జూబ్లీహిల్స్లో కారు బీభత్సం
Published Mon, Jan 30 2017 12:06 PM | Last Updated on Tue, Aug 14 2018 3:25 PM
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్లో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఆపోలో ఆస్పత్రి సమీపంలో సోమవారం ఉదయం వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన నడుకుంటూ వెళ్తున్న 15 మంది పాదచారుల పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 9 మంది గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారును అక్కడే వదిలి డ్రైవర్ పరారయ్యాడు. అతని కోసం సీసీ టీవీ ఫుటేజిల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.
Advertisement
Advertisement