నడిరోడ్డుపై కుంగిన డ్రైనేజీ పైపులైన్
హైదరాబాద్: సికింద్రాబాద్లో నడిరోడ్డుపై డ్రైనేజీ పైపులైన్ కుంగింది. క్లాక్టవర్ సమీపంలోని రోడ్డులో గురువారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరుగలేదు. అయితే, కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలుసుకుని అప్రమత్తమైన అధికారులు వెంటనే ఆ ప్రాంతంలో రాకపోకలను క్రమబద్ధీకరించారు. అనంతరం వాటర్వర్క్స్ యంత్రాంగాన్ని రప్పించి మరమ్మతులు చేపట్టారు.