నాంపల్లిలోని రెండు హోటళ్లపై బాలల హక్కుల కమిషన్ అధికారులు దాడులు జరిపారు.
హోటళ్లపై దాడులు..బాలలకు విముక్తి
Oct 5 2016 11:00 AM | Updated on Sep 4 2017 4:17 PM
హైదరాబాద్: నాంపల్లిలోని రెండు హోటళ్లపై బుధవారం బాలల హక్కుల కమిషన్ అధికారులు దాడులు జరిపారు. ఈ సందర్భంగా పలువురు బాలలకు విముక్తి కల్పించారు.
ఈ దాడిలో కరాచీ బేకరీలో నలుగురు, న్యూ పారడైజ్ లాడ్జిలో 8మంది మైనర్లు పట్టుబడ్డారు. వీరిని బొమ్మలు విక్రయించే పనిలో వాడుకుంటున్నట్లు తేలిందని చైల్డ్ కమిషన్ అధికారి ఇంతియాజ్ చెప్పారు. వీరికి కనీస వేతనంతో పాటు ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని కమిషనర్ అచ్యుతరావు తెలిపారు. పట్టుబడిన 12 మంది బాలలను బాలసదన్కు తరలించామన్నారు. ఈ మేరకు సంబంధిత హోటల్ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
Advertisement
Advertisement