Nampally
-
నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు సీఎం రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ముందు సీఎం రేవంత్రెడ్డి గురువారం హాజరయ్యారు. బీజేపీ రిజర్వేషన్లు తొలగిస్తుందని.. గత పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ వీడియో విడదల చేసిన సంగతి తెలిసిందే.. ఆ సమయంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్పై కేసు నమోదైంది. హైదరాబాద్, నల్గొండలో కేసు నమోదు చేశారు. విచారణ నిమిత్తం నాంపల్లి ప్రజాపత్రినిధుల కోర్టుకు రేవంత్రెడ్డి వెళ్లారు. తదుపరి విచారణను కోర్టు.. ఈ నెల 23కి వాయిదా వేసింది. -
నాంపల్లి స్పెషల్ కోర్టులో హాజరైన మంత్రికొండ సురేఖ
-
చర్లపల్లి తరహాలో మరిన్ని స్టేషన్లు..
సాక్షి, హైదరాబాద్: ఆధునిక రైళ్లను పట్టాలెక్కిస్తున్న రైల్వే శాఖ ఇప్పుడు రైల్వే స్టేషన్లకు ఆధునిక రూపు కల్పిం చేందుకు భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. హైదరాబాద్లో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపై ఉన్న భారాన్ని తగ్గించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో నగర శివారులోని చర్లపల్లి స్టేషన్కు ఆధునిక భవనాన్ని నిర్మించిన తరహాలో.. రాష్ట్రంలోని ముఖ్య స్టేషన్లను సమూలంగా మార్చనుంది. రాష్ట్రంలో 40 స్టేషన్లకు కొత్త ఆధునిక భవనాలను నిర్మించేందుకు రూ.2,737 కోట్లను మంజూరు చేసింది. అమృత్ భారత్ స్టేషన్లుగా వీటిని గుర్తించిన రైల్వే శాఖ ఈమేరకు ఇటీవల నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం దేశంలోనే పెద్ద స్టేషన్లలో ఒకటైన సికింద్రాబాద్ లాంటి స్టేషన్లలో కూడా సరైన వసతులు లేవు.వాటిని ఆధునీకరించకపోవటం, క్రమంగా రద్దీ విపరీతంగా పెరిగిపోవటంతో ప్రయాణికులు చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఒకేసారి నాలుగైదు ముఖ్య రైళ్లు వచ్చిన సమయంలో, వాటిల్లోంచి ఎక్కి దిగే ప్రయాణికులతో పరిసరాలు కిక్కిరిసిపోయి సకాలంలో రైళ్ల వద్దకు చేరుకోలేక అవి వెళ్లిపోతున్న సందర్భాలు నిత్యకృత్యంగా మారాయి. సికింద్రాబాద్ స్టేషన్లో ఫుట్ఓవర్ బ్రిడ్జిపై ఆ సమయంలో ప్రయాణికులు ఎక్కడివారక్కడ నిలిచిపోయేంత రద్దీ ఉంటోంది. చూస్తుండగానే రైళ్లు వెళ్లిపోయి ప్రయాణికులు ఉసూరుమంటున్నారు. ఇక టికెట్ల జారీ, నిరీక్షణ సమయం, వీల్ చైర్లు, టాయిలెట్లు, ప్లాట్ఫామ్స్ మారే సమయం.. ఇలా అన్నీ ఇబ్బందులే.పెద్ద స్టేషన్లోనే పరిస్థితి ఇలా ఉంటే, చిన్నవాటిల్లో సమస్యలు మరింత తీవ్రంగా ఉంటున్నాయి. వీటన్నింటినీ పరిష్కరించటంతోపాటు కొత్త వసతులు కల్పిం చటమే ఈ పథకం ఉద్దేశం. సాధారణ మరమ్మతులు కాకుండా, విమానాశ్రయ తరహాలో ఆకృతి ఇస్తూ ఆధునిక రూపు కల్పించాలన్నది ప్రధాని మోదీ ఆదేశం. విశాలమైన పార్కింగ్ ప్రాంతం, హైలెవల్ ప్లాట్ఫామ్స్, ఆధునిక వెయిటింగ్ హాల్స్, అవసరమైన చోట్ల ఎస్కలేటర్లు, వేగంగా టికెట్లు జారీ అయ్యేలా కౌంటర్లు, సరికొత్త అనౌన్స్మెంట్ వ్యవస్థ, సోలార్ విద్యుత్ ఏర్పాట్లు, విశాలమైన పార్కింగ్ లాట్స్, విశాలమైన అప్రోచ్ రోడ్లు, భద్రతా స్కానింగ్ సెంటర్లు, ఆకర్షణీయమైన భవనం.. ఇలా అన్ని వసతులతో ఇవి ఆకట్టుకుంటాయి.14 స్టేషన్లకు ఆధునిక హంగులుఅమృత్భారత్లో చోటు దక్కించుకున్న స్టేషన్లలో 14 హైదరాబాద్కు చెందినవే కావటం విశేషం. అమృత్భారత్లో భాగమైనప్పటికీ, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, చర్లపల్లి స్టేషన్లను భారీ ప్రాజెక్టుల కోటాలో ఉంచారు. వీటికి భారీ నిధులు కేటాయించారు. రూ.430 కోట్లతో మినీ ఎయిర్పోర్టు తరహాలో రూపుదిద్దుకున్న చర్లపల్లి టెర్మినల్ను ఇటీవలే ప్రధాని మోదీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తు తం వేగంగా పనులు జరుపుకొంటున్న సికింద్రాబాద్, ఇటీవలే పనులు మొదలైన నాంపల్లి, త్వరలో పనులు ప్రారంభించుకోనున్న కాచిగూడ స్టేషన్లకు భారీగా నిధులు కేటాయించారు.ఇప్పటికే రూ.700 కోట్లతో సికింద్రాబాద్ స్టేషన్కు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో భారీ భవనాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మరో ఏడాదిన్నరలో ఇది పూర్తి కానుంది. ఈ ఏడాది డిసెంబరు నాటికి కొత్త భవనం అందుబాటులోకి రావాల్సి ఉన్నా, సకాలంలో పనులు పూర్తయ్యేలా లేవు. దీంతో వచ్చే ఏడాది జూలై నాటికి సిద్ధమవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీని పనులు కొలిక్కి వస్తున్న తరుణంలో, నగరంలో మరో ముఖ్య స్టేషన్ అయిన నాంపల్లి (హైదరాబాద్) స్టేషన్ భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. పాత క్వార్టర్ భవనాలు, చుట్టూ గోడలు కూల్చి వేశారు. ప్రధాన నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. ఈ స్టేషన్ భవనానికి రూ.327.27 కోట్లు కేటాయించారు.కొత్త రూపు సంతరించుకోనున్న స్టేషన్లు ఇవే.. చర్లపల్లితోపాటు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి, హఫీజ్పేట, హైటెక్సిటీ, ఉప్పుగూడ, మలక్పేట, మల్కాజిగిరి, బేగంపేట, మేడ్చల్, యాకుత్పురా, ఉందానగర్, ఆదిలాబాద్, భద్రాచలం రోడ్, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, కాజీపేట జంక్షన్, ఖమ్మం, మధిర, మహబూబ్నగర్, నిజామాబాద్, రామగుండం, తాండూరు, జహీరాబాద్, యాదాద్రి, బాసర, గద్వాల, జడ్చర్ల, మంచిర్యాల, మెదక్, మిర్యాలగూడ, నల్లగొండ, పెద్దపల్లి, షాద్నగర్, వికారాబాద్, వరంగల్, జోగుళాంబ. -
నాగార్జున పరువునష్టం కేసు.. మంత్రి కొండా సురేఖ గైర్హాజరు!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబంపై మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర మనోవేదనకు గురి చేశాయని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు మంత్రికి నోటీసులు జారీ చేసింది. ఈనెల 12న వ్యక్తిగతంగా హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.అయితే ఇవాళ విచారణకు మంత్రి కొండా సురేఖ హాజరు కాలేదు. పలు కార్యక్రమాల కారణంగా విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు ఆమె తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో మరింత గడువు కావాలని న్యాయమూర్తిని కోరారు. దీంతో న్యాయస్థానం ఈ నెల 19కి విచారణను వాయిదా వేసింది. అసలేంటి వివాదం..గతంలో మంత్రి కొండా సురేఖ నాగార్జున ఫ్యామిలీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మాజీ మంత్రి కేటీఆర్ను విమర్శించే క్రమంలో నాగార్జున ఫ్యామిలీపై కామెంట్స్ చేసింది. దీంతో తమ పరువుకు భంగం కలిగేలా మంత్రి మాట్లాడారని నాగార్జున కోర్టును ఆశ్రయించారు. ఆయన పరువు నష్టం కేసు దాఖలు చేయగా.. న్యాయస్థానం విచారణకు అనుమతించింది. -
Nampally: పెట్రోల్ బంక్లో అగ్నిప్రమాదం
-
నాంపల్లిలో కారు బీభత్సం..
సాక్షి, హైదరాబాద్: నాంపల్లిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అధిక వేగంలో ఉన్న కారు అదుపు తప్పి.. జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. అనంతరం, మద్యం తాగి కారు నడిపిన వ్యక్తిని స్థానికులు చితకబాదారు.వివరాల ప్రకారం..నాంపల్లిలోని రెడ్హిల్స్ నీలోఫర్ కేఫ్ వద్ద గురువారం తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. ఓ వ్యక్తి మద్యం తాగి కారు నడపడంలో అదుపు తప్పి జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. అనంతరం, మద్యం మత్తులో కారు నడిపిన వ్యక్తిని స్థానికులు చితకబాదారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
HYD: ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్తో కేటీఆర్ సందడి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఇరానీ చాయ్కి ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. అయితే ఇరానీ చాయ్ను తాజాగా నాంపల్లిలోనిఓ కేఫ్లో రుచిచూశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఉస్మానియా బిస్కెట్తో ఇరాన్ చాయ్ని ఎంజాయ్ చేశారు. జనంతో ముచ్చట్లు పెడుతూ అభిమానులతో సెల్ఫీలకు పోజులిచ్చారు. కొండా సురేఖపై దాఖలుచేసిన పరువునష్టం దావాలో కేటీఆర్ బుధవారం నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో తన వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం బీఆర్ఎస్ నేతలతో కలిసి నాంపల్లిలోని ఏక్మినార్ మసీదు వద్దనున్న ఓ ఇరానీ కేఫ్లో చాయ్ తాగారు. ఉస్మానియా బిస్కెట్ను ఆస్వాదించారు. కేఫ్కు వచ్చిన వారితో ముచ్చటించారు. వారితో సెల్ఫీలు దిగారు. తర్వాత పక్కనే ఉన్న బట్టల దుకాణ యజమాని ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లి వారితో ముచ్చటించారు.No Hyderabadi will ever miss a chance to have a sip of our favourite Irani chai & Osmania biscuit 😊I did the same @ Nampalli yesterday pic.twitter.com/qGawPhxAOz— KTR (@KTRBRS) October 24, 2024Iske peene se tabiyat mei ravani aaeBRS Leader KTR Enjoys Irani Chai aT Nampally Restaurant pic.twitter.com/jVfS6Hq3mH— Shakeel Yasar Ullah (@yasarullah) October 23, 2024 -
కేటీఆర్ 30 నిమిషాల స్టేట్ మెంట్.. కొండా సురేఖకు చురకలు..
-
నాంపల్లి కోర్టులో.. పరువు - ప్రతిష్ఠ
-
కేటీఆర్ పరువునష్టం పిటిషన్.. విచారణ 18వ తేదీకి వాయిదా
హైదరాబాద్, సాక్షి: మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువునష్టం పిటిషన్పై ఇవాళ (సోమవారం) నాంపల్లి ప్రత్యేక కోర్టు విచారణ చేట్టింది. ఈ పిటిషన్పై విచారణ చేట్టిన కోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఈ నెల 18న పిటిషనర్ కేటీఆర్తో పాటు.. నలుగురు సాక్షుల స్టేట్మెంట్ రికార్డు చేస్తామని కోర్టు వెల్లడించింది. మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేటీర్ పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే. 23 రకాల ఆధారాలను కేటీఆర్ తరఫు లాయర్లు కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమా, దాసోజు శ్రవణ్లను పటిషన్ సాక్షులుగా చేర్చారు. మంత్రి కొండా సురేఖ తన పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. -
కేటీఆర్ పరువు నష్టం దావాపై విచారణ ప్రారంభం
-
కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా
సాక్షి,హైదరాబాద్: నాంపల్లి కోర్టులో మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై ఇవాళ (గురువారం) నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కేటీఆర్ తరఫు న్యాయవాది వినతించారు.బాల్క సుమన్, తుల ఉమ, సత్యవతి రాథోడ్, దాసోజు శ్రవణ్ను సాక్షులుగా కేటీఆర్ చేర్చారు. కొండా సురేఖ మాట్లాడిన ఆడియో, వీడియో టేపులను కేటీఆర్ న్యాయవాదులు కోర్టుకు సమర్పించారు. 23 రకాల ఆధారాలను అందజేశారు. తదుపరి విచారణ ఈ నెల 14కు కోర్టు వాయిదా వేసింది. కాగా, ఇప్పటికే మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని హీరో అక్కినేని నాగార్జున పిటిషన్ దాఖలు చేయగా, ఆమెకు కోర్టు నోటీసులు జారీ చేసింది. కొద్దిరోజుల క్రితం అక్కినేని నాగార్జున కుటుంబం మీద ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి.ఈ క్రమంలో మంత్రి తమ కుటుంబంపై అమర్యాద పూర్వక వ్యాఖ్యలు చేశారని నాగార్జున కోర్టును ఆశ్రయించి పరువు నష్టం దావా వేశారు. రాజకీయ లబ్ధి కోసమే మంత్రి కొండా సురేఖ తమ కుటుంబంపై తప్పుడు వ్యాఖ్యలు చేశారని సినీ నటుడు నాగార్జున నాంపల్లి కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే, తాజాగా స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 23న జరగనుంది. -
కొండా సురేఖ వివాదం.. నాగార్జున పిటీషన్పై విచారణ వాయిదా
టాలీవుడ్ ప్రముఖ నటుడు నాగార్జున కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయని నాంపల్లి న్యాయస్థానంలో పరువు నష్టం దావా కేసును నాగార్జున వేశారు. అయితే, నేడు జరగాల్సిన విచారణ వాయిదా పడింది. న్యాయమూర్తి సెలవులో ఉండటంతో సోమవారం విచారణ జరుగుతుందని కోర్టు తెలిపింది.ఇదీ చదవండి: మమ్మల్ని బలిపశువులను చేసింది: అఖిల్తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ను విమర్శించే క్రమంలో కొండ సురేఖ ఈ వ్యాఖ్యలే చేశారు. అక్కినేని నాగార్జున కుటుంబం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలను లేవనెత్తుతూ.. సినీనటి సమంత విడాకులు, రకుల్ ప్రీత్సింగ్ పెళ్లి వంటి అంశాలపై ఆమె వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో పెద్ద దుమారమే రేగింది. అధారాలు లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చూస్లూ ఊరుకోమంటూ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు రియాక్ట్ అయ్యారు. -
27 ఏళ్లు శ్రమించి.. 195 దేశాలు చుట్టేసి..
ప్రపంచంలోని అన్ని దేశాలను సందర్శించడమే అతడి లక్ష్యం.. ఆ దిశగా ఎంతో కష్టపడ్డారు. సుమారు 27 ఏళ్లు ఎంతో శ్రమకోర్చి అన్ని దేశాలను సందర్శించి అరుదైన ఘనత సాధించారు. ప్రస్తుతం 195 దేశాల సందర్శన పూర్తి చేసుకుని తెలుగుగడ్డపై బుధవారం అడుగుపెట్టారు. ఈ అరుదైన ఘనత సాధించిన వ్యక్తి మన తెలుగువాడు కావడం విశేషం.ప్రపంచాన్నే చుట్టేసిన 43 ఏళ్ల వయస్సు కలిగిన రవిప్రభు స్వస్థలం విశాఖపట్నం. ఆయన హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో చదువుకున్నాడు. పొలిటికల్ సైన్స్లో పట్టభద్రుడైన రవిప్రభు విద్యార్థి దశలోనే 1996లో అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. వివాహం చేసుకొని ఉద్యోగం చేసుకుంటూనే విదేశాలను సందర్శించడం ప్రారంభించారు. భూటాన్ దేశాన్ని సందర్శించడంతో ప్రారంభమైన ఆయన యాత్ర వెనుజులతో ముగిసింది. ప్రపంచంలోని దేశాలను సందర్శిస్తూనే 2020లో ఒక యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించారు. మొత్తం సందర్శన విశేషాలను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ వచ్చారు.అన్ని దేశాలను చుట్టేసి వచ్చిన ఆయన రెడ్హిల్స్లోని ఫెడరేషన్ హౌస్లో మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 600 మందికి పైగా అంతరిక్షంలోకి వెళ్లారు. 6,600 మంది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ప్రపంచంలోని 850 కోట్ల మందిలో 280 మంది మాత్రమే ప్రతి దేశాన్ని సందర్శించారని అన్నారు. ఈ అరుదైన ఘనత సాధించిన 280 మందిలో తనకు స్థానం లభించడం సంతోషంగా ఉందని తెలిపారు. 27 ఏళ్లు కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నట్లు ఆయన వివరించారు. ఈ ప్రయాణాల కోసం రూ.25 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినట్లు చెప్పారు. -
'హైదరాబాద్ కోహినూర్': ఆమెలా మరెవ్వరూ చనిపోకూడదని..!
కోహినూర్ వజ్రాన్ని మన దేశం నుంచి బ్రిటిష్ వాళ్లు పట్టుకుపోయారని కథకథలుగా విన్నాం. కానీ మన హైదరాబాద్ కోహినూర్గా పిలిచుకునే మన నిజాం మహారాణి గురించి వినిలేదు కదా..!. ఆ రోజుల్లోనే ష్యాషన్కి ఐకాన్గా ఉండేది. ఆమె అందానికి తగ్గట్టు గొప్ప గొప్పదాతృత్వ సేవలకు కూడా పేరుగాంచింది. మన హైదరాబాద్లోని నిలోఫర్ ఆస్పత్రికి నిర్మించడానికి కారణమే ఆమె. ఎవరీమె..? ఎలా మన హైదబాద్ నిజాం కుటుంబానికి కోడలయ్యింది తదితరాలు గురించి చూద్దాం.!మార్చి 3, 1924న టర్కీ పార్లమెంట్ ఖలిఫాను రద్దు చేసింది. ఖలీఫా అంటే వారసత్వం. దీని కారణంగా 101వ ఖలీఫా అబ్దుల్మెసిడి II కుటుంబం సామ్రాజ్యం నుంచి బహిష్కిరించబడింది. దీంతో వారిలో చాలామంది ఫ్రెంచ్ నగరాల్లో స్థిరపడ్డారు. వారిలో ఒట్టోమన్ సామ్రాజ్యానికి చెందిన నీలూఫర్ హన్సుల్తాన్ కూడా ఒకరు. ఆమె తండ్రి మరణంతో తల్లి అడిలే సుల్తాన్తో కలిసి ఫ్రాన్స్లో ఉండేవారు. అయితే హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ చిన్నకుమారుడు మోజమ్ తన అన్నయ్యతో కలిసి ఫ్రాన్స్కి వచ్చాడు. మోజమ్ అన్నయ ఆజం జా నీలూఫర్ బంధువైన డుర్రూషెహ్వార్ సుల్తాన్ను వివాహం చేసుకోవాల్సి ఉంది. ఇక అతడి తమ్ముడు మోజామ్ ఒట్టోమన్ యువరాణి మహ్పేకర్ హన్సుల్తాన్తో పెళ్లి నిశ్చయం అయ్యింది. అయితే మోజామ్ నిలూఫర్ని చూసి ఆమె అందానికి మంత్రముగ్దుడై వెంటనే తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుని మరీ నీలోఫర్ను పెళ్లిచేసుకున్నాడు. ఆమెను వివాహం అనంతరం నీలూఫర్ ఖానుమ్ సుల్తాన్ బేగం సాహిబా అని పిలిచేవారు. అలా నీలోఫర్ నిజాంకి చెందిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కోడలు అయ్యింది. ఆమె నిజాం కోటలో ఆధునికత యుగానికి నాంది పలికింది. నిజాంను పాపా అని సంభోదించగలిగేది కూడా నీలూఫర్నే. అతడి కుమార్తెలు సైతం అతడిని సర్కార్ అని పిలిచేవారు. ఇక నీలోఫర్ తన బంధువు డుర్రోషెహ్వార్తో కలిసి మహిళల విముక్తి కోసం పనిచేసింది. మహిళలను ముసుగులు తొలిగించి స్వతంత్రంగా బతికేలా ప్రోత్సహించేవారు. ఇక నీలూఫర్ అందచందాలకు భర్త దాసోహం అన్నట్లుగా ఉండేవాడు. అందులోనూ ఆమె ఫ్యాషన్ శైలి ఎవ్వరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. ఆమె ధరించే చీరలు, ఆభరణలు నిజాం పాలనలో మంచి ట్రెండ్ సెట్ చేసేవి. అప్పట్లోనే ఆమె చీరలను ముంబైకి చెందిన డిజైనర్ మాధవదాస్ డిజైన్ చేసేవారు. ఆమె ఒట్టోమన్ మూలాలు నిజామీ సంస్కృతితో అందంగా కలిసిపోయాయి. అంతేగాదు ఆమె చీరలు ఎంతో ప్రజాధరణ పొందేవి. అవి ఇప్పటికీ న్యూయార్క్లోని ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాజీలో ప్రదర్శనగా ఉన్నాయి. అంతేగాదు ఆమె ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళల్లో ఒకరిగా పేరుగాంచింది. పైగా ఆమెను ముద్దుగా 'హైదరాబాద్ కోహినూర్' అని పిలుచుకునేవారు కూడా. ఇక ఆమె బంధువు డుర్రూషెహ్వార్ ఒక కొడుకుకి జన్మనివ్వగా, నీలూఫర్ గర్భం దాల్చలేకపోయింది. అందుకోసం యూరప్లోని నిపుణులెందరినో కలిసింది. ఆ టైంలో వైద్య సదుపాయాలు బాగా కొరతగా ఉండేవి. దీని కారణంగానే ఆమె పనిమనిషి ప్రసవ సమయంలో మరణించింది. ఇది ఆమెను బాగా కుంగదీయడమే గాక మహిళల కోసం ఆస్పత్రిని నిర్మించేందుకు దారితీసింది. తన పనిమినిషిలా ఎంతమంది రఫాత్లు మరణిస్తారంటూ ప్రసూతి ఆస్పత్రిని నిర్మించింది. అదే నేడు నాంపల్లిలో ఉన్న నీలోఫర్ ఆస్పత్రి. ఈ ఆస్పత్రి చరిత్ర గురించి నిజాం కుటుంబ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నజాఫ్ అలీఖాన్ చెబుతుంటారు.కాగా, నీలూఫర్ గర్భందాల్చకపోవడంతో ఆమె భర్త రెండోవ వివాహం చేసుకున్నాడు. దీంతో ఆమె తన తల్లితో జీవించడానికి తిరిగి ఫ్రాన్స్ వెళ్లిపోయింది. ఆ తర్వాత నాలుగేళ్లకు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నుంచి ఆమె సామాజికి సేవలో ఎక్కువ సమయం గడుపుతుండేది. అలా 1963లో పారిస్లోని దౌత్యవేత్త, వ్యాపారవేత్త ఎడ్వర్డ్ జూలియాస్ పోప్ను వివాహం చేసుకుంది. ఇక శేషజీవితాన్ని పారిస్లోనే గడుపుతూ.. 1989లో మరణించింది. (చదవండి: దేశీ గర్ల్ టు గ్లోబల్ ఐకాన్: మహిళా సాధికారతకు అసలైన నిర్వచనం ఆమె!) -
ఇద్దరు అరెస్ట్.. మరో ఇద్దరు పరారీ
-
హైదరాబాద్ నాంపల్లి పోలీసుల కాల్పుల కలకలం
-
హైదరాబాద్లో మరోసారి కాల్పుల కలకలం
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్లో పోలీసుల కాల్పుల ఘటనలు మరువకముందే నగరంలో మరో చోట పోలీసు కాల్పుల కలకలం రేగింది. నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో పోలీసులపై ఒక వ్యక్తి గొడ్డలితో దాడికి యత్నించాడు. మరో వ్యక్తి రాళ్లతో దాడి చేశాడు.దీంతో తప్పించుకునే యత్నంలో పోలీస్ డెకాయ్ టీమ్ కాల్పులు జరిపింది. పోలీసుల కాల్పుల్లో ఇద్దరికి గాయాలు కాగా, మరో ఇద్దరు దుండగులు పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కాగా, గత నెలలో సికింద్రాబాద్లోని సిటీలైట్ హోటల్ వద్ద యాంటీ స్నాచింగ్ టీమ్ పోలీసులు.. పారిపోతున్న స్నాచర్ల బైక్ టైర్ను కాల్చాలని ప్రయత్నించగా.. ఆ తూటా బైక్ వెనుక కూర్చున్న నేరగాడి కాలులోకి దూసుకుపోయింది. తప్పించుకున్న ఇద్దరు స్నాచర్లను పోలీసులు పట్టుకున్నారు.మరో ఘటనలో గత కొన్ని రోజులుగా వరుసగా దొంగతనాలు చేస్తూ చెలరేగిపోతున్న చైన్స్నాచర్లపై సైదాబాద్ పోలీసులు కాల్పులు జరిపారు. సైదాబాద్లో అమీర్ గ్యాంగ్ చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు వారిని పట్టుకునేందుకు వెంబడించగా.. గ్యాంగ్ పోలీసులపై ఎదురుదాడికి దిగారు. దీంతో పోలీసులు తమ వద్ద ఉన్న తుపాకులతో ఫైరింగ్ చేశారు. రెండు రౌండ్లు కాల్పులు జరపగా భయపడిన అమీర్ పోలీసులకు లొంగిపోయాడు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు చుక్కెదురు
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న ఏసీపీ ప్రణీత్ రావు, అడిషనల్ ఎస్పీ భుజంగ రావు, తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లు కొట్టేసింది నాంపల్లి కోర్టు. పోలీసుల వాదనలతో న్యాయ స్థానం ఏకీభవించింది.ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న ఏసీపీ ప్రణీత్ రావు, అడిషనల్ ఎస్పీ భుజంగ రావు, తిరుపతన్నలు బెయిల్ కావాలంటూ దాఖలు చేసిన పిటిషన్పై గురువారం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సమయంలో కేసులో పోలీసులు ఎటువంటి ఛార్జీషీట్ దాఖలు చేయలేదని తమ వాదనల్ని వినిపించారు.అయితే పిటిషన్లు దాఖలు చేసినట్లు చెప్పారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి ఛార్జ్షీట్లో మూడు కీలకమైన డాక్యుమెంట్లను జత చేసినట్లు తెలిపారు. ఈ కేసులో మరో కీలక నిందితుడైన ప్రభాకర్ రావు విదేశాల్లో ఉన్నారని, ఆయన్ని అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. ఫోన్ ట్యాంపింగ్పై మరికొంతమందిని విచారించాల్సి ఉందని, ఈ తరుణంలో వీరికి బెయిల్ ఇస్తే సాక్ష్యాల్ని రూపుమాపడమే కాకుండా..సాక్ష్యుల్ని బెదిరించే అవకాశం ఉందని వాదించారు. పోలీస్ శాఖలో కీలక పదవుల్లో ఉన్నారని, కేసులో మిగిలిన నిందితులు అరెస్ట్ చేసే వరకు బెయిల్ ఇవ్వకూడదని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. పోలీసుల వాదనల్ని ఏకీభవించిన కోర్టు నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది నాంపల్లి కోర్టు. -
Fish Prasadam 2024 : చేప ప్రసాదం కోసం పోటెత్తిన జనాలు (ఫొటోలు)
-
నాంపల్లి : చేప ప్రసాదం పంపిణీ.. భారీగా తరలి వచ్చిన జనం (ఫొటోలు)
-
Phone Tapping: రాధాకిషన్ రావు రిమాండ్ పొడిగింపు
-
నుమాయిష్ 2024 ప్రారంభం.. మాస్క్ కంపల్సరీ!
హైదరాబాద్, సాక్షి: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నుమాయిష్ సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం, శ్రీధర్బాబు(నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు కూడా) పాల్గొన్నారు. ఈసారి కూడా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు నుమాయిష్ 2024 జరగనుంది. నుమాయిష్ కోసం ఈసారి 2,400 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇక తెలంగాణలో కరోనా కేసులు కలవర పెడుతున్నాయి. నుమాయిష్కు పెద్ద ఎత్తున సందర్శకులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో.. మాస్కులు కచ్చితంగా ధరించి రావాలంటూ సందర్శకులను కోరుతున్నారు నిర్వాహకులు. ఈసారి నుమాయిష్ నేపథ్యంలో నగరంలో 45 రోజుల పాటు ఆ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. మరోవైపు సర్వీసులను ఎక్కువ సమయం నడిపేందుకు హైదరాబాద్ మెట్రో సిద్ధమైంది. ఇక మహాలక్ష్మి పథకం ఉచిత ప్రయాణాల నేపథ్యంలోనూ నాంపల్లి రూట్లో బస్సులకు ప్రయాణికుల తాకిడి పెరిగే అవకాశం కనిపిస్తోంది. నుమాయిష్కు టికెట్ ధరలు గతంలో మాదిరే ఉండనున్నాయి. గతేడాది 10 రూపాయలు పెంచి నుమాయిష్ టికెట్ ధర రూ.40గా నిర్ణయించారు. ఇప్పుడు కూడా టికెట్ ధర రూ.40 లుగా కొనసాగించనున్నారు. నుమాయిష్ సాధారణ రోజులలో సాయంత్రం 4 నుంచి రాత్రి 10.30 వరకు కొనసాగుతోంది. వీకెండ్స్,సెలవు దినాల్లో మాత్రం సాయంత్రం 4 నుండి రాత్రి 11 గంటల వరకు నుమాయిష్ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. ఈ సంవత్సరం నుమాయిష్ సందర్శన వేళలను నిర్వాహకులు పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నుమాయిష్ ను సందర్శించేందుకు మహిళలు, పిల్లలకు ప్రత్యేకంగా ఒక్కో రోజు కేటాయించనున్నారు. జనవరి 9న 'లేడీస్ డే' పేరుతో మహిళలను, 31న 'చిల్డ్రన్ స్పెషల్' పేరుతో పిల్లలను నుమాయిష్ ను సందర్శించేందుకు అవకాశం కల్పిస్తామని నిర్వహకులు తెలిపారు. నుమాయిష్ నిర్వహణ ద్వారా ప్రతీ ఏడాది సుమారు రెండు వేల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించడంతోపాటు సుమారు 30 వేల మంది విద్యార్థులకు విద్యావకాశం కల్పిస్తోంది నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ. -
జనవరి 1 నుంచి నుమాయిష్
హైదరాబాద్: అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయి)కు సమయం ఆసన్నమైంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జనవరి 1న 83వ నుమాయిష్ ప్రారంభానికి ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల ఉత్పత్తులతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలు ఉత్పత్తులు, ప్రభుత్వాల స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 15వ తేదీ వరకు 46 రోజుల పాటు కొనసాగనుంది. ఎగ్జిబిషన్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ సుమారు 2,400 స్టాళ్లు కొలువుదీరనున్నాయి. ఒకేచోట అన్ని వస్తువులు.. ఎగ్జిబిషన్లో అన్ని రకాల వస్తువులు ఒకేచోట లభ్యమవుతాయి. నగరంలో దొరకని పలు రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. దుస్తులు, బెడ్ïÙట్లు, కిచెన్వేర్ , మహిళల కోసం పలు విధాల వంట సామగ్రి, వివిధ రకాల దుప్పట్లు, బెడ్షీట్లు, కశీ్మరీ డ్రై ఫ్రూట్స్తో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు, వివిధ రకాల కొత్త తరహా ఫరి్నచర్స్, పలు విధాల ఉపయోగపడే పలు రకాల సామగ్రి అందుబాటులో ఉంటాయి. టికెట్ ధర రూ.40.. ఎగ్జిబిషన్ను సుమారు 22 లక్షల మంది సందర్శింనున్నట్లు అంచనా. ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ఎగ్జిబిషన్ సొసైటీ సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేస్తోంది. ఎగ్జిబిషన్కు వచ్చే గోషామహల్, అజంతా గేట్, గాంధీభవన్, గేట్ల వద్ద మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేసి సందర్శకులను లోపలికి అనుమతిస్తారు. టికెట్ ధర రూ.40. వినోదాత్మకమైన పలు విభాగాలు అందుబాటులో ఉంటాయి. సందర్శకులకు కనువిందు చేస్తాం.. ఎగ్జిబిషన్కు వచ్చే సందర్శకులకు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాం. క్రీడా పోటీలు, వినోదాత్మక కార్యక్రమాలు చేపడతాం. సందర్శకుల కోసం ఆహ్లాదకర వాతావరణంలో ఏర్పాట్లు చేస్తాం. – ఏనుగుల రాజేందర్ కుమార్, ఎగ్జిబిషన్ సొసైటీ కోశాధికారి తెలంగాణ విద్యావ్యాప్తికి కృషి ఎగ్జిబిషన్ నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యారంగ వ్యాప్తికి కృషి చేస్తున్నాం. ముఖ్యంగా మహిళా కళాశాలలు, పాలిటెక్నిక్, ఫార్మసీ, ఇంజినీరింగ్, డిగ్రీ, ఐటీఐ కళాశాలలను స్థాపించి విద్యా వ్యాప్తికి నిరంతరం పాటుపడుతున్నాం. – బి.హన్మంతరావు, ఎగ్జిబిషన్ కార్యదర్శి 33 సబ్ కమిటీల ద్వారా ఏర్పాట్లు.. 33 సబ్ కమిటీల ద్వారా ఎగ్జిబిషన్ను విజయవంతంగా కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఎగ్జిబిషన్ లోపల, బయట సందర్శకులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎగ్జిబిషన్ సబ్ కమిటీల ప్రతినిధులు తగిన చర్యలు తీసుకుంటారు. – వనం సత్యేందర్, ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు -
మాజీ మంత్రుల కార్యాలయాల్లో ద్రస్తాల చోరీ!
సాక్షి, హైదరాబాద్, నాంపల్లి (హైదరాబాద్): మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్పై నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. మాసబ్ట్యాంక్లోని పశు సంవర్థకశాఖ కార్యాలయంలోనికి అక్రమంగా ప్రవేశించిన కల్యాణ్ బీరువాలో ఉన్న ద్రస్తాలను కారులో తరలించుకునిపోయారు. వాచ్మన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు చేశారు. నాంపల్లి ఇన్స్పెక్టర్ అభిలాష్ తెలిపిన వివరాల ప్రకారం... మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ శుక్రవారం మాసబ్ట్యాంక్లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలోనికి అక్రమంగా ప్రవేశించారు. అక్కడి సిబ్బంది సహాయంతో బీరువాలో ఉన్న ఫైళ్లను చింపేశారు. అంతటితో ఆగకుండా చించివేసిన ఫైళ్లను తన కారులో తరలించుకుని పోయారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సైతం పనిచేయకుండా చేశారు. దీంతో వాచ్మెన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కళ్యాణ్పై కేసు నమోదు చేసినట్లు వివరించారు. అతడికి సహకరించిన కంప్యూటర్ ఆపరేటర్స్ ఎలిజ మోహన్, అటెండర్లు వెంకటేశ్, ప్రశాంత్లపైనా కేసులు నమోదు చేశామని చెప్పారు. ఎస్సీఈఆర్టీ కార్యాలయంలోనూ... హైదరాబాద్ ఎల్బీ స్టేడియం ఎదురుగా ఉన్న రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) కార్యాలయం నుంచి గుర్తు తెలియని వ్యక్తులు అధికారిక ద్రస్తాలు ఎత్తుకెళ్లినట్టు ప్రచా రం జరుగుతోంది. ఇక్కడే మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి కార్యాలయం ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. మాజీ మంత్రి కార్యాలయం నుంచి ఒక ఆటోలో కొంతమంది ఫైళ్లు తీసుకెళ్తున్నట్టు తమకు సమాచారం వచ్చిందని అబిడ్స్ పోలీసులు తెలిపారు. కార్యాలయం వాచ్మెన్ వెల్లడించిన ప్రకారం కొన్ని బస్తాల్లో కాగితాలు, ఫైళ్లు తీసుకెళ్ళినట్టు పోలీసులు చెబుతున్నారు. అందులో ఏమున్నాయనేది విచారణ జరిపితే తెలుస్తుందని, అన్ని కోణాల్లో వివరాలు సేకరిస్తున్నామని అన్నారు. వాస్తవానికి రెండో శనివారం కావడంతో ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉంటుంది. గేట్ కూడా మూసివేస్తారు. కానీ ఆగంతకులు లోనికెలా వచ్చారు? తాళం ఎలా తీశారు అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ ఘటన సెలవు రోజున... అదీ రాత్రి సమయంలో జరగడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఫైళ్లు తీసుకెళ్లిన వ్యక్తి ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా అనుమానిస్తున్నారు. కార్యాలయంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. తీసుకెళ్లారని భావిస్తున్న ద్రస్తాలు ఏ శాఖకు సంబంధించినవి? వాటి ప్రాధాన్యం ఏమిటనేది తేలాల్సి ఉంది. ఎస్సీఈఆర్టీ కార్యాలయం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదీనంలో ఉంటుంది. దీనిపై పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేనను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. -
ఉత్తర ద్వారం తెరిచిన ‘బీజేపీ’.. మార్పు కలిసొచ్చేనా?
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ఫలితాల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల కార్యాలయాల్లో ఆసక్తికరమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గురువారం రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరగగా, అదే రోజు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో తూర్పు వైపు ఉన్న ప్రధాన ద్వారాన్ని మూసేసి గతంలో ఉపయోగించిన ఉత్తరం వైపు తలుపును తెరిచారు. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఇదే మార్గంలో రాకపోకలు సాగిస్తే పార్టీకి అనుకూలంగా మంచి ఫలితాలు రావొచ్చునని నాయకులు అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగానే వాస్తు మార్పు చేసి, ఉత్తరం వైపు ద్వారాన్ని ఉపయోగించాలని నిర్ణయించినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం పార్టీ కార్యాలయాన్ని నిర్మించాక తూర్పువైపు ప్రధాన ద్వారాన్నే చాలా కాలం ఉపయోగించారు. గతంలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక కొన్ని వాస్తుపరమైన మార్పులు చేశారు. ఇందులో భాగంగా తూర్పువైపు ద్వారం మూసేసి, ఉత్తరం వైపు తలుపులు తెరిచి రాకపోకలకు ఉపయోగించారు. మళ్లీ ఇప్పుడు ఎన్నికల పోలింగ్, ఫలితాలు వెలువడే సందర్భంగా వాస్తుపరంగా ఉత్తర ద్వారాన్ని ఉపయోగిస్తుండడం గమనార్హం. పార్టీ పోటీచేస్తున్న నియోజకవర్గాల్లో గురువారం పోలింగ్ సరళిని బట్టి చూస్తే సానుకూల పరిణామాలే కనిపించాయని, గతం కంటే ఎక్కువ ఓటింగ్శాతమే నమోదు అవుతుందనే ధీమా పార్టీ వర్గాల్లో వ్యక్తమౌతోంది. మరి నిజంగానే ప్రధాన ద్వారం మార్పు అనేది పార్టీ అధిక సీట్లను గెలిపిస్తుందా అనేది తేలాలంటే ఫలితాలు వెలువడే దాకా వేచి చూడాల్సిందే మరి. -
బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ కలిసే పనిచేస్తాయి: రాహుల్ గాంధీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు చివరి రోజు ప్రచారంలో కాంగ్రెస్ నేతలు స్పీడ్ పెంచారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. నాంపల్లిలో కాంగ్రెస్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు. నాంపల్లి సభలో రాహుల్ మాట్లాడుతూ.. ‘ప్రేమను పంచాలనే లక్ష్యంతో భారత్ జోడో యాత్ర చేశాను. బీజేపీ విభజన రాజకీయాలు చేసింది. మన దేశ సంస్కృతి ఇది కాదు. నాపై దేశవ్యాప్తంగా కేసులు పెట్టారు. నాపై పరువు నష్టం కేసు కూడా వేశారు. నా లోక్సభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు. నాపై 24 కేసులు ఉన్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఒవైసీపై ఎన్ని కేసులు ఉన్నాయి. కాంగ్రెస్ నేతలపై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు ఉంటాయి. ఒవైసీపై ఎందుకు ఉండవు. కాంగ్రెస్, బీజేపీ పోటీచేసే రాష్ట్రాల్లో.. మా ఓట్లు చీల్చేందుకు ఎంఐఎం వస్తుంది. బీజేపీ ఇచ్చిన లిస్ట్తో తమ అభ్యర్థులను ఎంఐఎం ప్రకటిస్తుంది. బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ మూడు పార్టీలు కలిసి పనిచేస్తాయి. నేను మోదీతో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. కేంద్రంలో మోదీని ఓడించాలంటే.. తెలంగాణలో కేసీఆర్ను ఓడించాలి. హైదరాబాద్లో మెట్రో, ఎయిర్పోర్టు నిర్మించింది కాంగ్రెస్ హయాంలోనే. బైబై కేసీఆర్ అని చెప్పే సమయం వచ్చింది’ అని కామెంట్స్ చేశారు. -
నాంపల్లి బజార్ ఘాట్ అగ్నిప్రమాదం కేసులో దర్యప్తు ముమ్మరం
-
నాంపల్లి బజార్ఘాట్ అగ్నిప్రమాదంపై దర్యాప్తు వేగవంతం
-
Nampally Fire Accident : హైదరాబాద్ నాంపల్లిలో ఘోర అగ్నిప్రమాదం (ఫొటోలు)
-
అందుకే నాంపల్లి ప్రమాదం జరిగింది: అగ్నిమాపక శాఖ
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి బజార్ఘాట్ అగ్నిప్రమాద ఘటనపై అగ్నిమాపక శాఖ అధికారిక ప్రకటన చేసింది. బిల్డింగ్లో ఫైర్ సేఫ్టీ లేదని పేర్కొన్న ఫైర్శాఖ.. కెమికల్ డ్రమ్ముల వల్లే అగ్నిప్రమాదం జరిగిందని తేల్చి చెప్పింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం ప్రకటన విడుదల చేసింది. ‘‘అగ్నిప్రమాదం నవంబర్ 13 సోమవారం ఉదయం 9గం.30 నిమిషాలకు జరిగింది. ఘటనలో తొమ్మిది మంది చనిపోయారు. ప్రమాదం నుంచి 21 మందిని రక్షించగలిగాం. అక్రమంగా సెల్లార్లో కెమికల్ డ్రమ్ములు పెట్టారు. ఆ డ్రమ్ముల వల్లే అగ్నిప్రమాదం జరిగింది. బిల్డింగ్లో ఫైర్ సేఫ్టీ లేకపోవడం గుర్తించాం అని అగ్నిమాపక శాఖ ప్రకటించింది. #WATCH | Daring rescue of a child and woman amid massive fire in a storage godown located in an apartment complex in Bazarghat, Nampally of Hyderabad pic.twitter.com/Z2F1JAL8wa — ANI (@ANI) November 13, 2023 స్థానికుల మౌనం సోమవారం ఉదయం ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ కెమికల్ నిల్వలను రమేష్ జైశ్వాల్ అనే వ్యక్తి నిల్వ ఉంచినట్లు తేలింది. పెద్ద పెద్ద డ్రమ్ముల్లో నిల్వ ఉంచి అపార్ట్మెంట్ సెల్లార్లో వ్యాపారం చేస్తున్నాడు రమేష్ జైశ్వాల్. అయితే ఇది చాలారోజులుగా నడుస్తున్న వ్యవహారమని అధికారులకు తెలిసింది. దీంతో స్థానికుల్ని ప్రశ్నించారు వాళ్లు. భారీగా కెమికల్ నిల్వలు ఉంచినప్పుడు తమకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని అపార్ట్మెంట్ వాసులను అడిగారు అగ్నిమాపక శాఖ అధికారులు. అయితే స్థానికులు ఆ ప్రశ్నకు మౌనం వహించారు. మరోవైపు తనిఖీలు చేపట్టని విజిలెన్స్ అధికారులు, సేఫ్టీ పరిశీలనలో విఫలమైన జీహెచ్ఎంసీ తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
నాంపల్లిలో ఘోరం.. ఆ ఒక్క తప్పుతో బూడిదైన బతుకులు
-
బజార్ ఘాట్ అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి.. నాంపల్లి ప్రమాద బాధితుల హెల్త్ కండిషన్
-
బజార్ ఘాట్ అగ్నిప్రమాదం.. మృతులకు 5లక్షల ఎక్స్గ్రేషియా
-
బజార్ ఘాట్ అగ్నిప్రమాదంపై కేటీఆర్, తలసాని
-
అగ్నిప్రమాద స్పాట్లో కేటీఆర్, వీహెచ్..
-
అగ్నిప్రమాదంపై ఫిరోజ్ ఖాన్ మాటల్లో..!
-
8 మంది సజీవదహనం, మరో 8 మంది పరిస్థితి విషమం
-
డీజిల్ డ్రమ్స్ పేలడంతో వ్యాపించిన మంటలు
-
చనిపోయిన వారిలో చిన్నారి ఉన్నట్టు గుర్తింపు
-
నాంపల్లి ప్రమాదంపై రేవంత్ దిగ్భ్రాంతి.. సర్కార్పై ఫైర్
సాక్షి, హైదరాబాద్: నాంపల్లిలోని బజార్ఘాట్ అపార్ట్మెంట్లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. అగ్ని ప్రమాదంపై రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ అగ్ని ప్రమాదాలకు నిలయంగా మారిందని సంచలన కామెంట్స్ చేశారు. కాగా, నాంపల్లి అగ్ని ప్రమాదంపై రేవంత్ మాట్లాడుతూ..‘హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైంది. ఈ జరిగిన అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది మృతిచెందడం అత్యంత బాధాకరమైన విషయం. అపార్ట్మెంట్ సెల్లార్లో కారు మరమ్మత్తులు చేయడం ఏంటి?. రెసిడెన్షియల్ ఏరియాలో కెమికల్ డ్రమ్ములు ఎలా నిల్వ చేశారు. ఈ విషయంలో సమగ్ర విచారణ జరపాలి. ప్రమాదంలో మృతిచెందిన వారికి ప్రగాఢ సంతాపం. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి’ అని డిమాండ్ చేశారు. -
హైదరాబాద్ నాంపల్లిలో అగ్నిప్రమాదం
-
నాంపల్లి భారీ అగ్ని ప్రమాదం ఘటనపై కేసు నమోదు
Updates.. ఘటనపై పోలీస్ కేసు నమోదు బజార్ఘాట్ అగ్నిప్రమాద ఘటనపై నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు అయ్యింది. క్రైమ్ నెంబర్ 347/23 us 304పార్ట్ ఐపీసీ సెక్షన్లు 285, 286(పేలుడు పదార్థాలతో నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించడం) ప్రకారం.. అలాగే.. ఇండియన్ ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ సెక్షన్ 9 క్లాజ్ బి ప్రకారం కేసు నమోదు చేశారు పోలీసులు. వరుస ప్రమాదాలు.. అయినా నిర్లక్ష్యమే!: అజారుద్దీన్ వరుస ప్రమాదాలు జరుగుతున్నా జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం వీడడం లేదని కాంగ్రెస్ నేత అజారుద్దీన్ అన్నారు. నాంపల్లి అగ్నిప్రమాద స్థలాన్ని ఆయన పరిశీలించి.. అనంతరం మీడియాతో మాట్లాడారు. నివాస ప్రాంతాల్లో గోదాములు ఉన్నాయని తెలిసినా చర్యలు తీసుకో లేదు. డెక్కన్మాల్, స్వప్నలోక్ కాంప్లెక్స్ ప్రమాదాల తర్వాత కూడా అలర్ట్ కాలేదు. వరుస ప్రమాదాలు జరుగుతున్నా నిర్లక్ష్యంగానే జీహెచ్ఎంసీ వ్యవహరిస్తోంది అని మండిపడ్డారాయన. రూ.5 లక్షలా?.. ఏమైనా భిక్షం వేస్తున్నారా?: సీపీఐ నారాయణ నాంపల్లి ప్రమాద ఘటనాస్థలిని పరిశీలించిన సీపీఐ నారాయణ.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘కేటీఆర్ కేవలం ఐదు లలక్షల మాత్రమే ప్రకటించారు. బాధితులకు ఏమైనా భిక్షం వేస్తున్నారా?’’ అని నారాయణ మండిపడ్డారు. ప్రభుత్వం బాధితులకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, బాధిత కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగమూ ఇప్పించాలని నారాయణ ప్రభుత్వాన్ని కోరారు. ‘రెసిడెన్షియల్ ఏరియాల్లో కెమికల్ డబ్బాల ఉంచితే నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి?.. కాబట్టి నాంపల్లి ప్రమాద ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి’ అని అన్నారాయన. నాంపల్లి ఘటన.. జనసేన చీఫ్ పవన్ స్పందన నాంపల్లి అగ్నిప్రమాద ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఘటన దిగ్భ్రాంతి కలిగించిందన్న ఆయన.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కెమికల్స్ వల్లే ప్రమాదం జరిగిందని తెలిసిందని, నివాస ప్రాంతాల్లో ఈ తరహా ప్రమాదాలకు ఆస్కారం ఇచ్చే వాటిని నిల్వ చేయకుండా కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ అధికారుల్ని కోరారాయన. నాంపల్లి అగ్ని ప్రమాదం దిగ్భ్రాంతికరం - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/lb8SkVP5ix — JanaSena Party (@JanaSenaParty) November 13, 2023 ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి: సీపీఐ తమ్మినేని నాంపల్లి కెమికల్ గోడౌన్ అగ్ని ప్రమాదంపై సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన పేరు మీద ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది పార్టీ. ‘‘తొమ్మిది మంది కార్మికుల మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నది. మృతి చెందినవారికి సంతాపాన్ని, వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తున్నాము. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రు.20 లక్షలు అందించాలని, ఆ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని, గాయపడినవారికి మెరుగైన వైద్యాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ..హైదరాబాదులో ఇలాంటి అగ్ని ప్రమాదాలు వరుసగా జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చేతులు దులుపుకుంటున్నది. ప్రజలు నివసించే ప్రాంతాల్లో కెమికల్ గోడౌన్లను ఉంచకుండా శివారు ప్రాంతాలకు తరలించి ప్రమాదాలను అరికట్టాలని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని కోరుతున్నది’’. అగ్ని ప్రమాదంపై సీఎల్పీ నేత భట్టి దిగ్భ్రాంతి.. ►నాంపల్లి అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది మృతిచెందడం బాధాకరం. ►మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం, సానుభూతి. ►అగ్ని ప్రమాదంలో గాయపడిన వారికి యుద్ధ ప్రాతిపదికన మెరుగైన వైద్యం అందించాలి ►మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి. ►అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలి ►ప్రమాద ఘటనను సందర్శించడానికి వచ్చిన ఫిరోజ్ ఖాన్ను ఎంఐఎం కార్యకర్తలు అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నాను. ►మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఐదు లక్షల ఎక్స్గ్రేషియా ప్రమాదంపై మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి ►నాంపల్లి అగ్నిప్రమాద స్థలాన్ని మంత్రులు కేటీఆర్, తలసాని పరిశీలించారు. ►అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ►ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తునకు కేటీఆర్ ఆదేశం. ►షార్ట్ సర్య్కూట్ లేదా టపాసుల వల్ల మంటలు వ్యాప్తించాయి. ►ఒక్కో మృతుడి కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్గ్రేషియా. ►బాధితులకు మెరుగైన వైద్య సాయం అందిస్తాం. ►అపార్ట్మెంట్లో కెమికల్స్ వాడటం ప్రమాదకరం. ►కాసేపట్లో ఘటనా స్థలానికి మంత్రి కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్. ►రెండో అంతస్తులో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి. ►అగ్ని ప్రమాదంలో తన వారిని కోల్పోయి కన్నీరు పెట్టుకున్న బాధితుడు. నాంపల్లిలో ఉద్రిక్తత.. పోలీసుల లాఠీఛార్జ్ ►ఘటనా స్థలంలో ఫిరోజ్ ఖాన్ను అడ్డుకున్న ఎంఐఎం నేతలు ►వీరి మధ్య వాగ్వాదం ►పోలీసులు వారించినా పట్టించుకోని నేతలు ►పోలీసుల స్వల్ప లాఠీఛార్జ్. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఫిరోజ్ ఖాన్ ►నాంపల్లిలో ఘటనా స్థలాన్ని పరిశీలించిన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్. ►ఈ క్రమంలో ఆయనను స్థానిక నేతలు అడ్డుకున్నారు. ►దీంతో, ఫిరోజ్ ఖాన్, ఎంఐఎం నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. స్థానిక ఎంఐఎం నేతలపై ఫిరోజ్ ఖాన్ తీవ్ర ఆరోపణలు. నాంపల్లి అగ్ని ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి.. ►నాంపల్లి అగ్ని ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ►మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. ►తక్షణమే పటిష్టమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ►తీవ్రంగా గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ► నాంపల్లిలో అగ్ని ప్రమాదానికి గురైన ఇంటి యాజమాని రమేష్ జైశ్వాల్గా గుర్తించారు. రమేష్ జైశ్వాల్కు కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్నట్టు గుర్తింపు. రమేష్ కోసం గాలిస్తున్న పోలీసులు. 30 కెమికల్ డబ్బాలు గుర్తింపు, కాలిపోకుండా ఉన్నవి మరో 100 డబ్బాలను గుర్తించారు. నాంపల్లి ప్రమాదంపై రేవంత్ దిగ్భ్రాంతి.. ►నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ►అగ్ని ప్రమాదంపై రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి. ►హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైంది. ►అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది మృతిచెందడం అత్యంత బాధాకరమైన విషయం. ►అపార్ట్మెంట్ సెల్లార్లో కారు మరమ్మత్తులు చేయడం ఏంటి?. ►రెసిడెన్షియల్ ఏరియాలో కెమికల్ డ్రమ్ములు ఎలా నిల్వ చేశారు. ►ఈ విషయంలో సమగ్ర విచారణ జరపాలి. ►ప్రమాదంలో మృతిచెందిన వారికి ప్రగాఢ సంతాపం. ►వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ► మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి. అగ్ని ప్రమాద స్థలికి కిషన్ రెడ్డి.. ►ప్రమాదంలో మృతి చెందిన వారు వీరే.. తూభ(5) తరూభ(12) మహ్మాద్ ఆజమ్ (54), రెహమాన్, రెహానా సుల్తానా(50) డాక్టర్ తహుర ఫర్హీన్(38), ఫైజా సమీన్(25) సెలవుల కారణంగా పిల్లలతో పాటు బంధువుల ఇంటికి వచ్చిన డాక్టర్ ఫరీన్. మూడవ అంతస్తులో : (1) జకీర్ హుస్సేన్ (2) నిక్కత్ సుల్తానా ►హైదరాబాద్లోని నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. బజార్ఘాట్లోని కెమికల్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఏడుగురు సజీవ దహనమయ్యారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్ని ప్రమాక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ►వివరాల ప్రకారం.. నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం బజార్ఘాట్లోని కెమికల్ గోదాంలో మంటలు చెలరేగాయి. మంటలు ఒక్కసారిగా నాలుగు అంతస్తులకు వ్యాపించాయి. ఎగిసిపడుతున్న మంటల్లో కార్మికులు చిక్కుకున్నారు. ఇప్పటికి ఏడుగురు మృతిచెందినట్టు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సమాచారం అందుకున్న వెంటనే మూడు ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఇంకా భవనంలో దట్టమైన పొగ అలుముకుంది. ►ఇక, అపార్ట్మెంట్లో కార్మికులు చిక్కుకున్నట్టు సమాచారం. రెస్య్కూ సిబ్బంది ఇప్పటికి 21 మందిని కాపాడింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఎనిమిది మందిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. మృతుల్లో నలుగురు పురుషులు, మహిళలు, చిన్నారులు ఉన్నట్టు సమాచారం. ►ఈ ప్రమాద ఘటనపై డీసీపీ మాట్లాడుతూ.. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అపార్ట్మెంట్పైకి మంటలు వ్యాపించాయి. ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. అపార్ట్మెంట్ సెల్లార్లో మెకానిక్ షెడ్ ఉంది. కారు రిపేర్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డీజిల్ డ్రమ్స్ పేలడంతో మంటలు వ్యాపించాయి. -
ఎన్నికల జాబితాలో జోక్యం చేసుకోలేం: తెలంగాణ హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల జాబితాలో జోక్యం చేసుకోలేం అని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. నాంపల్లి ఓటర్ల జాబితాపై కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం విచారణ జరిపింది. నాంపల్లిలో 45 వేలకు పైగా బోగస్ ఓట్లున్నాయని.. మరణించిన, ఇళ్లు మారిన, రెండుచోట్ల ఉన్న ఓటర్లను తొలగించలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రత్యేక సవరణ చేపట్టి బోగస్ ఓట్లు తొలగించేలా ఈసీని ఆదేశించాలని ఫిరోజ్ ఖాన్ కోరారు. ఈ పిటిషన్పై సీజే జస్టిస్ అలోక్ అరాథే ధర్మాసనం విచారణ చేపట్టింది. ముసాయిదా ప్రకటించి అభ్యంతరాలను స్వీకరించాకే తుది జాబితా ఖరారు చేశామని ఈసీ తెలిపింది. ఎన్నికల జాబితాలో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు ధర్మాసనం.. అభ్యంతరాలపై సీఈఓకు ఫిర్యాదు చేయాలని ఫిరోజ్ ఖాన్కు సూచించింది. చదవండి: TS: మూడే రోజుల్లో అన్నేసి కోట్లు సీజ్ -
తెలంగాణ సాధనతోనే నా జన్మ సాకారమైంది: సీఎం కేసీఆర్
Updates.. ► నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్లో జరుగుతున్న జాతీయ సమైక్యతా వేడుకల్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ కోసం పోరాడిన వీరులందరికీ నా వందనాలు. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేకత ఉంది. న్యాయం, ధర్మం కోసం ఎందరో ప్రాణత్యాగం చేశారు. ఆనాటి సామాన్యులు చేసిన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తిని అందిస్తూనే ఉంటాయి. గాంధీ, నెహ్రు, పటేల్ వంటి నేతల వల్లే ప్రస్తుత భారతదేశం సాధ్యమైంది. తెలంగాణలో రాచరికం ముగిసి ప్రజాస్వామ్య పాలన ప్రారంభమైంది. తెలంగాణ సాధనతోనే నా జన్మ సాకారమైంది. ఉమ్మడి రాష్ట్రంలో పెండింగ్లో పెట్టిన ప్రాజెక్ట్లను పూర్తి చేశాం. ► తెలంగాణ వచ్చాక అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోంది. తెలంగాణ విధానాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత పాలమూరు పచ్చగా మారింది. ఎన్నో అడ్డంకులను అధిగమించి పాలమూరును పూర్తి చేశాం. తెలంగాణ సాగునీటి చరిత్రలో ఇదో సువర్ణ అధ్యయనం. 6 జిల్లాల్లో 12లక్షల 30వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. చెక్ డ్యామ్ల నిర్మాణాలతో భూగర్భ జలాలు పెరిగాయి. దేవాదుల ఎత్తిపోతలతో వరంగల్కు త్వరలోనే సాగునీరు అందిస్తాం. కోటి 25లక్షల ఎకరాలకు సాగునీరందించడమే లక్ష్యం. హైదరాబాద్ పేదల కోసం లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తున్నాం. డబుల్ బెడ్రూమ్ పథకం నిరంతరం కొనసాగుతుంది. అర్హుందరికీ డబుల్ ఇల్లులు అందిస్తాం. ► వైద్యవిద్యలో అనేక సంస్కరణలు తీసుకువచ్చాం. రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి. ఒకే రోజు 9 వైద్య కళాశాలలు ప్రారంభించాం. ప్రతీ ఏటా 10వేల మంది డాక్టర్లను తయారు చేస్తున్నాం. తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉంది. హైదరాబాద్ పేదల కోసం లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తున్నాం. డబుల్ బెడ్రూమ్ పథకం నిరంతరం కొనసాగుతుంది. అర్హుందరికీ డబుల్ ఇల్లులు అందిస్తామన్నారు. రాష్ట్రంలో 44లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయి. పెన్షన్ లబ్దిదారుల వయస్సును 57 ఏళ్లకు తగ్గించాం. ఖమ్మంలో సీతారామ ప్రాజెక్ట్ను నిర్మిస్తాం. ఆదివాసీలకు పోడు భూముల పట్టాలు ఇచ్చాం. ప్రపంంలోనే అనేక సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నాయి.దళిత బంధు పథకంతో దళితుల కుటుంబాల్లో వెలుగులు వచ్చాయి. దేశంలో ఎక్కడా దళిత బంధు పథకం లేదు. ఐటీ రంగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. ► తెలంగాణ పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన కేసీఆర్. ► పబ్లిక్ గార్డెన్స్లో జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం కేసీఆర్ ► గన్ పార్క్లో తెలంగాణ అమరవీరులకు సీఎం కేసీఆర్ నివాళులు. ► పబ్లిక్ గార్డెన్స్లో జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతోంది. వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ► సచివాలంలో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాలు వేడుకలు. ► జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎస్ శాంతి కుమారి ► నేడు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం. అధికార బీఆర్ఎస్ పార్టీ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్లో జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలను నిర్వహించనుంది. -
‘‘సీపీఎస్ రద్దు– ఓపీఎస్ అమలు’’ ఇదే మా నినాదం.. పోరాటం
సాక్షి, హైదరాబాద్: ‘కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు చేయాలి... పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరించాలి. ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియ జరగాలి. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేసిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లాలి’అంటూ తెలంగాణ స్టేట్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్సీపీఎస్ఈయూ) గొంతెత్తింది. 2004 తర్వాత రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో నియమితులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అమలు చేస్తున్న సీపీఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం టీఎస్సీపీఎస్ఈయూ ఆధ్వర్యంలో నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 54 సంఘాల ఉద్యోగులు మద్దతు తెలుపుతూ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో పాటు పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతలు సైతం ఈ సభకు హాజరై సీపీఎస్ రద్దుకు గొంతు కలిపారు. 2 లక్షల కుటుంబాల చిరకాల వాంఛ ఇది ఈ సందర్భంగా టీఎస్సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ మాట్లాడారు. ‘ఐదేళ్ల క్రితం సీపీఎస్ రద్దు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమా? రాష్ట్ర ప్రభుత్వమా? అని అడిగిన సందర్భాలున్నాయి. ఆ ప్రశ్నలకు ఇప్పుడు సరైన సమాధానం దొరికింది. సీపీఎస్ పథకాన్ని రద్దు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. అదేవిధంగా ఈ పథకం కింద జమ అయిన నిధులను వెనక్కు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రంలోని దాదాపు 2 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబాల చిరకాల వాంఛ సీపీఎస్ రద్దు– ఓపీఎస్ అమలు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల హామీ మాదిరి కాకుండా ఎన్నికలకు ముందే సీపీఎస్ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలి. వెనువెంటనే ఓపీఎస్ను అమలు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులంతా రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలబడే వారే. ప్రభుత్వం ఆదేశాలను తూచ తప్పకుండా అనుసరించి అమలు చేసేవారు కావడంతో ప్రభుత్వం ఏమాత్రం సంకోచించకుండా సీపీఎస్ను రద్దు చేయాలి’అని కోరారు. సీపీఎస్ ఉద్యోగుల ప్రధాన సమస్యలు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దృష్టికి పోవడం లేదని, ఆయనకు సుదీర్ఘంగా వివరిస్తే తప్పకుండా పరిష్కారం లభిస్తుందన్నారు. అందుకోసమే రాష్ట్ర రాజధానిలో ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు వివరించారు. జిల్లాలను చుట్టి.. రాజధానికి చేరి.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అమలు చేస్తున్న సీపీఎస్ రద్దుపై విస్తృత అవగాహన కలి్పంచేందుకు టీఎస్సీపీఎస్ఈయూ జూలై 16 నుంచి 31వ తేదీ వరకు పాత పెన్షన్ సాధన సంకల్ప యాత్రను తలపెట్టింది. రాష్ట్రంలోని 33 జిల్లాల మీదుగా సాగిన ఈ యాత్ర ద్వారా ఉద్యోగులు, ఉపాధ్యాయులను చైతన్య పరిచి పాత పెన్షన్ ఆవశ్యకత, సీపీఎస్ రద్దుపై విపులంగా వివరించి అభిప్రాయ సేకరణ జరిపింది. పక్షం రోజుల పాటు సాగిన ఈ యాత్రలో వివిధ ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొని మద్దతు పలికారు. ఈ క్రమంలో ఈనెల 12న హైదరాబాద్లో సీపీఎస్ ఉద్యోగులతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు స్థితప్రజ్ఞ ఇదివరకే ప్రకటించారు. ఇందులో భాగంగా శనివారం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో తలపెట్టిన భారీ బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు హాజరయ్యారు. పోటెత్తిన వివిధ రాష్ట్రాల నేతలు కార్యక్రమంలో నేషనల్ మూమెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్స్ స్కీం జాతీయ అధ్యక్షులు విజయకుమార్ బంధు, పంజాబ్ సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సుఖజిత్ సింగ్, కర్ణాటక సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు శాంతారామ్, ప్రధాన కార్యదర్శి రంగనాథ్, ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ నాయకుడు పల్లెల రామాంజనేయులు, మహారాష్ట్ర నుంచి విటేష్ ఖండేల్కర్, ఝార్ఖండ్ నుంచి విక్రమ్ సింగ్, ఛత్తీస్గఢ్ నుంచి రాకేష్ సింగ్, తమిళనాడు నుంచి ఆరోగ్యదాస్, తెలంగాణ రాష్ట్రం నుంచి ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్, తపస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుబ్బయ్య, సురేష్, టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మధుసూదన్రెడ్డి, కటకం రమేశ్, ఎస్జీటీయూ రాష్ట్ర అధ్య క్షుడు మహిపాల్ రెడ్డి, టీఎస్టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ నాయక్, వెటర్నరీ ఫోరం అధ్యక్షుడు అభిషేక్ రెడ్డి, బ్లైండ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అనిల్ పాల్గొన్నారు. ఇరువురు సీఎంలతో చర్చ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, తెలంగాణ సీఎం కేసీఆర్కు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. తప్పకుండా ఇరువురు సీఎంలతో పాత పెన్షన్ పునరుద్ధరణపై చర్చిస్తాం. అదేవిధంగా జార్ఖండ్లో అమలు చేస్తున్న పాత పెన్షన్ స్టాండింగ్ ఆపరేటింగ్ గైడ్లైన్స్ వివరిస్తాం. –విక్రమ్ సింగ్, జార్ఖండ్ సీపీఎస్ యూనియన్ అధ్యక్షుడు మేమూ ఎదురుచూస్తున్నాం తెలంగాణలో సీపీఎస్ రద్దుకోసం మహారాష్ట్రలో సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు. పాత పెన్షన్ కోసం పార్టీ పరమైన నిర్ణయాన్ని తీసుకుంటే మరింత స్పష్టత వస్తుంది. –విటేష్ ఖండేల్కర్, మహారాష్ట్ర సీపీఎస్ యూనియన్ అధ్యక్షుడు కేసీఆర్ దేశ్కీ నేతా అయ్యేందుకు ఇదే చాన్స్ తెలంగాణలోని రెండు లక్షల ఉద్యోగుల సీపీఎస్ను రద్దు చేస్తే దేశంలోని మిగతా రాష్ట్రాలు కూడా అనుకరిస్తాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ్కి నేతా అయ్యేందుకు ఇదే మంచి అవకాశం. – విజయ్కుమార్ బంధు, సీపీఎస్ జాతీయ అధ్యక్షుడు -
జనరల్ బోగీల వద్దే భోజనం ప్లేట్ మీల్స్ రూ.50
సాక్షి, హైదరాబాద్: జనరల్ బోగీల్లో ప్రయాణించే వారికోసం జనాహార్ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటివరకు ఈ కేంద్రాలు ప్రధాన రైల్వేస్టేషన్లలో స్టాళ్లకే పరిమితమయ్యాయి. సాధారణ బోగీల్లో ప్రయాణించేవారి భోజన ఇబ్బందులు తొలగించేందుకు దక్షిణమధ్య రైల్వే చర్యలు చేపట్టింది. జనరల్ బోగీలు ఆగేచోటనే ఈ విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే నాంపల్లి రైల్వేస్టేషన్లో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. విజయవాడ, గుంతకల్, రేణిగుంట స్టేషన్ల పరిధిలోనూ ఈ సేవలు అమలవుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు రైల్వేస్టేషన్లలో ఈ తరహా సదుపాయం ప్రవేశపెట్టనున్నట్టు ఇటీవల రైల్వేశాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే మొదటివిడతగా దక్షిణమధ్య రైల్వేలో మొదట నాలుగుస్టేషన్లలో జనాహార్ విక్రయ కేంద్రాలను ప్రారంభించారు. జనరల్ బోగీ ప్రయాణికులు మాత్రం తమకు ఆహారం కావాలంటే ట్రైన్ దిగి స్టేషన్లో అందుబాటులో ఉన్న రెస్టారెంట్లు, ఫుడ్కోర్టుల నుంచి ఆహారం తెచ్చుకోవాలి. ఈ ఇబ్బందులను తొలగించేందుకే జనరల్ బోగీల వద్దకే జనాహార్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. తక్కువ ధరల్లో నాణ్యమైన ఆహారం అన్ని రకాల నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో తయారు చేసిన శుభ్రమైన ఆహారపదార్థాలను ప్రయాణికులకు అందజేస్తారు. రూ.20కే ఏడు పూరీలు, కర్రీ ఇస్తారు. ఇది 250 గ్రాముల వరకు ఉంటుంది. దీనిని ఐఆర్సీటీసీ ఎకానమీ మీల్గా పేర్కొంది. కాంబో మీల్ రూ.50కే అందజేస్తారు. ఇందులో 350 గ్రాముల వరకు అన్నం, ఒక కర్రీతోపాటు పప్పు ఉంటుంది. ప్రస్తుతానికి ఈ రెండు రకాల ఆహార పదార్థాలను అందజేస్తున్నారు. ప్రయాణికులు డిజిటల్ రూపంలో చెల్లించే సదుపాయం ఉంది. దశలవారీగా విస్తరణ దశలవారీగా సికింద్రాబాద్, తిరుపతి, గుంటూరు, కాకినాడ, వరంగల్, కాజీపేట్ తదితర స్టేషన్లలో కూడా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చే అవకాశముంది. ప్రయాణికులకు నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం తక్కువ ధరలోనే లభిస్తుందని దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్జైన్ తెలిపారు. ప్లేట్ ఇడ్లీ రూ.1,200 గోల్డ్ ఇడ్లీని అమ్ముతున్న హైదరాబాద్ కేఫ్ బంజారాహిల్స్(హైదరాబాద్): గోల్డెన్ ఇడ్లీ.. నగరంలో అందుబాటులోకి వచ్చిన కొత్త డిష్ ఇది. ప్లేట్ ఇడ్లీ ధర రూ.1200..అందుకే ఆ ఇడ్లీ బంగారమే అనడంతో అతిశయోక్తి లేదు. తినడానికి కొందరు..చూడడానికి మరికొందరు ఇలా భారీ సంఖ్యలో ఆ హోటల్కు జనాలు బారులుతీరుతున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం.3 నుంచి శ్రీనగర్కాలనీకి వెళ్లే రోడ్డులో కర్ణాటక బ్యాంక్ ఎదురుగా రాఘవేంద్ర రెసిడెన్సీలో ఏర్పాటుచేసిన కృష్ణ ఇడ్లీ కేఫ్నకు తెల్లవారుజామునుంచే ఫుడ్డీలు చేరుకుంటున్నారు. బంగారు పూత పూసిన ఇడ్లీని గులాబీ రేకులతో కనువిందు చేసే రీతిలో సర్వ్ చేస్తున్నారు. ఒక ప్లేట్కు రెండు ఇడ్లీలు మాత్రమే ఇస్తారు. ఇక్కడ గోల్డ్ ఇడ్లీలే కాకుండా బంగారు దోశ, గులాబిజామ్ బజ్జీ, మలాయి కోవా వంటి 100కిపైగా ఫుడ్ ఐటమ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. దక్షిణాది వంటకాలే కాకుండా చైనీస్ వంటకాలకూ ఈ హోటల్ స్పెషల్. -
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కొనసాగుతున్న చేపప్రసాదం పంపిణీ
-
ఫుల్ జోష్.. నుమాయిష్ హౌస్ఫుల్, ఇప్పటివరకు ఎంత మంది సందర్శించారంటే?
గన్ఫౌండ్రీ: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న 82వ అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిస్) సందర్శకులతో కిటకిటలాడుతోంది. ప్రతి ఏడాది లానే ఈ సారి కూడా సందర్శకులను ఆకట్టుకుంటోంది, పైగా సంక్రాంతి పండుగ సెలవులు కావడంతో ఎగ్జిబిషన్ను రోజూ వేల సంఖ్యలో సందర్శకులు సందర్శించినట్లు బుకింగ్ కమిటీ ఛైర్మన్ హన్మంతు తెలిపారు. ఇప్పటి వరకు ఎగ్జిబిషన్ను 4 లక్షలకు పైగా సందర్శించినట్లు తెలిపారు. ఈ ఏడాది 23 లక్షల మంది సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. కాగా ఎగ్జిబిషన్కు సందర్శకులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో పలు వాహనాలను ట్రాఫిక్ పోలీసులు దారిమళ్లించారు. చదవండి: వందేభారత్లో త్వరలో స్లీపర్ బెర్తులు -
HYD: ఆ రెండు లైన్లలో అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు
సాక్షి, హైదరాబాద్: నగర వాసులకు కాస్త ఊరట కలిగించే వార్త అందించింది హైదరాబాద్ మెట్రో. అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లను నడపాలని నిర్ణయించుకుంది. అయితే అది కొన్నిరోజుల వరకు, రెండు రూట్లలో మాత్రమే!. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నుమాయిష్ కొనసాగినన్ని రోజులు ఈ సౌకర్యం ఉంటుందని హైదరాబాద్ మెట్రో రైలు ప్రకటించింది. మియాపూర్-ఎల్బీనగర్, నాగోల్ –రాయదుర్గం కారిడార్లలో ఈ వెసులుబాటు కల్పించినట్లు అధికారులు తెలిపారు. ఎల్బీనగర్, మియాపూర్, నాగోల్, రాయదుర్గం స్టేషన్ల నుంచి ఆఖరి రైలు అర్ధరాత్రి 12 గంటలకు బయలుదేరి గమ్యస్థానాన్ని రాత్రి 1 గంటకు చేరుకుంటుందని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. నుమాయిష్ సందర్శకులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరారు ఆయన. అయితే.. జేబీఎస్–ఎంజీబీఎస్ రూట్లో చివరి రైలు మాత్రం రాత్రి 11 గంటలకు మాత్రమే బయలుదేరుతుందని ఆయన స్పష్టంచేశారు. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో నుమాయిష్ ఎగ్జిబిషన్ వద్ద ఉన్న గాందీభవన్ స్టేషన్లో అదనపు టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. నుమాయిష్ షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 15 వరకు మెట్రో సేవల పొడిగింపు కొనసాగనుంది. -
నందకుమార్ కు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
-
బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి పెంచాలి
నాంపల్లి: బీసీ రిజర్వేషన్లను యాభై శాతానికి పెంచాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం ఏసీగార్డ్స్ అడ్వకేట్స్ కాలనీలోని బీఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ రిజర్వేషన్ల పెంపు–బీఎస్పీ భవిష్యత్తు కార్యాచరణ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. జనాభా దామాషా పద్ధతిలో బీసీ రిజర్వేషన్లు 27 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని, క్రీమిలేయర్ విధానాన్ని ఎత్తివేయాలని కోరారు. కాలేల్కర్, మండల్ కమిషన్ల సిఫార్సులను అమలు చేయకుండా ప్రభుత్వాలు బీసీలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. తమిళనాడు, జార్ఖండ్ రాష్ట్రాల్లో మాదిరిగా తెలంగాణలో కూడా రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో దేశవ్యాప్తంగా బీసీల కోసం 8617 టీచింగ్ పోస్టుల భర్తీకి అనుమతి ఉన్నా ఉద్దేశపూర్వకంగా 4821 పోస్టులను ఖాళీగా ఉంచారని నిందించారు. దర్యాప్తులు, ఐటీ దాడుల పేరుతో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని దుయ్యబట్టారు. పథకం ప్రకారమే రెండు ప్రభుత్వాలు దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. పోడు భూములకు పట్టాలివ్వకుండా ఫారెస్టు అధికారులను చంపుతున్నారని ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవం నుంచి తమ పార్టీ కార్యాచరణ ప్రారంభం అవుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దయానంద రావు, రాష్ట్ర మైనార్టీ కన్వీనర్ అబ్రార్, రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్, అధికార ప్రతినిధులు సాంబశివగౌడ్, అరుణ, డాక్టర్ వెంకటేష్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. -
బండి సంజయ్ వ్యాఖ్యలపై ఉద్యోగ జేఏసీ ఆగ్రహం
నాంపల్లి: ఉద్యోగ సంఘాలు అమ్ముడుపోయాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఉద్యోగ జేఏసీ నేతలు నిరసన తెలిపారు. జేఏసీ చైర్మన్ మామిళ్ళ రాజేందర్ నేతృత్వంలో నాంపల్లిలోని టీఎన్జీవో కేంద్ర సంఘం కార్యాలయం నుంచి ఏ–వన్ సిగ్నల్ వరకు చేరుకుని, అక్కడి నుంచి తిరిగి టీఎన్జీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. సోమవారం జరిగిన ర్యాలీలో ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలను నిరసిస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ సెక్రటరీ జనరల్ వి.మమత, టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, టీజీవో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, టీఎన్జీవో నేతలు గండూరి వెంకటేశ్వర్లు, కస్తూరి వెంకటేశ్వర్లు, రామినేని శ్రీనివాసరావు, ఎస్.ఎం.హుస్సేన్, శ్రీరామ్, తదితరులు పాల్గొన్నారు. -
ఆయుధ అలజడి...తరచూ తుపాకులు, తూటాలు కలకలం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో తరచూ తుపాకులు ‘దొరుకుతున్నాయి’. అక్రమ ఆయుధాలు వినియోగిస్తున్న, రవాణా చేస్తున్న, కలిగి ఉన్న వారితో పాటు లైసెన్స్ ఉన్న ఆయుధాలను దుర్వినియోగం చేసిన వారిని పట్టుకోవడం నాణేనికి ఒక వైపైతే... చెత్త కుప్పలు, చెట్ల పొదల్లో అక్రమాయుధాలు, తూటాలు లభిస్తుండటం మరో వైపైంది. తాజాగా శుక్రవారం అసెంబ్లీకి కూతవేటు దూరంలో ఉన్న పబ్లిక్ గార్డెన్స్లో లభించిన రెండు తపంచాలు, ఓ కంట్రీమేడ్ రివాల్వర్ తీవ్ర కలకలం సృష్టించాయి. గతంలో రెండు సందర్భాల్లో ఇలా ఆయుధాలు, బుల్లెట్లు బయటపడ్డాయి. ఆ కేసులు ఇప్పటికీ కొలిక్కిరాలేదు. తాజా ఉదంతంతో సహా మొత్తం మూడూ శుక్రవారాల్లోనే చోటు చేసుకోవడం గమనార్హం. మొదటగా గాంధీ ఆస్పత్రి సమీపంలో... సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రి సమీపంలో 2013 ఫిబ్రవరి 15న (శుక్రవారం) ఆయుధాలు, తూటాలు లభించాయి. చిలకలగూడ ఠాణా పరిధిలో ఉన్న రెండు ప్రాంతాల్లో ఇవి దొరికాయి. ఈ ప్రాంతాల మధ్య కేవలం కిలోమీటరు దూరమే ఉండటంతో ఒకరి పనిగానే అనుమానించారు. సదరు తుపాకులు, తూటాలు దాదాపు 40 ఏళ్ల క్రితం నాటివిగా అంచనా వేశారు. పద్మారావునగర్లో ఆ రోజు ఉదయం 6.30 గంటలకు పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న జీహెచ్ఎంసీ కాంట్రాక్టు కార్మికులు చెత్తను డబ్బాలో వేసేందుకు వెళ్లారు. అందులో ప్లాస్టిక్ గోనెసంచిలో కట్టిన రెండు తుపాకులు (రైఫిల్స్ మాదిరివి) కనిపించాయి. దీంతో తీవ్ర భయభ్రాంతులకు గురైన సిబ్బంది వెంటనే చిలకలగూడ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కలకలం కొనసాగుతుండగానే... మరో అరగంటకు షాబాద్గూడ నుంచి మరో సమాచారం వచ్చింది. రామచంద్రయ్య అనే వ్యక్తి చెత్త పడేసేందుకు తన ఇంటి సమీపంలోని డబ్బా వద్దకు వెళ్లగా... అందులో తూటాలు ఉన్నట్లు గుర్తించారు. ఆ తుపాకులు, తూటాలు సైతం అమెరికాలో తయారైనవిగా వెల్లడైంది. రెమింగ్టన్ కంపెనీకి పాయింట్ 410 ఎంఎం, 0.38 ఆర్మీడ్, 3.57 రేంజర్ క్యాలిబర్లతో కూడిన తూటాలు మొత్తం వంద వరకు, మరికొన్ని ఖాళీ క్యాట్రిడ్జ్లు (కాల్చేయగా మిగిలినవి) ఉన్నట్లు గుర్తించారు. కొన్నింటిని పాన్ల్లో వినియోగించే ఖాళీ జర్దా డబ్బాలో, మరికొన్ని ప్రముఖ మిఠాయి దుకాణం కర్నూలు బ్రాంచ్కు చెందిన డబ్బాలో ఉంచి చెత్తడబ్బాలో పడేశారు. మూడేళ్ల క్రితం రైల్వేస్టేషన్ వద్ద... హైదరాబాద్ రైల్వే స్టేషన్ (నాంపల్లి) సమీపంలోని ఓ సులభ్ కాంప్లెక్స్లో 2019 డిసెంబర్ 20న (శుక్రవారం) రెండు రివాల్వర్లు దొరికాయి. ఆ రోజు రాత్రి మరుగుదొడ్లను శుభ్రం చేసే సిబ్బంది వీటిని గుర్తించారు. దీంతో కాంప్లెక్స్ నిర్వాహకులు నాంపల్లి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు సంఘటనాస్ధలానికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. అవి రివాల్వర్లు కాదని, తపంచాలని పోలీసులు నిర్ధారించారు. తపంచాలు వదిలిపెట్టిన వ్యక్తుల కోసం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను సైతం పరిశీలించారు. నాంపల్లి రైల్వే స్టేషన్కు వచ్చిన ప్రయాణికులే సులభ్ కాంప్లెక్స్లో స్నానం చేసి ఉంటారని, వాళ్లే ఇక్కడ వదిలిపెట్టి వెళ్లినట్టుగా భావించి ఆ కోణంలోనూ ఆరా తీశారు. అక్రమ రవాణా ముఠాలు, దోపిడీ దొంగలు, రౌడీ షీటర్లు, మావోయిస్టులు, మాజీ నక్సలైట్లు.. వీళ్లల్లో ఎవరైనా తీసుకువచి్చ, సులభ్ కాంప్లెక్స్లో వీటిని మరిచిపోయారని అంచనా వేశారు. ఇలాంటి కేసుల్లో దర్యాప్తు జటిలమే... సాధారణంగా కంపెనీల్లో తయారయ్యే మారణాయుధాలకు కొన్ని సీరియల్ నెంబర్లు, బ్యాచ్ నెంబర్లు తదితరాలు ఉంటాయి. ఇవి ఎక్కడైనా లభిస్తే ఈ నెంబర్ల ఆధారంగా దర్యాప్తు అధికారులు ముందుకు వెళ్లి బాధ్యలను గుర్తించే అవకాశం ఉంటుంది. అయితే నాటు తుపాకులు, తపంచాలకు ఇలాంటి లేకపోవడంతో పాటు విదేశాల్లో తయారైన వాటికి ఇవి ఉన్నా ఫలితం ఉండట్లేదు. నగరానికి నాటు తుపాకులు, తపంచాలు ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ల్లోని వివిధ ప్రాంతాల నుంచి సరఫరా అవుతున్నాయి. ఇలాంటివి లభించినప్పుడు వాటి రూపం, పిడి ఉన్న తీరుతెన్నుల్ని బట్టి బాలిస్టిక్ నిపుణులు సైతం ఏ ప్రాంతంలో తయారైందో మాత్రమే చెప్పలగరు. ఇంతకు మించి ముందుకు వెళ్లడానికి సీసీ కెమెరాలు వంటి వాటిపై ఆధారపడాల్సిందే. అయితే అనివార్య కారణాల నేపథ్యంలో వాటిలోనూ సరైన ఆధారాలు లభించట్లేదు. ఫలితంగా ఈ అక్రమ ఆయుధాల కేసులు బాధ్యులు గుర్తించడం జరగకుండానే పెండింగ్లో ఉండి క్లోజ్ అయిపోతున్నాయి. (చదవండి: రామోజీపై భూకబ్జా కేసు పెట్టాలి.. ఆ 70 ఎకరాలు..) -
Hyderabad Metro: ప్రయాణికుల సంఖ్య పెరిగినా అవే సాంకేతిక ఇబ్బందులు
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైళ్లలో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇటీవల గణేష్ నిమజ్జనం సందర్భంగా రైళ్లలో రద్దీ నాలుగు లక్షల మార్కును దాటి.. ప్రస్తుతం దాదాపు అదే స్థాయిలో కొనసాగుతోంది. కానీ.. మెట్రో రైళ్లు తరచూ మందగిస్తున్నాయి. కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక లోపాలు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా నాంపల్లి– లక్డీకాపూల్ మార్గంలో ట్రాక్కు సంబంధించి సాధారణ నిర్వహణ, మరమ్మతులో భాగంగా గ్రౌటింగ్ పనులు జరుగుతుండడంతో రైళ్ల వేగం అకస్మాత్తుగా 15 కేఎంపీహెచ్కు పడిపోవడం గమనార్హం. మరో నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. సాంకేతిక చిక్కులు.. ► సాధారణంగా మెట్రో రైళ్ల వేగం 50–60 కేఎంపీహెచ్ మధ్యన ఉంటుంది. ఒక్కసారిగా రైళ్ల మందగమనంతో సమయానికి గమ్యస్థానానికి చేరుకుందామన్న ప్రయాణికుల అంచనాలు తప్పుతున్నాయి. రైళ్లు కిక్కిరిసి ఉంటున్న నేపథ్యంలో అకస్మాత్తుగా రైళ్ల వేగం పడిపోయిన ప్రతిసారీ ఏం జరిగిందోనని ప్రయాణికుల్లో ఆందోళన, గందరగోళం నెలకొంటోంది. ► నగర మెట్రో రైళ్లలో డ్రైవర్ అవసరం అంతగా లేని కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ వ్యవస్థను వినియోగిస్తున్నారు. వాతావరణ మార్పులు, ఒక్కసారిగా వాయు కాలుష్యం పెరిగిన సమయంలో ఈ టెక్నాలజీలో తరచూ లోపాలు తలెత్తుతున్నాయి. ఉన్నపళంగా రైళ్లు పట్టాలపై నిలిచిపోవడం, వేగం తగ్గడం తదితర సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సాంకేతికతను మన నగర పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేపట్టాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రద్దీ పెరుగుతోంది.. ప్రస్తుతం నగరంలో అన్నిరకాల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు పుంజుకోవడంతో రైళ్లలో రద్దీ కోవిడ్కు ముందున్న స్థాయిలో నాలుగు లక్షలకు చేరువైంది. అత్యధికంగా ఎల్బీనగర్– మియాపూర్ రూట్లో నిత్యం రెండు లక్షల మంది జర్నీ చేస్తున్నారు. ఐటీ కంపెనీల్లో కార్యకలాపాలు ప్రారంభం కావడంతో నాగోల్– రాయదుర్గం రూట్లోనూ రద్దీ 1.75 లక్షల మేర ఉంది. జేబీఎస్– ఎంజీబీఎస్ రూట్లో రద్దీ నిత్యం సరాసరిన 25 వేల మేర ఉంది. పండగలు, సెలవురోజుల్లో మూడు మార్గాల్లో కలిపి ప్రయాణికుల రద్దీ అదనంగా మరో 30 వేల 50 వేల వరకు ఉంటుందని మెట్రో వర్గాలు తెలిపాయి. (క్లిక్ చేయండి: ఫార్ములా– ఈ పనులు రయ్..రయ్) -
Hyderabad: కలెక్టరేట్కు వీడని గ్రహణం.. శిథిలావస్ధలో పాత భవనం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కలెక్టరేట్కు గ్రహణం వీడటంలేదు. కొత్త భవన నిర్మాణానికే కాదు.. కనీసం తరలింపునకు కూడా అడ్డగింపులు తప్పడం లేదు. తాజాగా కొంగరకలాన్లో నిర్మించిన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ భవనం పూర్తయ్యింది. కొత్త భవన సముదాయంలోకి మారనుంది. ఇంతకుముందు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఉన్న లక్డీకాపూల్లోని కాంప్లెక్స్లోకి హైదరాబాద్ కలెక్టరేట్ తరలించాలనే పాత ప్రతిపాదనపై సందిగ్ధత నెలకొంది. మరోవైపు కొత్తగా నిర్మిస్తున్న సచివాలయంలో అన్ని విభాగాల హెచ్ఓడీ ఉండాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో ప్రస్తుత కలెక్టరేట్ పక్కనే ఉన్న భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయంలోకి కలెక్టరేట్ను షిఫ్ట్ చేసే ఆలోచనను కూడా ప్రభుత్వం చేస్తోంది. తరలించాలని ఉన్నా.. హైదరాబాద్ కలెక్టరేట్ను లక్డీకాపూల్కు తరలించాలనే ప్రతిపాదన 2016లోనే వచ్చింది. కొంగరకలాన్కు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ తరలింపుతో ఖాళీ అయ్యే భవనాన్ని హైదరాబాద్ కలెక్టరేట్కు ఉయోగించాలని నిర్ణయించింది. ఈ మేరకు కొత్త కాంప్లెక్స్లోకి షిఫ్ట్ అయ్యేందుకు రంగారెడ్డి జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. లక్డీకాపూల్ మార్గం నిత్యం వాహనాలతో కిక్కిరిసి ఉండడం.. ధర్నాలు, ఆందోళనలతో ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో ఇక్కడికి హైదరాబాద్ కలెక్టరేట్ను తరలించేందుకు పోలీసుశాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. చదవండి: బండి సంజయ్ పాదయాత్రపై సస్పెన్స్.. హైకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ.. పదహారేళ్ల క్రితం.. పదహారేళ్ల క్రితం నగరంలోని మాసాబ్ ట్యాంక్ వద్ద ఎకరం ప్రభుత్వ స్థలంలో నూతన కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రతిపాదించారు. నాంపల్లి– అబిడ్స్ రోడ్డులోని కలెక్టరేట్లో పాత భవన సముదాయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో 1990లో నిర్మించిన నాలుగు అంతస్తులతో ఒకే ఒక కొత్త భవనంలో కలెక్టరేట్ విభాగాలు కొనసాగుతున్నాయి. వివిథ శాఖల ఆఫీసులు వేర్వేరుగా దూరంగా ఉండటం.. మొత్తం 32 విభాగాలను నిర్వహించడానికి స్థలం లేకపోవడంతో ఇతర ప్రాంతంలో నిర్మాణం చేపట్టాలని అప్పట్లో భావించారు. చదవండి: కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే పోటీ.. ఇక్కడి నుంచే కవిత పోటీ చేసే ఛాన్స్? కొత్త కాంప్లెక్స్ కోసం ఏప్రిల్ 2007 లో రూ.10 కోట్లు మంజూరు చేసింది. సుమారు 10 అంతస్తులతో కాంప్లెక్స్కు ఆర్అండ్బీ శాఖ, ప్రైవేట్ కన్సల్టెంట్తో కలిసి డిజైన్లు సిద్ధం చేసింది. కాంప్లెక్స్ అంచనా వ్యయం రూ.46 కోట్లు కాగా, రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు ఏ మూలకు సరిపోని పరిస్థితి నెలకొంది. అంతలోనే 2008 మార్చిలో బడ్జెట్ గడువు ముగియడంతో ప్రతిపాదన పెండింగ్లో పడింది. ఆ తర్వాత కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన నవీన్ మిట్టల్ మరో ఆర్కిటెక్ట్ ద్వారా ఆరు అంతస్తులకు తగ్గించి రూ.22 కోట్ల అంచనా వ్యయంతో 1.80.000 చదరపు అడుగుల బిల్టప్ ఏరియాతో సవరించి డిజైన్ చేశారు. సవరించిన ప్రణాళికలు, అంచనాలను తిరిగి ప్రభుత్వానికి ఆమోదం కోసం పంపించారు. కలెక్టరేట్ కాంప్లెక్స్ భూవేలంతో వచ్చిన మొత్తాన్ని కొత్త కాంప్లెక్స్కు ఉపయోగించాలని ప్రభుత్వం సూచించడంతో నిర్మాణం పెండింగ్లో పడింది. -
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్.. బొల్లారం పీఎస్ నుంచి నాంపల్లి కోర్టుకు తరలింపు
-
ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు.. రూట్ల వారీగా వివరాలు ఇవిగో..
సాక్షి, హైదరాబాద్: ఈ నెల14వ తేదీ ఆదివారం 34 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు లేకపోవడంవల్ల ఈ మేరకు ఫలక్నుమా–లింగంపల్లి, సికింద్రాబాద్–లింగంపల్లి, నాంపల్లి–లింగంపల్లి, ఫలక్నుమా–నాంపల్లి, తదితర రూట్లలో నడిచే రైళ్లు రద్దు కానున్నాయి. పలు రైళ్లు రద్దు.. లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని తాటిచెర్ల–జంగాలపల్లి డబ్లింగ్ పనుల నేపథ్యంలో పలు రైళ్ల రద్దు, మరికొన్నింటిని దారి మళ్లించినట్లు గుంటూరు రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం ఆంజనేయులు గురువారం తెలిపారు. గుంతకల్–హిందూపూర్ డెమూ రైలు 12 నుంచి 19 వరకు, హిందూపూర్–గుంతకల్ డెమూ రైలును 13 నుంచి 20 వరకు రద్దు చేసినట్లు చెప్పారు. తిరుపతి–గుంతకల్ రైలు ఈ నెల 12 నుంచి 19వ వరకు ధర్మవరం–గుంతకల్ మీదుగా, గుంతకల్–తిరుపతి రైలు ఈ నెల 12 నుంచి 19 వరకు గుంతకల్–ధర్మవరం మీదుగా తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలిపారు. (క్లిక్: ఇంజనీరింగ్లో సీట్లపై ఉత్కంఠ.. పదివేలు దాటినా సీఎస్సీ పక్కా) -
తెలుగు వర్సిటీలో 20 కొత్త కోర్సులు
నాంపల్లి: తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో వెలువడిన ఉత్తమ గ్రంథాలకు తెలుగు విశ్వవిద్యాలయం 2019 సాహితీ పురస్కారాలను అందజేసింది. గురువారం తెలుగు వర్సిటీలోని నందమూరి తారక రామారావు కళా మందిరంలో ఏర్పాటు చేసిన పురస్కార ప్రధాన సభలో పది మంది ఉత్తమ గ్రంథ రచయితలకు రూ.20,116 నగదు పారితోషికంతో సత్కరించింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వర్శిటీ ఉపాధ్యక్షులు ఆచార్య తంగెడ కిషన్ రావు మాట్లాడుతూ... తెలుగు సాహిత్య సేవకు అంకితమైన నిరాడంబర రచయితలకు 2019 సాహితీ పురస్కారాలను అందించడానికి విశ్వవిద్యాలయం ఎంతో గర్వపడుతోందన్నారు. అందుకు సహకరించిన పురస్కారాల నిర్ణాయక సంఘానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వర్సిటీలో ఈ విద్యా సంవత్సరంలో 20 కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అలాగే వచ్చే రెండు మాసాల్లో తెలుగు విశ్వవిద్యాలయాన్ని బాచుపల్లి ప్రాంగణానికి తరలించడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధ్యక్షులు ఆచార్య ఆర్.లింబాద్రి మాట్లాడుతూ... సామాజిక మనుగడకు ఆయా ప్రాంతాల సాహిత్య, సంస్కృతి ప్రధాన భూమిక వహిస్తుందని, ఆ దిశగా తెలుగు విశ్వవిద్యాలయం సామాజిక బాధ్యతతో సాహిత్యాన్ని, సంస్కృతిని కాపాడుతున్నందుకు అభినందనలు తెలియజేశారు. -
అయ్యో టీచరమ్మ! స్కూల్కు వచ్చే సమయంలో తీవ్రమైన తలనొప్పి..
సంస్థాన్నారాయణపురం/నాంపల్లి: బ్రెయిన్ డెడ్తో ఉపాధ్యాయురాలు మృతిచెందింది. నారాయణపురం మండలానికి చెందిన జక్కిడి విజయలక్ష్మి నాంపల్లి మోడల్ స్కూల్లో పీజీటీగా పని చేస్తూ భర్త నర్సింహారెడ్డితో కలిసి హైదరాబాద్లో ఉంటోంది. ఈనెల 21 పాఠశాలకు వచ్చే సమయంలో తీవ్రమైన తలనొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు ఆమెను హయత్నగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు మెదడులో రక్తం గడ్డకట్టిందని చెప్పారు. మెరుగైన చికత్స కోసం యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విజలక్ష్మి కోమాలోకి వెళ్లింది. శుక్రవారం ఉదయం బ్రెయిన్ డెడ్ అయి చనిపోయిందని డాక్టర్లు ధ్రువీకరించారు. ఇంటర్లో మళ్లీ వంద శాతం సిలబస్ అవయవాలు జీవన్దాన్ ట్రస్టుకు.. విజయలక్ష్మి అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దీంతో ఆస్పత్రి వర్గాల ద్వార జీవన్ దాన్ సంస్థకు రెండు కిడ్నీలు, లివర్, రెండు కళ్లను అప్పగించారు. అనంతరం మృతదేహాన్ని సంస్థాన్ నారాయణపురానికి తీసుకొచ్చారు. శనివారం దహన సంస్కారాలు నిర్వహించనున్నారు. విజయలక్ష్మి మృతికి ఉపాధ్యాయ సంఘం నాయకులు, ప్రజా నాట్య మండలి సభ్యులు, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు సంతాపం వ్యక్తం చేశారు. సంతాపం వ్యక్తం చేసిన వారిలో ఎంఈఓ గురువారావు, యూటీఎఫ్ మండల అధ్యక్షుడు చిలువేరు నారాయణ, పీఆర్టీయూ అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, టీఆర్ఎస్కేవీ నాయకుడు బిరుదోజు దామోదరచారి, ప్రజా నాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి, ఉపాధ్యాయులు సంజీవరావు, విఠల్, కృష్ణారెడ్డి, భారతి, పలువురు నేతలు తదితరులు ఉన్నారు. బంగారు నాణేనికి బదులు బిల్లొచ్చింది! -
లింగంపల్లి–కాకినాడ, నాంపల్లి–జైపూర్ మధ్య ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: రద్దీ నేపథ్యంలో లింగంపల్లి–కాకినాడ, హైదరాబాద్–జైపూర్ మధ్య అదనపు రైళ్లు నడుపుతున్నారు. లింగంపల్లి–కాకినాడ మధ్య (07296) జూలై 2 నుంచి అక్టోబరు 1 వరకు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో.. కాకినాడ–లింగంపల్లి మధ్య జూలై 1 నుంచి సెప్టెంబరు 30 వరకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో (07295).. హైదరాబాద్–జైపూర్ మధ్య జూలై 1 నుంచి ఆగస్టు 26 వరకు ప్రతి శుక్రవారం (07115).. జైపూర్–హైదరాబాద్ మధ్య జూలై 3 నుంచి ఆగస్టు 28 వరకు ప్రతి ఆదివారం (07116) ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. కాకినాడ రైళ్లు లింగంపల్లిలో సాయంత్రం 6.25 గంటలకు బయల్దేరనుండగా, జైపూర్ రైళ్లు నాంపల్లిలో రాత్రి 8.20కి బయల్దేరుతాయి. డబ్లింగ్ పనులతో పలు రైళ్ల రద్దు.. సెంట్రల్ రైల్వే పరిధిలోని మన్మాడ్ సెక్షన్లో డబ్లింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో కొన్ని రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేశారు. జూన్ 23 నుంచి 28 వరకు ఈ రైళ్లకు అంతరాయం ఏర్పడనుంది. విశాఖ–షిర్డీ సాయినగర్ ఎక్స్ప్రెస్ 23 తిరుగుప్రయాణం కాగా, 24న రద్దు కానున్నాయి. సీఎస్టీ ముంబై–జాల్నా ఎక్స్ప్రెస్ 25 నుంచి 28 వరకు, తిరుగుప్రయాణంలో 29 వరకు, ఆదిలాబాద్–ముంబై ఎక్స్ప్రెస్ 26 నుంచి 27 తేదీల్లో, తిరుగుప్రయాణంలో 27, 28 తేదీల్లో, కాజీపేట–దాదర్ 25, తిరుగుప్రయాణంలో మరుసటిరోజు, పుణే–కాజీపేట 24న, కాజీపేట–పుణే 26న రద్దయ్యాయి. కాకినాడ పోర్టు–సాయినగర్ షిర్డీ 25, 27లలో, తిరుగుప్రయాణంలో 26, 28లలో, సికింద్రాబాద్–షిర్డీ ఎక్స్ప్రెస్ 24, 26లలో తిరుగుప్రయాణంలో 25, 27లలో నాగర్సోల్–షిర్డీ మధ్య రద్దయ్యాయి. సికింద్రాబాద్–మన్మాడ్ ఎక్స్ప్రెస్ 24 నుంచి 27 వరకు, తిరుగుప్రయాణంలో 25 నుంచి 25 వరకు నాగర్సోల్–మన్మాడ్ మధ్య రద్దయ్యాయి. (క్లిక్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసం.. తూటా రూట్ మారెన్) -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం
నైరుతి రుతుపవనాల ప్రవేశంలో తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా, బుధవారం సాయంత్రం హైదరాబాద్లో ఆకాశం మేఘావృతమైంది. దీంతో నగరంలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. నాంపల్లి, బషీర్బాగ్, కోఠి, అబిడ్స్, అంబర్పేట్, సుల్తాన్బజార్, బేగంబజార్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్మెట్, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, సరూర్ నగర్, మీర్పేట్, అత్తాపూర్, రాజేంద్రనగర్, నార్సింగి, గండిపేట్, మణికొండ, పుప్పాలగూడ, కాటేదాన్, పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. #15JUNE 7:45PM⚠️ Massive Rains Ahead Tonight in Entire #Telangana⛈️🥳 👉South #Hyderabad already Seeing Good Rains&More Rains Ahead in coming Hours 🌧️#HyderabadRains pic.twitter.com/ygx5SEoTru — Hyderabad Rains (@Hyderabadrains) June 15, 2022 -
రథాన్ని తరలిస్తుండగా విద్యుదాఘాతం
నాంపల్లి: నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం కేతేపల్లిలో శ్రీసీతారామచంద్ర స్వామి రథం తరలింపులో అపశ్రుతి చోటుచేసుకుంది. స్వామివారి రథాన్ని ఆలయం నుంచి మరో చోటుకు తరలిస్తుండగా విద్యుత్ తీగలకు తగలడంతో షాక్ తగిలి ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటనలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కేతేపల్లి గ్రామంలోని గుట్టపై ఉన్న శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ ఉత్సవాలు ఏప్రిల్ 10న ముగిశాయి. అయితే రథం ఆలయ ఆవరణలోనే ఉండిపోయింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రథం తడుస్తుండడంతో దానిని తయారు చేయించిన దాత దయానందరెడ్డి రథాన్ని సురక్షిత ప్రదేశానికి తరలించేందుకు శనివా రం సాయంత్రం గ్రామానికి చెందిన పలువురిని గుట్టపైకి తీసుకెళ్లారు. అందులో 8 మంది తాళ్ల సహాయంతో.. మరో నలుగురు దానిని పట్టు కుని లాగుతుండగా ఇనుముతో చేసి న రథం కరెంటు తీగలకు తగలడంతో దానిని పట్టుకుని లాగుతున్న రాజబోయిన యాదయ్య(45), పొగాకు మోహనయ్య(36) దాసరి ఆంజనేయులు (26) విద్యు దాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందారు. రాజబో యిన వెంకటయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిం చారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. చదవండి: ‘ఏ తప్పూ చేయలేదు.. నా చావును కోరుకుంటున్నారు కదా.. మీ కోరిక తీరుస్తా’ -
10 ఏళ్ల తర్వాత తుది తీర్పును వెలువరించనున్న నాంపల్లి కోర్టు
-
అక్బరుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలపై నేడు కోర్టు తీర్పు
-
డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీ పై విచారణ
-
పోలీసు పుత్రిడి నుంచి ఉగ్రవాదిగా అజీజ్... 16 ఏళ్ల జైలు శిక్ష
సాక్షి హైదరాబాద్: పాక్ నిఘా సంస్థ లష్కరే తొయిబా (ఎల్ఈటీ) ఆదేశాల మేరకు హైదరాబాద్లో భారీ విధ్వంసాలకు కుట్రపన్నిన కేసులో నిందితుడిగా ఉన్న అబ్దుల్ అజీజ్ అలియాస్ గిడ్డా అజీజ్ దోషిగా తేలాడు. ఇతడికి 16 ఏళ్ల జైలు శిక్ష, రూ.26 వేల జరిమానా విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చినట్లు శనివారం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏసీపీ పి.వెంకటేశ్వర్లు వివరించారు. ఈ కేసులో మరో నిందితుడు మహ్మద్ నిస్సార్కు న్యా యస్థానం 2011లోనే 16 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పెట్రోల్ పంపులో మేనేజర్గా.. భవానీనగర్కు చెందిన గిడ్డా అజీజ్ తండ్రి మెహతబ్ అలీ హెడ్ కానిస్టేబుల్గా పని చేశారు. అజీజ్ 1985 నుంచి 87 వరకు పాతబస్తీలోని మదీనా ప్రాంతంలోని ఓ పెట్రోల్ పంపులో మేనేజర్గా పని చేశాడు. నల్లగొండ జిల్లా బోనాల్పల్లికి చెందిన సిమి ఉగ్రవాది మహ్మద్ ఫసీయుద్దీన్ ద్వారా ఉగ్రవాద బాటపట్టాడు. ఎల్ఈటీకి అనుబంధంగా ఆజం ఘోరీ ఏర్పాటు చేసిన ఇండియన్ ముస్లిం మహమ్మదీ ముజాహిదీన్ సంస్థతో సన్నిహితంగా మెలిగాడు. హత్యలు, దోపిడీలతో పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన ఫసీ అతని అనుచరుడు మీర్ 1993 జూన్ 21న కార్ఖానా పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యారు. 2000లో జగిత్యాలలో జరిగిన ఎన్కౌంటర్లో ఘోరీ చనిపోయాడు. దీంతో సౌదీ అరేబియాకు వెళ్లిపోయిన గిడ్డా అజీజ్ అక్కడే ఇంటర్నేషనల్ ఇస్లామిక్ రిలీఫ్ ఆర్గనైజేషన్ (ఐఐఆర్వో) అనే సంస్థలో చేరాడు. పూర్తి స్థాయి జిహాదీ వలంటీర్లతో కూడి న ఈ సంస్థలో అజీజ్ కీలకపాత్ర పోషించాడు. భారీ విధ్వంసానికి కుట్ర.. ‘బాబ్రీ’ ఉదంతం తర్వాత రెచ్చిపోయిన అజీజ్ అయోధ్యతో పాటు హైదరాబాద్లోనూ భారీ స్థాయిలో విధ్వంసానికి కుట్రపన్నాడు. అప్పట్లో బోస్నియా– చెచెన్యాల్లో జరుగుతున్న అంతర్యుద్ధాలకు ఆకర్షితుడైన అజీజ్ 1995లోనే ఆ దేశానికి వెళ్లి వచ్చాడు. ఆ యుద్ధాల్లో కీలక పాత్ర పోషించడంతో పాటు అనేక మంది యువతకు ఉగ్రవాద శిక్షణ కూడా ఇచ్చాడు. 1995 జూలై 17 బోస్నియా నుంచి అసలు పేరుతోనే పాస్పోర్ట్ పొందాడు. ఆపై భారత్కు వచ్చిన గిడ్డా అజీజ్ 1993 జనవరి 7న సికింద్రాబాద్ ఆర్పీఓ కార్యాలయం నుంచి తన పేరుతోనే మరో పాస్పోర్ట్ తీసుకున్నాడు. 2000 అక్టోబర్ 3న అబ్దుల్ కరీం పేరుతో ఇంకో నకిలీ పాస్పోర్ట్ పొందాడు. అజీజ్, నిస్సార్ సహా మరొకరిని నగర పోలీసులు 2001 ఆగస్టు 28న హుమాయున్నగర్ పరిధిలోని సరోజినీ దేవి కంటి ఆస్పత్రి వద్ద అరెస్టు చేశారు. అజీజ్ నుంచి ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, బెల్జియంలో తయారైన పిస్టల్, క్యాట్రిడ్జిలు, బోస్నియా పాస్పోర్ట్, రెండు నకిలీ పాస్పోర్టులు, ఎలక్ట్రిక్ సర్క్యూట్ బోర్డులు, రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బెయిల్ పొందిన అజీజ్ సౌదీకి పారిపోయాడు. మూడేళ్లే అక్కడే ఉన్న అజీజ్ 2004లో నగరానికి వచ్చాడు. సికింద్రాబాద్లో ఉన్న గణేష్ దేవాలయం పేల్చివేతకు కుట్రపన్నాడు. సౌదీలో తలదాచుకుని.. వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో పేలుళ్లకు పన్నిన ఈ కుట్రను ఛేదించిన టాస్క్ఫోర్స్ పోలీసులు మిగిలిన నిందితుల్ని అరెస్టు చేయగా... గిడ్డా అజీజ్ త్రుటిలో తప్పించుకున్నాడు. బోస్నియా పాస్పోర్ట్ వినియోగించి అడ్డదారిలో సౌదీ పారిపోయి అక్కడే తలదాచుకున్నాడు. అజీజ్ది నకిలీ పాస్పోర్ట్ అని గుర్తించిన సౌదీ అధికారులు 2007లో అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న నగర పోలీసులు రెండు కేసుల్లో వాంటెడ్గా ఉన్న అజీజ్పై 2008లో ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించారు. సౌదీలో నకిలీ పాస్పోర్ట్ కేసు విచారణ, శిక్ష పూర్తికావడంతో అక్కడి అధికారులు 2016లో భారత్కు బలవంతంగా తిప్పిపంపించారు. దీంతో అప్పటి నుంచి 2001 నాటి విధ్వంసాల కేసు విచారణ సాగి అజీజ్కు 16 ఏళ్ల శిక్ష పడింది. (చదవండి: ములుగులో ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు దుర్మరణం) -
ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకపోవడం దుర్మార్గం
గన్ఫౌండ్రీ (హైదరాబాద్) : రాష్ట్రంలో ఉద్యోగ నోటి ఫికేషన్లు విడుదల చేయకపోవడం దుర్మార్గమని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మండి పడ్డారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరుతూ మంగళవారం వైఎస్సార్టీపీ ఆధ్వర్యంలో నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ఎదుట దీక్ష చేపట్టారు. షర్మిల మాట్లాడుతూ యువత, విద్యార్థుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడం బాధాకరమన్నారు. ఉపాధి అవకాశాలు లేక యువత ఆత్మహత్యలకు పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభు త్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే 1.90 లక్షల ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బి.జనార్దన్రెడ్డిని కలసి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన ఆమెను బేగంబజార్ పోలీసులు అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్స్టేషన్కు తరలించారు. -
నాంపల్లిలో అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని నాంపల్లిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. నాంపల్లి లోని ఎఫ్టీసీసీఐ ( ఫ్యాప్సి ) దగ్గర ట్రాన్స్ఫార్మర్ పేలడంతో పక్కనే ఉన్న అపార్ట్మెంట్లోనూ మంటలు వ్యాపించాయి. దీంతో అపార్టుమెంట్ వాసులు భయాందోళనతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు. -
ఒమిక్రాన్ ఎఫెక్ట్: నుమాయిష్ మూసివేత
సాక్షి, అబిడ్స్ (హైదరాబాద్): కరోనా కారణంగా ఎగ్జిబిషన్ను తాత్కాలికంగా మూసివేశారు. జనవరి 1వ తేదీన గవర్నర్ ఎగ్జిబిషన్ను ప్రారంభించగా ఆదివారం రాత్రి పోలీస్ శాఖ అధికారుల ఆదేశాలతో ఎగ్జిబిషన్ సొసైటీ ఈ నెల 10వ తేదీ వరకు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు స్టాళ్ల యజమానులకు తెలిపారు. దేశం నలుమూలలా కరోనా నిబంధనలు పాటించాలని, గుంపులు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఎగ్జిబిషన్కు బ్రేక్ పడింది. 2021వ సంవత్సరం కూడా ఎగ్జిబిషన్ను కరోనా నిబంధనలతో పూర్తిగా మూసివేశారు. కొన్నిరోజులుగా నగరంతో పాటు రాష్ట్ర నలుమూలలా ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో తీవ్ర ఆందళన మొదలైంది. -
ఫెయిలైన విద్యార్థులకు న్యాయం చేయాలి
నాంపల్లి: ఇంటర్మీడియట్ బోర్డు వైఖరిని పలు రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాల నేతలు తప్పుబట్టారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వైఖరిని నిరసిస్తూ ఆ కార్యాలయం ఎదుట తెలంగాణ వైఎస్సార్సీపీ, టీజే ఎస్లతో పాటు ఏబీవీపీ ధర్నా నిర్వహించారు. ఫెయిలైన విద్యార్థులకు న్యాయం చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో ఆందోళన చేపట్టిన వారిని పోలీసులు అరెస్టు చేసి గోషామహాల్ స్టేడియానికి తరలించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి కె.ప్రవీణ్రెడ్డి మాట్లాడుతూ ప్రభు త్వం ఉచితంగా రీ వాల్యుయేషన్ చేసి విద్యా ర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
టాలీవుడ్ డ్రగ్స్ కేసు: కెల్విన్కు నాంపల్లి కోర్టు సమన్లు
ప్రస్తుతం టాలీవుడ్ డ్రగ్ కేసు సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కెల్విన్కు తాజాగా నాంపల్లి కోర్టు సమన్లు జారి చేసింది. బోయినాపల్లి మాదక ద్రవ్యాల కేసులో టాస్క్ఫోర్స్ పోలీసులు కెల్విన్ను అరెస్టు చేసి ఎల్ఎస్డి రకం మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత సీసీఎస్లోని నార్కోటిక్స్ విభాగానికి కేసు బదిలీ అవ్వడం.. పూర్తిస్థాయిలో విచారణ జరపకపోవడం, సకాలంలో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేకపోవడంతో బెయిల్పై బయటకు వచ్చాడు. 2016లో మళ్లీ ఎక్సైజ్శాఖ కెల్విన్ కేసు మరోసారి అరెస్టు చేయడంతో టాలీవుడ్ డ్రగ్ వ్యవహరం బయట పడింది. ఈ నేపథ్యంలో సీసీఎస్లోని నార్కోటిక్స్ విభాగం.. తాజాగా నాంపల్లి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయడంతో కోర్టు ఆ ఛార్జ్సీట్ను విచారణకు స్వీకరించింది. దీంతో ఈ నెల 11వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ కెల్విన్కు కోర్టు సమన్లు జారీ చేసింది. -
ఓటుకు కోట్లు కేసులో నిందితులకు ఈడీ కోర్టు సమన్లు
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన అభియోగ పత్రాన్ని ఈడీ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి (ఎంఎస్జే) కోర్టు శనివారం విచారణకు స్వీకరించింది. ఈ కేసులో నిందితులుగా మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ చీఫ్ ఎ.రేవంత్రెడ్డి, టీడీపీ మైనారిటీ సెల్ ప్రతినిధి హ్యారీ సెబాస్టియన్, రుద్ర ఉదయసింహ, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతోపాటు జెరూసలెం మత్తయ్య, అప్పటి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్రెడ్డి కుమారుడు వేం క్రిష్ణకీర్తన్లనూ చేర్చింది. అక్టోబర్ 4న వారిని ప్రత్యక్షంగా విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ ఎంఎస్జే తుకారాంజీ సమన్లు జారీ చేశారు. ఈడీ అభియోగపత్రం ప్రకారం నిందితులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మనీలాండరింగ్కు సహకరించడం లేదా ఆ కుట్రలో భాగస్వామి కావడం తదితర అభియోగాలు ఉన్నాయి. వారిపై నేరం రుజువైతే మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. మరోవైపు ఏసీబీ నమోదు చేసిన కేసుకు సంబంధించి ప్రత్యేక కోర్టులో కీలక సాక్షుల విచారణ పూర్తయ్యింది. అయితే ఈ కేసును విచారించే పరిధి ఏసీబీ కోర్టుకు లేదంటూ ఇటీవల ఎంపీ రేవంత్రెడ్డి తదితరులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరి పిటిషన్ను విచారించిన సుప్రీం కోర్టు.. ప్రత్యేక కోర్టు విచారణను నిలిపివేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)ను ఆదేశిస్తూ విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. చదవండి: తీన్మార్ మల్లన్నను అరెస్టు చేసిన పోలీసులు..! -
పోలీసుల కస్టడీకి కార్వీ ఎండీ పార్థసారథి.. నాంపల్లి కోర్టు అనుమతి
-
సీఎం కేసీఆర్కు నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ మాజీ కార్యదర్శి లేఖ
-
సీఎం కేసీఆర్కు లాల్బహదూర్శాస్త్రి కాలేజీ మాజీ సెక్రటరీ రవీంద్రసేన లేఖ
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీలో ఏసీబీ తనిఖీలు నేపథ్యంలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు (కేసీఆర్)కు లాల్బహదూర్శాస్త్రి కాలేజీ మాజీ సెక్రటరీ రవీంద్రసేన లేఖ రాశారు. రెండేళ్ల క్రితమే ఎగ్జిబిషన్ సొసైటీ లీజ్ ముగిసినా అక్రమంగా కార్యకలాపాలు సాగించినట్లు లేఖలో పేర్కొన్నారు. సొసైటీ నిబంధనలకు విరుద్ధంగా 62 మందికి మెంబర్షిప్లు ఇచ్చారన్నారు. గత మూడేళ్లలో కొత్తగా మెంబర్షిప్ పొందినవారిని సస్పెండ్ చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఆడిట్ సక్రమంగా జరగలేదని తెలిపారు. కాలేజీ నిధులను సైతం మళ్లించారని.. ప్రశ్నించినందుకు తన సభ్యత్వాన్ని రద్దు చేశారంటూ లేఖలో రవీంద్రసేన పేర్కొన్నారు. -
నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీలో కొనసాగుతున్న ఏసీబీ తనిఖీలు
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీలో రెండో రోజు ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎగ్జిబిషన్ సొసైటీలో నిధులు దుర్వినియోగం జరిగినట్లు ఏసీబీకి ఫిర్యాదు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్గా మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరేళ్లు పనిచేశారు. ఆయన ప్రెసిడెండట్గా ఉన్న సమయంలో సొసైటీలో మెంబర్షిప్లు ఇస్టానుసారంగా ఇచ్చారని ఏసీబీకి ఫిర్యాదు అందింది. దీంతో సొసైటీ ఆడిట్ సెక్షన్లో రెండు రోజు దనిఖీల్లో భాగంగా ఏసీబీ రికార్డులను పరిశీలిస్తున్నారు. -
HYD: నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీలో ఏసీబీ తనిఖీలు
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీలో శుక్రవారం ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. నిధుల గోల్మాల్పై సొసైటీ కార్యాలయంలో ఏసీబీ సోదాలు జరిపినట్లు తెలుస్తోంది. నిధుల విషయంలో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదు వచ్చిందని, దీంతో రికార్డులను పరిశీలిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. సొసైటీ కార్యదర్శి ప్రభా శంకర్ మాట్లాడుతూ.. 80సంవత్సరాల నుండి ఎగ్జిబిషన్ నడిపిస్తున్నామని, అకస్మాత్తుగా ఈ రోజు ఎగ్జిబిషన్ సొసైటీ పైన విచారణ చేస్తామని ఏసీబీ సిబ్బంది వచ్చారన్నారు. ఏసీబీ వాళ్లకు ఫిర్యాదు వచ్చిందని మాకు చెప్పి తనీఖీలు చేస్తున్నారుని, అయినా మా సొసైటీ లో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఆయన అన్నారు. సొసైటీ కార్యకలాపాలు అన్ని పారదర్శకంగా జరుగుతున్నాయని తెలిపారు. అకౌంట్స్ అన్ని ప్రతి సంవత్సరం ఆడిట్ చేస్తామని, సొసైటీ ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని పేర్కొన్నారు. ఈటెల రాజేందర్కు ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. కాగా మొట్టమొదటి సారిగా సొసైటీ మీద ఏసీబీ సోదాలు చేస్తున్నారని చెప్పారు. చదవండి: Work From Home Survey: ఆఫీసుకు వెళ్తేనే అసలు మజా! -
నాంపల్లిలో బర్త్డే వేడుకపై ఆకతాయిల దాడి
-
నాంపల్లిలో బర్త్డే వేడుకపై ఆకతాయిల దాడి
సాక్షి, హైదరాబాద్: నాంపల్లిలో బర్త్డే వేడుకపై ఆకతాయిలు దాడికి తెగబడ్డారు. కమ్యూనిటీ హల్లో జరుగుతున్న పుట్టినరోజు వేడుకల్లో బ్యాండ్ ఆపకపోవడంతో 10 మంది యువకులు గొడవ చేశారు. బర్త్డే పార్టీ నిర్వహిస్తున్న వారిపై కర్రలు, రాడ్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో పలువురికి గాయాలవ్వగా వారిని ఆసుపత్రికి తరలించారు. నాంపల్లిలో దాడి నేపథ్యంలో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. బాధితులు నాంపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చదవండి: ఇన్స్టా పరిచయం.. ప్రేమ అంగీకరించలేదని ప్రియుడి ఆత్మహత్య