యాయస్థానం ఆదేశించిన సంగతి తెల్సిందే. నెలరోజుల్లోగా విచారణ పూర్తి చేయాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు దర్యాప్తు ప్రక్రియ వేగాన్ని మరింత పెంచాలని నిర్ణయించారు. మంగళవారం నాడు సమావేశమైన ఏసీబీ ఉన్నతాధికారులు న్యాయస్థానం ఆదేశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. చంద్రబాబు పాత్రకు సంబంధించి తదుపరి చర్యల కోసం న్యాయ సలహా తీసుకోవాలని ఏసీబీ భావిస్తోంది. అందుకోసం న్యాయస్థానం వెలువరించిన తీర్పు ప్రతిని న్యాయనిపుణులకు ఏసీబీ అధికారులు పంపించారు. ఈ కేసులో ప్రాథమిక ఆధారాలున్నందున చంద్రబాబు పేరును నిందితుల జాబితాలో చేర్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఏసీబీ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు, ఏసీబీ డీజీ ఏకే ఖాన్లు మంగళవారంనాడు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్తో భేటీ అయ్యారు. సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఏసీబీ ప్రత్యేక కోర్టు తీర్పు నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ‘ఓటుకు కోట్లు’ కేసులో కోర్టు తీర్పు, తదనంతర పరిణామాలపై గవర్నర్తో వీరు చర్చించినట్లు సమాచారం. వీరితోపాటు తెలంగాణ అడ్వకేట్ జనరల్ కూడా ఈ భేటీలో పాల్గొనడం గమనార్హం. కాగా ఎన్నడూ లేనిది ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు రెండుగంటల సేపు గవర్నర్ నివాసమైన రాజ్భవన్లో గడపడం విశేషం. ప్రాథమిక ఆధారాలున్నాయంటున్న న్యాయనిపుణులు ‘ఓటుకు కోట్లు’ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని నిందితునిగా చేర్చేందుకు అవసరమైన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతేడాది తెలంగాణలో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు ముట్టజెప్పిన కేసులో ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి సహా మరికొందరిని నిందితులుగా చేరుస్తూ అవినీతి నిరోధక శాఖ గతంలో చార్జ్షీట్ దాఖలు చేసింది. నేరుగా స్టీఫెన్సన్తో చంద్రబాబు ఫోన్లో మాట్లాడటంతో ఆయననే అసలు సూత్రధారిగా భావించాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. చంద్రబాబు స్థానంలో మరొకరు ఉంటే నిందితునిగా చేర్చకుండా ఉంటారా అని రిటైర్డ్ పోలీసు ఉన్నతాధికారులు ప్రశ్నిస్తున్నారు. పైగా ఏసీబీ దాఖలు చేసిన చార్జ్షీట్లో చంద్రబాబు పేరు 33 సందర్భాల్లో ప్రస్తావనకు వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో అసలు నిందితుడు చంద్రబాబే కనుక ఆయన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చాలంటూ వైఎస్సార్సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ‘ఏసీబీ కోర్టు తీర్పు నేపథ్యంలో చంద్రబాబునాయుడు పేరు ఎఫ్ఐఆర్లో చేర్చాల్సిందే. ఇప్పటికే ఆయనకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు కూడా లభ్యమయ్యాయి’ అని రిటైర్డ్ డీజీపీ ఒకరు అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా డీజీపీగా పని చేసిన ఆ రిటైర్డ్ అధికారి ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. చంద్రబాబు కాకుండా మరొకరు ఉంటే కేసు పెట్టకుండా ఉండేవారా అని ఆయన ప్రశ్నించారు. ఏసీబీ ప్రత్యేక కోర్టు తీర్పు వల్ల అయినా అటు ఏసీబీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన దిశగా కేసును విచారిస్తాయని ఆశిస్తున్నానని మాజీ న్యాయమూర్తి ఒకరు వ్యాఖ్యానించారు. ఉన్నతమైన పదవిలో ఉన్నంత మాత్రాన తప్పుడు పనులు చేసిన వారిని ఎలా వదిలేస్తారని ఆ మాజీ న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇప్పటికే చార్జిషీట్లో పేరు ప్రస్తావన.. ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ దాఖలు చేసిన చార్జిషీట్లో ఏపీ సీఎం చంద్రబాబు పేరును పలు మార్లు ప్రస్తావించిన విషయం తెలిసిందే. అంతేకాదు ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్ల మధ్య జరిగిన ఫోన్ సంభాషణల్లో చాలా స్పష్టంగా చంద్రబాబు పేరు ప్రస్తావించారు. అలాగే ఏ-1 నిందితుడు, నేరుగా డబ్బులు అందజేసిన ఎమ్మెల్యే రేవంత్రెడ్డి కూడా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో మాట్లాడిన సంభాషణల్లో కూడా ‘బాస్’ ఆదేశాల మేరకు తాను వచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఏసీబీ కూడా న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జిషీట్లో సీఎం చంద్రబాబు పేరును దాదాపు 33 చోట్ల ప్రస్తావించింది. అలాగే స్టీఫెన్సన్ ఫోన్లో రికార్డు అయిన వాయిస్ నిజమైనదేనని, ఎక్కడా కట్, పేస్టులు లేవని, ఒకే నిడివిగల సంభాషణ అని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ కూడా న్యాయస్థానానికి నివేదిక ఇచ్చింది. ఈ వాయిస్ విషయంలో ముంబైకి చెందిన డిజిటల్ ఫోరెన్సిక్ ల్యాబోరేటరీ.. ఆ గొంతు చంద్రబాబుదేనని నిర్ధారించింది. దీంతో వాయిస్ విషయంలో స్పష్టత రావడంతో సీఎం చంద్రబాబు పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్చాలని యోచిస్తోంది. అయితే న్యాయస్థానంలో ప్రైవేటు పిటీషన్ దాఖలు చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మాత్రం సీఎం చంద్రబాబుపై అవినీతి నిరోధక చట్టం సెక్షన్-12, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 120(బి)కింద కేసు నమోదు చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో న్యాయ నిఫుణుల సలహా మేరకు ఏ క్లాజు ప్రకారం చేర్చాలనే విషయంలో ఏసీబీ అధికారులు చర్చలు జరుపుతున్నారు. -
టీడీపీలో కలకలం
హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాత్రపై దర్యాప్తు చేయాలని ప్రత్యేక కోర్టు ఆదేశించడంతో ఏసీబీ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో ఏవిధంగా ముందు కెళ్లాలనే దానిపై చర్చలు జరుపుతున్నారు. సెప్టెంబర్ 29లోగా నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు నిన్న, నేడు సమావేశమయ్యారు. చంద్రబాబును ముద్దాయిగా చేర్చే విషయంపై కసరత్తు జరుపుతున్నారు. మరోవైపు ‘ఓటుకు కోట్లు’ కేసు టీడీపీలో మరోసారి కలకలం రేపింది. కేసులో నిందితులుగా ఉన్నవారిని శిబిరాలకు తరలిస్తున్నట్టు సమాచారం. పొరుగు రాష్ట్రాలకు వీరిని పంపిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్సీ స్థానం కోసం ఎమ్మెల్యేల కొనుగోలుకు జరిపిన వ్యవహారమంతా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే జరిగిందని అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) చార్జ్షీట్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు పేరును చార్జిషీట్లో దాదాపు 33 సార్లు ప్రస్తావించింది. అంతేకాదు ఈ కుట్రకు ఎలాంటి వ్యూహం రచించింది... ఎవరెవరు పాత్రధారులు, సూత్రధారులనే విషయాన్ని స్పష్టం చేసింది. రూ.150 కోట్ల కుంభకోణం కుట్ర, ఎమ్మెల్యేల కొనుగోళ్లకు సంబంధించి న్యాయస్థానానికి అందించిన నివేదికలో ఏసీబీ పూసగుచ్చినట్లు వివరించింది. దాదాపు 25 పేజీలతో కూడిన నివేదికను న్యాయస్థానానికి ఏసీబీ అందజేసింది. -
ఓటుకు కోట్లు కేసులో బాబు పాత్రపై దర్యాప్తు
-
ఓటుకు కోట్లు కేసులో బాబు పాత్రపై దర్యాప్తు
- సెప్టెంబర్ 29లోగా నివేదిక సమర్పించండి - ఏసీబీ అధికారులకు ప్రత్యేక కోర్టు ఆదేశం - ఈ కేసులో ఏపీ సీఎం చంద్రబాబును నిందితునిగా చేర్చాలి - ఆయన గొంతును ఫోరెన్సిక్ ల్యాబ్కూడా నిర్ధారించింది - వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ - పిటిషనర్ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యేని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన ‘ఓటుకు కోట్లు’ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాత్రపై దర్యాప్తు చేయాలని ఏసీబీని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. దర్యాప్తు నివేదికను సెప్టెంబరు 29లోగా సమర్పించాలని న్యాయమూర్తి సోమవారం ఏసీబీని ఆదేశించారు. ఓటుకు కోట్లు కుట్ర కేసులో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని, ఆయనపై అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 12, భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 120(బి)కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి(ఆర్కే) ఈనెల 8న ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. నేర విచారణ చట్టం సెక్షన్ 210 కింద విచారణ చేపట్టాలని ఆ ఫిర్యాదులో కోరారు. పిటిషనర్ తరఫున న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్రెడ్డి, అల్లం రమేశ్లు సోమవారం సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. ‘‘ప్రభుత్వాలు రాజ్యాంగం అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించనప్పుడు న్యాయవ్యవస్థ జోక్యం చేసుకొని రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించాలి’’ అన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ వ్యాఖ్యలను ఈ సందర్భంగా న్యాయవాదులు ప్రస్తావించారు. చంద్రబాబుదే ప్రధాన పాత్ర: ‘‘నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను రూ.5 కోట్లకు కొనేందుకు చేసిన కుట్రలో చంద్రబాబునాయుడే ప్రధాన పాత్ర పోషించారు. ఈ కేసులో కీలక సూత్రధారి అయిన చంద్రబాబునాయుడిని మొదటి నిందితునిగా చేర్చాల్సి ఉంది. టీడీపీకి అనుకూలంగా ఓటు వేస్తే రూ.2.5 కోట్లు ఇస్తారంటూ టీడీపీ తరఫున జెరూసలెం మత్తయ్య స్టీఫెన్సన్ను కలసి ప్రలోభపెట్టారు. తర్వాత రేవంత్రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. రూ.5 కోట్లు ఇవ్వడానికి బాస్ అంగీకరించారని, అడ్వాన్స్గా రూ. 50 లక్షలు ఇస్తున్నామని రేవంత్రెడ్డి తెలిపారు. మిగిలిన నాలుగున్నర కోట్లు రేపు ఇస్తామని చెప్పారు. స్టీఫెన్సన్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు...రూ.50 లక్షలు ఇస్తుండగా రేవంత్రెడ్డిని అరెస్టు చేశారు. ఈ కేసులో రేవంత్రెడ్డిని ప్రధాన నిందితునిగా చేర్చారు. ఓ దశ వరకు దర్యాప్తు బాగానే సాగిన తర్వాత ఆగిపోయింది. చంద్రబాబును నిందితునిగా చేర్చాల్సి ఉన్నా ఏసీబీ పట్టించుకోలేదు. అందుకే ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేయాల్సి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం తన ఫోన్ను ట్యాప్ చేసిందని ఓ జాతీయ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు అంగీకరించారు. దీన్ని బట్టి చూస్తే స్టీఫెన్సన్తో మాట్లాడింది తానేనని చంద్రబాబు అంగీకరించారు. అయినా చంద్రబాబును ఏసీబీ నిందితునిగా చేర్చలేదు’’ అని న్యాయవాదులు వివరించారు. అన్ని ఆధారాలు ఉన్నా..: ఈ కుట్రలో బాబు కీలకపాత్ర పోషించారని నిరూపించేం దుకు అవసరమైన అన్ని ఆధారాలూ ఉన్నాయని న్యాయవాదులు కోర్టుకు నివేదించారు. కేసు నమోదు చేసి 14 నెలలు దాటినా ఈ కేసు లో చంద్రబాబుని ఏసీబీ నిందితునిగా చేర్చలేదని వారు పేర్కొన్నారు. తాను చంద్రబాబునాయుడు పంపితేనే వచ్చానని ఈ కేసులో మొద టి ముద్దాయిగా ఉన్న రేవంత్రెడ్డి స్పష్టం చేశారని వివరించారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో చంద్రబాబునాయుడు ప్రత్యక్షంగా మాట్లాడారని, మనవాళ్లూ అంతా బ్రీఫ్ చేశారని చెప్పారన్నారు. ఈ స్వరం చంద్రబాబునాయుడిదేనని నిర్ధారిస్తూ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన నివేదికను ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించారు. అన్ని ఆధారాలు ఉన్నా ఏసీబీ ఆయన్ను నిందితునిగా చేర్చలేదని పేర్కొన్నారు. ఈ మేరకు పిటిషనర్ సమర్పించిన ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన న్యాయమూర్తి...ఈ ఫిర్యాదుపై దర్యాప్తు చేయాలని ఏసీబీని ఆదేశించారు. పిటిషనర్ సమర్పించిన అన్ని ఆధారాలను ఏసీబీకి పంపాలని తన సిబ్బందిని ఆదేశించారు. దర్యాప్తు నివేదికను వచ్చే నెల 29లోగా సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. న్యాయస్థానం తీర్పు అనంతరం పిటిషనర్ ఆళ్ల రామక్రిష్ణారెడ్డి, న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. కీలకసాక్షిగా సీమాకొటాల్వర్ ఈ కేసులో ముంబైకి చెందిన డిజిటల్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సంస్థలో సైంటిస్టుగా పనిచేస్తున్న సీమాకొటాల్వర్ కీలకసాక్షిగా మారనున్నారు. స్టీఫెన్సన్తో మాట్లాడింది చంద్రబాబునాయుడేనని సీమాకొటాల్వర్ నిర్ధారించారు. ఈ నివేదిక ఈ కేసులో కీలక ఆధారంగా మారనుంది. రామక్రిష్ణారెడ్డి తన ఫిర్యాదులో సీమాకొటాల్వర్ను ఐదో సాక్షిగా పేర్కొన్నారు. చంద్రబాబు తప్పుచేశారు... తప్పించుకోలేరు: ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడి ప్రజాధనాన్ని అడ్డంగా దోచుకున్నారు. ఈ అక్రమార్జనతో... బలం లేకపోయినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం కోసం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు. అయినా నిస్సిగ్గుగా నేను గొప్పవాడిని, నిజాయితీపరుడిని అంటున్నాడు. చంద్రబాబు అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి ఈ కేసు నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. తప్పు చేసినా అందరినీ మభ్యపెడుతున్నాడు. తన వాయిస్ రికార్డులను ఎక్కడ నిర్ధారిస్తారో, తన బండారం ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతో ఫోరెన్సిక్ ల్యాబ్ డెరైక్టర్గా పనిచేసి పదవీ విరమణ చేసిన ట్రూత్ ల్యాబ్స్ అధినేత కేపీసీ గాంధీని అవసరం లేకపోయినా ఏసీబీ కేసు నమోదు చేసిన వెంటనే తన సలహాదారుగా నియమించుకొని కేబినెట్ హోదా ఇచ్చారు. అందుకోసం పాత తేదీలతో జీవోలు జారీచేశారు. ఈ కేసులో తనను ఎక్కడ ముద్దాయిగా చేరుస్తారో అన్న భయంతో ఏపీకి ప్రత్యేక హోదాను కూడా అడగలేకపోతున్నాడు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో మాట్లాడింది చంద్రబాబే అని ప్రజలందరికీ తెలుసు. అయినా ఆయన బొంకారు. అందుకే ఆయన దావోస్ ఆర్థిక సదస్సులో మాట్లాడిన స్పీచ్ను, ఏసీబీకి దొరికిన వాయిస్ను పరిశీలన కోసం ఓ ప్రైవేట్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపాం. మన వాళ్లు బ్రీఫ్డ్ మీ అంటూ మాట్లాడింది చంద్రబాబేనని ఆ ల్యాబ్ నిర్ధారించింది. ఒక దశలో తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా చంద్రబాబు బెదిరించారు. తనకూ ఏసీబీ ఉందని, తనకూ హైదరాబాద్లో పోలీసులు ఉన్నారంటూ కేసీఆర్ను బెదిరించాడు. తర్వాత కేసు నుంచి బయటపడేందుకు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నాడు. హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని అయినా ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు హడావుడిగా.. లేని రాజధానికి పారిపోయారు. ఉద్యోగులను అక్కడికి రావాలంటూ ఇబ్బందులు పెడుతున్నారు. ఈ కేసులో చంద్రబాబు పాత్రకు సంబంధించి ఇంత స్పష్టమైన ఆధారాలు ఉన్నా ఏసీబీ ఆయన్ను నిందితునిగా చేర్చలేదు. అందుకే ఏసీబీ ప్రత్యేక కోర్టును ఆశ్రయించాను. సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి...తన ఫిర్యాదును ఏసీబీకి పంపి దర్యాప్తు చేయాలని ఆదేశించారు. నేరం చేసి అడ్డంగా దొరికినా చట్టం నుంచి తప్పించుకొని పెద్ద మనిషిలా చెలామణి అవుతున్నాడు. చట్టం మీద, న్యాయవ్యవస్థ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ముఖ్యమంత్రి పదవి నుంచి వెంటనే చంద్రబాబు తప్పుకోవాలి. అప్పీల్కు వెళ్లకుండా ఏసీబీ దర్యాప్తునకు సహకరించాలి. చంద్రబాబు ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించినా ఈ కేసు నుంచి ఆయన తప్పించుకోలేరు. చివరికి న్యాయమే గెలుస్తుంది’’ చట్టం ముందు దోషిగా నిలబెట్టాం: న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి ‘‘ తప్పు చేసి తప్పించుకు తిరుగుతున్న చంద్రబాబును చట్టం ముందు దోషిగా నిలబెట్టాం. నామినేటెడ్ ఎమ్మెల్యేను కొనేందుకు ప్రయత్నిస్తూ చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. అయినా నిస్సిగ్గుగా ప్రవర్తిస్తూ అన్ని వ్యవస్థలను మేనేజ్చేసి దోషిగా దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారు. అన్ని ఆధారాలున్నా 14 నెలలు గడిచినా ఆయన్ను నిందితునిగా చేర్చలేదు. కళ్ల ముందే అవినీతిపరుడు తిరుగుతున్నా ప్రభుత్వ వ్యవస్థలు పట్టించుకోకపోవడాన్ని చూస్తూ ఊరుకోలేక ఈ పిటిషన్ దాఖలు చేశాం. సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం...ఏసీబీ రికార్డు చేసిన స్వర నమూనా ఆయనదేనంటూ నిర్ధారిస్తూ ఓ ల్యాబ్ ఇచ్చిన నివేదికను పరిశీలించిన తర్వాత...మా ఫిర్యాదును ఏసీబీకి పంపారు. ఈ కుట్రలో చంద్రబాబు పాత్రపై మేం సమర్పించిన అన్ని ఆధారాలను ఏసీబీకి పంపాలని ఆదేశించారు. ఓటుకు కోట్లు కేసును పునర్విచారణ చేయాలని స్పష్టం చేశారు. చివరికి న్యాయమే గెలిచింది. ఈ రోజు న్యాయదేవత సగర్వంగా తల ఎత్తుకుంటుంది’’. -
'చంద్రబాబును ఎవరూ కాపాడలేరు'
-
ఆబద్దం ఆడను, నిజాన్ని బయటపెడతా..
న్యూఢిల్లీ : త్వరలోనే వాస్తవాలను బయటపెడతానని ఓటుకు కోట్లు కేసులో A-4 నిందితుడుగా ఉన్న జెరూసలెం మత్తయ్య తెలిపారు. తనకు ప్రాణహాని ఉందంటూ ఆయన సోమవారం జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. కాగా ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ఏసీబీ కీలక నిందితుడిగా ఆరోపిస్తున్న జెరూసలెం మత్తయ్య ప్రమేయానికి సంబంధించి సరైన సాక్ష్యాలు లేవని పేర్కొన్న తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఆయన పేరును చార్జిషీటు నుంచి తప్పించిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు నిర్ణయంతో విభేదించిన తెలంగాణ ప్రభుత్వం ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్కు కౌంటర్ దాఖలుకు తనకు కొంత సమయం కావాలని మత్తయ్య ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మత్తయ్య తరఫు న్యాయవాది అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన సుప్రీంకోర్టు ఈ కేసు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ సందర్భంగా మత్తయ్య ఓ ప్రెస్నోట్ విడుదల చేశారు. ప్రాణభయంతో ఢిల్లీ వచ్చానని, అబద్ధం ఆడనని, నిజాన్ని త్వరలో బయటపెడతానని ఆయన తెలిపారు. సుప్రీంకోర్టు ద్వారా తాను నమ్మిన దేవుడు న్యాయం చేస్తాడని మత్తయ్య పేర్కొన్నారు. తనకు ప్రాణహాని జరిగితే మొదటి ముద్దాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని , అలాగే కేసీఆర్ కూడా బాధ్యుడేనని ఆయన వ్యాఖ్యానించారు. తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆయన అన్నారు. చంద్రబాబు తనను అవసరానికి వాడుకున్నారని, నీకేం కాదు..తాను ఉన్నానని చెప్పారని, ఇప్పుడు పట్టించుకోవడం లేదని మత్తయ్య ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో తాను అమాయకుడినని ఆయన తెలిపారు. తనను ఎ4 గా చిత్రించి, దేశ ప్రధాన న్యాయస్థానంలో దోషిగా నిలబెట్టేందుకు ఆంధ్రా,తెలంగాణ ప్రభుత్వాలు, తెలుగుదేశం, టిఆర్ఎస్లు ఆడుతున్న చదరంగంలో జెరుసలెం మత్తయ్య అను నన్ను బలిపశువును చేసి, ఇరు రాష్ట్రాలలో నా కులస్థులకు, మతస్థులకు అర్దం కాని చిక్కుల్లో పడేస్తున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు బాగోతం , చంద్రశేఖరరావు చలోక్తులు, రాజకీయాలకే పరిమితం కాకుండా, తనలాంటి సామాన్యుల జీవితాలతో కేసీఆర్ ప్రభుత్వం ముద్దాయిగా చేసే ప్రయత్నం జరుగుతోందని ఆయన అన్నారు. చంద్రబాబు జోలపడి నీకేం కాదు.. అని ధైర్యం చెప్పినట్లు నటించారని, ఇరువురు తన పరిస్థితిని అగమ్యగోచరం చేశారని, దీనిని ప్రజలే తీర్పు చెప్పాలని ఆయన అన్నారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని అన్నారు. సుప్రీంకోర్టు మీద నమ్మకం ఉందని మత్తయ్య అన్నారు. ప్రజాకోర్టులో నిలబడి తనకు న్యాయం జరిగేవరకూ పోరాడతానని తెలిపారు. తనకు, కుటుంబసభ్యులకు ప్రాణ రక్షణ కల్పించాలంటూ జాతీయ మానవహక్కుల కమిషన్ లో పిటిషన్ వేశానని ఆయన చెప్పారు. సుప్రీంకోర్టులో కౌంటర్ వేశాక తనలో దాగిన నిజాలు పత్రికా ముఖంగా తెలియచేస్తానని మత్తయ్య చెప్పారు.