హైదరాబాద్: సాయంత్రం వేళ సరదాగా ఆడుకోవాలని పార్కుకు వెళ్లిన ఓ చిన్నారి ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ లుంబినీ పార్కులో బుధవారం సాయంత్రం రెండు బ్యాటరీ కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆ చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.