Drainage system
-
సరదా డీఎన్ఏ పరీక్ష... మర్డర్ మిస్టరీని ఛేదించింది!
అది 1997. అమెరికాలో మిషిగన్ రాష్ట్రంలో మాకినాక్ కౌంటీ. ఓ డ్రైనేజ్ కాలువలో నవజాత శిశువు మృతదేహం దొరికింది. పోలీసులు ఎంత విచారించినా ఆ చిన్నారిని ఎవరు పొట్టన పెట్టుకున్నారో కనిపెట్టలేకపోయారు. తనకు ‘బేబీ గార్నెట్’గా నామకరణం చేసి స్థానిక శ్మశానవాటికలో ఖననం చేశారు. ఫోరెన్సిక్ సైన్స్ పుణ్యమా అని ఏకంగా పాతికేళ్ల తర్వాత ఆ మిస్టరీ వీడింది. ఓ యువతి సరదాగా చేసుకున్న డీఎన్ఏ టెస్ట్ ఈ కేసులో ఆమె అమ్మమ్మను జైలుపాలు చేసింది. క్రిస్మస్ సందర్భంగా డీఎన్ఏ కిట్లు కానుకగా ఇవ్వడం అమెరికాలో ఆనవాయితీ. అలా మిషిగాన్లోని న్యూబెర్రీలో పూల దుకాణంలో పనిచేసే జెన్నా గెర్వాటోవ్స్కీకి డీఎన్ఏ కిట్ అందింది. ఆమె సరదాకు టెస్ట్ చేసుకుని అక్కడితో మరిచిపోయింది. అయితే, ‘బేబీ గార్నెట్’ కేసు గురించి విన్నారా?’ అంటూ 2022లో పోలీసుల నుంచి ఆమెకు కాల్ వచ్చింది. అవునని చెప్పింది జెన్నా. తన డీఎన్ఏ బేబీ గార్నెట్ డీఎన్ఏతో సరిపోయిందని వారు చెప్పడంతో ఆశ్చర్యపోయింది. 1997లో చనిపోయిన శిశువుకు, తనకు సంబంధమేమిటో అర్థం కాలేదు. ఇంటికి వెళ్లాక తల్లి కారాకు చెబితే స్పామ్ కాల్ అయి ఉంటుందని కొట్టిపారేసింది. కానీ వారం తరువాత షాప్లో ఉండగా అర్జెంటుగా ఇంటికి రమ్మంటూ తల్లి ఫోన్ చేసింది. వెళ్లి చూస్తే ఇంట్లో పోలీసులున్నారు. బేబీ గార్నెట్ తనకు పిన్ని అవుతుందని వారు చెప్పడంతో జెన్నా ఆశ్చర్యపోయింది. పోలీసులు తల్లితో మాట్లాడి ఆమెనూ డీఎన్ఏనూ పరీక్షలకు ఒప్పించారు. కారాకు బేబీ గార్నెట్ స్వయానా సోదరి అని తేలింది. కారాను లోతుగా ప్రశ్నించగా తన తర్వాత తల్లి నాన్సీకి ఓ పాప పుట్టిందని, ఊపిరాడక మరణించిందని చెప్పింది. కానీ ఆ పాపను పుట్టగానే సంచిలో పెట్టి పడేశారన్నది పోలీసుల వాదన. నాన్సీపై నవజాత శిశువు హత్యాభియోగం మోపారు. రుజువైతే ఆమెకు జీవిత ఖైదు పడవచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘పూర్’.. పాలికలు!
పెద్ద కార్పొరేషన్ల నుంచి చిన్న మునిసిపాలిటీల వరకు అదే దుస్థితి రూ.1,000 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్లో.. చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు.. కొత్త పనులు చేపట్టేందుకు ససేమిరా కార్మీకులకు వేతనాలు ఇవ్వలేని స్థితిలో పలు మునిసిపాలిటీలు అయోమయంలో అధికారులు..కార్యాలయాలకు రాని చైర్మన్లు, మేయర్లుస్మార్ట్ రోడ్డు పనులూ సగం వరకే!⇒ వరంగల్ అభివృద్ధిలో భాగంగా రూ.44.50 కోట్లతో మునిసిపల్ ప్రధాన కార్యాలయం నుంచి భద్రకాళి నాలా వరకు, భద్రకాళి ఆర్చి నుంచి కాపువాడ వరకు, అక్కడి నుంచి ములుగు రోడ్డు వరకు, హనుమకొండ చౌరస్తా నుంచి పద్మాక్షి గుట్ట, న్యూ శాయంపేట రోడ్డు వరకు స్మార్ట్ రోడ్లను ప్రతిపాదించారు. వీటికి 2017 నవంబర్లో శంకుస్థాపన చేశారు. నాలుగు పనుల్లో మూడు పనులు 90% మేరకు పూర్తయ్యాయి. హనుమకొండ పద్మాక్షి గుట్ట నుంచి న్యూ శాయంపేట వరకు స్మార్ట్ సిటీ రోడ్డు పనులు 50 శాతం మాత్రమే పూర్తయ్యాయి. కాంట్రాక్టర్కు చేసిన పనులకు డబ్బులు చెల్లించకపోవడంతోనే రోడ్లు అసంపూర్తిగా మిగిలాయి.సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం లేదు. మౌలిక సదుపాయాల ముచ్చటే లేదు. చిన్న చిన్న పనులు కూడా జరగట్లేదు. కనీసం వర్షాకాలంలో పొంగిపొర్లే వరదనీటి కాలువలు, డ్రైనేజీల మరమ్మతులకు, పాడైన రోడ్ల రిపేర్లకు కూడా దిక్కులేదు. కార్మీకులకు వేతనాల్లేవు. పాత బిల్లులు కోట్లలో పేరుకుపోయాయి. దీంతో చేస్తున్న పనులను కాంట్రాక్టర్లు మధ్యలో ఆపేశారు. ఇక కొత్త పనులు చేపట్టేందుకు ససేమిరా అంటున్నారు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో అధికారులుండగా, చైర్మన్లు, మేయర్లు కార్యాలయాలకు రావడం మానేశారు. ఇదీ రాష్ట్రంలోని దాదాపుగా అన్ని పురపాలికల పరిస్థితి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యవేక్షణలో ఉన్న మునిసిపల్ శాఖకు నిధులు కరువవడమే ఇందుకు కారణం. అన్ని పురపాలికలదీ అదే పరిస్థితి మునిసిపల్ సాధారణ నిధులు, 14, 15 ఆర్థిక సంఘం నిధులు, ప్రభుత్వ గ్రాంట్లతో పాటు తెలంగాణ పట్టణ ఆర్థిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీయూఎఫ్ఐడీసీ) ద్వారా చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి దాదాపు రూ.1,000 కోట్లకు పైగా బకాయిలు ఆయా మునిసిపాలిటీలకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నట్టు సమాచారం. దీంతో స్మార్ట్ సిటీలు వరంగల్, కరీంనగర్లతో పాటు పలు పెద్ద మునిసిపల్ కార్పొరేషన్లలో సైతం చిన్న చిన్న పనులు కూడా జరగడం లేదు. ఇక కొత్తగా ఏర్పాటైన మునిసిపాలిటీల్లో పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. కాగా కరీంనగర్ నగరపాలక సంస్థలో సాధారణ నిధులు, పట్టణ ప్రగతి తదితర నిధులతో చేపట్టిన పనులకు సంబంధించి రూ.50 కోట్ల వరకు బిల్లులు రావాల్సి ఉండగా.. ఆగస్టు 15వ తేదీ నాటికి బకాయిలు చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామంటూ మున్సిపల్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ కరీంనగర్ శాఖ హెచ్చరించింది. మరోవైపు బకాయిలు చెల్లించని కారణంగా రూ.2.46 కోట్లతో చేపట్టాల్సిన వనమహోత్సవానికి సంబంధించిన టెండర్, రూ.2 కోట్ల సాధారణ నిధులతో చేపట్టాల్సిన ఇతర పనుల టెండర్లను ఇక్కడి కాంట్రాక్టర్లు బహిష్కరించారు. ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లో.. గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లు, 129 మునిసిపాలిటీలు.. మునిసిపల్ పరిపాలన డైరెక్టర్ (సీడీఎంఏ) పరిధిలో ఉండగా, కేవలం మునిసిపాలిటీలకు సంబంధించి గత నెలాఖరు నాటికి ఆర్థిక శాఖలో రూ.508.90 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో రూ.345 కోట్లు రాష్ట్ర ఆర్థిక సంస్థ (ఎస్ఎఫ్సీ) ద్వారా ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలలకు రావలసిన నిధులు కావడం గమనార్హం. ఒక్కో నెలకు రూ.115 కోట్ల చొప్పున కమిషన్ ద్వారా రావలసిన నిధులను ఆర్థిక శాఖ నిలిపివేసింది. మరోవైపు 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి 122 మునిసిపాలిటీలకు రావలసిన రెండో వాయిదా నిధులు రూ.60.65 కోట్లు ఆర్థిక శాఖ వద్దే పెండింగ్లో ఉన్నాయి. మెడికల్, జీపీఎఫ్, ఎలక్రి్టసిటీ, ఎడ్యుకేషన్, ఔట్సోర్సింగ్ బిల్లులతో పాటు ఈఈఎస్ఎల్ (విద్యుత్ సంబంధిత) పద్దు కింద 49 మునిసిపాలిటీలకు సంబంధించిన బిల్లులు కూడా రూ.కోట్లలోనే ప్రభుత్వం బకాయి పడింది. ఇవి కాకుండా పట్టణ ప్రగతి కింద వైకుంఠధామాల నిర్మాణం పనుల పెండింగ్ బిల్లులు రూ.19.56 కోట్లు, వెజ్, నాన్వెజ్ మార్కెట్ల బిల్లులు రూ.34.37 కోట్లు, కంటోన్మెంట్ బోర్డు ట్రాన్స్ఫర్ డ్యూటీకి సంబంధించి రూ 34.12 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. పట్టణ ప్రగతి, ఎస్సీ సబ్ ప్లాన్, జనరల్ ఫండ్, 14, 15వ ఆర్థిక సంఘం నిధులతో చేసిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు రూ.180 కోట్లు కూడా నిలిచిపోయాయి. ఇక రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో టీయూఎఫ్ఐడీసీ ద్వారా గత రెండేళ్ల నుంచి సుమారు రూ.400 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులు జరిగాయి. వీటి బిల్లులు కూడా చెల్లించలేదు. ఇవి కాకుండా మరో రూ.800 కోట్లకు సంబంధించిన పనులకు టెండర్లు పిలిచినప్పటికీ కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. వేతనాలు చెల్లించని మునిసిపాలిటీలు ప్రభుత్వం నుంచి నిధులు రాక, సొంతంగా సమకూర్చుకోలేక కొన్ని ముసినిపాలిటీలు చివరకు కార్మీకుల వేతనాలు సైతం చెల్లించడం లేదు. డోర్నకల్ మునిసిపాలిటీలో 2023 ఏప్రిల్, ఆగస్టు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించి కార్మీకులకు చెల్లించాల్సిన వేతనాలు రూ.20.43 లక్షలు పెండింగ్లో ఉన్నాయి. మహబూబాబాద్లో 2023 జనవరి, మే నెలలతో పాటు 2024కు సంబంధించి జనవరి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన వేతనాలు ఏకంగా సుమారు రూ.68 లక్షలు పేరుకుపోయాయి. కామారెడ్డి మునిసిపాలిటీకి సంబంధించి గత మే నెల బాపతు రూ.3.48 లక్షలు కార్మీకులకు చెల్లించాల్సి ఉండగా, జూన్ నెల వేతనాలు సుమారు రూ.21 లక్షల వరకు పెండింగ్లో ఉన్నాయి. ఆత్మకూర్, నందికొండ, చండూర్, నర్సంపేట, మెట్పల్లి, సత్తుపల్లి, వైరా, పాల్వంచ, మణుగూరు, ఆదిలాబాద్ మునిసిపాలిటీల్లో కూడా కార్మీకులకు వేతనాలు చెల్లించలేదు. మొత్తంగా రూ.2.60 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. పాత బకాయిల కింద ప్రభుత్వం ఎగ్గొడుతుందేమోనని కార్మీకులు ఆందోళన చెందుతున్నారు. గ్రేటర్కూ నిధుల షార్టేజీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కొత్త పనులకు నిధుల్లేవు. ఇటీవలి రాష్ట్ర బడ్జెట్లో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, మూసీ, మెట్రో రైలు, వాటర్ బోర్డు తదితరాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినా అందులో జీహెచ్ఎంసీకి దక్కేది రూ.3,065 కోట్లే. జీహెచ్ఎంసీలో ఇప్పటికే చేసిన పనులకు గాను కాంట్రాక్టర్లకు రూ.1,200 కోట్ల మేర బకాయిలున్నాయి. దీంతో వారు కొత్త పనులకు ముందుకు రావటం లేదు. ఏవైనా కొత్త రుణాలు తీసుకోవాలన్నా నిబంధనలు అనుమతించేలా లేవు. కేంద్రం నుండి ఇప్పటికే నాలాల అభివృద్ధి (ఎస్ఎన్డీపీ కింద) కోసం రావాల్సిన సుమారు రూ.500 కోట్ల నిధులపై ఇంకా సరైన స్పష్టత రాలేదు. దీంతో వర్షాకాలం కంటే ముందు పూర్తి చేయాల్సిన నాలాల విస్తరణ, డీసిలి్టంగ్ పనులు పూర్తవలేదు. వానాకాలంలో ప్రారంభించాల్సిన మొక్కల పెంపకానికి కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదించిన నిధులు వస్తేనే కొన్ని పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపిస్తోంది. పరిస్థితి అధ్వానంగా ఉంది గత పాలకులు ప్రణాళిక లేకుండా మునిసిపాలిటీల్లో ఇష్టానుసారంగా కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. పాత పనుల బిల్లులు రావనే భయంతో సొంత డబ్బులు ఖర్చు చేసి కొందరు కాంట్రాక్టర్లు కొత్త పనులు చేశారు. కానీ బిల్లులు మాత్రం రాలేదు. ట్రెజరీలను ఫ్రీజ్ చేశారు. దీంతో ఇప్పుడు మునిసిపాలిటీల్లో పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. నిధులు లేక, పనులు సాగక పాలకమండళ్లు ఆందోళన చెందుతున్నాయి. – వెన్రెడ్డి రాజు, మునిసిపల్ కౌన్సిల్స్ చైర్మన్ కాంట్రాక్టర్ల బిల్లులు వెంటనే విడుదల చేయాలి రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు సుమారు రూ.1,000 కోట్లకు పైగా బిల్లులు రావలసి ఉంది. అవి వెంటనే విడుదల చేయడానికి సీఎం రేవంత్రెడ్డి చొరవ చూపాలి. అప్పులు తెచ్చి పనులు పూర్తిచేసిన చిన్న, మధ్యతరగతి కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వారిని ఆదుకోవాలి. – భూక్యా రాము నాయక్, మునిసిపల్ కౌన్సిల్ ఫోరం చైర్మన్ మధ్యలో ఆగిన ‘సీఎం హామీ’రోడ్డు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని కోతిరాంపూర్ నుంచి కట్టరాంపూర్ వరకు (1.2 కిలోమీటర్లు) రూ.4.5 కోట్ల ముఖ్యమంత్రి హామీ పథకం (సీఎంఏ) నిధులతో అధునాతన రోడ్డు, డ్రైనేజీ, వాటర్ పైప్లైన్ పనులను గత ఏడాది శంకుస్థాపన చేశారు. కొత్త రోడ్డు కోసం ఉన్న పాత రోడ్డును తవ్వారు. కొత్త రోడ్డు నిర్మాణం దాదాపు 35 శాతం పూర్తి చేశారు. గత డిసెంబర్లో అకస్మాత్తుగా కాంట్రాకర్ పని నిలిపివేశారు. దీంతో 8 నెలలుగా ప్రజలు నరకయాతన పడుతున్నారు. మధ్యలో కల్వర్టులు, డ్రైనేజీలు అసంపూర్తిగా వదిలేయడంతో ప్రమాదాలు కూడా చోటుచేసుకొంటున్నాయి. ఇప్పటివరకు చేసిన పనులకు బిల్లు రాకపోవడంతోనే కాంట్రాక్టర్ పనులు ఆపేశాడని అధికారులు చెబుతున్నారు. రూ.100 కోట్లు మంజూరుతోనే సరి నిజామాబాద్ కార్పొరేషన్లో ప్రధాన రోడ్ల అభివృద్ధి కోసం రెండేళ్ల క్రితం తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ తరఫున రూ.100 కోట్లు మంజూరు చేశారు. గత సంవత్సరం మార్చి నుంచి సెప్టెంబర్ వరకు కాలనీల్లో రోడ్ల మరమ్మతు, డ్రైనేజీలు, కల్వర్టుల నిర్మాణానికి నాటి ఎమ్మెల్యే గణేష్ గుప్తా శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా కాంట్రాక్టర్లు రూ.2.30 కోట్ల పనులు చేయగా, వీటికి సంబంధించిన బిల్లులు ఇప్పటివరకు విడుదల చేయలేదు. దీంతో కాంట్రాక్టర్లు ఈ పనులు మాకొద్దంటూ వెళ్లిపోయారు. గతంలో విడుదల చేసిన నిధులను కూడా ప్రస్తుత సర్కారు నిలిపివేసింది. -
విద్యార్థుల జలసమాధిపై ఉన్నతస్థాయి కమిటీ
న్యూఢిల్లీ: ఢిల్లీలో కోచింగ్ సెంటర్లో విద్యార్థుల జలసమాధి ఘటనపై కేంద్ర ప్రభుత్వం అత్యున్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. అదనపు కార్యదర్శి ఆధ్వర్యంలో దర్యాప్తు కమిటీని ఏర్పాటుచేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సోమవారం ప్రకటించింది. ఘటనకు కారణాలను తెల్సుకోవడంతోపాటు బాధ్యులెవరో తేల్చనుంది. ఘటనలు పునరావృతంకాకుండా తీసుకోవాల్సిన చర్యలతోపాటు అవసరమైతే విధానపర నిర్ణయాల్లో చేపట్టాల్సిన మార్పులను కమిటీ సిఫార్సుచేయనుంది. గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో ఢిల్లీ ప్రభుత్వ(హోంశాఖ) ముఖ్య కార్యదర్శి, ఢిల్లీ పోలీస్, ఫైర్ స్పెషల్ కమిషనర్ సభ్యులుగా ఉంటారు. హోం శాఖ సంయుక్త కార్యదర్శి ఈ కమిటీకి కనీ్వనర్గా ఉంటారు. 30 రోజుల్లోపు ఈ కమిటీ తన నివేదికను సమర్పించనుందని హోం శాఖ అధికార ప్రతినిధి సోమవారం చెప్పారు మరో ఐదుగురి అరెస్ట్ ఈ ఘటనలో బేస్మెంట్ యజమానులపాటు మొత్తం ఐదుగురిని సోమవారం పోలీసులు అ రెస్ట్చేశారు. డ్రైనీజీలపై అక్రమ కట్టడాలను అధికారులు బుల్డోజర్లతో కూల్చేయడం మొదలెట్టారు.20 బేస్మెంట్లకు సీలుకోచింగ్ కేంద్రాలకు నిలయమైన పాత రాజీందర్ నగర్ ప్రాంతంలో సోమవారం అధికారులు అక్రమ కట్టడాలపై చర్యలకు ఉపక్రమించారు. అక్రమంగా నడుస్తున్న పలు కోచింగ్ సెంటర్లకు సంబంధించిన 20 బేస్మెంట్లకు సీల్వేశారు. అధిక కోచింగ్ సెంటర్లు ఉండే మరో ప్రాంతం ముఖర్జీ నగర్లోనూ ఆకస్మిక పర్యటనలు చేయించండి. అభ్యర్థులను శాంతింపజేయడానికి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సోమవారం అక్కడి చేరుకుని వారితో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు తలో రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. -
"డ్రైనేజ్ టు డైమండ్.." పవన్ కొత్త ప్రాజెక్ట్
-
సంక్షేమం కోసం CM జగన్ ప్రభుత్వం పని చేస్తోంది: MLA
-
అపర బాహుబలి మా కల్వకుంట్ల కేసీఆరయ్య!!
‘‘అప్పుడెప్పుడో కాటన్దొర అని ఓ ఆసామి ఉండేవాడు. ఆయన నూరూ, నూటాయాభై ఏళ్ల కిందట కట్టిన బ్యారేజ్లు చెక్కుచెదర...’’ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఏదో విమర్శించబోతుంటే..రాబోతున్న గుగ్లీ బంతేమిటో తెలిసి, మధ్యలోనే దాన్ని కట్ చేస్తూ... ‘‘ఏయ్... ఎవల్లో ఎప్పుడో ఆంధ్రోల్ల కోసం, ఆంధ్ర ఏరియాల కట్టిన ప్రాజెక్టులతోని పోల్చి..తెలంగాణను తక్కువ చేస్తూ మాట్లాడతరెందుకురా?’’ అంటూ దాన్ని కవర్డ్రైవ్ వైపు నెట్టేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు. ‘‘అయితే తెలంగాణ గురించే మాట్లాడదాం. ఈడ హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్లకు ప్లానిచ్చిండు. ఇక్కడి డ్రైనేజీ సిస్టమ్ను చక్కబెట్టడానికి అలనాడెప్పుడో మోక్షగుండం విశ్వేశ్వర...’’ మళ్లీ మధ్యలోనే మాట కట్ చేసి, మళ్లీ ఇలా చెప్పారు. ‘‘అసలు తెలంగాణ అపరభగీరథుడు కేసీఆర్ పవరేమిటో తెల్సా? అసలాయన ఉనికేందో, ఎల్లవేళలా నీళ్లల పుట్టి నీళ్లల పెరిగిన ఆ సంగతులు తెల్సా మీకు?’’ ‘‘ఏందీ... నీల్లల్ల బుట్టి నీల్లల్ల పెరిగిండా? అదెట్ల?’’ చెప్పడం మొదలుపెట్టారు బీఆర్ఎస్ వారు. అదేదో సిన్మాల బాహుబలి అనేటాయన ఒక పే...ద్ద జలపాతం.. దాని ఎమ్మట్నే పారే పే...ద్ద నది ఉండే..ఆ ఊళ్ల పెరిగిండు కదా. కానీ కేసీఆర్ సార్ నిజంగనే నాలుగు మూలలల్ల నాలుగు అద్భుత తటాకాలున్న పల్లెల పుట్టి, పెరిగిండు. చింతమడక అనే ఆ ఊళ్లె... ఊరికి ఉత్తరాన పెద్ద చెరువు ఉంటె, దక్షిణాన దమ్మచెరువుంది. కొద్దిగ పెడమర్ల పడమర్ల కోమటి చెరువు! తూర్పున సింగచెరువు!! కొద్దిగ దూరంల అంకపేటల ఈశాన్యాన పెద్ద చెర్వు!! కోమటిచెరువుల ఈదిండు. పెద్ద చెరువుల తొక్కునీల్ల కాడ దునికి కాకరాల్ల దాక పొయ్యి... అక్కడ మత్తడి దాంక ఈతగొట్టిండు. చింతచెర్వు మొత్తం ఈదిండు. దమ్మచెర్వుకింద ఒక బాయి ఉండె. దాంట్లెకు మోటచిమ్ములెక్కి దునికేది. ఎత్తు సరిపోక మర్రిచెట్టుకొమ్మలెక్కి కూడ దునికేది. అసలు వాళ్ల ఊళ్లె వాళ్లింటి పాటకు ముందునుంచే మూణ్ణెల్లు జాలు నీళ్లు జాలుబారుతుంటే, ఆ నీళ్లల కాయితప్పడవలేసి, ఆడిండు. ఇగ రాజకీయాలల్లకు వచ్చినంక గూడ.. కార్ల పొయ్యేటప్పుడు ఏడ్నన్న బిడ్జి కనబడితే సాలు... ఆగి దాంట్లెకు ఓ రూపాయో, రెండో, ఐదురూపాల బిళ్లను ఇసిరేటోడు. అది బుడుంగన మునిగేదాంక ఆగి చూసి, అప్పుడు కదలేటోడు. నీళ్లతోని ఇంత అనుభవం, ఇంత నైపుణ్యం ఉండి, జాలునీళ్లల్ల కాయితప్పడవలతోటి ఫ్లోటాలజీ, నీళ్లు పారే తీరు తెలిసిన ‘ఫ్లోవాలజీ’, మునిగే కాయిన్లతోని తెలుసుకున్న ‘బుడుంగాలజీ’, వాటర్ల నీటిశాతం, బురదల జిగటశాతం, ఉస్కెతోని రేణుశాస్త్రం.. ఇయన్నీ తెలుసుగాబట్టే.. తెల్లారితె బాహుబలి జలపాతాన్ని ఎక్స్ప్లోర్ చేసినట్టే... కేసీఆర్ సారు గూడ పొద్దుందాక నీళ్లతత్వం అధ్యయనం చేసి, తెలుసుకునేది. ఆ అనుభవంతోని వచ్చినయే ఈ మేడిగడ్డలూ, అన్నారాలు... ఈ ప్రాజెక్టులన్నీ. ఆ సిన్మాల బాహుబలి వాళ్ల అమ్మగారు బాధపడ్డట్టే... తెలంగాణ తల్లి కూడ బుగులుబడతాంది. కానీ..బక్కపానమైనా మాసారు బాహుబలికంటె ఎక్కువ బలమూ, సంకల్ప బలమూ ఉన్నోడు. ‘జటాకటాహ సంభ్రమ భ్రమ్మన్నిలింప నిరఝరీ, విలోలవీచి వల్లరీ విరాజమాన మూర్ధనీ.. ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకే..కిశోర ‘‘చంద్రశేఖరే’’..అని మాసారు పేరు తోని బ్యాక్గ్రౌండ్ల పాట వినిపిస్తుండంగా... ఎవ్వరంట ఎవ్వరంటా పిల్లరెత్తుకుందీ? తెలంగాణ తల్లికీ ముద్దులకొడుకీ నందీ. ఉస్కెలో డస్కిందీ..బురదలో కుంగిందీ పిల్లరెత్తుకున్నాక భుజమ్మీద పెట్కోనీ పైకెత్తేనండీ... ఇట్లా మునపటి లెవల్కు తెల్చి... తల్లితో ‘‘అమ్మా ఒప్పేనా?’’ అంటూ అడిగాడు. అప్పుడామె ‘‘నాకేమి తెలుసు? ఓటరు దేవరనడుగు?’’ అనగానే ఇటు తిరిగి... ఆయన ఓటరు దేవరనడిగాడు. అప్పుడు... ‘‘ఏమో శివుడి మనసులో ఏముందో... శివుడేటనుకుంటున్నాడో మనకేమి తెల్సు’’ అంటూ అప్పటికి గడుసుగా బదులిచ్చాడు ఓటరు దేవర. -
చినుకుతో వణుకు
యమునా నది ఢిల్లీ పరిధిలో 48 కి.మీ. మేరకు ప్రవహిస్తుంది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహించింది. జూలై 10న సంభవించిన వరదల కారణంగా రాజధాని నగరానికి రూ.10 వేల కోట్లకు పైగా ఆర్థిక నష్టం సంభవించినట్లు అంచనా. ఢిల్లీలో చిత్తడి నేలలు, బావులు, సరస్సులు వంటి జల వనరులు 1,040కి పైగా ఉన్నాయి. వీటికి అధికారిక గుర్తింపు లేదు. ప్రభుత్వం నోటిఫై చేయకపోవడంతో అవి సులభంగా ఆక్రమణలకు గురవుతున్నాయి. ఫలితంగా ఢిల్లీని వరద కష్టాలు వెంటాడుతున్నాయి. నిజానికి దేశంలోని అన్ని చిన్నా పెద్దా నగరాలదీ ఇదే సమస్య... ♦ ఢిల్లీలో మురుగునీటి పారుదల వ్యవస్థ 1970ల నాటిది. నాటితో పోలిస్తే నగర జనాభా కనీవినీ ఎరగనంతగా పెరిగిపోయింది. ♦ దాంతో చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ జలమయంగా మారుతున్నాయి. ఇక అడ్డగోలు నిర్మాణాలతో డ్రైనేజీ వ్యవస్థ కుదించుకుపోయి సమస్య మరీ పెద్దదవుతోంది. ♦ ఢిల్లీలో యమున వరద నీరు చేరే ప్రాంతం దాదాపుగా 97 చదరపు కిలోమీటర్లుంటుంది. నగర భూభాగంలో ఇది 7%. ఇందులో అత్యధిక భూభాగాన్ని ఆక్రమణలు, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులు కట్టడానికి కేటాయించడంతో నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ♦ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ నివేదిక ప్రకారం ఢిల్లీలో యమున వరద నీరు చేరే ప్రాంతాలు 600కు పైగా ఉన్నాయి. వీటిలో 60% వరకు నీరు లేక ఎండిపోయాయి. ఒక్క రోజులోనే అతి భారీ వర్షం కురవడంతో అవన్నీ ఇప్పుడు నీట మునిగాయి. ♦ పైగా వీటిలో చాలా ప్రాంతాలు ఆక్రమణలకు లోనయ్యాయి. వాటిని వ్యవసాయ క్షేత్రాలుగా మార్చుకొని లక్షలాది మంది బతుకుతున్నారు. మరెన్నో భూముల్ని అభివృద్ధి ప్రాజెక్టులకు కేటాయించారు. 2010లో కామన్వెల్త్ క్రీడల కోసం నిర్మించిన గ్రామం, అక్షరధామ్ ఆలయం వంటివెన్నో వరద ప్రాంతాల్లోని ఆక్రమిత భూములపై నిర్మించినవే. ♦ చిత్తడి నేలలు సహజసిద్ధంగా నీటిని పీల్చుకొని భూగర్భ జలాలను పెంపొందిస్తాయి. కానీ ఢిల్లీలోని చిత్తడి నేలల్లో 200కు పైగా ఎండిపోయి ఆక్రమణలకు గురయ్యాయి. హతినికుండ్ వివాదం హరియాణాలో 1996లో కట్టిన ఈ ఆనకట్ట ద్వారా నీళ్లు యమున నది తూర్పు, పశ్చిమ కాలువల్లోకి ప్రవహిస్తాయి. హరియాణా ప్రభుత్వం ఈ బ్యారేజ్ గేట్లు ఎత్తేయడంతో నేరుగా యమున నదిలోకి వరద నీరు చేరి ప్రమాదకరంగా మారుతోందని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే తాము నిబంధనలకనుగుణంగానే వ్యవహరిస్తూ లక్ష క్యూసెక్కులు దాటితేనే నీటిని వదులుతున్నామని హరియాణా ప్రభుత్వం వాదిస్తోంది. ఈ నెల 10వ తేదీన హతినికుండ్ ప్రాజెక్టు నుంచి ఏకంగా 3.59 లక్షల క్యూసెక్కుల నీరు యమునలోకి వచ్చింది. అందుకే ఢిల్లీ నీట మునిగిందన్న వాదనలు కూడా ఉన్నాయి. అయితే 2010 వర్షాకాలంలో 7 లక్షల క్యూసెక్కుల నీరు హతినికుండ్ నుంచి విడదల చేసినప్పటికీ అప్పట్లో నగరానికి పెద్దగా ముప్పు రాలేదు. ఇప్పుడు మూడు లక్షల క్యూసెక్కులకే ముప్పు రావడానికి ఆక్రమణలు, అడ్డగోలు నిర్మాణాలే కారణమని సౌత్ ఆసియా నెట్వర్క్ ఆన్ డామ్స్, రివర్స్, పీపుల్ కోఆర్డినేటర్ హిమాంశు ఠక్కర్ అభిప్రాయపడ్డారు. చిత్తడి నేలల పునరుద్ధరణ.. వరద ప్రభావాన్ని తగ్గించాలంటే ఆక్రమణలను తొలగించి నదీ తీర ప్రాంతాలను పునరుద్ధరించాల్సిన అవసరం చాలా ఉంది. నగరంలో డ్రైనేజీ వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన మెరుగుందుకు ప్రభుత్వం కృషి చేయాలి. యమునా నది పొంగి పొర్లకుండా ఢిల్లీకి రక్షణ కవచంలా ఉండే చిత్తడి నేలలు, సరస్సులు, చెరువుల వంటివి తగ్గిపోతున్నాయి. అవి లేకుండా యమున ప్రవాహం సవ్యంగా సాగదన్న అభిప్రాయాలున్నాయి. ఈ సరస్సులు, చెరువులు, బావుల వంటివి నీటిని స్టోరేజ్ చేయడం వల్ల డ్రైనేజీలోకి వెళ్లే నీటి ప్రవాహం తగ్గుతుంది. ‘‘నదుల వరదను శాపంగా చూడకూడదు. పరివాహక ప్రాంతంలో గడ్డివాములు, చెట్లు పెంచడం వంటివి చేస్తే వరద ముప్పు నుంచి తప్పించుకోవచ్చు’’ అని సీనియర్ సైంటిస్ట్ ఫయాద్ ఖుద్సర్ చెప్పారు. ఢిల్లీ రెండు రకాల సమస్యలు ఎదుర్కొంటోంది. నిర్మాణాలు పెరిగి కాంక్రీట్ జంగిల్గా మారింది. వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనే సన్నద్ధత లేదు. అందుకే నగరం ఇలా వరద ముప్పుకు లోనవుతోంది. – రితేశ్ కుమార్, డైరెక్టర్ ఆఫ్ వెట్ల్యాండ్స్ ఇంటర్నేషనల్, సౌత్ ఏషియా – సాక్షి , నేషనల్ డెస్క్ -
అధ్వానంగా పారిశుధ్య నిర్వహణ... కమిషనర్ను ప్రశ్నిస్తున్న కౌన్సిలర్లు
సదాశివపేట(సంగారెడ్డి): మున్సిపల్ పరిధి రోజురోజుకు విస్తరించడంతోపాటు జనాభా పెరుగుతోందని, అయితే శానిటేషన్ నిర్వహణ అధ్వానంగా తయారైందని, లై అవుట్లలో రోడ్లు, లైట్లు తదితర పనులు పూర్తి కాకుండానే తుది అనుమతి ఎలా ఇస్తారని కౌన్సిలర్లు కమిషనర్ కృష్ణారెడ్డిని ప్రశ్నించారు. గురువారం మున్సిపల్ సమావేశ మందిరంలో జరిగిన తెలంగాణ అమరవీరుల సంస్మరణ కార్యక్రమం అనంతరం అనధికారికంగా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు శానిటేషన్, లేఅవుట్లు, ఇతర అభివృద్ధి పనులు విషయంలో అధికారుల వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. పట్టణంలో పారిశుధ్య పనులు సక్రమంగా జరగడం లేదని ఆరోపించారు. మురుగు కాల్వల్లో పూడిక పెరుకుపోతుందని, పారిశుద్ధ్య నిర్వహణ ప్రైవేట్కు అప్పగించవద్దని 3వ వార్డు కౌన్సిలర్ చౌదరి ప్రకాశ్ చెప్పినట్లు సమాచారం. ప్రైవేట్ చెత్తసేకరణను రద్దుచేసి మున్సిపల్ శానిటేషన్ సిబ్బందితో చేయించాలన్నారు. ప్రస్తుతం ఉన్న సిబ్బంది చాలడంలేదని, సిబ్బంది సంఖ్యను పెంచాలన్నారు. పట్టణ పరిధిలో ఎన్ని లే అవుట్లను బ్లాక్ లిస్ట్లో పెట్టారని, లే అవుట్లలో రోడ్లు, మురుగునీటి కాల్వలు, వాటర్ ట్యాంకు నిర్మాణం, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా పైపులైన్ నిర్మించకుండా ఫైనల్ రిలీజ్ ఎందుకు చేస్తున్నారని కౌన్సిలర్ ఇంద్రమోహన్గౌడ్ కమిషనర్ కృష్ణారెడ్డిని ప్రశ్నించనట్లు తెలిసింది. లే అవుట్లలో అభివృద్ధి పనులు జరగకున్నా, ఇతర సౌకర్యాలు లేకున్నా ప్లాట్లు కొనుగోలు చేసినవారికి ఎలా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారని, నిబంధనల మెరకే లే అవుట్ ఫైనల్ చేస్తున్నామని కమిషనర్ సమాధానమిచ్చినట్లు సమాచారం. సీసీ రోడ్లు, డ్రైయిన్ల నిర్మాణ పనులు నాణ్యతా జరగడంలేదని కౌన్సిలర్లు నాగరాజ్గౌడ్, చౌదరి ప్రకాశ్ నిలదీశారని, నాణ్యతగా పనులు చేపట్టేందుకు ఇంజనీర్ను ఆదేశిస్తామని కమిషనర్ సమాధానమిచ్చినట్లు తెలిసింది. మూడు నెలలకోసారి కాకుండా ప్రతీనెల సమావేశాలు నిర్వహిస్తే ప్రజాసమస్యలు సులువుగా పరిష్కారమవుతాయని మెజార్టీ కౌన్సిలర్లు కోరినట్లు సమాచారం. సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ పిల్లోడి జయమ్మ, వైస్ చైర్మన్ చింతా గోపాల్, కౌన్సిలర్లు విద్యాసాగర్రెడ్డి, గుండు రవి, శ్రీనివాస్, ఇలియాస్ షరీఫ్, నాగరాజ్గౌడ్, గుండు రవి, ఖుద్దూస్, పిచర్యాగడి రేణుక, కోఆప్షన్ మెంబర్ కలీమ్ పటేల్ పాల్గొన్నారు. -
గోళ్లపాడు తరహాలో మరో ప్రాజెక్టు!
ఖమ్మంఅర్బన్: జిల్లా కేంద్రంలో ఏళ్లుగా మురికికూపంలా ఉన్న గోళ్లపాడు చానల్ను ఆ జాడలు లేకుండా పార్క్లు, ఓపెన్ జిమ్లతో తీర్చిదిద్దిన విషయం విదితమే. అచ్చం అదే మాదిరి నగరంలో మరో ప్రాజెక్టు నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇరవై డివిజన్ల నుంచి వెలువడే మురుగు నీరు నాలాల ద్వారా వెళ్లే క్రమంలో బయటకు కనిపించకుండా, చెరువుల్లోకి చేరుతుండడంతో అక్కడి నీరు కలుషితం కాకుండా నేరుగా మున్నేరులోకి తరలించేందుకు ఈ ప్రాజెక్టు నిర్మిస్తారు. తద్వారా వర్షాకాలంలో దుర్వాసన, దోమల బెడదతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల సమస్యకు పరిష్కారం లభించనుంది. పైపులైన్ ఏర్పాటు, ఇతర పనులను సుమారు రూ.180కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు సిద్ధం కాగా.. త్వరలో ఖమ్మం రానున్న రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించాలని భావనతో ఉన్నట్లు సమాచారం. ఏం చేస్తారు? నగరంలోని సుమారు 20 డివిజన్ల పరిధిలో నివాసాల్లో వాడుకునే మురుగు నీరు చెరువుల్లోకి చేరుతోంది. ఈ సమయంలో దుర్వాసన వెదజల్లడమే కాక వర్షాకాలంలో నీరు సాఫీగా సాగక జనావాసాలను ముంచెత్తుతోంది. దీనిని అధిగమించేందుకు ఇళ్ల నుంచి వెలువడే నీరు చెరువుల్లో చేరకుండా, డ్రెయిన్లకు లింక్గా ప్రత్యేక పైపులైన్ ఏర్పాటుచేసి మున్నేరుకు నీటిని తరలిస్తారు. ఇందుకోసం సుమారు 20 కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ పైపులైన్ వేయనున్నట్లు తెలిసింది. ఈ మొత్తం 20 కిలోమీటర్ల నిడివిలో రెండు మురుగునీరు శుద్ధీకరణ ప్లాంట్లు కూడా ఏర్పాటుచేయనున్నట్లు సమాచారం. అంతేకాక పైపులైన్ పైభాగంలో పార్క్లు, ఓపెన్ జిమ్లు నిర్మించిన శుద్ధీకరణ ప్లాంట్లలో శుభ్రం చేసే నీటిని మొక్కల పెంపకానికి విని యోగించాలనే ప్రతిపాదనను అంచనాల్లో పొందు పర్చినట్లు తెలిసింది. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతోపాటు కార్పొరేషన్ నిధులు కూడా వెచ్చించనున్నారు. ఇప్పటికే పనులకు ఆమోదం లభించినప్పటికీ మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ప్రకటన చేసి శంకుస్థాపన చేయించాలనే యోచనలో మంత్రి పువ్వాడ అజయ్ ఉన్నట్లు సమాచారం. త్వరలోనే టెండర్లు రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఇటీవల ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ‘వాడవాడకు పువ్వాడ’ పేరిట ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా మురుగుబాధ తొలగించాలని పలు డివిజన్ల ప్రజల నుండి వెల్లువెత్తుతున్న వినతులతో మంత్రి గోళ్లపాడు చానల్ తరహాలోనే మరో అండర్ డ్రెయిన్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. సుమారు రూ.180కోట్ల వ్యయమయ్యే ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు సిద్ధం కాగా.. పది రోజుల్లో టెండర్ల ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్నట్లు తెలిసింది. -
నిధుల్లేవు.. పనుల్లో జాప్యం
మంచిర్యాలటౌన్: దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం రోజుకో శాఖకు సంబంధించిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. శుక్రవారం మున్సిపాలిటీల్లో ‘తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం’ నిర్వహణకు ఆదేశించింది. ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీలో గత తొమ్మిదేళ్లుగా చేపట్టిన అభివృద్ధి పనులను ప్రగతి నివేదిక రూపంలో వివరించి, ఉత్తమ సేవలను అందిస్తున్న కార్మికులు, ఉద్యోగులు, అధికారులకు ప్రశంసాపత్రాలు అందించి, సన్మానించేలా ఏర్పాట్లు చేశారు. బల్దియాల్లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసేలా 2020 ఫిబ్రవరి నుంచి పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టింది. ప్రతీ నెల మున్సిపాలిటీ జనాభా, వార్డుల ఆధారంగా నిధులు విడుదల చేస్తోంది. మొదటి రెండేళ్లపాటు ప్రతీ నెల నిధులు విడుదల చేసినా ఆ తర్వాత జాప్యం జరుగుతూ వస్తోంది. ఈ నిధులతో పట్టణంలోని రోడ్లు, డ్రెయినేజీలు, అత్యవసరంగా చేపట్టే పనులతోపాటు సుందరీకరణ, పార్కుల అభివృద్ధి, ఇతరత్రా పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటోంది. ఏటా వర్షాకాలం ప్రారంభంలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని 15 రోజులపాటు వార్డుల్లో నిర్వహించి, చెత్తాచెదారాన్ని తొలగించడం, డ్రెయినేజీల్లోని పూడికతీత పనులు చేసి, వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవడం వంటి కార్యక్రమాలు మూడేళ్లుగా చేపడుతున్నారు. ఈ ఏడాది పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టకుండానే వర్షాకాలంలోకి అడుగు పెడుతుండగా, దశాబ్ది ఉత్సవాల పేరిట పట్టణ ప్రగతి వేడుకలను నిర్వహించుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఏడాదిగా... జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతి నిధులతో అభివృద్ధి పనులు చేస్తూ కొంత మేర సమస్యలు లేకుండా చేస్తున్నారు. గత ఏడాది నుంచి నిధుల విడుదలలో ఆలస్యం జరుగుతోంది. ఈ ఏడాది జనవరి నెల వరకే నిధులు విడుదల చేయగా ఫిబ్రవరి నెల నుంచి మే నెల వరకు నిధులు విడుదల కాలేదు. కోట్ల రూపాయలతో చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు అడుగుతున్నా నిధులు రాక చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. దీంతో కాంట్రాక్టర్లు తప్పనిసరి పరిస్థితుల్లో చేపడుతున్న పనులను మధ్యలోనే నిలిపివేసే పరిస్థితి నెలకొంది. పట్టణ ప్రగతి నిధుల్లో కేంద్ర ప్రభుత్వానికి సమానంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులను కలిపి ప్రతీ నెల ఆయా మున్సిపాలిటీలకు జనాభా ప్రాతిపదికన అందించాల్సి ఉంటుంది. ఏడాదిన్నరపాటు సక్రమంగా నిధులు ఇవ్వగా.. 2021 ఆగస్టులో 25 శాతం కోత విధించింది. మిగతా 75 శాతం నిధులు ప్రతి నెలా అందించడంలోనూ జాప్యం జరుగుతోంది. జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో మంచిర్యాలకు అత్యధికంగా రూ. 23.36 కోట్లు విడుదల కాగా, అందులో పెద్ద మొత్తంలో రూ.4.5 కోట్లు పార్కుల అభివృద్ధికి, రూ.4.5 కోట్లతో రోడ్లు, రూ.4 కోట్లతో జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో జంక్షన్ల నిర్మాణం కోసం కేటాయించారు. నిధుల జాప్యంతో పనులు ముందుకు సాగడం లేదు. జిల్లాలోని మున్సిపాలిటీలు, వార్డులు, పట్టణ ప్రగతి నిధుల వివరాలు మున్సిపాలిటీ వార్డులు ఇప్పటికి విడుదలైన ఈ ఏడాది జనవరిలో పట్టణ ప్రగతి నిధులు(రూ.కోట్లలో) విడుదలైన నిధులు(రూ.లక్షల్లో) మంచిర్యాల 36 23.36 57 బెల్లంపల్లి 34 14.53 36 మందమర్రి 24 14.72 36 క్యాతన్పల్లి 22 10.42 25 లక్సెట్టిపేట 15 6.47 17 నస్పూర్ 25 20.58 51 చెన్నూరు 18 6.94 17 -
నిత్యం మురుగు పరుగు
సాక్షి, సిటీబ్యూరో: విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహా నగరంలో డ్రైనేజీల నుంచి మురుగు పొంగి పొర్లుతోంది. దుర్వాసన వెదజల్లుతుండటంతో జనం అవస్థలు పడుతున్నారు. సగం వరకు పగిలి, సరిగ్గా మూతల్లేని, చెత్తాతో నిండిన మ్యాన్హోళ్ల నుంచి నిత్యం మురుగు నీరు పొంగి రోడ్లపైకి వస్తుండటంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. కాలనీల్లోనే కాదు... నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారులపై కూడా ఇదే పరిస్థితి ఉంది. జలమండలి యంత్రాంగం, డ్రైనేజీ పైప్లైన్ల, మ్యాన్హోల్స్ మరమ్మతులు, నిర్వహణ పేరుతో పనులు కొనసాగిస్తున్నా... మురుగునీరు రోడ్లపై రాకుండా శాశ్వత పరిష్కారం మాత్రం లభించడం లేదు. కొన్ని చోట్ల చిన్న వర్షం పడ్డా డ్రైనేజీ మ్యాన్హోళ్లు పొంగి ముగురు నీరు ఇళ్లలోకి వస్తుండగా, కొన్నిచోట్ల తాగునీటి పైప్లోకి మురుగు వస్తోంది. నిత్యం సమస్యలే.. మహానగరంలో మ్యాన్హోళ్ల నిర్వహణ జలమండలికి పెద్ద ప్రహసనంగా మారింది. నిత్యం వందల ప్రాంతాల్లో మ్యాన్హోళ్లు పొంగడం, లేదంటే వాహనాల బరువుతో మూతలు పగలడం, భూమిలోకి కుంగిపోవడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతూనే ఉన్నాయి. ప్రజల నుంచి అధికారులకు నిత్యం వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తుంటాయి. చిన్న వర్షం పడితే ఫిర్యాదుల సంఖ్య మూడింతలు పెరుగడం సాధారణంగా తయారైంది. ఎక్కడ చూసినా.. ఇవే సమస్యలు. నగరంతోపా టు శివార్లలో సైతం మ్యాన్హోళ్ల పరిస్ధితి అధ్వానంగా తయారైంది. ప్రతిచోట మ్యాన్హోళ్లపై సిబ్బందితో నిఘా పెట్టడం కష్ట సాధ్యమే. ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే కానీ, స్పందించని పరిస్థితి ఉంది. 12 వేల చదరపు కిలో మీటర్ల మురుగు నీటి వ్యవస్థ... మహానగరంలో సుమారు 12 వేల చదరపు కిలోమీటర్లకు పైగా మురుగు నీటి వ్యవస్థ విస్తరించి ఉంది. వీటిపై సుమారు నాలుగు లక్షల వరకు మ్యాన్హోళ్లు ఉన్నాయి. ప్రధాన రోడ్డు మార్గాల్లో లక్ష వరకు మ్యాన్హోళ్లు ఉంటాయన్నది అంచనా. వీటిలో సుమారు 20 వేలకు పైగా లోతైనవి ఉంటాయి. నగరంలోని సుమారు 450 ప్రాంతాల్లో నిత్యం డ్రైనేజీ సమస్య ఉత్పన్నమవుతోంది. చిన్న వర్షానికే పొంగిపర్లుతుంటాయి. మరోవైపు వ్యర్థాలు, చెత్తా పేరుకుపోవడంతో మురుగు వెళ్లక మ్యాన్హోళ్ల నుంచి పొంగడం సర్వసాధారణంగా తయారైంది. నిజాం కాలం నుంచే.. నిజాం కాలం నుంచే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్ధ కొనసాగుతోంది. అప్పట్లో వరద నీళ్లు పోయేందుకు నాలాలు, నివాసాలు, ఇతర నిర్మాణాల నుంచి వెలువడే మురుగునీటిని తరలించేందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అప్పటి జనాభాకు ఐదు రెట్లు జనం పెరిగినా కూడా సీవరేజ్ పైపులైన్లు పనిచేసేలా పక్కా ప్లానింగ్తో నిర్మాణాలు చేపట్టారు. అయితే అప్పటికీ ఇప్పటికీ నగర జనాభా 25 రెట్లు పెరిగినా పాత కాలం నాటి డ్రైనేజీలే ఇప్పటికీ వినియోగంలో ఉన్నాయి. అవి చాలా చోట్ల దెబ్బతినడం, పెరిగిన జనాభాకు అనుగుణంగా సామర్థం లేకపోవడంతో మురుగునీరు రోడ్లపై పారుతోంది. పైప్లైన్లను కొన్ని ప్రాంతాల్లో రీస్టోర్ చేసినా.. క్లీనింగ్ యంత్రాలతో మ్యాన్హోళ్లను శుభ్రం చేసినా పెద్దగా ఫలితం ఉండటంలేదు. తాగునీటి పైపుల్లోకి.. కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ పైపుల పక్కనే తాగునీటి పైపులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. డ్రైనేజీలు దెబ్బతిని లీకవడంతో ఆ నీళ్లు తాగునీటి పైపుల్లోకి చేరుతోంది. పాతబస్తీలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. సీవరేజీ నీళ్లు తాగునీటిలో కలుçవడంతో మంచినీరు కలుషితమవుతోంది. సంబంధిత సిబ్బంది తాత్కాలిక మరమ్మతులతో చేతులు దులిపేసుకుంటున్నారు. -
మురికిపోయి.. ముద్దుగా మారి
అదో కాలువ.. దానికి అనుబంధంగా డ్రైనేజీలు, వానాకాలం వచ్చిందంటే ఉప్పొంగడం, రోడ్లన్నీ మురికినీటితో నిండిపోవడం, విషజ్వరాలు, తాగునీటి కాలుష్యం, దుర్వాసన.. ఇదంతా గతం.. ఇప్పుడు అదంతా అందాల హరివిల్లు. పచ్చదనం నిండిన పార్కులు, ఫౌంటెయిన్లు, ఓపెన్ జిమ్లు, వాకింగ్ ట్రాక్లు, ఆట స్థలాలతో ఆహ్లాదం పంచే ప్రదేశం.. ఖమ్మం పట్టణంలోని గోళ్లపాడు చానెల్,దాని వెంట ఉన్న ప్రాంతాల్లో వచ్చిన అద్భుతమైన మార్పు ఇది. సీఎం కేసీఆర్ హామీ, మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చొరవ కలిసి రూ.100 కోట్ల ఖర్చుతో గోళ్లపాడు చానెల్ ప్రాజెక్టు అపూర్వంగా రూపుదిద్దుకుంది. సీఎం కేసీఆర్ ఈ అభివృద్ధి పనులకు కితాబివ్వగా.. త్వరలోనే మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. రూ.100 కోట్లతో 10.6 కి.మీ.పొడవునాఅభివృద్ధి గోళ్లపాడు చానల్ పునరుద్ధరణతో ఖమ్మం పట్టణానికి వన్నె ఆక్రమణలకు పాల్పడిన 862 మందికి పునరావాసం మంత్రి పువ్వాడ చొరవతో పనులు.. త్వరలో కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం గోళ్లపాడు చానల్ ఖమ్మం నగరం మీదుగా వెళ్తూ.. శివారు ప్రాంతాల్లోని పంట పొలాలకు నీరందించేది. త్రీటౌన్ ప్రాంతంలో 10.6 కిలోమీటర్ల పొడవునా ఉన్న ఈ కాల్వ కాలక్రమేణా నగరాభివృద్ధితో డ్రైనేజీగా మారింది. పంపింగ్ వెల్ రోడ్, సుందరయ్య నగర్, ప్రకాశ్నగర్ ప్రాంతాల్లో కాల్వకు ఇరువైపులా బస్తీలు వెలిశాయి. ఖమ్మం నగరంలోని 28 డివిజన్ల మురికినీరంతా ఈ కాల్వ నుంచే వెళ్లి మున్నేరులో కలుస్తుండటం, ఆక్రమణలు, సిల్ట్ తీయకపోవడంతో నాలుగు దశాబ్దాలుగా కాల్వ, పరిసర ప్రాంతాలు మురికి కూపంగా మారాయి. వానాకాలంలో ఈ డ్రైనేజీ పొంగి సమీప డివిజన్లలో మురికినీరు చేరడం, ఆ నీరు పైపులైన్లలో కలిసి తాగునీరు కలుíÙతం కావడం నిత్యకృత్యమైంది. దోమల స్వైర విహారంతో విషజ్వరాలు, వ్యాధుల విజృంభణ సాధారణమైంది. రూ.100 కోట్లతో మారిన ముఖచిత్రం సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లతోపాటు ఖమ్మం కార్పొరేషన్ అభివృద్ధికి 2018లో ప్రత్యేక నిధులు కేటాయించారు. అందులో భాగంగా రూ.100 కోట్ల నిధులతో గోళ్లపాడు చానల్ పునరుద్ధరణ, సుందరీకరణ పనులు ప్రారంభమయ్యాయి. వచ్చే 30ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని భారీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాన నీరు వెళ్లేందుకు ఓపెన్ కాల్వ నిర్మించడంతోపాటు.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైభాగంలో ఆహ్లాదం పంచేలా పార్కులను ఏర్పాటు చేశారు. అధునాతన సౌకర్యాలతో.. పది డివిజన్ల పరిధిలోని 50 వేల మంది ప్రజలకు ఆహ్లాదం పంచేలా గోళ్లపాడు చానల్ను అభివృద్ధి చేశారు. పిల్లలకు చెస్పై అవగాహన కలి్పంచేలా రష్యాలోని మాస్కో తరహాలో మెగా చెస్బోర్డులు, అధునాతనంగా స్కేటింగ్ రింక్లు, వాటర్ ఫౌంటెయిన్లు, బాస్కెట్బాల్, వాలీబాల్, షటిల్ కోర్టులు, వాకింగ్ ట్రాక్లు, ఓపెన్ జిమ్లు, బస్తీ దవాఖానా, యోగా వేదికలు, పంచతత్వ పార్కులు, 10 వేల ఔషధ, ఇతర మొక్కలతో మినీ పార్కులను ఏర్పాటు చేశారు. మొత్తం 32 ఎకరాల స్థలం ప్రజా అవసరాల దృష్ట్యా వినియోగంలోకి వచ్చింది. గోళ్లపాడు చానల్ ప్రాజెక్టు వ్యయం రూ.100 కోట్లు అయితే.. వినియోగంలోకి వచ్చిన భూమి విలువ రూ.300 కోట్లకు పైమాటేనని అంచనా వేశారు. సీఎం సూచనల మేరకు ఇటీవల నిజామాబాద్ కలెక్టర్, ఆ జిల్లా అధికారులు ఈ అభివృద్ధి పనులను సందర్శించారు కూడా. గోళ్లపాడు చానల్పై నిర్మించిన పార్కులకు ప్రొఫెసర్ జయశంకర్, మంచికంటి రామకిషన్రావు, పుచ్చలపల్లి సుందరయ్య, కాళోజీ నారాయణరావు, కొండా లక్ష్మణ్ బాపూజీ, రజబ్ అలీ, వనజీవి రామయ్య తదితరప్రముఖుల పేర్లను పెట్టారు. గోళ్లపాడు చానల్ వెంట గతంలో గుడిసెలు, ఇతర తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్న 862 మంది పేదలకు ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్లలో ఇళ్ల స్థలాలు ఇచ్చి, అన్ని వసతులతో కాలనీ ఏర్పాటు చేశారు. మురికి పోయి.. వన్నె వచ్చింది సీఎం కేసీఆర్ రూ.100 కోట్లను గోళ్లపాడు చానల్కు కేటాయించడంతో నాలుగు దశాబ్దాల మురికి కూపం నుంచి విముక్తి కలిగింది. వన్నె వచ్చింది. ప్రత్యేకంగా త్రీటౌన్ ప్రాంతానికి ఆహ్లాదం పంచేలా గోళ్లపాడు చానల్ ముస్తాబైంది. విషజ్వరాలు, దుర్వాసనతో ఇబ్బందులు పడ్డ ప్రజలు నేడు ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తున్నారు. సీఎం దార్శనికతకు ఇది నిదర్శనం.- పువ్వాడ అజయ్ కుమార్, రవాణా శాఖ మంత్రి అందరి కృషితో ఆహ్లాదం సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ అజయ్కుమార్, అధికారులు, స్థానికుల సహకారంతో గోళ్లపాడు చానల్ సొబగులు అద్దుకుంది. ఆహ్లాదకరమైన పార్కులు అందుబాటులోకి వచ్చాయి. ప్రజలు వీటిని సదినియోగం చేసుకోవాలి. మొత్తం పది వేల కుటుంబాలు ఆహ్లాదాన్ని ఆస్వాదించేలా తీర్చిదిద్దాం. గోళ్లపాడు చానల్ పార్కుల్లో ఇంకా కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తాం. -వీపీ గౌతమ్, కలెక్టర్, ఖమ్మం -
హైదరాబాద్ లో ఎక్కడ చూసిన మురికి కుప్పలే: రేవంత్ రెడ్డి
-
Viral Video: డ్రైవింగ్ చేస్తూ ఉన్నపళంగా డ్రైనేజీ కాలువలోకి పడిపోయింది
-
గ్రేటర్ సిటీకి తీరని ముప్పు! హైదరాబాద్ వరదల చరిత్ర చూస్తే బేజారే!
సాక్షి, హైదరాబాద్: పట్టుమని పది సెంటీమీటర్ల వాన కురిసిన ప్రతిసారి విశ్వనగరం మునకేస్తోంది. హైదరాబాద్ ప్రధాన నగరం సహా శివార్లు, లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. బండారీ లేఅవుట్, నాచారం తదితర ప్రాంతాల్లోని వారం, పదిరోజులపాటు ముంపులోనే మగ్గాల్సిన దుస్థితి నెలకొంది. చరిత్ర పుటలను తిరగేసినా ఎన్నోమార్లు నగరం వరద విలయంలో చిక్కి విలవిల్లాడినట్టు స్పష్టమవుతోంది. ఈ దురవస్థకు చరమగీతం పాడుతూ విశ్వనగర ప్రణాళికకు ప్రభుత్వం శ్రీకారం చుట్టాలని ప్రజలు కోరుతున్నారు. వందేళ్ల కిందట మూసీ వరదలు, నగర తాగునీటి అవసరాలు, హుస్సేన్సాగర్ పరిరక్షణ, డ్రైనేజీ వ్యవస్థ అంకురార్పణ కోసం అహరహం శ్రమించిన ప్రఖ్యాత ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సమగ్ర మాస్టర్ప్లాన్ సిద్ధం చేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఆయన స్ఫూర్తితో మరో మాస్టర్ప్లాన్ సిద్ధం చేసి హైదరాబాద్ నగరానికి వరదలు, విపత్తుల నుంచి విముక్తి కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పెరుగుతున్న వరద, ముంపు సమస్యలు ►ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ జనాభా కోటిన్నరకు చేరువైంది. సుమారు 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన మహా నగరంలో 185 చెరువులు, 1,500 కిలోమీటర్ల పొడవైన నాలా వ్యవస్థ ఉన్నాయి. ఇందులో ముఖ్య ప్రాంతాల్లో 900 కిలోమీటర్ల మేర, శివార్లలో 600 కిలోమీటర్ల మేర నాలాలు విస్తరించి ఉన్నాయి. ►నాలాలపై అనధికారికంగా పదివేలకుపైగా అక్రమ నిర్మాణాలు వెలిసినట్టు బల్దియా అంచనా. వాటిని తొలగించడంలో తొలి నుంచీ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ►నాలాల ప్రక్షాళనకు సుమారు రూ.పదివేల కోట్ల అంచనా వ్యయంతో బల్దియా సిద్ధం చేసిన సమగ్ర ప్రణాళిక అటకెక్కింది. దీనితో భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి వరద సాఫీగా వెళ్లేదారిలేక జనావాసాలు నిండా మునుగుతున్నాయి. ►రోజువారీగా జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 1,400 మిలియన్ లీటర్ల మురుగు నీరు వెలువడుతోంది. ఇందులో జలమండలి 700 మిలియన్ లీటర్ల మేర శుద్ధిచేసి మూసీలోకి వదులుతోంది. ►గ్రేటర్ హైదరాబాద్లో విలీనమైన 11 శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో వెలువడుతున్న మురుగునీరు ఓపెన్ డ్రెయిన్లు, నాలాల్లో యథేచ్ఛగా కలిసి మూసీలోకి ప్రవేశిస్తోంది. వర్షం కురిసినపుడు ప్రధాన రహదారులపై మురుగు పోటెత్తుతోంది. ►శివారు ప్రాంతాల్లోని డ్రైనేజీలు సరిగా లేక నివాస సముదాయాల్లో మురుగు ఇళ్లలోని సెప్టిక్ ట్యాంకుల్లో మగ్గుతోంది. ►రోజువారీగా గ్రేటర్లో వెలువడుతున్న మురుగు నీరు సాఫీగా వెళ్లేందుకు ప్రస్తుతమున్న డ్రైనేజీ పైప్లైన్ వ్యవస్థ ఏమాత్రం సరిపోవడం లేదు. ►ఆయా ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ మాస్టర్ప్లాన్ అమలు కోసం సుమారు రూ.5 వేల కోట్లు అవసరం. దీనిని ప్రభుత్వం విస్మరిస్తోందన్న ఆరోపణలున్నాయి. ఈ ఏడాది సీజన్ ప్రారంభమైన జూన్ ఒకటి నుంచి అక్టోబర్ 14 వరకు గ్రేటర్ హైదరాబాద్ నగరంలో సాధారణం కంటే 40శాతం అధిక వర్షపాతం నమోదైంది. గత పదేళ్లలో అక్టోబర్లో కురిసిన వర్షపాతం లెక్కలను పరిశీలిస్తే.. 2020 అక్టోబర్ 14న అత్యధికంగా 19.1 సెంటీమీటర్ల రికార్డు వర్షపాతం నమోదైంది. వరదల చరిత్ర ఇదీ ►1591 నుంచి 1908 వరకు 14సార్లు హైదరాబాద్ నగరం వరద ప్రవాహంలో చిక్కుకుంది. 1631, 1831, 1903 వరదలతో హైదరాబాద్లో భారీగా ధన, ప్రాణనష్టం సంభవించింది. ►1908 నాటి వరదల్లో 2 వేల ఇళ్లు కొట్టుకుపోయాయి. 15వేల మంది మృతి చెందారు, 20 వేల మంది నిరాశ్రయులయ్యారు. వారం రోజుల వరకు జనజీవనం స్తంభించింది. ►1631లో అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో సంభవించిన వరదలకు హైదరాబాద్లో ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు «ధ్వంసమయ్యాయి. మూసీ చుట్టుపక్కల ఉన్న ఇళ్లు వరదలకు కొట్టుకుపోయాయి. ప్రభుత్వ ఖజానా నుంచి పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేసి వరద బాధితులను ఆదుకున్నారు. ►200ఏళ్ల అనంతరం 1831లో మీర్ ఫర్కుందా అలీఖాన్ నాసరుద్దౌలా పాలనా కాలంలో భారీ వరదలు వచ్చాయి. అప్పట్లో నిర్మాణంలో ఉన్న చాదర్ఘాట్ వంతెన కొట్టుకుపోయింది. వేలాది గుడిసెలు, మట్టి ఇళ్లు కూలిపోయాయి. వందల సంఖ్యలో ప్రాణనష్టం జరిగింది. అప్పట్లో పురానా హవేలీలోని నాలుగో నిజాం నివాసం దాకా వరద నీరు చేరింది. నాసరుద్దౌలా వరద బాధితులకు సాయం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఒడ్డుకు దూరంగా ఇళ్లు నిర్మించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ►మళ్లీ ఆరో నిజాం మీర్ మహబూబ్ ఆలీ పాలనా కాలమైన 1903 సెప్టెంబర్లో భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం మరోసారి అతలాకుతలమైంది. మూడు రోజులు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు మూసీ ప్రమాద స్థాయిలో ప్రహహించి, భారీ నష్టం సంభవించింది. ►తర్వాత 1968, 1984, 2007, 2016, 2019 సంవత్సరాల్లోనూ భారీ వర్షాలతో మూసీ పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. -
విషాదం.. డ్రైనేజీ శుభ్రం చేసేందుకు దిగి ముగ్గురు మృతి
పల్నాడు జిల్లా: సత్తెనపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. న్యూ వినాయక ఫ్యామిలీ రెస్టారెంట్లో డ్రైనేజిలోకి దిగిన ముగ్గురు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. డ్రైనేజీ బాగు చేసేందుకు లోపలికి వెళ్లిన వీరు ఊపిరాడక మరణించారు. మృతుల్లో ఇద్దరు కార్మికులు. మరొకరు బిల్డింగ్ యజమాని కొండలరావు. చదవండి: ప్రాణం తీసిన వివాహేతర సంబంధం! -
Hyderabad: చినుకు రాలితే.. వాన వరదైతే.. వెళ్లే దారేది? ‘డంపెత్తిన కంపు ’
సాక్షి, సిటీబ్యూరో: ఐటీ హబ్కు కేరాఫ్గా మారిన గ్రేటర్ సిటీ.. విశ్వనగరం బాటలో దూసుకెళుతున్నా.. మురుగు, వరదనీరు సాఫీగా వెళ్లే దారి లేక కంపుకొడుతోంది. గత వారం రోజులుగా తెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో సుమారు 200కు పైగా బస్తీలను మురుగు, వరదనీరు ముంచెత్తింది. దీంతో ఆయా బస్తీలవాసులు రోగాల బారినపడుతున్నారు. వాహనదారులు, ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. దశాబ్దాలుగా ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఈ దుస్థితికి పరిష్కారం లభించడంలేదు. ఏళ్లుగా నాలాలు విస్తరించకపోవడం, స్మార్ట్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడంతో ఏటా పరిస్థితి విషమిస్తోంది. మురుగుకు మోక్షం కల్పించాలిలా.. గ్రేటర్ విస్తీర్ణం 625 చదరపు కిలోమీటర్లు.. జనాభా కోటి దాటింది. నగరంలో నిత్యం 1400 మిలియన్ లీటర్ల మురుగు నీరు ఉత్పన్నమవుతోంది. ఇందులో 700 మిలియన్ లీటర్ల మురుగు నీటిని జలమండలి 23 ఎస్టీపీల్లో శుద్ధి చేస్తోంది. మిగతా మురుగు నీరు ఎలాంటి శుద్ధి ప్రక్రియ లేకుండానే సమీప చెరువులు, మూసీలో కలుస్తోంది. 2007లో జీహెచ్ఎంసీలో విలీనమైన 11 మున్సిపల్ సర్కిళ్ల పరిధిలోని సుమారు వెయ్యి కాలనీలు, బస్తీల్లో డ్రైనేజీ ఔట్లెట్ సదుపాయం లేకపోవడంతో మురుగు నీరు సెప్టిక్ ట్యాంకులు, బహిరంగ ప్రదేశాలు, ఓపెన్ నాలాలు, చెరువులు, కుంటలను ముంచెత్తుతోంది. ఆయా మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో రూ.3723 కోట్ల అంచనా వ్యయంతో సుమారు 2 వేల కిలోమీటర్ల మార్గంలో డ్రైనేజి పైపులైన్ వ్యవస్థ ఏర్పాటుచేయాల్సి ఉంది. ఈ పైపులైన్ల ద్వారా మురుగు నీటిని నూతనంగా రూ.1046 కోట్లతో నిర్మించనున్న 17 ఎస్టీపీల్లోకి మళ్లించి శుద్ధి చేసిన అనంతరమే మూసీ, నాలాల్లోకి వదిలిపెట్టాలి. మురుగు శుద్ధి కేంద్రాల్లో శుద్ధిచేసిన నీటిని గార్డెనింగ్, పారిశ్రామిక, నిర్మాణరంగ అవసరాలు, కార్వాషింగ్, ఫ్లోర్ క్లీనింగ్ తదితర అవసరాలకు వినియోగించాలి. వరద కష్టాలు లేకుండా.. గ్రేటర్ మొత్తానికీ సమగ్ర మాస్టర్ప్లాన్.. సూక్ష్మస్థాయి వరదనీటి పారుదల నెట్వర్క్ ప్లాన్.. మేజర్, మైనర్ వరద కాల్వల ఆధునికీకరణకు గతంలో ఓయంట్స్ సొల్యూషన్ సంస్థ సిద్ధం చేసిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక ప్రకారం పనులు చేపట్టాలి. నగరంలో 1500 కి.మీ మేర విస్తరించిన నాలాలపై ఉన్న 10 వేల అక్రమ నిర్మాణాలను తొలగించాలి. నాలాలను సమూలంగా ప్రక్షాళన చేయాలి. విస్తరించాలి. నాలాల ఆధునికీకరణ ఆవశ్యకతను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి. ఇందుకోసం రాజకీయ పార్టీలు, ఎన్జీఓల సహకారం తీసుకోవాలి. వరద నీటి కాల్వల్లో మురుగునీరు పారకుండా జలమండలికి స్పష్టమైన ఆదేశాలివ్వాలి. మురుగునీటి పారుదలకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలి. స్టార్మ్ వాటర్ డ్రైనేజి (వరదనీటి కాల్వల) మాస్టర్ ప్లాన్ను పరిగణనలోకి తీసుకొని టౌన్ప్లానింగ్ విభాగం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను అనుమతించరాదు. జీహెచ్ఎంసీ పరిధిలోని 185 చెరువుల పునరుద్ధరణ చేపట్టాలి. దీంతో వర్షపు నీరు చెరువుల్లోకి చేరి జలకళ సంతరించుకుంటాయి. చదవండి: రెండ్రోజులు మరిన్ని వానలు! ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ -
వర్షం వస్తే.. నగరం నరకం!
సాక్షి, హైదరాబాద్: నగరంలో గత వరద అనుభవాలతో లోతట్టు, సమస్యాత్మక ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ముంపు సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఎస్ఎన్డీపీని ఏర్పాటు చేసింది. పనులు చేపట్టడంలో జరిగిన ఆలస్యంతో ఎక్కడా పనులు పూర్తికాలేదు. దీంతో.. తాత్కాలిక ఉపశమనంగా ఎక్కడికక్కడ వాననీరు నిల్వకుండా వెంటనే తొలగించేలా జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. అన్ని జోన్లలోని నాలాల వెంబడి క్షేత్రస్థాయి సర్వేలతో ప్రమాదకర ప్రాంతాలను గుర్తించారు. అక్కడ భద్రత చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. ఎస్ఎన్డీపీ కింద దాదాపు రూ.747 కోట్ల విలువైన 37 వరద కాల్వల పనులు చేపట్టారు. బాటిల్ నెక్స్గా ఉన్న నాలాలు వెడల్పు చేయడం, బాక్స్డ్రెయిన్ల నిర్మాణం, రీమోడలింగ్, వంటి పనులు వీటిల్లో ఉన్నాయి. పనులైతే మొదలైనప్పటికీ, ఇవి ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ప్రాణనష్టం వాటిల్లకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించడంతో ఆమేరకు చర్యలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇంకా పూర్తికాని పనులు.. ఇవి కాక 2000 సంవత్సరంలో జరిగిన ఘటనల్ని దృష్టిలో ఉంచుకొని వెడల్పు తక్కువగా ఉన్న నాలాలకు పైకప్పుల ఏర్పాటు, అన్ని నాలాలకు అవసరమైన మరమ్మతులు, పైప్లైన్లు, డ్రెయిన్ల ఏర్పాటు వంటి పనుల కోసం రూ.298.34 కోట్లు మంజూరు చేశారు. మొత్తం 468 పనులకు రూ.139.78 కోట్లతో 98 పనులు పూర్తిచేశారు. రూ. 94.11కోట్ల విలువైన 98 పనులు కొనసాగుతున్నాయి. కోర్టు వివాదాలు తదితరమైన వాటితో రూ.5.82 కోట్ల విలువైన 19 పనులు పనులు రద్దు చేశారు. మిగతా పనులు ఆయా దశల్లో ఉన్నాయి తప్ప పూర్తి కాలేదు. ఎమర్జెన్సీ టీమ్స్.. వర్షాకాల ఫిర్యాదులపై వెంటనే రంగంలోకి దిగి వాన నీటినిల్వలు తొలగించేందుకు జీహెచ్ఎంసీ సిబ్బందితో 168 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, 160 స్టాటిక్ లేబర్ టీమ్స్ ఏర్పాటు చేశారు. స్టాటిక్టీమ్స్ నీరు నిలిచే ప్రాంతాలకు దగ్గరలో ఉండి వెంటనే నీటిని తోడిపోస్తాయి. అందుకు 237 పంప్సెట్లను సమకూర్చుకున్నారు. అక్టోబర్ వరకు పనిచేసే ఈటీమ్స్ కోసం రూ. 36.98కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా. ఇవి కాక ప్రధాన రహదారుల మార్గాల్లో రోడ్లు నిర్వహిస్తున్న ప్రైవేట్ ఏజెన్సీలు తమ మార్గాల్లో పనుల కోసం 29 ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇవి జీహెచ్ఎంసీ నుంచి కాగా, వాటర్బోర్డు, విద్యుత్ విభాగాల అధికారులు సైతం జీహెచ్ఎంసీ కాల్సెంటర్కందే ఫిర్యాదులు పరిష్కరించేలా జీహెచ్ఎంసీ కాల్సెంటర్లో 040– 21 11 11 11 ఫోన్ నంబర్ను ఏర్పాటు చేశారు. ►ఎక్కడైనా రోడ్లపై నీరు, మురుగు నిలిచినా, విద్యుత్ సమస్యలు తలెత్తినా ఇవి వెంటనే రంగంలో దిగుతాయని మేయర్ పేర్కొన్నారు. ప్రాణాపాయం జరగకుండా పటిష్ట చర్యలు.. ►900కుపైగా ప్రాంతాలకు ఇన్చార్జి అధికారులు ►వర్షాల కారణంగా ఎక్కడా, ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూడటంతోపాటు ►సమస్యాత్మక ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పనులు చేపట్టేందుకు వీలుగా అధికారులను ఇన్చార్జులుగా నియమించారు. ►ఎల్బీనగర్ జోన్లో 74 సమస్యాత్మక ప్రాంతాలకు 76 మంది అధికారులను ఇన్చార్జులుగా నియమించారు. చార్మినార్ జోన్లో 52 సమస్యాత్మక ప్రాంతాలకు 32 మంది అధికారులను, ఖైరతబాద్జోన్లోని 711 ప్రాంతాలకు 81 మంది అధికారులను, శేరిలింగంపల్లి జోన్లోని 52 సమస్యాత్మక ప్రాంతాలకు 52 మంది అధికారులను, కూకట్పల్లి జోన్లోని 48 సమస్యాత్మక ప్రాంతాలకు 49 మంది అధికారులను,సికింద్రాబాద్ జోన్లోని 55 సమస్యాత్మ కప్రాంతాలకు 79 మంది అధికారులను ఇన్ఛార్జులుగా నియమించారు. వారి నేతృత్వంతో దిగువస్థాయి సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి వాన సమస్యల్ని పరిష్కరిస్తారని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. -
విశాఖలో ప్రతిష్టాత్మక ఐసీఐడీ కాంగ్రెస్
సాక్షి, అమరావతి: అంతర్జాతీయంగా అత్యంత ప్రతిష్టాత్మక ఐసీఐడీ(ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్) 25వ కాంగ్రెస్ నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకుంది. వచ్చే ఏడాది నవంబర్ 6 నుంచి 13 వరకూ విశాఖపట్నంలో ఐసీఐడీ 25వ కాంగ్రెస్తో పాటు, ఆ సంస్థ 75వ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్(ఐఈసీ) సమావేశం నిర్వహించనుంది. ప్రపంచవ్యాప్తంగా 78 దేశాల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. ప్రపంచానికి జలభద్రత చేకూర్చడం, తక్కువ నీటితో అధిక విస్తీర్ణంలో పంటల సాగుకు దోహదం చేసే అత్యాధునిక నీటి పారుదల విధానాలపై సమావేశంలో చర్చిస్తారు. అత్యాధునిక నీటి పారుదల విధానాలను ఈ సమావేశాల్లో ప్రదర్శిస్తారు. వాటిని అందిపుచ్చుకుని.. నీటి వనరులను మరింత సమర్థంగా ఉపయోగించుకుని.. అత్యధిక విస్తీర్ణంలో ఆయకట్టుకు నీరందించి, రాష్ట్రాన్ని సుభిక్షం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి 10 వరకూ ఐసీఐడీ 24వ కాంగ్రెస్, 74వ ఐఈసీ సమావేశాలు ఆస్ట్రేలియాలోని అడిలైడ్లో జరగనున్నాయి. జల వనరుల సంరక్షణ.. తక్కువ నీటితో అధిక విస్తీర్ణంలో పంటల సాగు విధానాలపై అధ్యయనం చేసి, వాటి ఫలితాలను ప్రపంచానికి అందించడమే లక్ష్యంగా 1950, జూన్ 24న సిమ్లా వేదికగా ఐసీఐడీ ఆవిర్భవించింది. ఐసీఐడీ తొలి కాంగ్రెస్ను 1951, జనవరి 11–16 వరకూ ఢిల్లీలో నిర్వహించారు. 1953, జూన్లో బెంగళూరు వేదికగా నాలుగో సమావేశాన్ని నిర్వహించారు. ఐసీఐడీ ఆరో కాంగ్రెస్ను దేశంలో చివరగా ఢిల్లీలో 1966, జనవరి 4–13 వరకూ నిర్వహించారు. ఆ సంస్థ 23వ కాంగ్రెస్ను మెక్సికో దేశ రాజధాని మెక్సికో సిటీలో 2017, అక్టోబర్ 8 నుంచి 14 వరకూ నిర్వహించారు. ఐసీఐడీ 24వ కాంగ్రెస్ను నిర్వహించే బాధ్యతను ఆస్ట్రేలియా దక్కించుకోగా, 25వ కాంగ్రెస్ నిర్వహణ బాధ్యతలను భారత్ చేజిక్కించుకుంది. ఆ సదస్సును విశాఖలో నిర్వహించాలని ఐసీఐడీ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ డాక్టర్ కె.యల్లారెడ్డి చేసిన ప్రతిపాదనను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదించారు. రాష్ట్రాన్ని మరింత సస్యశ్యామలం చేసే దిశగా.. ఐసీఐడీ 25వ కాంగ్రెస్కు విశాఖపట్నాన్ని వేదికగా చేసుకోవడం నీటి పారుదల రంగానికి సీఎం వైఎస్ జగన్ ఇస్తున్న ప్రాధాన్యతకు దక్కిన గౌరవంగా సాగు నీటిరంగ నిపుణులు అభివర్ణిస్తున్నారు. సదస్సు నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలో శతాబ్దాల కిందట నిర్మించిన చెరువులను సంరక్షించుకుని, ఆయకట్టుకు నీళ్లందించడం దగ్గర్నుంచి.. చిన్న, మధ్య, భారీ ప్రాజెక్టుల కింద కోటి ఎకరాల ఆయకట్టుకు నీరందించడం, సూక్ష్మ నీటిపారుదల విధానాలను అందిపుచ్చుకుని.. తక్కువ నీటితో అత్యధిక విస్తీర్ణంలో పంటలు సాగుచేస్తుండటాన్ని ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం వివరించనుంది. ప్రపంచ వ్యాప్తంగా 78 దేశాలకు చెందిన ప్రతినిధులు, మేధావులు ప్రతిపాదించే అత్యా«ధునిక నీటి పారుదల విధానాలను పరిశీలించి.. వాటిని అమలు చేయడం ద్వారా రాష్ట్రాన్ని సుభిక్షం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
‘మురుగు’.. తప్పితేనే మెరుగు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరానికి తాగునీరిచ్చే జంట జలాశయాలు హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ (గండిపేట)లను మురుగు ముప్పు వెంటాడుతోంది. సమీపంలోని 11 గ్రామాల నుంచి, చుట్టూ ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల నుంచి వస్తున్న మురుగునీటితో రిజర్వాయర్లు కలుషితం అవుతున్నాయి. నిత్యం గండిపేట జలాశయంలోకి 29 లక్షల లీటర్లు, హిమాయత్సాగర్లోకి 43.5 లక్షల లీటర్ల వ్యర్థ జలాలు కలుస్తున్నట్టు జల మండలి పరిశీలనలోనే వెల్లడైంది. గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాల నుంచి వచ్చే మురుగు నీటిని ఎక్కడికక్కడ శుద్ధి చేయాలని, అందుకోసం మురుగు శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీలు) ఏర్పాటు చేసుకోవాలని.. గతంలోనే గ్రామ పంచాయతీలు, కాలేజీలకు జలమండలి, కాలుష్య నియంత్రణ బోర్డు (పీసీబీ) నోటీసులు ఇచ్చాయి. ఎస్టీపీలను నిర్మించుకోవాలని, జలాశయాలు కలుషితం కాకుండా చూడాలని హైకోర్టు కూడా కాలేజీల యాజమాన్యాలను ఆదేశించింది. అయినా ఫలితం లేదు. పంచాయతీల నిర్లక్ష్యానికితోడు.. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడం కూడా దీనికి కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మురుగునీటి చేరికను ఆపడం, శుద్ధి చేయడం ద్వారా జంట జలాశయాల్లో నీటి నాణ్యతను మెరుగుపర్చాలన్న డిమాండ్లు వస్తున్నాయి. ఐదేళ్లుగా పైసా లేదు.. సుమారు పదివేల ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉన్న జంట జలాశయాలకు సమీపంలో 11 గ్రామా లు ఉన్నాయి. వాటి నుంచి వెలువడుతున్న మురుగు నీరంతా జలాశయాల్లోకి చేరుతుండటంతో.. మురుగుశుద్ధి కేంద్రాలు (ఎస్టీపీ)లను నిర్మిం చాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. సుమారు రూ.40.50 కోట్ల అంచనా వ్యయంతో ఎస్టీపీల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యా యి. అందులో రూ.27.50 కోట్లను పంచాయతీ రాజ్ శాఖ, మరో రూ.13 కోట్లను కాలుష్య నియంత్రణ మండలి నుంచి విడుదల చేయాలని సూచించింది. ఇది జరిగి ఐదేళ్లయినా ఆయా విభాగాల నుంచి పైసా నిధులు విడుదల కాలేదు. మురుగు నీరు నేరుగా జలాశయాల్లో కలుస్తూ.. ఆర్గానిక్ కాలుష్యం పెరిగిపోతోంది. తాఖీదులు ఇచ్చినా.. జంట జలాశయాల చుట్టూ ఉన్న గ్రామ పంచాయతీలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఎస్టీపీలు నిర్మించుకోవాలంటూ గతంలోనే తాఖీదులిచ్చామని పీసీబీ వర్గాలు తెలిపాయి. పీసీబీ తరఫున రూ.13 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని.. కానీ పంచాయతీరాజ్ విభాగం నుంచి రావాల్సిన రూ.27.50 కోట్లను విడుదల చేయడం లేదని ఓ అధికారి చెప్పారు. అయితే దీనిపై జిల్లా పంచాయతీ అధికారిని వివరణ కోరగా.. ఈ అంశంపై దృష్టి సారించి, సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. తక్షణం ఎస్టీపీలు నిర్మిస్తేనే.. ►జంట జలాశయాల్లో కాలుష్యం చేరకుండా తీసు కోవాల్సిన చర్యలపై నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ►సమీప గ్రామాల మురుగునీరు చేరకుండా తక్షణం ఎస్టీపీలు నిర్మించాలి. వాటిలో శుద్ధిచేసిన నీటిని కూడా జలాశయాల్లోకి వదలకుండా గార్డెనింగ్, పంటలకు వినియోగించాలి. రిజర్వాయర్లలోని నీటిలో ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు ఏరియేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. ►వరదనీరు చేరే ఇన్ఫ్లో చానల్స్ను ప్రక్షాళన చేయాలి. జలాశయాల ఎగువన, ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా వెలిసిన ఫాంహౌజ్లు, ఇంజనీరింగ్ కాలేజీలు, రియల్ ఎస్టేట్ వెంచర్లను తొలగించాలి. ఇసుక మాఫియాను కట్టడిచేయాలి. ►ఈచర్యల విషయంలో రెవెన్యూ, పంచాయతీరాజ్, జలమండలి విభాగాలు సమన్వయంతో పనిచేయాలి. మురుగు కాలుష్యం ప్రమాదకరం మురుగు చేరిక వల్ల మంచినీటి జలాశయాల్లోకి పురుగు మందుల అవశేషాలు, షాంపూలు, టాయిలెట్ క్లీనర్లు, సబ్బులు, ఇతర రసాయనాలు చేరుతున్నాయి. గృహ, వాణిజ్య వ్యర్థ జలా ల్లో ఉండే హానికర మూలకాలతోనూ ప్రమాదం ఉంటుంది. మానవ, జంతు వ్యర్థాలతో కూడిన మురుగులో కొలిఫాం, షిగెల్లా, స్టెఫైలోకోకస్, ఈకొలి వంటి ప్రమాదకర బ్యాక్టీరియా ఉంటుంది. మురుగునీటితో యుట్రిఫికేషన్ చర్య జరిగి గుర్రపు డెక్క ఉద్ధృతి పెరుగుతుంది. జలాశయాల్లో నీటిమట్టాలు తగ్గినపుడు దోమల లార్వాలు ఉద్ధృతంగా వృద్ధి చెందుతాయి. సమీప ప్రాంతాల్లో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. – సజ్జల జీవానందరెడ్డి, పర్యావరణవేత్త ఎస్టీపీలు నిర్మించాల్సిన గ్రామాలు, అవసరమైన సామర్థ్యం ఇదీ.. ఉస్మాన్సాగర్ పరిధిలో.. వట్టినాగులపల్లి - 8 లక్షల లీటర్లు చిలుకూరు - 7 లక్షల లీటర్లు ఖానాపూర్ - 6 లక్షల లీటర్లు జన్వాడ - 6 లక్షల లీటర్లు హిమాయత్నగర్ - 3 లక్షల లీటర్లు అప్పోజిగూడ - లక్ష లీటర్లు బాలాజీ ఆలయం - లక్ష లీటర్లు హిమాయత్సాగర్ పరిధిలో.. ఫిరంగినాలా - 29 లక్షల లీటర్లు అజీజ్నగర్ - 9 లక్షల లీటర్లు కొత్వాల్గూడ - 3 లక్షల లీటర్లు హిమాయత్సాగర్ - 2.5 లక్షల లీటర్లు -
వార్నీ ఇదేం కక్కుర్తి.. డ్రైనేజీనీ కూడా వదలరా?
సాక్షి,ఘట్కేసర్(హైదరాబాద్):ఇటీవల భూముల విలువ పెరగడంతో డ్రైనేజీలను సైతం వదలడం లేదు. జనవరి 5, 2021న పట్టణంలోని ఎదులాబాద్ రోడ్డులో రూ.21లక్షల డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. సాక్షాత్తు మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేసిన భూగర్భ డ్రైనేజీ స్థలామే కబ్జాకు గురైంది. మున్సిపల్ కమిషనర్ కార్యలయానికి నిత్యం వెళ్లే దారిలోని డ్రైనేజీ స్థలం కబ్జాకు గురికావడం, కమిషనర్కు స్థానికులు ఫిర్యాదు చేసిన పట్టిపట్టనట్లు వ్యవహరించడం, పక్షం రోజులుగా పనులు జరగుతున్న అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ స్థలంపై గేటు నిర్మించడంలో పాటు, సర్వేనంబర్ 481, 482లో చేసిన వెంచర్ రోడ్డును కూడా కబ్జా చేసి ప్రహరీ నిర్మించారు. అధికారులు స్పందించి కబ్జాకు గురైన రోడ్డు, డ్రైనేజీ స్థలాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. -
నరకం చూస్తున్న సామాన్యుడు.. సచ్చినా.. మారరా..?
గోల్కొండ: సొంతిల్లు ప్రతి ఒక్కరి కల.. కానీ ఆ కల సాకారం కావాలంటే మాత్రం నరకం చూడాల్సిందే.. ఇంటి నిర్మాణం అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న మొదలు.. నిర్మాణం పూర్తయ్యే వరకు అన్ని శాఖల అధికారులకు లంచాలు ముట్టజెప్పాల్సిందే.. లేదంటే అడుగడుగునా ఇబ్బందులు తప్పవు.. అడిగినంతా ఇచ్చుకుంటే ఇక ఆ ఇంటి నిర్మాణానికి ఎలాంటి ఆటంకం ఉండదు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా తయారైంది అన్ని శాఖల అధికారుల తీరు. దీంతో ఇల్లు నిర్మించుకోవాలంటే ఇబ్బందులు పడుతున్న ప్రజలు బిల్డర్లను ఆశ్రయిస్తున్నారు. ఎక్కడ ఏ అధికారికి ఎంత ముట్టజెప్పాలో తెలిసిన బిల్డర్లు లంచాలు వారికి అందించి ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో అధికారులు, కిందిస్థాయి సిబ్బంది అటువైపు కన్నెత్తి చూసిన పాపానపోవడం లేదు. ♦ అక్రమ నిర్మాణానికి డ్రైనేజీ లైన్ వేయాలన్నా.. తాగునీటి పైప్లైన్ అయినా.. ట్రాన్స్ఫార్మర్, మీటర్లు ఇలా ఏది కావాలన్నా బిల్డర్లు అధికారుల జేబుల్లో డబ్బులు కుక్కి.. యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. భూగర్భ డ్రైనేజీ లైన్ నుంచి ఇష్టానుసారంగా అక్రమ కనెక్షన్లు ఇస్తున్నా ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ♦ నిర్మాణాల వద్ద విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు అడ్డుగా ఉండే వాటిని ప్రైవేటు వ్యక్తులు పక్కకు తరలించే అవకాశం కల్పిస్తున్నారు. డబ్బులిచ్చుకో.. పనులు చేసుకో.. అంటూ బిల్డర్లకు, భవన యజమానులకు ఆదేశాలు ఇచ్చేస్తున్నారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు సైతం సొంతంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ♦ 10 రోజుల క్రితం తేజ కాలనీలో ఓ బిల్డర్లు తన ఇంటి ముందున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను మరో ప్రదేశానికి తరలిస్తుండగా విద్యుదాఘాతానికి ఓ కూలీ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఈ నిర్లక్ష్యంలో విద్యుత్ శాఖ అధికారుల ప్రమేయం ఉన్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని.. వారి పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు ముడుపుల మత్తులో జోగుతున్నారా అని ప్రశ్నిస్తున్నారు. ♦ పెద్దపెద్ద ప్రమాదకరమైన పనులను దినసరి కూలీలతో చేయిస్తున్నా.. అధికారులు మొద్దు నిద్ర వదలకపోవడంపై స్థానిక కాలనీల వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లంచాలు ముడితే చాలు ప్రాణాలు పోయినా పట్టించుకోరా..? అని ప్రశి్నస్తున్నారు. ♦ నిత్యం ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. లంచాలు ఇవ్వకపోతే ఒక్క అధికారి కూడా పని చేయడం లేదు. డబ్బులు ఇచ్చే వరకు ఫైల్ పెండింగ్లో ఉంచుతున్నారు. ఇంకా కొందరు అధికారులు సొంత పనులపైనే దృష్టి పెడుతున్నారు. ♦ అయ్యా.. సారూ.. అంటూ వారి చుట్టూ తిరుగుతున్నా అదిగో.. ఇదిగో అంటూ కాలం వెల్లదీస్తున్నారు. మీటింగులు, విజిట్ అంటూ సొంత పనుల కోసం తిరుగుతున్నారు. కొంత మంది బిల్డర్లు, గుత్తేదారులు ఫోన్లోనే మాట్లాడుకొని ముడుపులు వారి వద్దకే పంపడంతో పనులు చకచకా సాగిపోతున్నాయి. ♦ నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకున్న వారు అనుమతుల కోసం నెలల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సిన దుస్థితి. దీంతో విసిగిపోయి చాలామంది బిల్డర్లను ఆశ్రయిస్తున్నారు. ♦ అన్ని శాఖల్లో ఇదే విధానం కొనసాగుతోంది. తాగునీటి కనెక్షన్, డ్రైనేజీ లైన్ కావాలంటే కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు డబ్బులు ఇవ్వాల్సిందే.. విద్యుత్ మీటర్ కోసం క్షేత్రస్థాయి సిబ్బందికి లంచాలు తప్పనిసరిగా ఇవ్వాల్సిందే.. డబ్బులు ఇస్తే ఎలాంటి అక్రమాలైనా.. సక్రమాలవుతున్నాయి. ♦ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, మినీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ తీగలు మార్చడానికి నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలి. అయితే కాలనీల్లో బిల్డర్లు వీటిని పాటించడం లేదు. దీని వల్ల స్థానికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ♦ పలుమార్లు విద్యుత్ స్తంభాలు వేయడానికి, మార్చడానికి బిల్డర్లు నిబంధనలకు వ్యతిరేకంగా దినసరి కూలీలను పెట్టుకుని పనులు కానిస్తున్నారు. తన ఇంటి ముందున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను వేరే ప్రాంతానికి మార్చడానికి ఓ వ్యక్తి పది రోజుల క్రితం ఓ కూలీలను నియమించుకున్నాడు. విద్యుత్ సరఫరా నిలిపివేయకుండా పనులు కొనసాగించాడు. దీంతో ఆ కూలి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. -
‘తవ్వి’పోదురుగాక!
సాక్షి, హైదరాబాద్: ప్రతియేటా జీహెచ్ఎంసీ రోడ్ల నిర్మాణాలు, మరమ్మతులకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. రహదారులు వేయడానికి ముందే అవసరమైన వరద కాల్వలు, క్యాచ్పిట్లు, డ్రైనేజీ మ్యాన్హోళ్లు, కేబుళ్ల కోసం డక్ట్ వంటివి వేయాల్సి ఉండగా ఆ పని చేయడం లేదు. దాంతో ఆయా అవసరాల కోసం రోడ్డు వేసిన కొన్ని నెలలకే తిరిగి తవ్వుతున్నారు. దాంతో ప్రజాధనం పెద్దయెత్తున దుబారా అవుతోంది. అందుకు మచ్చుతునక ఫొటోలో కనిపిస్తున్న దృశ్యం. దోమలగూడలో రోడ్డు వేసిన కొద్దినెలలకే ఇలా.. తవ్విపోస్తున్నారు. ముందస్తుగానే ఆయా విభాగాలు తాము చేయాల్సిన పనులు తెలియజేయడంతో ఇలాంటి పరిస్థితి రాకుండా చేస్తామని సిటీ కన్జర్వెన్స్ సమావేశాల్లో చెబుతున్నప్పటికీ, అమలులో లోపం కళ్లకు కడుతోంది.. ఇలా.. (క్లిక్: ట్యాంక్బండ్పై సరోజినీ నాయుడి జ్ఞాపకాలు) -
హైదరాబాద్ వరద కష్టాలకు శాశ్వత పరిష్కారం
-
ఏమరపాటు వద్దు.. ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది
దీపావళి పండుగ కోసం దేశమంతా అందంగా ముస్తాబవుతోంది. ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగ రోజు కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. వెలుగులు నింపే దీపావళి పండుగ రోజు టపాసులు కాల్చే సమయంలో అపశ్రుతి చోటుచేసుకునే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ‘డ్రైనేజీ సమీపంలో టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డ్రైనేజీ లైన్లు మీథేన్ వాయువును విడుదల చేస్తాయి, డ్రైనేజీ లైన్ల దగ్గర గల కవర్లపై లేదా డ్రైనేజీ లైన్ల సమీపంలో క్రాకర్లను వెలిగించినపుడు మంటలు వ్యాపించే ప్రమాదం ఉంది. కావున డ్రైనేజీ లైన్ల దగ్గర క్రాకర్లను వెలిగించకూడదని మన పిల్లలకు తెలియజేయాలి’ అంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. చదవండి: దీపావళి 2021: శానిటైజర్లతో జాగ్రత్త! హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ!! ఆ వీడియో ప్రకారం.. కొందరు చిన్నారులు ఓ డ్రైనేజీ కవర్పై సరదాగా టపాసుని వెలిగించారు. ఏమైందో తెలియదు ఒక్కసారిగా ఆ డ్రైనేజీ కవర్ రంధ్రాల్లోంచి భారీ ఎత్తున మంటలు వచ్చాయి. చిన్నారులు అప్రమత్తమై ఆ కవర్ నుంచి వెనక్కి పరుగెత్తారు. ఈప్రమాదంలో కొందరు చిన్నారుల తల వెంట్రుకలు కాలిపోయాయి. అదృష్టవశాత్తూ ఎవరికి పెద్దగా గాయాలు కాలేదు. అయితే, డ్రైనేజీ లైన్ల నుంచి విషపూరిత, పేలుడు స్వభావం గల వాయువులు వెలువడుతుంటాయి. ఆ క్రమంలోనే పిల్లలు క్రాకర్స్ వెలిగించడంతో మంటలు వ్యాపించినట్టు తెలుస్తోంది. ఏదేమైనా పండగ వేళ పిల్లలు క్రాకర్స్ కాల్చే విషయంలో తల్లిదండ్రులు మరిన్ని జాగ్తత్తలు తీసుకుంటే మంచిది. ఏమరపాటుగా ఉండొద్దు! చదవండి: Diwali Special 2021: మీ ప్రియమైనవారికి ఈ గిఫ్ట్స్ ఇచ్చారంటే.. దిల్ ఖుష్!! డ్రైనేజీ లైన్లు మీథేన్ వాయువును విడుదల చేస్తాయి, డ్రైనేజీ లైన్ల దగ్గర గల కవర్లపై లేదా డ్రైనేజీ లైన్ల సమీపంలో క్రాకర్లను వెలిగించినపుడు మంటలు వ్యాపించే ప్రమాదం ఉంది. కావున డ్రైనేజీ లైన్ల దగ్గర క్రాకర్లను వెలిగించకూడదని మన పిల్లలకు తెలియజేయాలి. pic.twitter.com/sgfwMuwLKJ — Sushil Rao (@sushilrTOI) November 3, 2021 -
తన్నుకున్న సర్పంచ్, ఉపసర్పంచ్
కౌడిపల్లి (నర్సాపూర్): ఓ మురికి కాలువ నిర్మాణం విషయంలో సర్పంచ్, ఉపసర్పంచ్లు బాహాబాహీకి దిగారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం ముట్రాజ్పల్లిలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామ పంచాయతీ పాలకవర్గ సమావేశంలో పంచాయతీ నిధులతో స్థానిక పాఠశాల నుంచి నల్లపోచమ్మ గుడి వరకు మురికి కాలువ నిర్మించేందుకు సర్పంచ్ సంజీవ్ ప్రతిపాదించారు. అయితే మరోచోట నిర్మిద్దామని ఉపసర్పంచ్ వెంకటేశం ఈ ప్రతిపాదనపై అభ్యంతరం చెప్పారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకోవడంతో పాటు తన్నుకున్నారు. దీంతో తోటి సభ్యులు జోక్యం చేసుకుని ఇద్దరినీ విడిపించారు. పోలీస్స్టేషన్ సమీపంలో ఉపసర్పంచ్పై దాడి పంచాయతీ కార్యాలయంలో బాహాబాహీ అనంతరం ఎంపీటీసీ ప్రవీణ్, సర్పంచ్ సంజీవ్ కుటుంబ సభ్యులు అతని అనుచరులు కౌడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. ఇంతలోనే ఉపసర్పంచ్ వెంకటేశం కూడా అక్కడికి వచ్చాడు. ఇది గమనించిన సర్పంచ్ అన్న రవి, తమ్ముడు ప్రవీణ్తోపాటు అతని వర్గీయులు ఒక్కసారిగా ఉపసర్పంచ్పై దాడి చేశారు. దీంతో ఎస్ఐ రాజశేఖర్, పోలీసు సిబ్బంది ఇరువర్గాలను చెదరగొట్టారు. చదవండి: ఆధిపత్య పోరు: సర్పంచ్ వర్సెస్ ఉపసర్పంచ్ -
కాలవలోని చెత్తను తొలగించిన సర్పంచ్..
సాక్షి, విజయనగరం : శ్లాబు కల్వర్టు కింద మురుగునీరు నిల్వ ఉండకుండా పూడికను తొలగిస్తున్నది గ్రామానికి చెందిన పారిశుద్ధ్య కార్మికుడో, వేతనదారుడో అనుకుంటే పొరపాటే. శ్లాబు కల్వర్టు కింద మురుగునీరు నిల్వ ఉండకుండా అడ్డుకున్న చెత్తను తొలగిస్తున్నది విజయరాంపురం (బూరిపేట) పంచాయతీకి సర్పంచిగా ఎన్నికైన బూరి మధుసూదనరావు. వీధి కాలువల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా గురువారం తానే స్వయంగా కల్వర్టులో దిగి పేరుకుపోయిన చెత్తాచెదారాలను తొలగించి గ్రామస్తులతో శభాష్ అనిపించుకున్నారీయన. గ్రామస్తులంతా సర్పంచిని స్ఫూర్తిగా తీసుకొని ఎవరి ఇంటి వద్ద ఉన్న కాలువలను నిత్యం శుభ్రం చేసుకుంటే దోమలు వ్యాప్తిని అరకట్టి, ప్రజలు వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు కదా. మరెందుకు ఆలస్యం నడుం బిగిద్దామంటోంది ఆ గ్రామంలోని యువత. – తెర్లాం -
అనుమానాస్పద మృతి: కోర్టు ఎదుట డ్రైనేజీలో..
సాక్షి, కరీంనగర్: కరీంనగర్లోని జిల్లా కోర్టు భవనాల సముదాయం ఎదుట డ్రైనేజీలో మంగళవారం ఉదయం గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. మహిళ మృతదేహాన్ని గుర్తించిన ఆటోడ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు. కరీంనగర్ సీపీ కమలాసన్రెడ్డి, ట్రైనీ ఐపీఎస్ రితిరాజ్, కరీంనగర్ టౌన్ ఏసీపీ అశోక్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని బయటకు తీయించి ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతదేహం లభ్యమైన చోట సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. ఉరి వేసి హత్య చేసినట్లుగా ప్రాథమిక అంచనాకు వచ్చిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. టూటౌన్, సీసీఎస్, టాస్క్ఫోర్స్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మహిళ వివరాలు తెలియకపోవడంతో ఫొటోలు, గుర్తులు సోషల్మీడియాలో పోస్టు చేసి ఆరా తీస్తున్నారు. ఘటనలో ఇద్దరి పాత్ర..? జిల్లా జడ్జి భవనం ప్రాంగణం ఎదుట గల సీసీ కెమెరాల్లో మంగళవారం వేకువజామున 5గంటల ప్రాంతంలో మృతురాలు రోడ్డుపై తిరిగినట్లు రికార్డయినట్లు తెలుస్తోంది. ఓ వ్యక్తి బైక్పై మరోవ్యక్తిని దించి వెళ్లడం, ఆ వ్యక్తి మహిళ వద్దకు వెళ్లడం సీసీ పుటేజీల్లో నమోదైంది. దీని ఆధారంగా మహిళ మృతిలో ఇద్దరి పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మరిన్ని ఆధారాల కోసం కోర్టు ఎదురుగా ఉన్న దుకాణాల్లో సీసీ పుటేజీలను పరిశీలించారు. -
ఏమాత్రం ఆజాగ్రత్తగా ఉన్నా..
-
మరో మహిళను మింగేసిన నాలా
సాక్షి, హైదరాబాద్ : భాగ్యనగరంలో నాలాలు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఏమాత్రం ఆజాగ్రత్తగా ఉన్నా.. తెరుచుకుని ఉన్న నాలా మనుషులను మిగేస్తోంది. తాజాగా హైదరాబాద్లో అధికారులు నిర్లక్ష్యం మరో మహిళను బలితీసుంది. ఉదయం నడకకు వెళ్లి ప్రమాదవశాత్తు నాలాలో పడిన సరోజ శవమై తేలారు. స్థానికులు అందించిన సమాచారం ప్రకారం.. సరూర్ నగర్ చెరువు కింద ఉన్న శారదా నగర్ కి చెందిన సరోజ తెల్లవారుజామున ఉదయం ఆరుగంటల సమయంలో ఇంటి నుంచి వాకింగ్కు వెళ్లారు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు నాలాలో పడి కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హుటాహుటిన ఎన్డీఆర్ఎఫ్ టీమ్ను, పోలీసులను, జీహెచ్ఎంసీ సిబ్బందిని అప్రమత్తం చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అప్పటికే ఆలస్యం కావడంతో ఆమె మృతి చెందారు. చైతన్యపురిలోని హనుమాన్నగర్ నాలలో మృతదేహం లభ్యంమైంది. మృతదేహాన్ని వెలికితీసిన సిబ్బంది పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా ఇటీవల హైదరాబాద్ నగరంలో భారీగా వర్షాలు కురవడంతో నాలాలు ప్రమాదకరంగా మారిన విషయం తెలిసిందే. ఇక తాజా ఘటన నేపథ్యంలో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ప్రమాదాలు వరుసగా సంభవిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
వరద: నిజాంల ‘ప్లాన్’ బెస్ట్!
సాక్షి, హైదరాబాద్: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరం అంతా అతలాకుతలమైంది. కానీ కుతుబ్షాహీ, ఆసఫ్జాహిల కాలంలో ఏర్పడ్డ బస్తీ లు కొన్ని ఇప్పటికీ చెక్కుచెదరకుండా.. వరద ముప్పు లేకుండా ఉన్నాయి. పాత బస్తీలోని పలు పాత మొహల్లాల నివాసితులు తమ ప్రాంతాలకు ఇప్పటికీ వరద ముప్పు లేదని, దానికి నాటి నిజాం పాలకులు, ఇంజినీర్ల కృషే కారణమని అంటున్నారు. చార్మినార్, మొఘల్పురా, ఖిల్వాట్, షా అలీ బండా, ఫతే దర్వాజా, పురాని హవేలి, నూర్ఖాన్ బజార్, హుస్సేనీ ఆలం, దూద్బౌలి, ఇంజిన్ బౌలి, కోట్ల అలీజా, పత్తర్గట్టి, పంజేషా పంచ మొహల్లా, చంచల్గూడ, ఖాజీపురా, కార్వాన్, జియాగుడ, అఫ్జల్గంజ్, ఫీల్ఖానా, జుమేరాత్ బజార్ తదితర ప్రాంతాలు నిన్నమొన్నటి భారీ వరదల్లోనూ ముంపునకు గురికాలేదు. నిజాం కాలం నాటి డ్రైనేజ్ జనాభా అనేక రెట్లు పెరిగినప్పటికీ వందేళ్ల క్రితం నిజాం కాలంలో నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థ ఇప్పటికీ సమర్థవంతంగా పనిచేస్తోంది. వర్షం పడిన గంట, అరగంటలోపే పాతబస్తీలోని అత్యధిక బస్తీల్లో నీరు డ్రైనేజీ ద్వారా వెళ్లిపోతోంది. 1908లో మూసీ వరద విపత్తు తర్వాత నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను సంప్రదించి హైదరాబాద్ నగరాన్ని వరద నుంచి రక్షించేందుకు..నీరు సాఫీగా వెళ్లేందుకు డ్రైనేజీ వ్యవస్థను సిద్ధం చేయాలని కోరారు. హైదరాబాద్ నగర పునర్నిర్మాణంలో సలహాలు ఇవ్వాలని, వరదల నుంచి నగర భవిష్యత్ రక్షణ కోసం ప్రతిపాదనలు రూపొందించాలని, నీటిపారుదలకు సంబంధించి సర్వం సిద్ధం చేయాలని కోరారు. 1911లో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ మరణించారు. అనంతరం అధికారంలోకి వచ్చిన నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నగరంలో మెరుగైన పౌర సౌకర్యాలను అందించడానికి ‘సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు’ను స్థాపించి మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూచనలు అమలు చేశారు. ఆ కాలంలోనే పాత బస్తీలోని పలు ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థతో పాటు, వర్షపు నీరు వెళ్లడానికి రోడ్లపై ప్రత్యేక భూగర్భ నీటిపారుదల కోసం లైన్స్ ఏర్పాటు చేశారు. విశ్వేశ్వరయ్య ప్లాన్లోని ముఖ్యాంశాలివీ.. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని డ్రైనేజీ నిర్మాణం మూసీ వరదల నివారణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అమలు పురానాపూల్ నుంచి చాదర్ఘాట్ æవరకు మూసీనది పరీవాహక ప్రాంతంలో రక్షణ గోడలు ఏర్పాటు డ్రైనేజీ మాస్టర్ప్లాన్ పనుల పర్యవేక్షణకు నిపుణుల కమిటీ ఏర్పాటు. సకాలంలో పనులు పూర్తి ఓపెన్ డ్రైనేజీని భూగర్భ డ్రైనేజీ వ్యవస్థగా మార్చడం ట్రంక్ సీవర్ మొయిన్స్, లేటరల్స్, సబ్మొయిన్స్, మురుగు కాల్వల డిజైన్లు సిద్ధం చేశారు లోతట్టు ప్రాంతాలు, ఎగువ ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉండాలో దిశానిర్దేశం చేశారు జాయింట్స్, మలుపుల వద్ద పైప్లైన్ వ్యవస్థ ఎలా ఉండాలో డ్రాయింగ్స్ ద్వారా ముందస్తుగా కసరత్తు చేసి నిర్మాణాలు చేపట్టారు నిజాం కాలంలో పకడ్బందీగా నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థ నేటికీ చెక్కు చెదరకుండా ఉంది. దీంతో పాటు భూగర్భ అంతర్గత పైప్లైన్ల డిజైన్ వ్యవస్థ నేటికీ ఆయా ప్రాంతాలను వరద ముప్పు నుంచి కాపాడుతోంది. -
ఒడిసి పట్టు.. మునగదు ఒట్టు!
సాక్షి, హైదరాబాద్: ఏటా సెప్టెంబర్లో 5 సెం.మీ. వర్షం కురిస్తే చాలు హైదరాబాద్ నిండా మునుగుతోంది. కర్ణుడి చావుకు కారణాలనేకం అన్నట్లు గ్రేటర్ మునకకు అన్నే కారణాలున్నాయి. వందకుపైగా ముంపు ప్రాంతాలున్నాయి. ఇటీవల కురిసిన జడివానకు పలు లోతట్టు ప్రాంతాల్లో నడుములోతు నీళ్లు రావడంతో దారులు ఏరులను తలపిం చాయి. వరద కారణంగా వాహనదారులు విలవిల్లాడారు. నగరంలో 5 వేల కిలోమీటర్ల మేర విస్తరించిన మురుగునీటి కాల్వలు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసినవి కావడంతో వాటి సామర్థ్యం సరిపోవడంలేదు. పలు చోట్ల మురుగునీటి పైపులైన్లలో నిర్మాణ వ్యర్థాలు పోగుపడటంతో భారీ వర్షం కురిసిన ప్రతిసారి మ్యాన్హోళ్లు ఉప్పొంగుతున్నాయి. అలాగే 1,500 కి.మీ. మేర విస్తరించిన నాలాలపై సుమారు 8 వేల ఆక్రమణలను తొలగించడంలో బల్దియా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. జడివాన కురిసిన ప్రతిసారి జనం బయటకు రావద్దని బల్దియా హెచ్చరికలు జారీ చేయడం పరిపాటిగా మారింది. ముంపు సమస్య ఇలా... నగరంలో ఏటా నమోదవుతున్న వర్షపాతంలో సింహభాగం ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతూనే ఉంది. రామంతాపూర్, భండారీ లే అవుట్, నందీకాలనీ.. లాంటి ప్రాంతాలు నీటమునగడం సర్వసాధారణంగా మారింది. ఈ వరద ముప్పును తప్పించేందుకు చక్కటి ప్రత్యామ్నాయం ఉందని ఐఐటీ బాంబే నిపుణుల తాజా అధ్యయనంలో తేలింది. నగరంలో ప్రతి ఒక్కరూ తమ ఇంటి పైకప్పుపై పడే వర్షపు నీటిని పదిలంగా ఒడిసిపట్టడమే సమస్యకు పరిష్కారమని స్పష్టం చేసింది. ఇలా చేస్తే ముంపు నుంచి విముక్తి.. గ్రేటర్ విస్తీర్ణం 625 చ.కి.మీటర్లు. నివాసాల సంఖ్య సుమారు 25 లక్షలు. ఏటా నమోదయ్యే వర్షపాతం 800–1000 మిల్లీమీటర్లు. ఏడాదికి సుమారు 50–90 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సమయంలో 25 లక్షల నివాసాలపై కురిసిన వర్షపు నీటిని వెయ్యి లీటర్ల సామర్థ్యంతో ఇంకుడు గుంతలు తవ్వి నిల్వ చేస్తే 43 శాతం ముంపు ముప్పు తప్పుతుందని ఐఐటీ బాంబే నిపుణుల బృందం స్పష్టం చేసింది. కనీసం ఇంటికి 500 లీటర్ల మేర వర్షపు నీటిని నిల్వ చేసినా.. 35 శాతం వరదముప్పు తప్పుదుందని ఈ నివేదిక వెల్లడించింది. ఇక 200 లీటర్ల నిల్వచేస్తే 22 శాతం.. ఇంటికి వంద లీటర్లయినా నిల్వచేస్తే 11 శాతం ముంపు సమస్య నుంచి విముక్తి లభిస్తుందని వెల్లడించింది. నేలలోకి ఇంకితే.. నగరంలోని ఫుట్పాత్లు, బహిరంగ ప్రదేశాలు, పార్కులు, పార్కింగ్ ప్రదేశాలు, లోతట్టు ప్రాంతాల్లో... కాంక్రీట్, టైల్స్, బండరాళ్లతో కప్పివేయకుండా మధ్యలో ఖాళీ స్థలాలు వదిలిపెడితే వర్షపు నీరు నేలలోకి ఇంకుతుందని.. వరద తగ్గే అవకాశం ఉంటుందని పేర్కొంది. సుమారు 185 చెరువుల్లోకి వరద నీటిని చేర్చే ఇన్ ఫ్లో చానల్స్, నాలాలను ప్రక్షాళన చేస్తే ముంపు నుంచి శాశ్వత విముక్తి లభిస్తుందని, వాటిల్లో నీటి మట్టం కూడా పెరుగుతుందని ఈ నివేదిక తెలిపింది. కాగితాలపైనే కిర్లోస్కర్ నివేదిక.. నగరానికి ముంపు సమస్య నుంచి విముక్తి కల్పించేందుకు 2003లో నివేదిక అందించిన కిర్లోస్కర్ కమిటీ వరదనీరు సాఫీగా వెళ్లేందుకు నాలాలను అభివృద్ధి చేయాలని సూచించింది. అలాగే 2007 గ్రేటర్ మొత్తానికీ సమస్య తీరేందుకు ‘సమగ్ర మాస్టర్ ప్లాన్ .. సూక్ష్మస్థాయి వరద నీటి పారుదల నెట్వర్క్ ప్లాన్ .. మేజర్, మైనర్ వరద కాలువల ఆధునీకరణకు సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు’(డీపీఆర్) తయారు చేసే బాధ్యతను ఓయంట్స్ సొల్యూషన్ ్స ప్రైౖ వేట్ లిమిటెడ్కు అప్పగించారు. దాని ప్రాథమిక అంచనా మేరకు గ్రేటర్లో వరద నీటి సమస్య పరిష్కారానికి సుమారు రూ.10,000 కోట్లు అవసరం. బల్కాపూర్ నాలా, కూకట్పల్లి, ముర్కినాలా, పికెట్, ఎర్రమంజిల్, బంజారాహిల్స్, ఎల్లారెడ్డిగూడ, పంజాగుట్ట, యూసుఫ్గూడ, నాగమయ్యకుంట, కళాసిగూడ, ఇందిరాపార్కు నాలాలను ప్రక్షాళన చేయాలి. ఆక్రమణలు నిరోధించాలి. కానీ ఈ పనులన్నీ నిధుల లేమితో కునారిల్లుతున్నాయి. తక్షణం చేయాల్సిన పనులివీ.. ► గ్రేటర్లో 1,500 కి.మీ. మేర విస్తరించిన ప్రధాన నాలాలపై ఉన్న సుమారు 8 వేల ఆక్రమణలను తొలగించాలి. ► నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తి కావాలంటే.. టౌన్ ప్లానింగ్ విభాగంతో పాటు మరో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. ► నాలాల ఆధునీకరణ ఆవశ్యకతను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి. దీనికి రాజకీయ పార్టీల, ఎన్జీఓల సహకారం తీసుకోవాలి. ► వరద నీటి కాలువల్లో మురుగునీరు పారకుండా చూడాలి. మురుగునీటి పారుదలకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలి. ► స్టార్మ్ వాటర్ డ్రైనేజీ మాస్టర్ప్లాన్ ను పరిగణనలోకి తీసుకొని టౌన్ ప్లానింగ్ విభాగం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను అనుమతించరాదు. ఇతర మెట్రో నగరాల్లో ఇలా.. చెన్నై, ముంబై మహానగరాల్లో 50 సెం.మీ.పైగా భారీ వర్షాలు కురిసినా ముంపు తప్పించేందుకు అక్కడి నాలా వ్యవస్థలో భారీ సామర్థ్యంగల పైపులైన్ల ఏర్పాటుతో వరదనీటికి చక్కటి పరిష్కారం చూపారు. ఆ నీటిని సముద్రంలోకి మళ్లించడంతో ఆయా నగరాలకు ముంపు ముప్పు తప్పింది. హైదరాబాద్కు సముద్రం లేకపోయినా వర్షపు నీటిని చెరువులు, కుంటలకు మళ్లించడంతోపాటు,లోతట్టు ప్రాంతాల్లో ఇంకుడు కొలనుల ఏర్పాటుచేసి వాటిలోకి మళ్లిస్తే ముంపు తప్పుతుందని నిపుణులు సూచిస్తున్నారు. -
ఉసురు తీసిన నాలా
నేరేడ్మెట్ (హైదరాబాద్): అమ్మా... కాసేపు ఆడుకొని వస్తానని తల్లికి చెప్పిందా చిన్నారి. సరదాగా సైకిల్ తొక్కుదామని బయటికి వెళ్లింది. ఇక ఎప్పటికీ కనిపించనంత దూరానికి వెళ్లిపోయింది. నోరు తెరిచిన ఓపెన్ నాలా ఆ పన్నెండేళ్ల బాలికను మింగేసింది. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యా నికి అభంశుభం తెలియని చిన్నారి బలైపోయింది. సైకిల్ తొక్కడానికి వెళ్లి అదృశ్యమైన బాలిక చివరకు చెరువులో శవమై తేలింది. కనిపించ కుండా పోయిన దాదాపు పన్నెండు గంటల తరువాత నాలా నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని బండచెరువులో బాలిక విగతజీవిగా లభించింది. ఆడుతూ పాడుతూ ఇంట్లో తిరిగిన తమ గారాలపట్టి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషాద సంఘ టన హైదరాబాద్లోని నేరేడ్మెట్ ఠాణా పరిధిలో... ఈస్ట్ దీనదయాళ్నగర్లో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఈస్ట్ దీనదయాళ్నగర్ రోడ్ నం.2లోని అద్దె ఇంట్లో ప్రైవేట్ ఉద్యోగి అభిజిత్ కపూరియా, సుకన్య దంపతులు నివసిస్తున్నారు. రెండు నెలల కిందటే వీరు కాకతీయనగర్ నుంచి దీనదయాళ్నగర్కు మారారు. వీరికి కూతురు సుమేధ కపూరియా (12), ఒక కుమారుడు ఉన్నారు. కూతురు సుమేధ స్థానిక పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. గురు వారం సాయంత్రం సుమారు 6.15 గంటల ప్రాంతంలో సుమేధ సైకిల్ తొక్కడానికి ఇంట్లోంచి బయటకు వెళ్లింది. అంతర్గత రోడ్లపై 6.26 వరకు సైకిల్ తొక్కుతున్నట్టు కాలనీలోని సీసీ టీవీలో రికార్డయింది. ఆ తరువాత బాలిక అదృశ్యమైంది. రాత్రి 7 గంటలు కావస్తున్నా కూతురు ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు కాలనీలో వెతికారు. ఎక్కడా కనిపించలేదు. తెలిసిన వారిని అడిగినా జాడ లభించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. రెండు రోజులుగా కురిసిన భారీ వర్షానికి కాలనీలోని నాలాలు పొంగిపోర్లుతున్నాయి. ప్రమాదవశాత్తు కూతురు నాలాలో పడిపోయిందా? అనే అనుమానం కలిగింది. బాలిక అదృశ్యమైన విషయం స్థానికులకు తెలియడంతో వారూ తల్లిదండ్రులతో కలిసి వెతకడం ప్రారంభించారు. మూడు గంటల పాటు గాలించినా జాడ తెలియలేదు. గురువారం సాయంత్రం కాలనీలో సైకిల్పై వెళుతున్న బాలిక సుమేధ (సీసీ టీవీ దృశ్యం) పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రాత్రి 10 గంటలకు కాలనీకి చేరుకొని అర్థరాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ దొరకలేదు. శుక్రవారం ఉదయం 8 గంటలకు రెస్క్యూ బృందం వచ్చి గాలింపు మొదలుపెట్టింది. కాలనీలోని మురుగునీరు వెళ్లే బండచెరువు నాలాలో రెస్క్యూ బృందం వెతుకుతుండగా సుమేధ తొక్కిన సైకిల్ లభించింది. అదే నాలా వెంట గాలిస్తూ సుమారు రెండు కి.మీ.దూరంలో ఉన్న బండచెరువు వద్దకు వెళ్లిన రెస్క్యూ బృందానికి బాలిక సుమేధ విగతజీవిగా లభించింది. మృతదేహాన్ని బయటకు తీసిన అనంతరం పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురికి తరలించారు. కాసేపు ఆడుకొని వస్తానని చెప్పి వెళ్లిన కూతురు...చెరువులో శవంగా కనిపించడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించడం చూసి కాలనీ వాసులు కంటతడిపెట్టారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు నేరేడ్మెట్ సీఐ నర్సింహ్మాస్వామి చెప్పారు. ఎవరు తెచ్చిస్తారు? తన కూతురు మరణానికి కారణం ఎవరని సుమేధ తండ్రి అభిజిత్ కపూరియా ప్రశ్నించారు. నాలాను నిర్లక్ష్యంగా వదిలేయడం కారణంగానే తన కూతురు ప్రాణాలు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురిని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నామని, సుమేధ ప్రాణాలను ఎవరు తీసుకొస్తారంటూ కన్నీరు మున్నీరయ్యారు. జీహెచ్ఎంసీ తీరుపై ఆగ్రహం ఓపెన్నాలా వల్ల వద్ద రక్షణ చర్యలు చేపట్టకపోవడం మూలంగానే బాలిక సుమేధ ప్రమాదానికి గురై మరణించిందని స్థానికులు తీవ్రంగా విమర్శించారు. బాలిక అదృశ్యమైన విషయాన్ని జీహెచ్ఎంసీ అధికారులకు తెలియజేసినా స్పందించలేదని, సకాలంలో గాలింపు చర్యలు చేపట్టలేదని స్థానికులు ఆరోపించారు. నిర్లక్ష్యంగా వ్యవహారించిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడంతోపాటు బాలిక కుటుంబానికి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఈస్ట్ దీనదయాళ్నగర్ను సందర్శించి నాలా పరిస్థితి, ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. బాలిక మృతిపై విచారం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, ఆమె కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. కలివిడిగా ఉండేది చిన్నారి సుమేధ మా దగ్గర భరత నాట్యం నేర్చుకుంటోంది. రోజూ మధ్యాహ్నాం వేళ ఒక గంట భరత నాట్యం నేర్చుకునేది. మా కాలనీకి వచ్చి రెండు నెలలే అవుతున్నా...గడిచిన నెలన్నర రోజులుగా భరతం నాట్యం నేర్చుకోవడానికి వచ్చేది. నాట్యంలో మెళకువలను ఇట్టే గ్రహించేది. స్నేహితులతోనూ కలివిడిగా ఉండేది. షీ ఈజ్ వెరీ షార్ప్. నాట్యం నేర్చుకోవడానికి వచ్చినప్పుడు మా ఇంట్లోని కుక్కపిల్లతో చాలాసేపు ఆడుకునేది. పెట్స్ అంటే ఇష్టమని సుమేధ చెబుతుండేది. మాతో కలిసిపోయి ఆడుతూపాడుతూ ఉండే చిన్నారి నాలాలో పడి మృతి చెందటం బాధ కలిగించింది. –అర్షిత, నాట్య శిక్షకురాలు ప్రమాదమేనా? బాలిక సుమేధ అదృశ్యం, మృతి సంఘటన ప్రమాదమా? లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు నాలాలో పడి.. అందులో కొట్టుకుపోయి చనిపోయిందా? ఎవరైనా పడేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సైకిల్ తొక్కుతుండగా బాలికతో ఎవరైనా మాట్లాడారా? నాలాలో పడితే రెండు కి.మీ. దూరంలోని చెరువు వరకు కొట్టుకుపోయినా.. బాలిక ముక్కు నుంచి రక్తం రావ డం మినహా ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవ డంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టుమార్టం నివేదిక తర్వాతే వాస్తవాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. ‘సైకిల్పై తిరుగుతూ కనిపించిన సుమేధ నాలా వద్ద నుంచి వెళుతుండగా చూశాను. తరువాత ఆమె కోసం వెతుకుతున్నారని తెలిసి నాలా ప్రాంతంలో గాలించాం’ అని కాలనీవాసి జ్ఞానకుమార్ తెలిపారు. -
పాల ప్యాకెట్ కోసం వచ్చి.. అనంతలోకాలకు
తూర్పుగోదావరి,మండపేట: పాల ప్యాకెట్ కోసం వచ్చిన చిన్నారిని మురుగునీటి డ్రైన్ రూపంలో మృత్యువు కబళించింది. పాల ప్యాకెట్ కోసం వెళ్లిన చిన్నారి వచ్చేస్తుందని ఎదురు చూస్తున్న కన్నవారికి తీరని కడుపు కోత మిగిల్చింది. బాలికను కాపాడేందుకు పెద్ద ఎత్తున స్థానికులు డ్రైన్లో గాలించినా ఫలితం లేకపోయింది. పట్టణానికి చెందిన పలివెల దుర్గాప్రసాద్, పల్లవి దంపతులకు కుమార్తె చంద్రకళ(7), కుమారుడు ఉన్నారు. స్థానిక మూడో వార్డులోని ఇంటిలో అద్దెకు ఉంటున్న దుర్గాప్రసాద్ వడ్రంగి పని చేస్తుంటాడు. స్థానిక రామాహిందూ మున్సిపల్ స్కూల్లో చంద్రకళ రెండో తరగతి చదువుతోంది. ఆదివారం సాయంత్ర సమయంలో పాల ప్యాకెట్ కోసం పోలీస్స్టేషన్ సమీపంలోని దుకాణం వద్దకు వచ్చింది. అప్పటికే కుంభవృష్టిగా కురిసిన వర్షంతో దుకాణం సమీపంలోని మంగళిబోదె డ్రైన్ వేగంగా ప్రవహిస్తోంది. రోడ్డుపై నుంచి ముంపునీరు ప్రవహిస్తుండడంతో నీటిలో కాలి చెప్పు జారిపోయింది. దానిని తీసుకునే ప్రయత్నంలో చంద్రకళ నీటి ప్రవాహ వేగానికి డ్రైన్లో పడి కొట్టుకుపోయింది. ప్రమాదాన్ని గమనించి ఇద్దరు చిన్నారులు బాలిక ఇంటికి వెళ్లి ఆమె తల్లికి చెప్పడంతో ఆమె పరుగెత్తుకుంటూ సంఘటన స్థలానికి చేరుకుంది. తన బిడ్డను కాపాడమంటూ ఆమె డ్రైన్ వెంబడి పరుగులు పెట్టడం చూసి స్థానికులు పెద్ద ఎత్తున డ్రైన్లోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. కిలోమీటరు దూరంలో చిన్నారి దొరకడంతో హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురాగా అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మున్సిపల్ కమిషనర్ టి.రామ్కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పట్టణ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమార్తె విగతజీవిగా పడి ఉండడం చూసి తల్లిదండ్రులు ప్రసాద్, పల్లవి శోకసంద్రంలో మునిగిపోయారు. తమ బిడ్డను కాపాడమంటూ ఆస్పత్రి వద్ద వారు మొరపెట్టుకోవడం చూపరులను కలచివేసింది. -
ఎప్పుడూ..‘నాలా’గేనా ?!
సాక్షి, సిటీబ్యూరో: మహానగరంలో నాలాల సమస్య ఏళ్లు గడుస్తున్నా తీరడం లేదు. ప్రతి వర్షాకాలంలో వరద ముంపు సంభవించినప్పుడు సమస్య గురించి చర్చిస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం లభించడం లేదు. విశ్వనగరంగా ఎదుగుతోన్న హైదరాబాద్ వర్షం వస్తే అనేక ప్రాంతాల్లో ముంపు సమస్యకు గురవుతోంది. నాలాల గుండా వెళ్లాల్సిన వరద నీరు.. రోడ్లపైకి చేరుతోంది. నాలాల్లో వేస్తున్న వివిధ రకాల వ్యర్థాలు ఇందుకు ఒక కారణం కాగా.. భారీ వర్షాలొస్తే తట్టుకునే సామర్ధ్యం నాలాలకు లేదు. గంటకు 2 సెం.మీ.ల కంటే ఎక్కువ వర్షం కురిసినా మునిగే ప్రాంతాలెన్నో ఉన్నాయి. ప్రధాన ర హదారుల వెంబడి వరదకాలువల్లో సాఫీగా నీరు వెళ్లేలా చేయడం.. పెద్ద వరదకాలువల్లో(నాలాల్లో) పూడిక లేకుండా చేయడంతోపాటు నాలాలను విస్తరించి ఆధునీకరించనిదే సమస్యకు పరిష్కారం ఉండదని కిర్లోస్కర్, ఓయెంట్స్ సొల్యూషన్స్ వంటి కన్సల్టెన్సీ సంస్థలు గతంలోనే సిఫారసు చేశాయి. జీహెచ్ఎంసీలో ఈ సమస్యల పరిష్కారానికి దాదాపు 390 కిలోమీటర్ల మేర పరిధిలోని మేజర్ నాలాల్ని విస్తరించాలంటే 12వేలకు పైగా ఆస్తులను తొలగించాల్సి ఉంటుందని టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక గుర్తించారు. ఇది సాధ్యమయ్యే పనికాదని భావించి తొలిదశలో అత్యంత సమస్యాత్మకంగా ఉన్న బాటిల్నెక్స్లోనైనా నాలాలను విస్తరిస్తే అతి తీవ్ర సమస్యలకు కొంతైనా పరిష్కారం లభిస్తుందని భావించారు. అలా దాదాపు 16 కి.మీ.ల మేరనైనా మేజర్ నాలాలను విస్తరించి, ఆధునీకరించాలని భావించారు. అందుకు దాదాపు వెయ్యి ఆస్తులు తొలగించాల్సి ఉంటుందని గుర్తించి దాదాపు 700 ఆస్తులకు సంబంధించి çపూర్తి సమాచారం సిద్ధం చేశారు. ఇప్పటి వరకు వాటిల్లో 25 శాతం ఆస్తులను కూడా తొలగించలేకపోయారు. అందుకు కారణాలనేకం. స్థానికుల వ్యతిరేకత, రాజకీయ కారణాలు, తదితరమైనవెన్నో వీటిల్లో ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా .. దాదాపు రెండు దశాబ్దాల నాడు 2000 సంవత్సరం ఆగస్టులో కురిసిన భారీ వర్షానికి నగరం కకావికలమైంది. ఇందిరాపార్కు రోడ్డు, తదితర ప్రాంతాల్లో కార్లు సైతం రోడ్లపై వరదల్లో కొట్టుకుపోయాయి. వరదలతో ముంపు సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఏంచేయాలని ఆనాటి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రభుత్వాలు మారాయి. ఎంసీహెచ్.. జీహెచ్ఎంసీగా అవతరించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది. కానీ ఈ సమస్య మాత్రం నేటికీ పరిష్కారానికి నోచుకోలేదు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ సమస్య పరిష్కారానికి 28 వేల ఆక్రమణలు తొలగించాల్సి ఉంటుందని అంచనా వేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. రెవెన్యూ, టౌన్ప్లానింగ్, ఇంజినీరింగ్ అధికారులు సంయుక్తంగా సర్వే చేశారు. 12 వేలకు పైగా ఆస్తులు తొలగించాల్సి ఉంటుందని అంచనా వేశారు. ఎన్ని చేసినా పరిస్థితి మాత్రం మారలేదు. -
ముంపు పసిగట్టి..
సాక్షి, సిటీబ్యూరో: లాక్డౌన్ సమయాన్ని వినియోగించుకొని ఇప్పటి వరకు ఇంజినీరింగ్ పనుల్లో భాగంగా ఫ్లై ఓవర్లు, రోడ్ల మరమ్మతులు, రీకార్పెటింగ్ వంటి పనులు చేపట్టిన జీహెచ్ఎంసీ తాజాగా వరదకాలువల పనులూ చేపట్టింది. త్వరలోనే వర్షాకాలం రానుండటంతో నీటిముంపు సమస్య పరిష్కారానికి ఈ చర్యలకు సిద్ధమైంది. నగరంలో వానొస్తే నీరు నిలిచి రోడ్లు చెరువులుగా మారడం.. తీవ్ర ట్రాఫిక్ సమస్యలు నగర ప్రజలకు అనుభవమే. ఈ సమస్యల పరిష్కారానికి తీవ్ర సమస్యలున్న ప్రాంతాల్లో వరదనీరు సాఫీగా సాగేందుకు వరదకాలువల నిర్మాణానికి సిద్ధమైంది. సీఆర్ఎంపీలో భాగంగా రోడ్డు నిర్వహణ పనులు చేస్తున్న పేరెన్నికగన్న కాంట్రాక్టు ఏజెన్సీలకే ఈపనులు అప్పగించింది. గ్రేటర్ పరిధిలోని ప్రధాన రహదారుల మార్గాల్లో దాదాపు 709 కి.మీ.ల మేర రహదారుల నిర్వహణను కాంట్రాక్టు ఏజెన్సీలకు ఇవ్వడం.. అవి పనులు చేస్తుండటం తెలిసిందే. పనిలో పనిగా రోడ్ల పనులతోపాటు నీటి నిల్వసమస్యలు లేకుండా రోడ్ల వెంబడి వరదకాలువ పనులను కూడా వాటికి అప్పగించింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పనులు వడివడిగా జరుగుతున్నాయి. నగరంలో ముంపు సమస్యలకు ప్రధాన కారణం నాలాల్లోంచి నీరు పారే దారి లేకపోవడం. వరదనీరు వెళ్లే మార్గం లేకే రోడ్లపై నీరు నిలుస్తోంది. పెద్ద నాలాల విస్తరణ పనులను ప్రాజెక్టŠస్ విభాగం చేస్తోంది. నాలాల ఆధునీకరణ, విస్తరణలకు భూసేకరణ సమస్యగా మారడంతో ఆ పనుల్లో జాప్యం జరుగుతోంది. నాలాల విస్తరణలు అవసరం లేని చోట, రోడ్లపైకి నీరు చేరకుండా వరదకాలువల గుండా నీరు వెళ్లేందుకు భూసేకరణలు అవసరం లేని చోట రోడ్ల నిర్వహణ పనులతోపాటు ఈ వరదకాలువల పనులు కూడా చేస్తున్నారు. ప్రస్తుతానికి కవాడిగూడ రోడ్, కర్బలామైదాన్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో ఈ పనులు చేపట్టినట్లు ఇంజినీర్లు పేర్కొన్నారు. తొలిదశలో దాదాపు 20 ప్రాంతాల్లో ఈ వరదకాలువల పనులకు సిద్ధమయ్యారు. ఆమేరకు ప్రభుత్వం నుంచి అనుమతి పొంది రోడ్ల పనులు చేస్తున్న కాంట్రాక్టు ఏజెన్సీలకే ఆపనులు అప్పగిస్తున్నారు. అవసరమైన ప్రాంతాల్లో వరదకాలువలు, భూగర్భ డ్రైనేజీలు, క్యాచ్పిట్స్ , మ్యాన్హోల్స్ పనులు చేయవవచ్చునని కాంట్రాక్టు ఒప్పందంలోనే ఉంది. అయితే రోడ్డు పనుల ఐదేళ్ల నిర్వహణలో భాగంగా కాకుండా ఈ అదనపు పనులకు అదనపు నిధులు చెల్లించనున్నారు. సీఆర్ఎంపీలో భాగంగా.. సీఆర్ఎంపీలో భాగంగా దాదాపు 709 కి.మీ.ల రోడ్ల నిర్వహణను ప్రైవేటు కాంట్రాక్టు ఏజెన్సీలకు అప్పగించారు. ఐదేళ్లపాటు నిర్వహణ కూడా వాటిదే. రోడ్లతోపాటు పచ్చదనం, పారిశుద్ధ్యం వంటి బాధ్యతలు కూడా వాటికే ఉన్నాయి. ఒప్పందంలో భాగంగా మొదటి సంవత్సరం 50 శాతం మేర రోడ్ల రీకార్పెటింగ్ పనులు చేయాల్సి ఉంది. దాదాపు ఆర్నెళ్లలో లాక్డౌన్ ముందు వరకు పనులు మందకొడిగా జరిగినప్పటికీ, లాక్డౌన్ నుంచి పనుల వేగం పెరిగింది. -
మురుగు ఇక పరుగు
కడప ఎడ్యుకేషన్: చిన్నపాటి వర్షం కురిసినా గ్రామీణ ప్రాంతాల్లో మురుగు సమస్య ప్రజలను వేధిస్తోంది. మురుగుపై దోమలు చేరడంతోపాటు దుర్గంధం వెదజల్లడంతో పలువురు రోగాల బారిన పడుతున్నారు. దీనిని గమనించిన ప్రభుత్వం గ్రామాల్లో మురుగు పారుదల వ్యవస్థను సవ్యం చేసేందుకు శ్రీకారం చుట్టింది. కాల్వలను ఏర్పాటు చేసి మురుగు ముందుకు సాగేలా పనులను చేపట్టారు. జిల్లావ్యాప్తంగా 46 మండలాల్లో 1555 డ్రైనేజీ కాల్వల పనులకుగాను 235.82 కోట్లు నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం ఆన్లైన్లో 1518 పనులను గుర్తించి 229.67 కోట్లు్ల మంజూరు చేసింది. ప్రొద్దుటూరు, సీకేదిన్నె, ఖాజీపేట, రాయచోటితోపాటు పలు మండలాల్లో పనులను మొదలు పెట్టారు. గ్రామీణ ప్రాంతాలో మురుగు సమస్య పరిష్కారమవుతోందని జనం సంతోషిస్తున్నారు. జిల్లాలో పరిస్థితి ఇలా... జిల్లాలో 790 గ్రామ పంచాయతీలలో 20 లక్షల జనాభా నివసిస్తున్నారు. పెద్దపెద్ద గ్రామాల్లో, అధిక జనాభా ఉన్న గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ ఉన్నప్పటికీ మిగతా గ్రామాల్లో మురుగు ముందుకు పోయే దారిలేదు. చిన్నపాటి వర్షం వచ్చినా వర్షపు నీరంతా నిలబడిపోతోంది. రోడ్లపై మురుగుతో కలిసి నిల్వగా మారుతోంది. దుర్గంధం వెదజల్లడంతోపాటు దోమలు పెరిగి రోగాలను వృద్ధి చేస్తున్నాయి. లక్షల రూపాయలు వెచ్చించి చాలా గ్రామాల్లో సిమెంట్ రోడ్లు నిర్మించారు. కానీ మురుగు కాల్వలు మాత్రం నిర్మించలేదు. పలుమార్లు ప్రజలు ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం తాజాగా ఈ సమస్యకు శాశ్వత చెక్ పెట్టేందుకు శ్రీకారం చుట్టింది. మురుగు కాల్వలపై కప్పులు జిల్లాలోని కొన్ని గ్రామాల్లో మురుగుకాల్వలు నిర్మించినా నిర్వహణను పట్టించుకోవడం లేదు. ఫలితంగా కాల్వల్లో మట్టితోపాటు చెత్తాచెదారం పేరుకుపోతోంది. కాల్వలు మూసుకుపోతున్నాయి.మురుగు ముందుకు వెళ్లే దారి లేకుండా పోతోంది. మురుగంతా కాల్వలో నిల్వ ఉంటూ దుర్గంధం వెదజల్లుతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతోపాటు ప్రస్తుతం నిర్మించనున్న మురుగుకాల్వల పైన కప్పులను కచ్చితంగా వేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉపాధిహామీ, స్వచ్చభారత్మిషన్ నిధులతో... ఉపాధిహామీలో 90 శాతం నిధులతోపాటు స్వచ్చభారత్ మిషన్ 10 శాతం నిధులతో మురుగుకాల్వల పనులను మొదలు పెట్టారు. పది నియోజక వర్గాలలోని 1555 పనులలో ప్రస్తుతం 1518 పనులను అన్ౖలైన్లో అనుమతులు లబించాయి. వీటికి 229.63 కోట్లు ఖర్చవుతుంది. ఈ నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. పలు చోట్ల పనులను ప్రారంభించారు. న్ని చోట్ల మట్టి పనులు జరుగుతుండగా మరికొన్ని చోట్ల సిమెంట్లో డ్రైనేజీ పనులను ప్రారంభించారు. త్వరగా పూర్తి చేస్తాం.. 46 మండలాలకు డ్రైనేజీ పనులు మంజూరైయ్యాయి. ఇప్పటివరకూ 40 కిపైగా మండలాల్లో పనులు ప్రారంభమైయ్యాయి. మిగతా మండలాల్లో కూడా నాలుగైదు రోజుల్లో పనులను ప్రారంభిస్తాం. మొదలైన పనులను కూడా పర్యవేక్షిస్తున్నాం. వీలైనంత త్వ రగా పూర్తి చేస్తాం. – మల్లికార్జునప్ప,ఆర్డబ్లూఎస్, ఎస్ఈ(ఎఫ్ఏసీ) -
తమ్ముడిని రక్షించి ప్రాణం విడిచిన అన్న
సాక్షి, చెన్నై : విషవాయువు పీల్చి ట్యాంక్లో స్పృహ తప్పి పడి ఉన్న తమ్ముడ్ని రక్షించి ఓ అన్న మృత్యుఒడిలోకి చేరాడు. మంగళవారం రాయపేటలోని ఓ ప్రైవేటు మాల్లో మురికి నీటి ట్యాంక్ శుభ్రం చేస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. తమ్ముడి కోసం అన్న.. చెన్నై ఐస్ హౌస్ హనుమంతపురానికి చెందిన మూర్తికి అరుణ్కుమార్(25), రంజిత్కుమార్(23) కుమారులు. అన్నదమ్ముళ్లు ఇద్దరూ తమకు ఏ పని దొరికినా సరే, దాన్ని పూర్తి చేసి కుటుంబానికి అండగా ఉంటూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాయపేటలోని ఓ ప్రైవేటు మాల్స్లో అండర్ గ్రౌండ్లో ఉన్న మురికి నీటి తొట్టెను శుభ్రం చేసే పని లభించింది. తమ ప్రాంతానికి చెందిన దండపాణి అనే వ్యక్తి ద్వారా లభించిన ఈ పనిని చేయడానికి రంజిత్, అరుణ్కుమార్తో పాటుగా మరో ముగ్గురు ఉదయం వెళ్లారు. తొలుత రంజిత్ కుమార్తో పాటుగా, మరో యువకుడు మురికి నీటి ట్యాంక్లోకి వెళ్లి శుభ్రం చేయడం మొదలెట్టారు. ఈ సమయంలో విషవాయువు వెలువడడంతో ఓ యువకుడు భయంతో బయటకు వచ్చేశాడు. అయితే, రంజిత్కుమార్ బయటకు రాలేని పరిస్థితి. దీంతో ఆందోళన చెందిన అన్న అరుణ్కుమార్ తమ్ముడ్ని రక్షించేందుకు ఆ ట్యాంక్లోకి వెళ్లాడు. స్పృహ తప్పి పడి ఉన్న తమ్ముడ్ని అతి కష్టం మీద రక్షించి బయటకు పంపించాడు. అయితే, ఆ విషవాయువు తనను కూడా తాకడంతో క్షణాల్లో ఆ మురికి నీటి ట్యాంక్లో కుప్పకూలాడు. మిగిలిన వారు పెట్టిన కేకతో మాల్ భద్రతా సిబ్బంది పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అన్నా సాలై పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అరుణ్కుమార్ను బయటకు తీసుకొచ్చి, ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్టు వైద్యులు తేల్చారు. రంజిత్కుమార్ ప్రథమ చికిత్స అనంతరం కోలుకున్నాడు. నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణం.. తనను రక్షించి అన్న అరుణ్కుమార్ మరణించడంతో రంజిత్ కన్నీరు మున్నీరు అయ్యాడు. తన సోదరుడి మృతికి మాల్ నిర్వాహకులే కారణమని మండిపడ్డాడు. ట్యాంకును సేఫ్టీ బృందం పరిశీలించినట్టు, అందులోకి వెళ్లవద్దని సూచించినా, ఆ విషయం తమకు చెప్పలేదని ఆరోపించాడు. విషయం తెలియకుండా లోపలికి వెళ్లిన కాసేపటికి ఏం జరిగిందో తెలియని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తన సోదరుడిని కోల్పాయానని విలపించాడు. అరుణ్ కుమార్ మరణ సమాచారంతో మూర్తి కుటుంబం శోక సంద్రంలో మునిగింది. ఐస్ హౌస్ పరిసర వాసులు పెద్ద సంఖ్యలో రాయపేట ఆస్పత్రి వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కేసు నమోదు చేసిన అన్నా సాలై పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చుస్తున్నారు. -
గ్రామాల్లో మురుగుకి చెక్
సాక్షి, మచిలీపట్నం: గ్రామీణ ప్రాంతాల్లో మురుగునీటి వ్యవస్థను చక్కదిద్దేందుకు నూతన ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలోని పంచాయతీల్లో ఓపెన్ డ్రెయిన్స్ నిర్మించాలని సంకల్పించింది. రాష్ట్రంలో ఐదువేల జనాభాకు పైబడిన పంచాయతీల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాలని గత ప్రభుత్వం హంగామా చేసింది. నిరంతరం మురుగు నీరు పారే పరిస్థితి లేనప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించడం వలన ప్రయోజనం ఉండదని అప్పట్లో ఉన్నతాధికారులు మొత్తుకున్నా గత ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు. పెద్ద ఎత్తున అంచనాలు వేసి పనులు చేపట్టకుండానే నిధులు స్వాహా చేశారు. ఈ నేపథ్యంలో పంచాయతీల్లో ఓపెన్ డ్రైనేజీ వ్యవస్థ మేలని నూతన ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని గ్రామాల్లోనూ అమలు... అన్ని గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి రూ.1,897.50 కోట్లతో లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ (ఎల్డబ్ల్యూఎం) ప్రాజెక్టుకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన పేరిట చేపడుతున్న అతిపెద్ద ప్రాజెక్టు ఇదే. ఈ ప్రాజెక్టులో 30 శాతం స్వచ్ఛాంధ్ర మిషన్, 70 శాతం ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ నిధుల నుంచి కేటాయిస్తారు. ఈ మేరకు రూ.577.50 కోట్లు స్వచ్ఛాంధ్ర మిషన్ నుంచి, మిగిలిన రూ. 1,320 కోట్లు ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ నుంచి ఖర్చుచేయాలని ప్రతిపాదించారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి రూ.11.50 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో గ్రామాల్లో అంతర్గత రహదారుల్లో ఒక వైపు, మెయిన్ రోడ్లలో ఇరువైపులా నిర్మించనున్నారు. తొలుత నియోజకవర్గానికో గ్రామ పంచాయతీని ఎంపిక చేస్తారు. ఆ తర్వాత మిగిలిన పంచాయతీల్లో అమలు చేస్తారు. స్థలం అందుబాటులో లేని ప్రాంతాల్లో ఇళ్ల వద్ద సోక్ పిట్స్ నిర్మిస్తారు. అలాగే సోక్ పిట్ లేదా డ్రైన్లకు అనుసంధానిస్తూ బట్టలు, వంట సామాగ్రి శుభ్రం చేసుకునేందుకు వీలుగా ప్లాట్ ఫామ్స్ నిర్మించాలని ప్రతిపాదించారు. ఇళ్లల్లో వినియోగించే నీటిలో 80 శాతం డ్రైన్స్ ద్వారా వెళ్లే విధంగా డిజైన్ చేయనున్నారు. శాచ్యురేషన్ పద్ధతిలో ఓపెన్ డ్రైన్స్ రాష్ట్రాన్ని నూరు శాతం మురుగు రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అన్ని గ్రామాల్లో సంతృప్త స్థాయిలో ఓపెన్ డ్రైన్స్ నిర్మించేందుకు లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు చేపట్టాం. ఇందుకు మార్గదర్శకాలు కూడా జారీ చేశాం. –సంపత్కుమార్, ఎండీ, ఏపీ స్వచ్ఛాంధ్ర మిషన్ -
నిధులు ఆవిరి..పారిశుద్ధ్యం కానరాదేమీ..!
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో సీసీ రోడ్ల నిర్మాణం కోసమే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016 ఏప్రిల్ నెల నుంచి ఈ ఏడాది మార్చి వరకూ రూ.459 కోట్లు ఖర్చు చేశారు. అవీ తూతూ మంత్రం గా నిర్మించడమే గాక, ఎక్కడా వాటి వెంబడి డ్రైనేజీ ఏర్పాటు చేయలేదు. దీంతో ఇళ్ల మధ్య మురుగునీరు ఎక్కడికక్కడ స్తంభించిపోతోంది. మురుగునీరు పోవడానికి కాలువలు లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఫలితంగా అంటువ్యాధులు, రోగాలు ముసురుతున్నాయి. గత ముఖ్యమంత్రి చంద్రబాబు మానసపుత్రికలైన జన్మభూమి కమిటీల నిర్వాకంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. గత ఐదేళ్లలో భారీగా నిధులిచ్చినా గ్రామాల్లో పరిస్థితి మారలేదని కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన శాంపిల్ సర్వే అద్దంపట్టడం గమనార్హం. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు నిర్మించామని, ఇది తమ ఘనతని గత టీడీపీ పాలకులు ప్రతి వేదికపైనా ఊదరగొట్టేవారు. వాస్తవానికి 30 శాతం వరకూ కమీషను మిగుల్చుకోవడానికి కేవలం సీసీ రోడ్లు మాత్రమే తూతూ మంత్రంగా వేసేశారు. కానీ ఇళ్ల మధ్య నుంచి మురుగునీరు పోవడానికి డ్రైనేజీ ఏర్పాటు చేయలేదు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరు చేసిన నిధుల్లో రూ.459 కోట్లు సీసీ రోడ్ల నిర్మాణానికే వెచ్చించారు. కానీ ఆ స్థాయిలో గ్రామాల్లో పారిశుద్ధ్య వ్యవస్థ మెరుగుపడలేదు. ఇవిగాక గత ఐదేళ్లలో 13వ ఆర్థిక సంఘం, 14వ ఆర్థిక సంఘం పేరుతోనూ గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చింది. జన్మభూమి కమిటీల నిర్వాకం... పేదలైన కూలీలకు సొంత ఊరిలోనే పనులు కల్పిస్తూ మరోవైపు గ్రామంలో అవసరమైన మౌలిక వసతులు కల్పించుకోవాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ జన్మభూమి కమిటీల్లోని టీడీపీ కార్యకర్తలకు మాత్రం కాసుల కక్కుర్తే ప్రధాన ధ్యేయమైంది. చివరకు గ్రామ పంచాయతీల ప్రకారమే అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉన్నా తమకు కాసులు కురిపించే పనులనే చేయించారు. సీసీ రోడ్లలో 30 శాతం వరకూ కమీషన్లు రావడంతో వాటికే మొగ్గు చూపించారు. మురుగు కాలువల నిర్మాణాన్ని పట్టించుకోలేదు. కొన్ని గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలే కాంట్రాక్టర్ల అవతారం ఎత్తడంతో ఎక్కడ పనులు చేశారో వారికే తెలియట్లేదు. టీడీపీ పెద్దల ఒత్తిళ్లతో కొంతమంది అధికారులు కూడా బిల్లులను ఆమోదించేశారు. ఫలితం ఇప్పుడు గ్రామాలు చాలా వరకూ పారిశుద్ధ్యలోపంతో సతమతమవుతున్నాయి. ప్రజలు డెంగీ, మలేరియా వంటి విషజ్వరాల బారినపడుతున్నారు. -
మురికి గుంతలో 48 గంటలుగా..
సాక్షి, హైదరాబాద్ : కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా మురికి కాల్వలు, మ్యాన్ హోళ్లు నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ ఓ మహిళ వినూత్న నిరసనకు దిగారు. ఏకంగా మురికి గుంతలో కూర్చుని డ్రైనేజీ పైప్లైన్ పనులను అడ్డుకున్నారు. శుక్రవారం మొదలైన ఆమె నిరసన కార్యక్రమం శనివారం (48 గంటలు) కూడా కొనసాగుతోంది. వివరాలు.. మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ 30 ఫీట్ల రోడ్డులో కొంత కాలంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలు తలెత్తాయి. దీంతో స్థానికులు సొంతంగా సేకరించిన నిధులతో సుమారు 200 మీటర్ల మేర యూజీడీ పైప్లైన్ నిర్మాణ పనులను చేపట్టారు. అయితే ఇష్టానుసారం పైప్లైన్లు నిర్మిస్తున్నారని పేర్కొంటూ కాలనీకి చెందిన అరుణ అనే మహిళ పనులను అడ్డుకుంది. డ్రైనేజీ పైప్లైన్ కోసం ఏర్పాటు చేసిన గుంతలో కూర్చొని నిరసనకు దిగారు. కాలనీలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) పనులను జీహెచ్ఎంసీ చేస్తుందని... మీరెందుకు చేస్తున్నారంటూ పనులను అడ్డుకుంది. అయితే, సొంత నిధులతో కాలనీని అభివృద్ధి చేసుకోవడంలో తప్పేంటని, తమ పనులకు అడ్డు రావద్దని కాలనీవాసులు ఆమెకు సూచించారు. అధికారులు ఏం చేస్తున్నారు.. ఇష్టానుసారంగా మురికి నీటి కాల్వలు నిర్మిస్తే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదురౌతాయని అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రణాళిక బద్దంగా డ్రైనేజీ పైప్లైన్లు నిర్మించాలని అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని ఆమె వాపోయారు. అందుకే ఈ కాలనీలో నివసిస్తున్న మహిళగా నిరసన తెలుపుతున్నానని స్పష్టం చేశారు. చందానగర్ డిప్యూటీ కమిషనర్, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, పోలీస్ అధికారులకు ఇదే విషయాన్ని చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా మురికి కాలువలు, మ్యాన్ హోళ్లు నిర్మిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ట్రాన్స్ఫార్మర్ అడ్డొచ్చిందని..!
సాక్షి, భవానీపురం: స్ట్రాం వాటర్ డ్రెయిన్ నిర్మాణానికి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ అడ్డొచ్చిందని కాలువను వంకరలు తిప్పుతూ చక్కటి రోడ్డును పగులకొట్టారు. అసలు స్ట్రాంవాటర్ డ్రెయిన్లే అనవసరంగా నిర్మిస్తున్నారని వాటి వలన ప్రయోజనం కూడా కనబడటం లేదని ప్రజలు అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే గతంలో గట్టిగా ఉన్న సైడు కాలువలను పగులకొట్టి కొత్తగా నిర్మించిన స్ట్రాంవాటర్ డ్రెయిన్స్తో మురుగునీటి పారుదల సక్రమంగా లేకపోవడమే వారి అసంతృప్తికి కారణం. ఈ నేపథ్యంలో విద్యాధరపురం 26వ డివిజన్ పరిధిలోని శ్రీకన్యకాపరమేశ్వరి కల్యాణ మండపం రోడ్లో నిర్మిస్తున్న స్ట్రాంవాటర్ డ్రెయిన్ కు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ అడ్డు వచ్చింది. విద్యుత్ సిబ్బందికి చెప్పినా అక్కడి నుంచి ట్రాన్స్ఫార్మర్ మార్చటం లేదని దానిని తప్పించి డ్రెయిన్ నిర్మించే క్రమంలో చక్కగా ఉన్న రోడ్డును పగులకొట్టారు. స్థానికులతో ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉండటమే కాకుండా వెడల్పు కూడా తక్కువగా ఉన్న ఈ రోడ్డును పగులకొట్టడంతో కుచించుకుపోయింది. దీనిపై కామకోటినగర్, అండిమాని బ్రహ్మయ్య రోడ్వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు తవ్వి కూడా వారం రోజులకుపైనే అయ్యిందని స్థానికులు చెబుతున్నారు. స్ట్రాంవాటర్ డ్రెయిన్ నిర్మాణ పనులను చేపట్టిన ఎల్ అండ్ టీ కంపెనీ ప్రాంతాలవారీగా సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించేయడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలు ఇబ్బందిపడినా పరవాలేదు..ఎలాగోలా తమ కాంట్రాక్ట్ పని పూర్తి చేసుకుని వెళ్లిపోయే పరిస్థితిలో సబ్ కాంట్రాక్టర్లు ఉన్నారు. డ్రెయిన్ నిర్మాణ పనులను పర్యవేక్షించాల్సిన పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు నిద్ర మత్తులోనో, ముడుపుల మత్తులోనో ఉండి పనులు జరుగుతున్న ప్రాంతంలో కానరావడం లేదు. దీనికి సంబంధించిన ఉన్నతాధికారులు ఎవరైనా ఉంటే వారైనా స్పందించి డ్రెయిన్ నిర్మిస్తున్న ప్రాంతాలలో స్థానికుల ఇబ్బందులను తెలుసుకుని పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
ముంచెత్తిన మురుగు
గాంధీఆస్పత్రి : డ్రైనేజీ వ్యవస్థలో ఏర్పడిన లోపం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి సెల్లార్ను మురుగునీరు ముంచెత్తింది. ఆస్పత్రి ప్రధాన భవనం సెల్లార్లో నిర్వహిస్తున్న మెడికల్ స్టోర్, సర్జికల్ స్టోర్ (సీఎస్డీ), టెలిఫోన్ ఎక్సేంజ్, ఫిజియోథెరపీ, డైట్ క్యాంటిన్ తదితర విభాగాల్లోకి గురువారం ఉదయం భారీగా మురుగునీరు చేరడంతో రోగులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పద్మారావునగర్ వైపు ఉన్న డ్రైనేజీ లైన్ మూసుకుపోవడంతో ఆస్పత్రి నుంచి బయటికి వెళ్లాల్సిన మురుగునీరు వెనక్కు వచ్చి సెల్లార్ను ముంచెత్తినట్లు గుర్తించిన ఆస్పత్రి పాలనా యంత్రాంగం సమస్యను పరిష్కరించేందుకు తాత్కాలిక చర్యలు చేపట్టింది. వివరాల్లోకి వెళితే..గాంధీ ఆస్పత్రికి చెందిన మురుగునీరు ప్రత్యేక పైప్లైన్ల ద్వారా పద్మారావునగర్ వైçపుగల జీహెచ్ఎంసీ డ్రైనేజీలో కలుస్తుంది. జీహెచ్ఎంసీ డ్రైనేజీ ఓవర్ఫ్లో కావడంతో ఆస్పత్రికి చెందిన డ్రైనేజీ వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. దీంతో మురుగునీరు బయటికి వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో సెల్లార్ను ముంచెత్తింది. సిబ్బంది, రోగులకు అస్వస్తత.... ఆస్పత్రి సెల్లార్లో ఫిజియోధెరపీ ఇన్పేషెంట్ విభాగాన్ని నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం మురుగునీరు ముంచెత్తడంతో అక్కడ వైద్యసేవలు అందిస్తున్న సిబ్బంది, రోగులుదుర్వాసన భరించలేక వాంతులు చేసుకున్నారు. దీంతోకొన్ని వైద్యయంత్రాలను ఓపీ విభాగంలోకితరలించి అక్కడే వైద్యసేవలు కొసాగించారు. అధునాతన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు రూ. 3 కోట్లతో ప్రతిపాదనలు... 15 ఏళ్ల క్రితం నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థ పాడైపోవడం, పెరిగిన రోగులు, వైద్యులు, సిబ్బందికి అవసరాలకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు రూ. 3 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. నిధులు మంజూరు కాకపోవడంతో నిర్మాణపనులు ప్రారంభం కాలేదు. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్కుమార్ సమస్యను ఆయన దృష్టికి తెచ్చారు. సమస్యను పరిష్కరించేందుకు ముంబైకి చెందిన నిపుణుల కమిటీతో అధ్యయనం చేయించి నూతన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆ తర్వాత రెండురోజులకే ఆస్పత్రి డ్రైనేజీ వ్యవస్థ కుప్పకూలడం గమనార్హం. సమస్యను గుర్తించామని మురుగునీరు సెల్లార్ను ముంచెత్తకుండా తాత్కాలిక చర్యలు చేపట్టామని ఆస్పత్రి ఆర్ఎంఓ–1 జయకృష్ణ తెలిపారు. తక్షణమే ప్రభుత్వంతోపాటు, టీఎస్ఎంఎస్ఐడీసీ అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని ఆస్పత్రి అధికారులు, వైద్యులు, సిబ్బందితోపాటు రోగులు కోరుతున్నారు. -
ఆగుతూ.. సాగుతూ
వనపర్తి : జిల్లా కేంద్రంలో నిత్యంరద్దీగా ఉండే బ్యాంక్ స్ట్రీట్లో చేపట్టిన రోడ్డు సుందరీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో రెండునెలలుగా ఈ కాలనీవాసులు, ఇక్కడి వ్యాపారులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. రాకపోకలకూ తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. 2018 మార్చిలో ఈ పనులకు కేటీఆర్ రాష్ట్ర మున్సిపల్శాఖ మంత్రి హోదాలో శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత అక్టోబర్, నవంబర్లో ఈ పనులకు అధికారులు టెండర్లు, అగ్రిమెంట్ ప్రక్రియను చేపట్టారు. 2019 ఏప్రిల్లో పనులను ప్రారంభించారు. రూ.1.31 కోట్ల నిధులతో చేపట్టిన ఈ పనులు గత రెండు నెలలుగా కేవలం 20శాతం పూర్తి చేసినట్లు అధికారులు రికార్డులు వెల్లడిస్తున్నాయి. సుమారు ఐదుబ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు, వందకుపైగా.. వ్యాపారదుకాణాలు, నివాస గృహాలు ఉన్న ఈ రోడ్డులో పనుల కారణంగా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోడ్డుకు రెండు వైపులా ఒకేసారి డ్రెయినేజీ నిర్మాణాలు చేపట్టి గోతులు తవ్వటంతో ఈ రోడ్డు మార్గాన వెళ్లే వాహదారులకు, పాదచారులకు తీవ్ర అసౌకర్యం ఏర్పడింది. ప్రధానమైన బీటీ, ఫుట్పాత్ సీసీ నిర్మాణం చేయాల్సి ఉంది. కేవలం 560 మీటర్ల కాంక్రీట్ డ్రెయినేజీ నిర్మాణం చేపట్టేందుకే రెండు నెలల సమయం తీసుకుంటే.. మిగతా పనులు చేపట్టేందుకు ఎంతకాలం పడుతుందని ఈ రోడ్డు మార్గాన వెళ్లే ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చేయాల్సి పనులు ఇవే.. బ్యాంక్ స్ట్రీట్గా పిలువబడే.. ఈరోడ్డు ఆర్టీసీ డిపో నుంచి ఇందిగాంధీ చౌరస్తా వరకు సుందరీకరణ పనులు చేపట్టాల్సి ఉంది. ఇందుకు రూ.1.31 కోట్ల నిధులు కేటాయించారు. ఇరువైపులా 560 మీటర్ల కాంక్రీట్ రోడ్డు, 33 ఫీట్ల బీటీరోడ్డు, రోడ్డుకు ఇరువైపులా.. ఒక్కోవైపు ఆరు ఫీట్ల చొప్పున మొత్తం 12 ఫీట్ల సీసీ ఫుట్పాత్ నిర్మాణం చేయాల్సి ఉంది. ప్రస్తుతం రాజీవ్ చౌక్ నుంచి పూజా ఎలక్ట్రానిక్స్ వరకు మాత్రమే పనులు చేయనారంభించారు. అక్కడి నుంచి డిపో వరకు పనులు సంగంలోనే ఆగిపోయాయి. రాజీవ్చౌక్ నుంచి ఇందిగాంధీ చౌరస్తా వరకు ఒకవైపు డ్రెయినేజీ నిర్మాణం ఇదివరకే చేసిన కారణంగా.. పడమర వైపు మాత్రమే నిర్మాణం చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇంకా పనులు ప్రారంభంకాలేదు. ప్రధాన చౌరస్తాలో మురికి కూపం జిల్లా కేంద్రంలోని నడిబొడ్డున ప్రధాన రాజీవ్చౌక్లో డ్రెయినేజీ నీరు నిలుస్తుండటంతో దుర్గంధం వెదజల్లుతోంది. పుర పాలకులు, అధికారులు ఎన్నోసార్లు ఈ ప్రధాన కూడలి గుండా వెళ్తుంటారు. కానీ ఎవ్వరికీ ఈ సమస్య పట్టకపోవటం గమనార్హం. ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండే చిరువ్యాపారులు మురికి కూపం నుంచి వచ్చే దుర్గంధంను భరించకతప్పని పరిస్థితి ఏర్పడింది. దుకాణాల ఎదుట కర్ర నిచ్చెనలు డ్రెయినేజీ నిర్మాణం కోసం రెండు వైపులా గోతులు తవ్వటంతో బ్యాంకులకు, వ్యాపార దుకాణాలకు, నివాసగృహాలకు వెళ్లే వారు కర్రనిచ్చెనలు రూ.వేలు వెచ్చించి ఏర్పాటు చేసుకున్నారు. రోడ్డు పనులు ప్రారంభించిన కొద్ది రోజులకే.. ఓ ప్రధాన ఆస్పత్రి వైద్యురాలు కర్రనిచ్చెన దాటబోయి కిందపడి గాయాలపాలైంది. అయినా పనుల్లో వేగం పెరగలేదు. రోడ్డుపై పారుతున్న మురుగునీరు రెండు వైపులా ఒకేసారి డ్రైనేజీల నిర్మాణం చేపట్టడంతో ఇరువైపుల నుంచి వచ్చే మురుగునీరు రోడ్డుపై పారుతోంది. దీంతో ఈ దారిగుండా వెళ్లే పాదచారులు ముక్కుమూసుకుని వెళ్లాల్సి వస్తోంది. ఈ కాలనీలో నివాసం ఉంటున్నవారు దుర్గంధాన్ని భరించలేకపోతున్నామని వాపోతున్నారు. అనారోగ్యం పాలవుతున్నామని అంటున్నారు. పుర పాలకులకు పట్టదా..? నిత్యం జిల్లా కేంద్రంలో ఉండే.. పురపాలకులు ఈ పనుల జాప్యం విషయంలో ఎందుకు చొరవ చూపించటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంటికి మంచినీరు వచ్చే కుళాయి పైప్లైన్లు కట్ అయ్యాయి. దీంతో మున్సిపల్ సిబ్బంది రెండుమూడు రోజులకు ఒకసారి ట్యాంకర్లతో ఈ రోడ్డున ఉన్న నివాసగృహాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. రోడ్డు సుందరీకరణ పనులు నెమ్మదించడం, ఇక్కడి ప్రజల ఇబ్బందుల విషయమై ఇదే కాలనీకి చెందిన ఓ యువకుడు ట్విటర్లో కేటీఆర్కు ఫిర్యాదు చేశారు. అతని పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. ఆక్రమణల విషయంలో ఆలస్యమైంది ఈ రోడ్డులో కొన్ని నిర్మాణాలు మున్సిపల్ రోడ్డును కొంతమేర ఆక్రమించుకుని చేశారు. వాటిని తొలగించి డ్రెయినేజీ నిర్మాణం చేయాల్సి ఉన్నందు వల్ల ఆలస్యమైంది. మరో రెండుమూడు రోజుల్లో డ్రెయినేజీల నిర్మాణం పూర్తిచేసి బీటీ రోడ్డు వేయిస్తాం. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. – భాస్కర్, మున్సిపల్ ఇంజనీర్ -
ఈ‘సారీ’అంతే.. వానొస్తే చింతే!
సాక్షి, సిటీబ్యూరో: నగర ప్రజలకు ప్రతిసారీ వర్షాకాలపు కష్టాలు తీరడం లేదు. ప్రతియేటా వర్షాకాలంలోపునే సమస్యలు లేకుండా చేస్తామని హామీనిస్తున్న బల్దియా యంత్రాంగం వివిధ కారణాలతో ఆ పనుల్ని పూర్తిచేయలేకపోతోంది. దీంతో వర్షం వచ్చిన ప్రతిసారీ అనేక ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలవడం, వాహనాలు, ప్రజలు ముందుకు కదల్లేక గంటల తరబడి ఆగిపోవాల్సి వస్తోంది. ఈ సారి కూడా అవే దృశ్యాలు పునరావృతం కానున్నాయి. ఈ వారంలో రెండు రోజులు కొద్దిసేపు కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయమై పరిస్థితిని హెచ్చరించాయి. నగరంలో దాదాపు 150 నీటిముంపు ప్రాంతాలుండగా వాటి శాశ్వత పరిష్కారం కోసం దశలవారీగా పనులు చేపడుతున్నారు. అయితే చాలాచోట్ల పూర్తికాని పనుల వల్ల సమస్యలు పునరావృతమవుతున్నాయి. గతంలో దీప్తిశ్రీనగర్ వంటి ప్రాంతాల్లో రోజుల తరబడి ఇళ్లు నీళ్లలోనే మునిగి ఉండటాన్ని దృష్టిలో ఉంచుకొని అలాంటి ప్రాంతాలకు ప్రథమ ప్రాధాన్యమిచ్చారు. దీప్తిశ్రీనగర్తోపాటు పీజేఎన్ ఎన్క్లేవ్, గంగారం చెరువు ప్రాంతాల్లో దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు పేర్కొన్నారు. నాలాలకు సంబంధించి 47 బాటిల్నెక్ ప్రాంతాల్లో 840 ఆక్రమణల్ని తొలగించాల్సి ఉండగా, దాదాపు 500 వరకు తొలగించారు. నగరం ముంపునకు ప్రధాన కారణం నాలాల విస్తరణ జరగకపోవడం. అందుకు ఆస్తుల సేకరణ, ఆక్రమణల తొలగింపు వంటివి ఆటంకాలుగా మారాయి. నగరంలో జూలై తర్వాతే వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తూ, అప్పటిలోగా మేజర్ పనుల్ని పూర్తిచేస్తామని చెబుతున్నారు. కానీ పూర్తయ్యే అవకాశం మాత్రం కనిపించడం లేదు. ఇప్పటికీ ఖైరతాబాద్, పంజగుట్ట మోడల్హౌస్, మెహదీపట్నం, లేక్వ్యూ గెస్ట్హౌస్, రాణిగంజ్, ఎస్పీరోడ్, హిమాయత్నగర్, చే నెంబర్, మహబూబ్మాన్షన్ వంటి తీవ్ర సమస్యలున్న ప్రాంతాల్లో సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేదు. వివిధ ప్రాంతాల్లో అక్కడి పరిస్థితుల్ని బట్టి బాక్స్డ్రెయిన్లు తదితర ప్రత్యామ్నాయాలతో సమస్యలు పరిష్కరిస్తామని అధికారులు చెబుతున్నారు. వివిధ అవసరాల కోసం జరిపిన రోడ్కటింగ్ పనులు పూర్తికాకపోవడం వల్ల కూడా వర్షం వచ్చినప్పుడు సమస్యలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. బాటిల్నెక్స్.. నాలాల బాటిల్నెక్స్లో వానముంపు సమస్యల పరిష్కారానికి రూ.98 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టారు. కానీ వాటిల్లో రూ.4.5 కోట్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి. పనులు పూర్తి కావాల్సిన ప్రాంతాల్లో కాప్రా–నాగారం చెరువు, పటేల్కుంట–పెద్దచెరువు, కాటేదాన్ పారిశ్రామికవాడ నుంచి శివరాంపల్లి మీదుగా మీరాలం ట్యాంక్, నిజాం కాలనీ– టోలిచౌకి, బర్లకుంట– ఖాజాగూడచెరువు, హఫీజ్పేట చెరువు– పటేల్చెరువు, మదీనగూడ–గంగారం చెరువు పరికి చెరువు– «ఆల్విన్కాలనీ, వాజ్పేయినగర్– ఆర్కేపురం చెరువు తదితర ప్రాంతాలున్నాయి. మేజర్ నీటినిల్వ ప్రాంతాల్లో.. మేజర్ నీటి నిల్వ ప్రాంతాల్లో సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన బాక్స్డ్రెయిన్ల పనులు పూర్తికాని ప్రాంతాల్లో బయోడైవర్సిటీ జంక్షన్, నాగోల్ – మూసీ తదితరమైనవి ఉన్నాయి. మేజర్ నీటినిల్వ ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి రూ. 27 కోట్ల పనులు చేపట్టగా పూర్తయినవి రూ. 2కోట్ల పనులే. అలాగే ఇతర పనుల్లో ముర్కినాలా, కళాసిగూడ నాలాలకు సంబంధించిన పనులు పూర్తికావాల్సి ఉంది. వీటితోసహ ఇతరత్రా పనులు వెరసి మొత్తం రూ. 39 కోట్ల పనులకుగాను రూ. 33 కోట్ల మేర పూర్తయ్యాయి. మిగతావి పూర్తికావాల్సి ఉంది. ఆ పనులన్నీ పూర్తయితేనే ఎక్కడికక్కడ వాననీరు వరదకాల్వల గుండా ప్రవహించి రోడ్లపైకి చేరదు. అవి పూర్తికాకపోవడంతో నీరు పారే దారిలేక ప్రధాన రహదారులన్నీ నీటమునుగుతున్నాయి. పూడికతో.. వీటితోపాటు నాలాల్లో పూడికతీత పనులు పూర్తికాకపోవడం వల్ల కూడా వరదనీరు సాఫీగా వెళ్లే పరిస్థితి లేదు. 800 కి.మీ.ల మేర పూడికతీత పూర్తికావాల్సి ఉండగా, 500 కి.మీ.ల మేర మాత్రమే పూడికతీత జరిగింది. దీంతో కొద్దిచినుకులకే నాలాలు పొంగిపొర్లుతున్నాయి. డీఆర్ఎఫ్ టీమ్స్ ఇవి కాక డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(డీఆర్ఎఫ్)టీమ్స్ కూడా తక్షణమే రంగంలోకి దిగి తమ సేవలందిస్తాయి. 13 డీఆర్ఎఫ్ టీమ్స్లో మొత్తం 240 మంది సుశిక్షితులైన సిబ్బంది ఉన్నారు. షిఫ్ట్కు 80 మంది వంతున మూడు షిప్టుల్లో 24 గంటలపాటు విధుల్లో ఉంటారు. మాన్సూన్యాక్షన్ టీమ్స్ రెడీ..– అంచనా వ్యయం రూ. 23 కోట్లు ఈ సమస్యలు పరిష్కారం కాని నేపథ్యంలో వానొస్తే రోడ్లన్నీ నీట మునుగుతుండటంతో తక్షణ చర్యల కోసం వెనువెంటనే సమస్యల పరిష్కారం కోసం ఈ సంవత్సరానికి గాను 291 ఎమర్జెన్సీ మాన్సూన్ టీమ్స్ను జీహెచ్ఎంసీ సిద్ధం చేసింది. వీటిల్లో 76 మినీ మొబైల్ మాన్సూన్ టీమ్స్, 75 మొబైల్ మాన్సూన్ టీమ్స్, 2 జోనల్ ఎమర్జెన్సీ టీమ్స్ ఉన్నాయి. ఇవికాక స్థానికంగా ఉండేలా 138 స్టాటిక్ లేబర్ టీమ్స్ ఉన్నాయి. మినీ మొబైల్ టీమ్స్లో జీపుతోపాటు కార్మికులు, మొబైల్ టీమ్లో డీసీఎం లేదా జేసీబీలతోపాటు కార్మికులు ఉంటారు. వీటన్నింటి అంచనా వ్యయం రూ.23 కోట్లు. -
మురుగు ముప్పు
సాక్షి, సిటీబ్యూరో: వర్షాకాలం త్వరలో ప్రారంభం కానుంది. గ్రేటర్ పరిధిలో సుమారు 6వేల కిలోమీటర్లకు పైగా ఉన్న మురుగునీటి పైపులైన్లు, మరో 1,500 కి.మీ మార్గంలోని నాలాలను బల్దియా సమూలంగా ప్రక్షాళన చేయకపోవడంతో ముంపు ముప్పు పొంచి ఉంది. మూడు సెంటీమీటర్ల మేర వర్షపాతం కురిసినా లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు, నాలాలకు ఆనుకొని ఉన్న బస్తీలు మునిగిపోతుండడం ప్రతిఏటా పరిపాటిగా మారింది. భారీ వర్షం కురిసిన ప్రతిసారీ నాలాలు ఉగ్రరూపం దాల్చడం, వరద, మురుగునీరు లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులను ముంచెత్తడం తెలిసిందే. ప్రధానంగా మహానగరంలో సుమారు 120 బస్తీలతో పాటు తరచూ మురుగు సమస్యలు తలెత్తే 2,258 ప్రాంతాలకు సంబంధించి జలమండలి ప్రత్యేక మ్యాపులు సిద్ధం చేసింది. కానీ ఈ ప్రాంతాల్లో ప్రక్షాళన చర్యలు చేపట్టే విషయంలో బల్దియా, జలమండలి విభాగాలు విఫలమయ్యాయి. దీంతో ఈ సీజన్లోనూ ముంపు ముప్పు తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. సమస్యల వర్గీకరణ.. గ్రేటర్లో ముంపు సమస్యలను నివారించేందుకు జీహెచ్ఎంసీ, జలమండలి ప్రాంతాలను నాలుగు విభాగాలుగా విభజించింది. అయినప్పటికీ ఆయా ప్రాంతాల్లో పూడికతీత, ఇతర ప్రక్షాళన పనులతో పాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ఆయా విభాగాలు విఫలమయ్యాయి. ఎ కేటగిరీ: మురుగు ఉప్పొంగడానికి ఆస్కారమున్నవి. వీటిని మినీ ఎయిర్టెక్ యంత్రాలతో తరచూ శుభ్రం చేయడం. సిల్ట్ తొలగించి మురుగు ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చేయడం. బి కేటగిరీ: నిర్వహణ డివిజన్లకు నెలవారీగా విడుదల చేసే లెటర్ ఆఫ్ క్రెడిట్ నిధులతో ఈ సమస్యలను పరిష్కరించడం. మ్యాన్హోళ్ల మరమ్మతులు, పునరుద్ధరణ, డీసిల్టింగ్ తదితర పనుల నిర్వహణ. సి కేటగిరీ: తరచూ మురుగు ఉప్పొంగే ప్రాంతాల్లో తక్షణ పరిష్కారానికి స్వల్ప దూరానికి పురాతన పైపులైన్ల మార్పు లాంటి పనులను వాటర్ బోర్డు సొంత నిధులతో చేపట్టడం. డి కేటగిరీ: భారీ మురుగునీటి పైపులైన్ల మార్పునకు సంబంధించినవి ఈ విభాగం కిందకు వస్తాయి. వీటి పరిష్కారానికి ప్రభుత్వానికి నివేదించడం. సర్కారు విడుదల చేసే నిధులతో భారీ పైపులైన్లు ఏర్పాటు చేయడం. -
డ్రైనేజీ శుభ్రం చేస్తూ.. ముగ్గురు మృతి
ముంబై : మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. డ్రైనేజీ శుభ్రం చేస్తూ ముగ్గురు కూలీలు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన పశ్చిమ థానేలోని ధోకాలిలోని ప్రైడ్ ప్రెసిడెన్సీ లక్సేరియా నివాస సముదాయంలో చోటు చేసుకుంది. డ్రైనేజీని శుభ్రం చేసేందుకు 8 మంది మురుగును శుద్ధి చేసే ప్లాంట్లోకి దిగారు. 130 క్యూబిక్ మీటర్ల లోతు ఉన్న ఈ ప్లాంట్లో విషవాయువుల కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురవడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను అమిత్ ఫుహల్(20), అమన్ బాదల్(21), అజయ్ బంబుక్(24)గా గుర్తించారు. -
పూడిక.. లేదిక!
సాక్షి, సిటీబ్యూరో: నాలాల పునరుద్ధరణకు గ్రేటర్ అధికారులు నడుం బిగించారు. ఇకపై ఏడాది పొడవునా పూడికతీత పనులు చేపట్టాలని నిర్ణయించారు. రూ.38.24 కోట్ల వ్యయంతో 806 కిలోమీటర్ల విస్తీర్ణంలో నాలాల పూడికతీత పనులకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. నగర పరిధిలో దాదాపు వెయ్యి కిలోమీటర్ల విస్తీర్ణంలో మురుగునీటి కాలువలు, వరద నీటి కాలువలు ఉండగా... వీటిలో 216 మేజర్ నాలాలు, 735 కిలోమీటర్ల విస్తీర్ణంలో పైప్లైన్ డ్రెయిన్లు, చిన్న సైజు డ్రెయిన్లు ఉన్నాయి. మేజర్ నాలాల్లో మెషిన్ల ద్వారా, పైప్లైన్ డ్రెయిన్లలో రీసైక్లర్స్ ద్వారా, చిన్న సైజు నాలాల్లో మ్యాన్వల్గా పూడికతీత పనులు చేపట్టడానికి టెండర్ ప్రక్రియను పూర్తిచేసిన జీహెచ్ఎంసీ పనులు కూడా ప్రారంభించింది. గతంలో వర్షాకాలానికి నెల రోజుల ముందు మాత్రమే పూడికతీత పనులు ప్రారంభించి, వర్షాకాలం పూర్తి కాగానే నిలిపేసేవారు. ఈ విధానంలో పూడిక పనులు సకాలంలో పూర్తికాకపోవడం, వరదతో పూడిక మట్టి తిరిగి నాలాల్లో చేరడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ విధానానికి స్వస్తి పలికిన జీహెచ్ఎంసీ ఏడాది పొడువునా పూడికతీత పనులు చేపట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం 92.10 కిలోమీటర్ల విస్తీర్ణంలో పూడికతీత పనులు పూర్తయ్యాయి. ఇందులో 51,888 క్యూబిక్ మీటర్ల పూడికను తొలగించారు. మిగిలిన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. టార్గెట్ మే... నగరంలో సుమారు 327 నాలాల్లో పూడికతీత పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వీటిలో 83 మేజర్ నాలాల్లో యంత్రాల ద్వారా, 23 డ్రెయిన్లలో రీసైక్లర్స్ ద్వారా, 214 చిన్న సైజు నాలాల్లో మ్యాన్వల్గా జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ నిర్వహణ విభాగం పనులు చేపట్టింది. నాలాల్లో పూడికను తొలగించడంతో పాటు దాన్ని సమీపంలోని డంపింగ్ యార్డుకు తరలించే బాధ్యత కూడా కాంట్రాక్టర్పైనే ఉంటుంది. ఈ నెల చివరి నాటికి పనులు మొత్తం పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మే తర్వాత కూడా వర్షాల వల్ల తిరిగి పూడిక ఏర్పడితే ఎప్పటికప్పుడు తొలగించే పనులు నిరంతరం కొనసాగనున్నాయి. ఎప్పటికప్పుడు నాలాల పూడికతీతతో నగరవాసులు ఇబ్బందులు ఉండవని, వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుందని కమిషనర్ అన్నారు. పారదర్శకతకు సోషల్ ఆడిట్.. నాలా పూడికతీత పనుల్లో అవకతవకలకు తావులేకుండా సోషల్ ఆడిట్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టినట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ తెలిపారు. నగరంలో పూడిక పనుల సందర్భంగా తొలగించిన మట్టి పరిమాణం, తరలింపు, పాల్గొన్న కూలీలు, జేసీబీలతో కూడిన వివరాలను పొందుపరిచి స్థానిక ప్రముఖులతో ధ్రువీకరణ సంతకాలను కూడా సేకరించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. -
గ్రేటర్కు ముంపు ముప్పు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్కు ముంపు ముప్పు పొంచి ఉంది. నాలాలు, మురుగు నీటి కాల్వల్లో పూడిక తొలగింపువిషయంలో జీహెచ్ఎంసీ, జలమండలినిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రతివేసవిలో వీటిలో పేరుకుపోయే పూడికను తొలగించాల్సి ఉండగా... పనులుఅరకొరగా చేపడుతూ మమఅనిపిస్తున్నాయి. గ్రేటర్లో దాదాపు 5వేలకిలోమీటర్ల పరిధిలో మురుగునీటి కాల్వలు, మరో 1,200 కిలోమీటర్ల మేర నాలాలు అందుబాటులో ఉన్నాయి. వరద, మురుగు నీరు సాఫీగా వెళ్లేందుకు వీటి ప్రక్షాళన చేపట్టాల్సి ఉండగా... అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా రానున్న వర్షాకాలంలో ముంపు తప్పదన్న సంకేతాలు సిటీజనులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. వరద సాఫీగా వెళ్లేందుకు నాలాలను అభివృద్ధి చేయాలని కిర్లోస్కర్ కమిటీ 2003లో సూచించింది. అయితే 2007లో శివార్లలోని 12 మున్సిపాలిటీల విలీనంతో గ్రేటర్ హైదరాబాద్ ఏర్పాటు కావడంతో విస్తీర్ణం 625 చ.కి.మీలకు పెరిగింది. దీంతో గ్రేటర్ మొత్తానికీ ‘సమగ్ర మాస్టర్ప్లాన్, సూక్ష్మస్థాయి వరదనీటి పారుదల నెట్వర్క్ ప్లాన్, మేజర్, మైనర్ వరద కాలువల ఆధునికీకరణకు సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్)’ బాధ్యతను ఓయంట్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు అప్పగించారు. దాని ప్రాథమిక అంచనా మేరకు గ్రేటర్లో వరదనీటి సమస్య పరిష్కారానికి సుమారు రూ.10వేల కోట్లుఅవసరమవుతాయి. ఈ నిధులతో బుల్కాపూర్, కూకట్పల్లి, ముర్కి, పికెట్, ఎర్రమంజిల్, బంజారాహిల్స్, ఎల్లారెడ్డిగూడ, పంజగుట్ట, యూసుఫ్గూడ, నాగమయ్యకుంట, కళాసీగూడ, ఇందిరాపార్కు నాలాలను ప్రక్షాళన చేసి ఆక్రమణలు నిరోధించాలి. ప్రభుత్వం తక్షణం చేయాల్సిన పనులివీ... ♦ మురుగునీటి కాల్వలు, నాలాల్లో పేరుకుపోయిన పూడికను తొలగించాలి. ♦ 1,200 కి.మీ మేర విస్తరించిన ప్రధాన నాలాలపై ఉన్న సుమారు 8వేల ఆక్రమణలను తొలగించాలి. బీపీఎల్, ఏపీఎల్ కుటుంబాలకు తగిన నష్టపరిహారం చెల్లించాలి. ♦ నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తి కావాలంటే టౌన్ప్లానింగ్ విభాగంతో పాటు మరో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. ♦ నాలాల ఆధునికీకరణ ఆవశ్యకతను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి. ఇందుకుగాను రాజకీయ పార్టీలు, ఎన్జీఓల సహకారం తీసుకోవాలి. ♦ వరదనీటి కాలువల్లో మురుగునీరు పారకుండా చూడాలి. మురుగునీటి పారుదలకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలి. ♦ అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు, ప్రజలకు తగిన అవగాహనకు ప్రభుత్వం, రాజకీయపార్టీల సహకారం తప్పనిసరి. లేని పక్షంలో కార్యక్రమం ముందుకు కదలదు. ♦ స్టార్మ్ వాటర్ డ్రైనేజీ (వరదనీటి కాలువల) మాస్టర్ప్లాన్ను పరిగణనలోకి తీసుకొని టౌన్ప్లానింగ్ విభాగం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను అనుమతించరాదు. ♦ ఆయా పనులు చేపట్టే వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం అవసరం. ♦ చెరువుల పునరుద్ధరణ జరగాలి. తద్వారా వర్షపునీరు చెరువుల్లోకి చేరి జలకళ సంతరించుకుంటాయి. ♦ నాలాల ఆధునికీకరణ పనులకు రూ.10 వేల కోట్లు ఖర్చు కాగలవని జీహెచ్ఎంసీ అధికారులు గతంలో ప్రతిపాదించినా నిధుల విడుదల విషయంలో సర్కారు నిర్లక్ష్యంతో నగరం నిండా మునుగుతోంది. ఈ నిధులను వెంటనే విడుదల చేయాలి. అటకెక్కిన డ్రైనేజీ మాస్టర్ప్లాన్... గ్రేటర్ పరిధిలో సుమారు 5వేల కి.మీ పరిధిలో మురుగునీటి పారుదలకు సంబంధించిన పైపులైన్లు ఉన్నాయి. వీటిపై 1.85 లక్షల మ్యాన్హోళ్లు ఉన్నాయి. కానీ గ్రేటర్ జనాభా కోటికి చేరువ కావడంతో నివాస, వాణిజ్య, పారిశ్రామికవాడల నుంచి వెలువడుతున్న మురుగునీరు ప్రవహించేందుకు అవసరమైన పైపులైన్లు లేకపోవడంతో డ్రైనేజీ రహదారులు, కాలనీలను ముంచెత్తుతోంది. వర్షం కురిసిన ప్రతిసారీ ఇదే సమస్య. గ్రేటర్లో విలీనమైన 12 శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలోని సుమారు వెయ్యి కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులో లేకపోవడంతో ఇళ్లలోని సెప్టిక్ ట్యాంకుల్లోనే మురుగు మగ్గుతోంది. మరికొన్ని చోట్ల కాలనీలు, బస్తీలను ముంచెత్తుతోంది. ఆయా కాలనీలు, బస్తీల్లో రూ.3,800 కోట్లతో రూపొందించిన డ్రైనేజీ మాస్టర్ప్లాన్ అమలుకు నోచుకోకపోవడంతో పరిస్థితి విషమిస్తోంది. -
ఇదేం ‘దారి’ద్య్రం !
పాల్వంచరూరల్: భద్రాచలం జాతీయ రహదారి నిర్మాణ పనులు ప్రారంభమై మూడేళ్లు గడుస్తున్నా ఇంకా నత్తనడకనే సాగుతున్నాయి. దీంతో ప్రయాణికుల రాకపోకలకు తీవ్రంగా ఇబ్బంది కలుగుతోంది. పెంచిన గడువు ప్రకారం గత మార్చి నెలాఖరు నాటికే పనులు పూర్తి కావాల్సి ఉండగా కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. మూడవ ప్యాకేజీ కింద సుమారు రూ.229 కోట్ల వ్యయంతో సారపాక నుంచి రుద్రంపూర్ వరకు 42 కిలోమీటర్ల మేర ఫోర్ లేన్ జాతీయ రహదారి పనులు సాగుతున్నాయి. 2017 నాటికే ఈ పనులు పూర్తి కావాల్సి ఉన్నా.. ఇప్పటికి 36 కిలోమీటర్ల వరకు మాత్రమే రోడ్డు నిర్మించారు. ఇంకా 6 కిలోమీటర్ల రహదారి పనులు చేపట్టాల్సి ఉంది. మొర్రేడు, గోధుమ వాగులపై రెండు బ్రిడ్జీలు కూడా నిర్మించాల్సి ఉంది. ఇవి కాకుండా పెద్దమ్మగుడి సమీపంలో కల్వర్టు పనులు చేపట్టాలి. ఇల్లెందు క్రాస్ రోడ్డు నుంచి సింగరేణి గెస్ట్ హౌస్ వరకు ఒకవైపు రహదారి పనులు ఇప్పుడిప్పుడే మొదలుపెట్టారు. రామవరం వద్ద గోధుమ వాగుపై బ్రిడ్జి పనులు ఇంకా పూర్తి కాలేదు. గోదావరి బ్రిడ్జిదీ ఇదే దుస్థితి.. భద్రాచలం వద్ద గోదావరిపై నిర్మిస్తున్న రెండో బ్రిడ్జి పనులు సైతం నత్తనడకనే సాగుతున్నాయి. ఇక జాతీయ రహదారికి ఇరువైపులా డ్రైనేజీ పనులు కూడా అస్తవ్యస్తంగానే చేశారు. 54 కిలోమీటర్ల దూరం డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉండగా, ఇప్పటి వరకు 24 కిలోమీటర్లు మాత్రమే పూర్తి చేశారు. ఇంకా 30 కిలోమీటర్ల మేర పనులు చేయాల్సి ఉంది. పెద్దమ్మగుడి ఎదుట ఇంకా నిర్మాణ పనులు పూర్తికాలేదు. ఆరోగ్యమాత చర్చి నుంచి సీ కాలనీ గేటు, బస్టాండ్ సెంటర్ నుంచి దమ్మపేట సెంటర్ వరకు పూర్తిస్థాయిలో రోడ్డు నిర్మించలేదు. అయితే ఒకవైపు రోడ్డు ఎత్తుగా, మరోవైపు తక్కువ ఎత్తు ఉండటంతో వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. పెద్దమ్మగుడి సమీపంలోని జగన్నాధపురంలో ఒకవైపు రోడ్డు నిర్మాణం కోసం గుంతలు తవ్వి నిర్లక్ష్యంగా వదిలేశారు. పనులు చేసే మార్గంలో హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. కేవలం ఇసుక బస్తాలను కొన్ని చోట్ల, డ్రమ్ములను మరికొన్ని చోట్ల పెట్టారు. దీంతో రాత్రి వేళల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. హైవే పనులు నత్తనడకన సాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2017 జూలై నాటి రహదారి నిర్మాణ పనులు పూర్తి చేయాలనే ఒప్పందం ఉండగా, జాప్యం కావడంతో అ«ధికారులు గడువును ఏడాది పాటు పొడిగించారు. అది కూడా పూర్తయినా.. పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఇక రోడ్డు పనులు నిలిపిన చోట హెచ్చరిక బోర్డులుగా రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయక పోవడంతో రాత్రి వేళల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. అస్తవ్యస్తంగా ఫుట్పాత్ నిర్మాణం.. జాతీయ రహదారి నిర్మాణం పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయనే ఆరోపణలు వస్తుండగా.. ఫుట్పాత్ పనులు మరీ దారుణంగా ఉన్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుట్ఫాత్ నిర్మాణం చేసిన తర్వాత క్యూరింగ్ చేయక పోవడం, పటిష్టంగా నిర్మించకపోవడంతో అక్కడక్కడ ఇటుకలు లేచి పోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫుట్ఫాత్ నిర్మాణ పనులను పటిష్టంగా చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. త్వరగా పూర్తిచేయాలి భద్రాచలం నుంచి రుద్రంపూర్ వరకు నాలుగు సంవత్సరాల క్రితం చేపట్టిన హైవే రోడ్డు నేటికీ పూర్తి కాలేదు. చేస్తున్న పనుల్లోనూ నాణ్యత లేదనే అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి పనులు త్వరగా, నాణ్యంగా చేపట్టాలి. – షఫీ, రామవరం ఇంకెన్నాళ్లకు పూర్తి చేస్తారో జాతీయ రహదారి పనులు నత్తడకన సాగుతున్నాయి. దీంతో వాహనాల రాకపోకలకు ప్రమాదకరంగా మారింది. ఫుట్ఫాత్ పనులు కూడా సక్రమంగా నిర్వహించడం లేదు. వేసవిలో క్యూరింగ్ లేకుండా పనులు చేస్తున్నారు. – రాము, పాల్వంచ రెండు వాగులపై బ్రిడ్జీలు నిర్మించాల్సి ఉంది జాతీయ రహదారి నిర్మాణ పనులు అపకుండా నిర్వహిస్తున్నాం. దాదాపుగా పూర్తి కావచ్చాయి. మొర్రేడు వాగు, గోధుమ వాగులపై రెండు బ్రిడ్జీలను నిర్మించాల్సి ఉంది. మూడు నెలల్లో ఈ పనులు పూర్తిచేస్తాం. గోదావరి నదిపై కూడా బ్రిడ్జి నిర్మాణం అక్టోబర్ నాటికి పూర్తి చేస్తాం. ఈ ఏడాది జనవరి నాటికి రోడ్డు పనులు పూర్తి చేయకపోవడంతో కాంట్రాక్టర్కు పదిశాతం అపరాధ రుసుం విధించాం. – వెంకటేశ్వరరావు, హైవే ఈఈ -
మృత్యుంజయురాలు దివ్య..
సుల్తాన్బజార్: నాలుగేళ్ల దివ్య.. మృత్యుంజయురాలై తిరిగొచ్చింది..తమ కుమార్తె అంత ప్రమాదం నుంచి బయటపడి ప్రాణాలతో బయటకు రావడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. ఇంతకీ అసలేం జరిగిందంటే..గౌలిగూడ టెలిఫోన్ కేంద్రం వద్ద చంద్రకాంత్ అనే కార్పెంటర్ నివాసముంటున్నాడు. ఇతనికి వెన్నెల(8), దివ్య(4) ఇద్దరు కూతుళ్లు. ఆదివారం ఉదయం చిన్నారులిద్దరూ టిఫిన్ తినేందుకు టెలిపోన్ కేంద్రం వద్దకు వచ్చారు. తరువాత ఇంటికి వెళుతుండగా దివ్య మూత్ర విసర్జనకు వెళ్లింది. అయితే అక్కడే కచ్చామోరీపై పెద్ద రంధ్రం ఉంది.ఇది గమనించకపోవడంతో దివ్య అందులో పడిపోయింది. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖ కేంద్రం అధికారి రాజకుమార్ గౌడ్కు సమాచారం అందించారు. ఫైర్సిబ్బంది క్రాంతికుమార్, సురేష్, రమణ, వసంతరావులు అక్కడికి చేరుకుని నిచ్చెన, తాడుతో క్రాంతికుమార్ కాలువలోపలికి దిగారు.లోపల చిన్నారి కనిపించకపోవడంతో కాసేపు ఆందోళన చెందారు.తరువాత ఏడుపు వినిపించడంతో టార్చ్లైట్తో మొత్తం వెతికారు. కాలువలో కొద్ది దూరంలోనే బురదలో కూర్చుని ఏడుస్తూ కనిపించింది. దీంతో ఆ చిన్నారిని సురక్షితంగా బయటకు తీయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. తమ కూతురు క్షేమంగా బయటకు రావడంతో ఆ తల్లిదండ్రులు అగ్నిమాపక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. -
చిన్న చూపేల బాబూ!
సాక్షి, అవనిగడ్డ : ‘‘అంతన్నాడు.. ఇంతన్నాడే.. చిన్నబాబు.. నన్నొగేసెలిపోయినాడే చిన్నబాబు..’’ అంటూ దీనంగా రోదిస్తోందీ చల్లపల్లి. స్వచ్ఛ చల్లపల్లిగా ఖ్యాతి పొందిన గ్రామంలో అభివృద్ధి ఆమడ దూరంలో ఉంది. గ్రామంలోని డ్రైనేజీ అధ్వానంగా దర్శనమిస్తోంది. 2016 నవంబర్ 11న గ్రామాన్ని సందర్శించిన అప్పటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు బైపాస్ రోడ్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మాణానికి నిధులిస్తామని హామీ ఇచ్చారు. తదుపరి ఆ శాఖ బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ బైపాస్ రోడ్డుతో పాటు, మండల పరిషత్ కార్యాలయం నుంచి 6వ నంబరు కాలువ వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మాణానికి రూ.2.2 కోట్లు మంజూరు చేశారు. కొంతకాలానికే గ్రామం మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మిస్తామని ప్రకటించి డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేయమని పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో రూ.11.50 కోట్లతో భారీ ప్రణాళిక రూపొందించారు. అది నేటికీ కార్యరూపం దాల్చలేదు. కనీసం బైపాస్ రోడ్డు డ్రైనేజీ అయినా అభివృద్ధి చేసి ఉంటే, గ్రామంలో కొంతమేర అయినా సమస్య పరిష్కారం జరిగుండేది. లక్ష్మీపురం కేంద్రంగా వాటర్ ఏటీఎంలు ఏర్పాటు చేస్తామని చెప్పి లక్ష్మీపురంలో యుద్ధప్రాతిపదికన హెవీ బోర్లు వేయించారు. పనులు, కార్యాచరణ కానరాలేదు. దీంతో అభివృద్ధి మాటలకే పరిమితమైందని ప్రజలు పెదవి విరుస్తున్నారు. -
తొలి ప్రతిపాదన ‘పేట’లో డ్రెయినేజీ వ్యవస్థ
సాక్షి, నారాయణపేట: జిల్లా ఆవిర్భావం అనంతరం ‘పేట’ అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. తొలి ప్రయత్నంగా పారిశుద్ధ్య వ్యవస్థపై అధికారులు దృష్టి సారించారు. వందశాతం మంచినీటి సౌకర్యం ఉన్న మున్సిపాలిటీల్లో అండర్గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసి పంపించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అందులో భాగంగా హైదరాబాద్ జోన్లోని 19 మున్సిపాలిటీలకు పబ్లిక్హెల్త్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ కమిషనర్ ఉత్తర్వులను జారీ చేశారు. అందులో నారాయణపేట గ్రేడ్–2 మున్సిపాలిటీకి అవకాశం వచ్చింది. రూ. 55 కోట్ల నిధులకు ప్రతిపాదనలు పట్టణంలో ప్రస్తుతం 70 కిలో మీటర్ల మేర ఓపెన్ డ్రెయినేజీలు ఉన్నాయి. అయితే అండర్గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం దాదాపు 100 కిలో మీటర్లు చేపట్టేందుకు ఆర్వీ కన్సల్టెన్సీవారు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పట్టణంలోని 23 వార్డుల్లో ఉన్న ఓపెన్ డ్రెయినేజీలను పరిశీలించి ఎక్కడెక్కడ ఇంకా ఓపెన్ డ్రెయినేజీలు అవసరమని గుర్తించారు. దాంతో పాటు అండర్గ్రౌండ్ డ్రెయినేజీ 1.5 మీటర్ల లోతులో నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలను రూపొందించారు. ఈ డ్రెయినేజీల నిర్మాణం కోసం రూ.55 కోట్ల నిధులు కావాల్సి వస్తుందని అధికారులు అంచనా వేశారు. సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పట్టణంలో చేపట్టే అండర్గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణంతో వీధుల నుంచి పారే మురుగునీరంతా ఒక చోట చేరేందుకు ప్లాంట్ను ఏర్పాటు చేస్తారు. దానినే సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటారు. పట్టణంలో రెండు ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. ఒకటి పళ్ల ఏరియాలోని బీబీ దర్గా సమీపంలో, మరోటి పగిడిమారి రోడ్లో ఏర్పాటు చేసేందుకు స్థలాలను పరిశీలించారు. ఒక్కో ప్లాంట్కు దాదాపు ఎకరా స్థలం కావాల్సి ఉంది. వర్షపునీరు పారేందుకు.. ఇళ్లనుంచి విడుదలైన నీటితో పాటు వర్షపు నీరు పారే నీటిని మాత్రమే ఓపెన్ డ్రెయినేజీల్లో పారేందుకు చర్యలు చేపట్టనున్నారు. మలమూత్ర విసర్జన, మురుగునీరు, బాత్రూం వాటర్ పైప్లైన్లను అండర్గ్రౌండ్ డ్రెయినేజీలకు అనుసంధానం చేస్తారు. ఈ నీరంతా సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కు చేరి ఫిల్టర్ అయి మళ్లీ బయటికి నాలాల ద్వారా పంపిస్తారు. ప్రభుత్వ ఆమోదమే తరువాయి.. ఆర్వీ కన్సల్టెన్సీ వారు తయారు చేసిన అండర్గ్రౌండ్ డ్రెయినేజీ ప్రతిపాదనలు (ప్రిమిలరీ డిటెల్ ప్రాజెక్ట్ రిపోర్ట్)ను స్థానిక మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఇటీవలే హైదరాబాద్ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ కమిషనర్కు పంపించారు. ఆ శాఖ పరిశీలన తర్వాత ఫైనల్ డిజైన్ను రూపొందిస్తూ ప్రభుత్వానికి నివేదిస్తారు. ప్రభుత్వం నుంచి ఆమోదం వస్తే పనులు ప్రారంభం కావడమే తరువాయి. ప్రతిపాదనలు పంపించాం నారాయణపేట పట్టణంలో అండర్గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం కోసం ఆర్వీ ద్వారా సర్వే చేయించాం. రూ.55 కోట్ల మేర నిధులు కావాలని డీపీఆర్ రూపొందించి ప్రతిపాదనలు తయారు చేసి సీడీఎంఏకు పంపించాం. ప్రభుత్వ అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తాం. – ఖాజాహుసేన్, ఇంజనీయర్, మున్సిపాలిటీ నారాయణపేట -
కాల్వలు దాటడం కష్టమే!
సాక్షి, అమరచింత(వనపర్తి) : అమరచింత మున్సిపాలిటీ ఏర్పడక ముందే గ్రామపంచాయతీలో కొత్తగా నిర్మించిన మురుగు కాల్వలపై అవసరం ఉన్నచోట స్లాబ్లను ఏర్పాటు చేయలేదు. దీంతో ఆయా కాలనీల్లోని ప్రజలు, చిన్నారులు మురుగు కాల్వలు దాటే క్రమంలో కిందపడి గాయపడుతున్నారు. సంబంధిత అధికారులు పట్టీపట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ద్విచక్రవాహనదారులతో పాటు రిక్షాలు కూడా కాలనీ, వీధుల్లో వెళ్లలేని దుస్థితి నెలకొంది. పాతకల్లుగేరిలో స్లాబ్లేని మురుగు కాల్వ రూ.16లక్షలతో నిర్మాణం.. అమరచింత మున్సిపాలిటీలోని ఆయా వీధులలో సుమారు రూ.16లక్షల వ్యయంతో 7 చోట్ల మురుగు కాల్వల నిర్మాణం పనులను చేపట్టారు. ప్రస్తుతం సదరు కాంట్రాక్టర్ బిల్లులను చెల్లించకపోవడంతో నిర్మించిన కాల్వలపై స్లాబ్లను ఏర్పాటు చేయడం మర్చిపోయారు. దీంతో రాకపోకలకు అంతరాయం కలుగుతున్నా పట్టించుకునే అధికారులు, ప్రజాప్రతినిధులు కరువయ్యారని ఆయా కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. స్లాబులు వేస్తేనే ప్రయోజనం.. అమరచింత మున్సిపాలిటీలోని సయ్యద్నగర్, రాణాప్రతాప్నగర్, ఆజాద్నగర్, శివాజీనగర్తో పాటు మరికొన్ని కాలనీల్లో రూ.16లక్షల వ్యయం తో కూడిన మురుగు కాల్వల నిర్మాణ పనులను మాజీ సర్పంచ్ పురం వెంకటేశ్వర్రెడ్డి హయాంలో నిర్మించారు. ప్రస్తుతం 7 కాల్వల నిర్మాణాలతో పా టు రాజీవ్గాంధీ విగ్రహం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు రోడ్డుకిరువైపులా నూతనంగా డ్రెయినేజీ పనులను సుమారు రూ.20లక్షలవ్యయంతో నిర్మించారు. గతంలో నిర్మిచిన మురుగు కాల్వల నిధులతోపాటు ప్రస్తుతం నూతనంగా ని ర్మించిన కాల్వల పనులకు కూడా బిల్లులు రాలేదని అవసరం ఉన్న చోట్ల కాల్వలపై స్లాబ్లను ఏర్పాటుచేయలేక పోతున్నారు. అధికారులు స్పందించి ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించి మురుగు కాల్వలపై వెంటనే స్లాబ్లను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
సరిహద్దు గ్రామం.. అభివృద్ధికి దూరం
తానూరు: మహారాష్ట్రకు సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఎల్వత్ గ్రామంలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. కనీస సౌకర్యాలైన అంతర్గత రోడ్లు, మురుగు కాలువలు లేక గ్రామస్తులు ఇ బ్బందులెదుర్కొంటున్నారు. గ్రామం మహారాష్ట్రకు సరిహద్దు ప్రాంతంలో ఉండడంతో అధికారులు అంతగా పట్టించుకోవడం లేదు. దీంతో దశాబ్దాలుగా ఇవే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవీ సమస్యలు.. తానూరు మండలంలో ఉన్న ఎల్వత్ గ్రామం మ హారాష్ట్రకు సరిహద్దు ప్రాంతంలో ఉంది. ఇక్కడి నుంచి మహారాష్ట్ర కిలోమీటరు దూరంలో ఉంది. ఈ గ్రామానికి వెళ్లాలంటే మహారాష్ట్రలోని ధర్మాబాద్ వెళ్లి అక్కడి నుంచి ఆ గ్రామానికి వెళ్లాల్సి వస్తుంది. గ్రామంలో అంతర్గత రోడ్లు, మురుగు కాలవలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. న్యూకాలనీలో మురుగు కాలువలు లేకపోవడంతో స్థానికులు వాడిన మురుగు నీరు రోడ్డుపై ప్రవహించి రోగాల బారిన పడుతున్నామని వాపోతున్నారు. గ్రామంలో మురుగు కాలువలు లేక పోవడంతో పాత గ్రామం నుంచి మురుగు నీరు న్యూకాలనీలో చేరుతోంది. కాలనీలో గతంలో సీసీ రోడ్డు నిర్మించిన మురుగు కా లువలు ఏర్పాటు చేయకపోవడంతో స్థానికులు వాడిన మురుగు నీరు ఇంటి పరిసర ప్రాంతంలో నిల్వ ఉంటోంది. పాలకులు మారినా తమ గ్రామంలో ఉన్న సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంచినీటి పథకాలు నిరుపయోగం ఎల్వత్ గ్రామంలో గత 8 సంవత్సరాల క్రితం రూ. 23 లక్షలతో రక్షత మంచి నీటి పథకం నిర్మించి అంతర్గత పైప్లైన్ పనులు పూర్తిచేశారు. మోటారు ఏర్పాటు చేయకపోవడంతో నిర్మించిన పథకం ప్రారంభానికి నోచ్చుకోక నిరుపయోగంగా మారింది. దీంతో గ్రామస్తుల తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు పథకం ప్రారంభించి తాగు నీటి సమస్య పరిష్కరించాలని వేడుకుంటున్నారు.కాలనీలో ఉన్న సింగిల్ ఫేజ్ మోటారుకు పైప్లు ఏర్పాటు చేసుకుని నీటిని తీసుకుంటున్నారు. రూ. లక్షలు ఖర్చుచేసి నిర్మించిన పథకంపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పథకం నిరుపయోగంగా మారింది. అధికారులు బోరుమోటారు ఏర్పాటు చేసి పథకం ఉపయోగంలో తీసుకువస్తే గ్రామస్తుల తాగు నీటి సమస్య పరిష్కారం అవుతుంది. నాసిరకంగా సీసీ రోడ్ల పనులు ఎనిమిది సంవత్సరాల క్రితం న్యూకాలనిలో అధికారులు రూ.లక్షలు ఖర్చుచేసి సీసీ రోడ్డు పనులను చేపట్టారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా వేయడంతో రోడ్లు పగుళ్లు తేలి, గుంతలు పడి అధ్వానంగా మారి నడవలేని స్థితిలో ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ లేక సంబందిత కాంట్రాక్టర్ ఇష్టరాజ్యంగా పనులు చేసి చేతులు దులుపుకున్నారు. సీసీ రోడ్లు నిర్మించిన అధికారులు డ్రైనేజీలు నిర్మించకపోవడంతో మురికి నీరు రోడ్డుపై పారుతోంది. ఈ విషయంలో పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకున్న నాథుడే లేడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఆకలి కేకలు
విజయనగరం ఫోర్ట్: కేంద్రాస్పత్రిని శుభ్రంగా ఉంచే పారిశుద్ధ్య కార్మికులు జీతాలందక అవస్థలు పడతున్నారు. ఇచ్చే జీతం తక్కువే అయినా అది కూడా సకాలంలో అందకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు నెలలుగా జీతాలు అందకపోవడంతో కుటుంబాలను ఎలా నెట్టుకురావాలని ప్రశ్నిస్తున్నారు. జీతాలు మంజూరు చేయాలని గతంలో అధికారులకు పలుమార్లు కోరినా ఫలితం లేకపోయిందని వాపోతున్నారు. కేంద్రాస్పత్రిలో 52 మంది పారిశుద్ధ్య కార్మికులకుగా పనిచేస్తున్నారు. వీరిలో కొంతమంది వార్డుల్లో పనిచేస్తుండగా... మరికొంతమంది గార్డెన్ పనులు చేస్తుంటారు. ఆస్పత్రిలో గైనిక్, కంటి, జనరల్ సర్జరీ, ఎముకలు, ఎన్సీడీ, ఈఎన్టీ, దంత, పిల్లలు, మానసిక, మెడికల్, ఏఆర్టీ, ఫిజియోథెరిపీ ఓపీ విభాగాలున్నాయి. అదేవిధంగా మహిళల మెడికల్, శస్త్రచికిత్సల వార్డులు, పురుషల మెడికల్, శస్త్రచికిత్సల వార్డులు , బర్నింగ్ , ఎన్ఆర్సీ, పిల్లల వార్డు, ఆరోగ్యశ్రీ, ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ, ఐసీయూ, సిటీస్కాన్, ఎక్సరే, సూపరింటెండెంట్ కార్యాయలం, డీసీహెచ్ఎస్ కార్యాలయం, ఆపరేషన్ థియేటర్, ఈసిజీ గదులు ఉన్నాయి. వీటిన్నంటినీ ప్రతీరోజూ పారిశుద్ధ్య కార్మికులు శుభ్రం చేయలి. కొన్నింటిని ఒకటి, రెండు సార్లు శుభ్ర పరచాలి. మరికొన్నింటిని నాలుగు, ఐదుసార్లు శుభ్రపరచాల్సి ఉంటుంది. నెలల తరబడి.. పారిశుద్ధ్య కార్మికులకు 2018 ఆక్టోబర్ నెల నుంచి జీతాలు రావడం లేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కార్మికులకు నెలకు రూ.6200 జీతం ఇస్తున్నారు. ఇచ్చే జీతం తక్కువే అయినప్పటికి సకాలంలో రాకపోవడం కుటుంబాలను నెట్టుకురాలేకపోతున్నారు. అధికారులు కూడా వీరికి జీతాలు ఇప్పించడంలో చొరవ చూపడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జీతాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాస్పత్రి సూపరింటెండెంట్ సీతారామారాజును పలుమార్లు కోరామని.. అయినా ఫలితం లేకపోయిందని సిబ్బంది వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమకు వేతనాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వాస్తవమే.. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు మంజూరుకాని మాట వాస్తవమే. నాలుగైదు రోజుల్లో వేతనాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటాం.– కె. సీతారామరాజు,సూపరింటెండెంట్, కేంద్రాస్పత్రి -
ఈ నగరానికి ఏమైంది?
జిల్లా కేంద్రంలోని ఒంగోలు నగరం నడిబొడ్డునున్న కూరగాయల మార్కెట్ సమీపంలోని ప్రాంతమది. అక్కడ నివసించే మూడు కాలనీల ప్రజలకు నిత్యం మురుగుతో యుద్ధం చేస్తున్నారు. వర్షాకాలంలో అయితే ఇళ్లల్లో కూడా ఉండలేని దుస్థితి. కాలువల గుండా మురుగునీరు ప్రవహించే మార్గం లేకపోగా, ఇతర కాలనీల్లోని మురుగంతా అక్కడకొచ్చి చేరుకుంటుంది. దీనికి తోడు ఇక్కడికి సమీపంలో ఉన్న చేపల మార్కెట్లో వ్యర్ధాలన్నీ ఈ కాలనీల్లోని కాలువల్లో వచ్చి చేరుతున్నాయి. నీరు, ఇతర వ్యర్ధాలు బయటకు పోయే మార్గం లేక ఐదడుగుల వెడల్పు కాల్వలు కూడా పూర్తిగా బ్లాక్ అయిపోయాయి. వినియోగంలో లేని కాల్వల నుంచి వెదజల్లే దుర్గంధం కారణంగా ఎప్పడు ఎలాంటి రోగాల బారిన పడాల్సివస్తుందోనని కాలనీల ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకొని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఒంగోలు నగరాన్ని ఎంతగానో అభివృద్ధి చేశానని, రోడ్లు, సైడ్ కాలువలు నిర్మించానని గొప్పలు చెప్పుకుంటున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్రావు నగర నడిబొడ్డున ఈ కాలనీల దుస్థితి చూసి సిగ్గు పడాలి. ఒంగోలు టౌన్: ఒంగోలు నగరంలోని కొత్త కూరగాయల మార్కెట్ నుంచి అద్దంకి బస్టాండు మీదుగా పోతురాజు కాలువలోకి మురుగు నీరు వెళ్లేందుకు ఇటీవల కాలువ నిర్మించారు. నిర్మాణం జరిగి నెలలు గడుస్తున్నా దానిని వినియోగంలోకి తీసుకురావాలన్న ఆలోచన నగర పాలక సంస్థ అధికారులకు రాలేదు. కాలువలు నిర్మించామా లేదా.. అవి ప్రజలకు కనబడుతున్నాయా లేదా. అంతేచాలు అన్నట్లుగా ఉంది నగర పాలక సంస్థ అధికారుల తీరు. కాలువలు నిర్మించినప్పటికీ వాటిని వినియోగంలోకి తీసుకురాకపోవడంతో లక్షలాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. కొత్త కూరగాయల మార్కెట్ నుంచి అద్దంకి బస్టాండు మీదుగా నిర్మించిన కాలువకు కనెక్షన్ ఇస్తే ఇక్కడి మంగళపాలెం, చాకలివారివీధి, వడ్డిపాలెం కాలనీవాసులకు కష్టాలు తొలగుతాయి. మెయిన్ లైన్ కాలువకు కనెక్షన్ ఇవ్వకుండా వదిలేయడంతో చేపల మార్కెట్లోని వ్యర్ధాలన్నీ ఆ మూడు కాలనీలపై దాడి చేస్తూనే ఉన్నాయి. నిత్యం.. ప్రాణ సంకటం.. ఆ మూడు కాలనీల్లో నివసించే ప్రజలు ఇళ్లముందు కాలువల్లో మురుగు నీరు ఉన్నప్పటికీ తమ తలరాతలు ఇంతేనని గడుపుతూ వస్తున్నారు. శనివారం మాత్రం చేపల మార్కెట్లోని వ్యర్థాలన్నీ ఆ కాలువ గుండా ఇళ్ల మధ్యకు చేరుకున్నాయి. అసలే దుర్గంధం వెదజల్లుతూ, దోమల బారిన పడుతూ బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్న ఆ కాలనీవాసుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది. చేపల వ్యర్ధాలతో భరించలేని దుర్వాసన వెదజల్లుతుండటంతో అనేక మందికి ప్రాణసంకటంగా మారింది. పగలు, రాత్రి తేడా లేకుండా దోమలు దాడి చేస్తుండటంతో మలేరియా, ఫైలేరియా వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. గతంలో ఆ కాలువలో పడిపోయిన ఓ చిన్నారిని అదృష్టవశాత్తు గమనించి బయటకు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. అభివృద్ధి అంటే ఇదేనా..? ఒంగోలు నగరాన్ని అభివృద్ధి చేశానంటూ పదేపదే చెప్పుకుంటున్న స్థానిక శాసనసభ్యుడు దామచర్ల జనార్దనరావు ఒంగోలు నగరంలోని ఈ మూడు కాలనీల్లో పర్యటిస్తే ఆయన చేసిన అభివృద్ధి ఏమిటో తెలుస్తుందని వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు పేర్కొన్నారు. ఈ కాలనీల ప్రజలతో కలిసి శనివారం ఆయన కాలువ గట్టుపై కూర్చొని నిరసన తెలిపారు. అనంతరం మాట్లాడుతూ కాంట్రాక్టర్ల కోసం కాలువలు కట్టడం తప్పితే ప్రజల కోసం కాదని విమర్శించారు. చేపల మార్కెట్లోని వ్యర్ధాలన్నీ ఈ మూడు కాలనీల్లోకి వస్తుండటంతో ప్రజలు భయపడుతున్నారన్నారు. ఊరచెరువులో ఏడు ఎకరాల స్థలం ఉందని, దానిలో నుంచి అద్దంకి బస్టాండు మీదుగా మురుగు నీరు చెరువులోకి వెళ్లే మార్గం ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నారు. కేవలం కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసమే కాలువలు తవ్వి వదిలేస్తున్నారని ఆయన విమర్శించారు. -
చుట్టూ టైఫాయిడ్ ఉంది
మనం సురక్షితం అనుకునే ఆహారం శుభ్రత లేని కారణంగా టైఫాయిడ్ను వ్యాప్తి చేయవచ్చు. ప్లాస్టిక్ తొడుగు ధరించి ఆహారాన్ని అందజేయాలని డిమాండ్ చేద్దాం. వీలైతే మన బ్యాగ్లో ఎప్పుడూ ఒక గ్లౌవ్స్ జత ఉంచుకుని బండి దగ్గరికి వెళ్లినప్పుడు మనమే వాళ్లకు ఇద్దాం. ఏం తెలుసు... మనకు టిఫిన్ కట్టిచ్చే వ్యక్తి చేతుల నుంచి మనకు టైఫాయిడ్ రావచ్చని. ఏం తెలుసు... వీధిలో పొంగుతున్న డ్రైనేజీలో తడిసిన మన చెప్పులు ఇంట్లోకి టైఫాయిడ్ తేవచ్చునని. ఏం తెలుసు... బహిరంగ మలవిసర్జన మనకు టైఫాయిడ్ వ్యాప్తి చేస్తుందని. ఏం తెలుసు.. చేతులు శుభ్రంగా కడుక్కుంటూ ఉంటే టైఫాయిడ్ రాదని. ఏం తెలుసు... దూరప్రయాణాలు చేసేటప్పుడు టైఫాయిడ్ వ్యాక్సిన్ వేయించుకుంటే సురక్షితమని. తెలియకుండానే జీవితం గడిపేస్తున్నాం. చుట్టూ టైఫాయిడ్ ఉంది. జాగ్రత్త.టైఫాయిడ్ ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న చాలా సాధారణ జ్వరం. పారిశుధ్ధ్య వసతులు సరిగా లేని చోట చాలా ఎక్కువగా ఇది వ్యాప్తి చెందుతుంది. పారిశుద్ధ్య పరిస్థితులు నెలకొన్న పాశ్చాత్య దేశాల్లో దీని ఉనికి బాగా తక్కువేగానీ మన దేశం లాంటి ఆసియా దేశాల్లో చాలా ఎక్కువగా కనిపిస్తోంది. మురికివాడల్లో, చెత్త నిండిన నివాస ప్రాంతాల్లో టైఫాయిడ్ చాలా ఎక్కువగా బాధిస్తోంది. జబ్బు కనిపించడం ఇలా... ఒక వ్యక్తి శరీరంలోకి ఈ బ్యాక్టీరియా ప్రవేశించినప్పుడు వారం నుంచి రెండు వారాలలో లక్షణాలు కనిపిస్తూ బయటపడుతుంది. అంటే దీని ఇంక్యుబేషన్ పీరియడ్ (బ్యాక్టీరియా ఒంటిలోనికి ప్రవేశించి లక్షణాలు బయటపడటానికి మధ్య వ్యవధి) ఒకటి నుంచి రెండు వారాలన్నమాట. ఒకసారి టైఫాయిడ్ జ్వరం వస్తే అది 3 – 4 వారాల పాటు బాధిస్తుంది. లక్షణాలు... ∙ఆకలి బాగా మందగించడం ∙తలనొప్పి ∙గుండె స్పందనల రేటు బాగా తగ్గడం (బ్రాడీకార్డియా) ∙రక్తంలో తెల్లరక్తకణాల సంఖ్య తగ్గడం (ల్యూకోపీనియా) ∙నీళ్ల విరేచనాలు (డయేరియా), పొట్టనొప్పి ∙ఒళ్లంతా నొప్పులు ∙తీవ్రమైన జ్వరం (ఒక్కోసారి 104 డిగ్రీల ఫారెన్హీట్కు మించి జ్వరం ఉండవచ్చు) ∙తీవ్రమైన అలసట, నిస్సత్తువ, నీరసం ∙చాలామందిలో ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం ∙చాలా అరుదుగా ర్యాష్తో పాటు మెడ, పొట్ట మీద గులాబిరంగు మచ్చలు కనిపించవచ్చు. ఎలాంటి దుష్ప్రభావాలు రాకపోతే మూడు నాలుగు వారాల తర్వాత జ్వరం అదే తగ్గుముఖం పడుతుంది. నిర్థారణ ∙మొదటివారంలో అయితే రక్త పరీక్షతో (బ్లడ్ కల్చర్) నిర్దిష్టంగా దీన్ని కనుగొనవచ్చు. అందుకే మొదటివారంలో నిర్వహించే రక్తపరీక్షను గోల్డ్స్టాండర్డ్ పరీక్షగా పేర్కొనవచ్చు. ∙ఇక రెండో వారంలో వైడాల్ టెస్ట్ అని పిలిచే సిరొలాజికల్ పరీక్ష (రక్తపరీక్ష)తో నిర్ధారణ చేయవచ్చు. (కొన్ని సందర్భాల్లో కొంతమంది డాక్టర్లు మొదటివారమే వైడాల్ పరీక్ష చేయిస్తుంటారు. అలా చేస్తే ఉపయోగం ఉండదు. ఎందుకంటే రోగకారక క్రిమి ఒంట్లోకి ప్రవేశించాక ఒంట్లోని రక్తంలో వాటి యాంటీబాడీస్ పుడతాయి. అందుకు ఒక వారం రోజులు పట్టవచ్చు. అలాంటి సందర్భాల్లో మొదటివారమే పరీక్ష చేయించి తద్వారా వచ్చిన టైటర్ ఫలితాలను తప్పుగా వ్యాఖ్యానించడం వల్ల రోగికి నష్టం చేకూరుతుంది. అందుకే ఏదైనా జ్వరం వచ్చి, వారం రోజులు దాటి, రెండో వారంలోకి ప్రవేశించి, దాన్ని టైఫాయిడ్గా అనుమానించినప్పుడే వైడాల్ టెస్ట్ ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని గ్రామీణ ప్రాంతపు వైద్యులు సైతం గుర్తించాలన్నది నిపుణుల మాట). ∙మూడో వారంలో అయితే ఎముక మజ్జ (బోన్మ్యారో) కల్చర్ పరీక్షతో నిర్థారణ చేస్తారు. ఈ పరీక్షలతో పాటు బయటకు కనిపించే టైఫాయిడ్ సాధారణ లక్షణాల సాయంతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. అయితే ఇలాంటి లక్షణాలే చాలా సందర్భాల్లో కనిపిస్తాయి కాబట్టి కేవలం లక్షణాలను బట్టే నిర్ధారణ అంత సులభం కాదు. వైద్యపరీక్షల సాయంతో దీన్ని నూరుపాళ్లు కచ్చితంగా నిర్ధారణ చేయవచ్చు. చికిత్స టైఫాయిడ్ జ్వరానికి చికిత్స తీసుకోని వారిలో ప్రతి ఐదుగురిలో ఒకరు మరణించే అవకాశాలుంటాయి. అందుకే చికిత్స తప్పనిసరి. పైగా 104 డిగ్రీలకు పైగా జ్వరం వచ్చినప్పుడు మరికొన్ని దుష్ప్రభావాలు కూడా కనిపించవచ్చు. అందుకే టైఫాయిడ్ రోగులు సరైన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. పూర్తి కోర్స్ వాడటం కూడా అత్యావశ్యకం. అలా జరగనప్పుడు మళ్లీ మళ్లీ జబ్బు తిరగబెట్టవచ్చు. అది తీవ్రంగా కూడా పరిణమించవచ్చు. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టైఫాయిడ్ ఇటీవల మందులకు లొంగని టైఫాయిడ్ కూడా వస్తోంది. మనం చిన్న చిన్న సమస్యలకు కూడా విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడుతుండటం, అది కూడా సరైన మోతాదులో కాకుండా ఇష్టం వచ్చిన మోతాదుల్లో ఉపయోగిస్తుండటంతో పాటు ఒక్కోసారి వాడాల్సిన వ్యవధి కంటే చాలా ఎక్కువ రోజుల పాటు ఆ మందుల్ని వేసుకుంటూ ఉండటం వల్ల డ్రగ్ రెసిస్టెంట్ టైఫాయిడ్ విస్తరిస్తోంది. దీని లక్షణాలు టైఫాయిడ్ లక్షణాల్లా కనిపించవు. ఇలాంటి కేసుల్లో రోగికి చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా వైద్యం అందించాల్సి ఉంటుంది. విచక్షణ రహితంగా యాంటీబయాటిక్స్ వాడే వారిలో టైఫాయిడ్ వచ్చిందంటే అది ఒక పట్టాన తగ్గక చాలా ఇక్కట్లకు గురిచేస్తోంది. టీకా అందుబాటులో... టైఫాయిడ్కు టీకా అందుబాటులో ఉంది. ఈ టీకా వల్ల 60 నుంచి 70 శాతం వరకు నివారణ సాధ్యమవుతుంది. టైఫాయిడ్ టీకాల్లో రకాలు: ∙ఇన్యాక్టివేటెడ్ టైఫాయిడ్ వ్యాక్సిన్ : ఇందులో టైఫాయిడ్ను వ్యాప్తి చేసే బ్యాక్టీరియాను నిర్వీర్యం (ఇన్యాక్టివేట్) చేసి, ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. ∙లైవ్ టైఫాయిడ్ వ్యాక్సిన్ : ఇందులో బలహీన పరచిన టైఫాయిడ్ టీకాను నోటి ద్వారా (ఓరల్గా) ఇస్తారు. దూరప్రయాణాలు చేస్తూ బయటి ఆహారం తీసుకునేవాళ్లు టీకా తీసుకోవడం చాలా మంచిది. లేకపోతే ఒక్కోసారి టైఫాయిడ్ జ్వరం కిడ్నీ ఫెయిల్యూర్, పొట్టలోని అంతర్గత అవయవాల్లో రక్తస్రావం, మెదడు పనితీరును ప్రభావితం చేయడం వంటి తీవ్రమైన లక్షణాలతో మరణానికి కూడా దారితీసే అవకాశం ఉంది. తమ ప్రయాణాలకు కనీసం రెండు మూడు వారాలకు ముందుగా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఈ టీకాతో కొద్దిమందిలో కాస్తంత జ్వరం, వికారం వంటివి కనిపించినా టైఫాయిడ్ టీకా నూరు శాతం సురక్షితమే. రూ. 150 నుంచి రూ. 525 వరకు ధరలతో ఇవి అందుబాటులో ఉన్నాయి. ఎలా వ్యాప్తి చెందుతుందంటే... టైఫాయిడ్ జ్వరం కలుషితాహారం వల్ల ఒకరి నుంచి మరొకరికి వస్తుంది. ఇది ‘సాల్మొనెల్లా టైఫీ’ అనే గ్రామ్నెగెటివ్ బ్యాక్టీరియా కారణంగా వస్తుంది. మానవ మలం వంటి విసర్జకాలు మంచినీళ్లలో కలిసినప్పుడు లేదా వాటితో తయారైన ఆహారపదార్థాలతో ఈ బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. దీనిలోనే కాస్తంత తక్కువ తీవ్రత ఉన్న సాల్మొనెల్లా పారాటైఫీ అనే మరో రకం బ్యాక్టీరియా కూడా ఉంది. అయితే అది అంత సాధారణం కాదు. చాలా తక్కువ మందిలోనే కనిపిస్తుంది. అయితే ఇది వచ్చినా దీనికి కూడా టైఫాయిడ్ మాదిరిగానే నిర్ధారణ పరీక్షలు చేయించి, చికిత్స అందించాల్సి ఉంటుంది. మరికొంతమందిలో ఈ బ్యాక్టీరియా ఎలాంటి లక్షణాలు కలగజేయకుండా నిద్రాణంగా ఉంటుంది. వారి నుంచి ఇతరులకు ఈ జ్వరం వ్యాపించవచ్చు. ఇలాంటి వారిని వైద్యపరిభాషలో క్యారియర్స్ అంటారు. అన్నట్టు ఈ జీవికి ఆశ్రయం ఇచ్చే ఒకే ఒక జీవి మానవుడు మాత్రమే. మానవ విసర్జితాలతో తాగు నీరుగానీ, తినే తిండిగానీ కలుషితం కాగానే మళ్లీ బ్యాక్టీరియా మరో వ్యక్తి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇలా అది వ్యాప్తి చెందుతుంది. క్రానిక్ క్యారియర్స్ ముందే చెప్పినట్లుగా సాల్మొనెల్లా టైఫీ అనేది మానవుల్లోనే ఆవాసం ఉండే బ్యాక్టీరియా. అయితే లక్షణాలు బయటపడకుండా ఎలాంటి జబ్బూ లేకుండా ఉండే వారిలో అపరిశుభ్రమైన క్యాంటీన్లు, మురికిగా ఉండే హోటళ్లలో పనిచేసేవారిలో ఇది దీర్ఘకాలం పాటు అంటే దాదాపు ఏడాదికిపైగా వాళ్ల గాల్బ్లాడర్లో నివాసం ఉంటుంది. వారు విసర్జించే విసర్జకాలు ఆహారంతో కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువ. కాబట్టి వీళ్లను క్రానిక్ క్యారియర్స్గా అభివర్ణించవచ్చు. మేరీ టైఫాయిడ్ క్రానిక్ క్యారియర్స్ విషయంలో ఒక అద్భుతమైన ఉదాహరణ ‘మేరీ మెలాన్’ అనే ఒక హాస్పిటల్ వంటగత్తె (కుక్). ఆమె ఐర్లాండ్లో పుట్టి అమెరికాలో స్థిరపడ్డ ఐరిష్–అమెరికన్. టీనేజ్లో ఉన్నప్పుడు మేరీ మెలాన్ ఐర్లాండ్ నుంచి అమెరికాలోని న్యూయార్క్కు చేరింది. ఎలాంటి లక్షణాలు కనిపించని మొట్టమొదటి అమెరికన్ అసింప్టమేటిక్ క్యారియర్గా ఆమెకు గుర్తింపు వచ్చింది. ఆమె ఓ టైఫాయిడ్ క్యారియర్ అని గుర్తించాక కూడా తనలో ఎలాంటి లక్షణాలూ కనిపించనందున మేరీ ఒంటరిగా ఉండటం (ఐసోలేషన్లోకి వెళ్లడం)గానీ, లేదా చికిత్స తీసుకోవడం గానీ చేయలేదు. దాంతో ఆమె ఒకేసారి 51 మందికి తన ద్వారా టైఫాయిడ్ను వ్యాప్తిచేసింది. అందులో ముగ్గురు మరణించారు. అలా ఆమె వ్యాప్తి చేసిన టైఫాయిడ్కు ఆమె పేరిట ‘మేరీ టైఫాయిడ్’ అని పేరు రావడం ద్వారా కొంత అపకీర్తిని మూటగట్టుకుంది పాపం మేరీ మెలాన్. నివారణ ∙చేతులు కడుక్కునే అలవాటు లేనివారిలో ఇది ఎక్కువగా రావడం కనిపిస్తుంది. అందుకే తినేముందు లేదా తాగే ముందర చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇక మల విసర్జన తర్వాత తప్పనిసరిగా సబ్బుతో చేతులు కడుక్కోవాలి. ∙నీటిని వడపోసి కాచి చల్లార్చి తాగడం మంచిది. ∙నేరుగా పట్టే నీటితో వేడి చేయకుండా తయారు చేసుకునే పదార్థాలతో టైఫాయిడ్ వ్యాపించే అవకాశాలు ఎక్కువ. అందుకే పానీపూరీ వంటి బయటి ఆహారాలకు ఎప్పుడూ దూరంగా ఉండాలి. ∙అన్నం, కూరలు వేడివేడిగా ఉండగానే తినెయ్యాలి. ఒకవేళ బయటి పదార్థాలు తినాల్సి వస్తే చల్లారిపోయాక అస్సలు తినకూడదు. అలాగే ఈగలు వాలడంతో కలుషితమయ్యే ఆహారాల వల్ల కూడా టైఫాయిడ్ వచ్చే అవకాశాలు ఎక్కువ. మలం మీద వాలిన ఈగలు మళ్లీ ఆహారపదార్థాల మీద వాలడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. అందుకే ఈగలు ముసిరే ఆహారాలు, బయటి పదార్థాలను తినకపోవడం మేలు. అలాగే కలుషిత జలాలతో తయారు చేసే ఐస్తో కూడా ఇది వ్యాపించే అవకాశం ఉన్నందున అది కూడా వాడకపోవడం చాలా మంచిది. -
ఆ గ్రామంలో అన్నీ సమస్యలే..!
సాక్షి, కనగల్ : మండలంలోని అమ్మగూడెం పరిధి కుమ్మరిగూడెంకు వెళ్లే దారిలో కంపచెట్లు రహదారికి ఇరుపక్కల పెరగడంతో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. ఊరు తూర్పు రోడ్డు మొత్తం కంపచెట్లుతో అల్లుకుపోవడంతో స్థానికులతోపాటు ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. గ్రామంలోకి వెళ్లాలంటే కంపచెట్లు అడ్డుగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొటున్నారు.చెరువు కట్టకు ఇరువైపులా పెరిగిన చెట్లు కంపచెట్లకుతోడు చిన్నపాటి వర్షానికే మట్టి రోడ్డు అంతా బురదమయం అవుతుండడంతో ప్రయాణం ప్రాణసంకటంగా మారింది. కంపచెట్లు తొలగించి రోడ్డును అభివృద్ధి చేయాలని గ్రామస్తులు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పాలకులు పట్టించుకోవడంలేదు. దీనితోపాటు గ్రామానికి ఎగువన ఉన్న చెరువు కట్టపై నుంచి నిత్యం వందలాది మంది రైతులు రాకపోకలు సాగిస్తుంటారు. కట్టపై ఇరుపక్కల కంపచెట్లు పెరగడంతో రైతులు వ్యవసాయ భూములకు వెళ్లేందుకు ఆటంకంగా మా రింది. కంపచెట్లను తొలగించాలని అమ్మగూడెం, కుమ్మరిగూడెం గ్రామాల ప్రజలు కోరుతున్నారు. సమస్యలతో సావాసం: కుమ్మరిగూడెంలో ఒక్క డ్రెయినేజీ లేదు. దీంతో మురుగు వీధుల్లో పారుతుండడంతో ఈగలు, దోమలు ప్రబలుతున్నాయి. నల్లా పైపులు పలుచోట్ల పగిలి నీరు కలుషితం అవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామంలోకి కృష్ణాజలాల పైపులైన్ వేసినప్పటికీ రెండేళ్లుగా ప్రజలకు కృష్ణాజలాలు అందడంలేదు. ఎయిర్ వాల్వ్ దగ్గర నీళ్లు రా కుండా చేయడంతో పలుమార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిత్యం రూ. 10 వెచ్చింది శుద్ధ జలాలు కొనుక్కొని తాగాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో సీసీ రోడ్లతోపాటు డ్రెయినేజీలు నిర్మించి, కంపచెట్లను తొలగించి గ్రామానికి దారి సౌకర్యం మెరుగుపర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. అదేవిధంగా గ్రామానికి కృష్ణాజలాలు సరఫరా అయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కంపచెట్లను తొలగించాలి: గ్రామంలోకి వచ్చే దారిలో ఇరుపక్కల కంపచెట్ల పెరిగాయి. చెరువుకట్టపై సైతం కంపచెట్లు పెరిగి రాకపోకలకు అడ్డంకిగా మారింది. కంపచెట్లను తొలగించి గ్రామంలోకి వచ్చే రోడ్డును అభివృద్ధి చేయాలి. –లక్ష్మీనారాయణ, కుమ్మరిగూడెం కృష్ణాజలాలు అందించాలి: గ్రామంలోకి కృష్ణాజ లాలు రాకపోవడంతో తాగునీటికి అవస్థలు పడుతున్నాం. గ్రామంలోకి కృష్ణాజలాలను స రఫరా చేయాలి. మా గ్రామం దాటి ఎం.గౌరారంకు కృష్ణాజలాలు వెళుతున్నా మాకు మాత్రం కృష్ణాజలాలు అందడంలేదు. సమస్యలను పరిష్కరించాలి. –తిరుమలేశ్, కుమ్మరిగూడెం -
మాపై ఎందుకీ వివక్ష?
కర్నూలు,ఆదోని: పట్టణంలో అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ పథకాల అమలులో మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. అధికార పార్టీ నాయకులకు అత్యంత ప్రాధాన్యమిస్తూ, వైఎస్ఆర్సీపీ వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. తమ వార్డు సమస్యలు పట్టించుకోవడం లేదంటూ అక్కడి రోడ్ల దుస్థితిపై 22వార్డు కౌన్సిలర్ లలితమ్మ ఫ్లెక్సీలు ప్రదర్శించగా తాజాగా శుక్రవారం 30వ వార్డు కౌన్సిలర్ శేఖమ్మ తనయుడు, వైఎస్సార్సీపీ నాయకుడు సూర్యనారాయణ ఆందోళనకు దిగారు. మూడేళ్లుగా గౌళిపేటలోని ఆవుదోడి వంక (ప్రధాన మురుగు కాలువ)లో పూడిక తీయాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆ మురుగు కాలువలోనే రెండు గంటల పాటు కూర్చున్నారు. ‘ఈ కాలువకు ఇరువైపులు వందల మంది నిరుపేదలు నివసిస్తున్నారు.. వారంతా దుర్వాసన భరించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది విషజ్వరాల బారిన పడ్డారు. కాలువలో పూడిక తీయిస్తే కొంత వరకు సమస్య తీరుతుంద’ని తన తల్లి శేఖమ్మ అధికారులతో మొరపెట్టుకున్నా స్పందించడం లేదన్నారు. సమస్య తీవ్రతను అధికారులకు తెలియజేసేందుకు మురుగు కాలువలో కూర్చొని నిరసన తెలుపుతున్నానని చెప్పారు. వార్డుదర్శిని కార్యక్రమానికి హాజరైన కమిషనర్ రామలింగేశ్వర్, ఎంఈ విశ్వనాథ్, డీఈలు రామమూర్తి, సత్యనారాయణ విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు. నేటి నుంచే కాలువలో పూడిక తీత పనులకు చర్యలు చేపడతామని, ధర్నా విరమించాలని కోరారు. దీంతో సూర్యనారాయణ నిరసన విరమించారు. వార్డు ప్రజల సమస్య పరిష్కారం కోసం తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా మురుగు కాలువలో ధర్నా చేపట్టిన కౌన్సిలర్ తనయుడికి స్థానిక ప్రజలు అభినందించారు. -
ఈ ఐదుగురు చావుకు ఎవరు బాధ్యులు?
సాక్షి, ఢిల్లీ : వీధుల్లోని, కాలనీల్లోని, గహ సముదాయాల్లోని మురుగునీరు కాల్వలను శుభ్రం చేయడం కోసం మ్యాన్ హోల్లోకి దిగి అర్ధంతరంగా మరణిస్తున్నా పారిశుద్ధ్య పనివాళ్ల ప్రాణాలకు ఏ మాత్రం విలువ లేకుండా పోయింది. వీరి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి జాతీయ మానవ హక్కుల కమిషన్ మార్గదర్శకాలను జారీ చేసి దాదాపు 16 ఏళ్లు గడుస్తున్నా వాటిని ప్రభుత్వ పాలకులుగానీ, కాంట్రాక్టర్లుగానీ పట్టించుకుంటున్న పాపన పోవడం లేదు. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఆదివారం రాత్రి మురుగు నీరు ట్యాంక్ను శుభ్రం చేయడం కోసం మ్యాన్ హోల్లోకి దిగి ఐదుగురు కూలీలు మరణించడం పట్ల ఢిల్లీ బీజేపీ, ఆప్ పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకున్నాయిగానీ జరిగిన ఘోరం పట్ల ఏ పార్టీ అంత చిత్తశుద్ధి ప్రదర్శించలేదు. అయితే జరిగిన దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తానని హామీ ఇచ్చిన అరవింద్ కేజ్రివాల్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ కేసులో ఓ సూపర్వైజర్ను మాత్రమే అరెస్ట్ చేసింది. ఇదేమీ మారుమూల జరిగిన మామూలు దుర్ఘటన ఎంతమాత్రం కాదు. ఎంతో ప్రతిష్టాత్మకమైన డీఎల్ఎఫ్ కాపిటల్ గ్రీన్స్ రెసిడెన్షియల్ ఫేస్–2 సెక్షన్ (మోతీ నగర్)లో జరిగింది. చనిపోయిన కార్మికులంతా హౌజ్ కీపింగ్ సిబ్బందిని సరఫరా చేసే జేఎల్ఎల్ సంస్థకు చెందిన వారు. వారిలో ఒక కార్మికుడు ఇంతవరకు ఒక్కసారి కూడా పారిశుద్ధ్యం పనిచేసి ఎరగడని అతని సోదరి తెలియజేసింది. మరణించిన మిగతా నలుగురి కార్మికులకు కూడా మురుగునీరును శుభ్రం చేసిన అనుభవం అంతగా లేదని కాలనీవాసులు చెబుతున్నారు. పైగా పారిశుద్ధ్యం పనిలోకి దిగే ముందు వారు ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోలేదు. గత ఐదేళ్ల కాలంలో ఢిల్లీలో 2,403 మంది పారిశుద్ధ్య కార్మికులు ఇలా మరణించారంటే పాలకులు, అధికారులు, కాంట్రాక్టర్లకు కార్మికుల ప్రాణాల పట్ల ఉన్న పట్టింపు ఏ పాటితో అర్థం చేసుకోవచ్చు. అనుసరించాల్సిన మార్గదర్శకాలు డ్రైనేజీ చాంబర్ల వద్ద, సెప్టిక్ ట్యాంకుల్లో, మాన్హోల్స్ వద్ద యాంత్రిక వెంటీ లేటర్లు ఏర్పాటు చేయాలి. కార్మికుల ప్రాణాలకు పూర్తి భద్రత ఉన్నట్లు వారికి సైట్ మేనేజర్లు కచ్చితంగా సర్టిఫికెట్ జారీ చేయాలి. అయినప్పటికీ ప్రమాదం సంభవించి ప్రాణాలు పోయినా, గాయపడిన వారికి పూర్తి నష్టపరిహారం సైట్ మేనేజర్లు, యజమానులే చెల్లించాలి. సుశిక్షితులైన కార్మికులను మాత్రమే ఈ పనిలోకి తీసుకోవాలి. వారికి భద్రత కల్పించే యూనిఫామ్, తగిన కళ్లజోళ్లు, ప్రాణవాయువు సిలిండర్లు కల్పించాలి. వారికి తగిన శిక్షణ ఇవ్వడానికి ఎప్పటికప్పుడు స్థానిక మున్సిపాలిటీలు మాక్ డ్రిల్స్ నిర్వహించాలి. శుభ్రం చేయాల్సిన ట్యాంక్ నుంచి విష వాయువులు వెలువడుతున్నాయా, లేదా అంశాన్ని నిర్ధారించేందుకు కచ్చితంగా ఓ నిపుణుడు పనివేళలో అక్కడే ఉండాలి. కాగితాలు అంటించి సెఫ్టిక్ ట్యాంకుల్లో పడేయడం ద్వారా విషవాయువులను తెలుసుకోవచ్చు. అవి త్వరగా మండుతాయి. థానేలోని మీరా భయాండర్ మున్సిపాలిటీలో ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు మరణించడంతో స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ 2013, జూలైలో ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. ఢిల్లీలో ఆదివారం జరిగిన ప్రమాదం ఘటనలో ఇందులో ఏ ఒక్కటి పాటించలేదు. అయినప్పటికీ పోలీసు అధికారులు సూపర్ వైజర్ను మాత్రమే అరెస్ట్ చేశారు. ఉద్యోగులను సరఫరా చేసిన కాంట్రాక్టర్ను, డీఎల్ఎఫ్ యాజమాన్యాన్ని కూడా అరెస్ట్ చేయాలి. జాతీయ మానవ హక్కుల కమిషన్ సూచించినట్లు వారి నుంచి నష్ట పరిహారం వసూలు చేయడంతోపాటు వారిని చట్టపరంగా శిక్షించేందుకు కొత్త చట్టాలు కూడా తీసుకరావాలి. -
అదిరిందయ్యా.. అమాత్యా..
తూర్పు గోదావరి, యానాం: బనియన్.. మోకాలు వరకు నిక్కరు వేసుకుని డ్రైన్లో సిల్టు తీయిస్తున్న ఈయనెవరో తెలుసా..పుదుచ్ఛేరి విద్యాశాఖ మంత్రి కమలకన్నన్.. కారైకల్ ప్రాంతానికి చెందిన ఈయన శుక్రవారం తన సొంత నియోజకవర్గం తిరునాళ్లార్కు వెళ్లి పారిశుద్ధ్య కార్మికులతో పాటు డ్రైన్లోకి దిగి ఇదిగో ఇలా పూడిక తీత పనులు చేపట్టారు. మంత్రిననే గర్వం, బేషజాలు లేకుండా ఆయన చేసిన పనిని చూసి అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. -
విలీనం.. వికారం
ఖమ్మంరూరల్: గ్రామాలు, తండాలు అభివృద్ధి చెందుతాయనుకున్నారు.. వీధులన్నీ అద్దంలా మెరుస్తాయనుకున్నారు.. మురుగు కాల్వలన్నీ మెరుగు పడతాయనుకున్నారు.. అపరిష్కృత సమస్యలన్నీ తీరి.. అభివృద్ధి బాట పడతాయనుకున్నారు. కానీ.. అంతా తారుమారైంది. కార్పొరేషన్ లో విలీనమైన గ్రామాలు వికారం పుట్టి స్తున్నాయి. సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. మురుగు, చెత్తతో కంపుకొడుతూ దర్శనమిస్తున్నాయి. ఇక్కడ ప్రత్యేకాధికారులు లేకపోవడంతో పాలన కుంటుపడింది. వెంటనే వారిని నియమించాలని విలీన గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం రూరల్ మండలం పెదతండా, గుర్రాలపాడు, వెంకటగిరి, గుదిమళ్ల, ఏదులాపురం గ్రామ పంచాయతీలను ఆగస్టు 2న ఖమ్మం కార్పొరేషన్లో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి ఆయా గ్రామాలకు ప్రత్యేకాధికారులను నియమించలేదు. దీంతో నెల రోజులుగా పాలన కుంటుపడింది. విలీన సమయంలోనే తమ పంచాయతీలను కార్పొరేషన్లో విలీనం చేయొద్దని ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఆయా పంచాయతీల ప్రజలు, రాజకీయ నాయకులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. అయితే అవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వం ఆయా గ్రామాలను కార్పొరేషన్లో విలీనం చేసింది. సమస్య జఠిలం ఇదిలా ఉండగా.. విలీనమైన 5 గ్రామాలకు చెందిన కొందరు తమ గ్రామాలను కార్పొరేషన్లో విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లారు. దీంతో విలీన తంతును నిలిపివేయాలని హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది. ప్రస్తుతం అక్కడ ఎటువంటి అభివృద్ధిచేయాలన్నా.. పాలక వర్గామైనా ఉండాలి.. లేదా ప్రత్యేకాధికారులైనా ఉండాలి. విలీన అంశం కోర్టు పరిధిలో ఉండడంతో ప్రత్యేకాధికారులు నియామకం కాక, పాలకవర్గం లేక ఆయా గ్రామాల ప్రజలు నలిగిపోతున్నారు. కోర్టు స్టే సమయం ఎప్పుడు పూర్తవుతుందో.. తమ సమస్యలు ఎప్పు డు తీరుతాయోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. తిష్ట వేసిన సమస్యలు కార్పొరేషన్లో విలీనమైన వెంకటగిరి, పెదతండా, ఏదులాపురం, గుదిమళ్ల, గుర్రాలపాడులో వివిధ సమస్యలు తిష్ట వేశాయి. సైడు కాల్వల్లో మురుగును తీయకపోవడం, వీధుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించకపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. నెల రోజుల నుంచి ఏ అధికారి కూడా విలీన గ్రామాల వైపు కన్నెత్తి చూడకపోవడంతో ప్రస్తుతం అక్కడి ప్రజల బాధలు వర్ణనాతీతం. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో కాల్వలు, గుంతల్లో మురుగునీరు చేరి దోమలు వ్యాప్తి చెంది ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. నగర శివారు రాజీవ్ గృహకల్ప వీధుల్లో పందులు సంచరిస్తూ.. అపరిశుభ్రంగా ఉండడంతో అక్కడి ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. ఇక తాగునీటి విషయంలో నెల రోజులుగా స్వచ్ఛమైన నీరు అందడం గగనమైంది. ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్లలో బ్లీచింగ్ వేయకుండానే నేరుగా నీటిని సరఫరా చేస్తున్నారు. అందులో పురుగులు, క్రిమికీటకాలు వస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. రాజీవ్ గృహకల్పకు తాగునీరు అందించే మోటార్ ఇటీవల వచ్చిన వర్షాలకు వరదలతో మున్నేటిలో మునిగిపోవడంతో అక్కడ నీటి సరఫరా వారం రోజులుగా నిలిచిపోయింది. ఇలా తీరొక్క సమస్యలు విలీన గ్రామాల ప్రజలను వేధిస్తున్నాయి. కొత్త ఇళ్లకు అనుమతిచ్చేవారేరి? నగరానికి అతి సమీపంలో పెదతండా, ఏదులాపురం వెంకటగిరి, గుర్రాలపాడు గ్రామాలు ఉన్నాయి. వాటి పరిధిలోని పరిసర ప్రాంతాల్లో కొత్తగా ఇళ్లు నిర్మించుకునే వారు అధిక సంఖ్యలో ఉన్నారు. అయితే ఇళ్లకు అనుమతి ఇచ్చే అధికారులు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. గతంలో పంచాయతీ కార్యదర్శి నుంచి అనుమతి తీసుకునేవారు. ఇప్పుడు ఆ గ్రామాలు కార్పొరేషన్లో విలీనం కావడంతో కార్పొరేషన్ అధికారులే అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం విలీన అంశం కోర్టు పరిధిలో ఉండడంతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టేవారు అయోమయానికి గురవుతున్నారు. కాగా.. విలీన గ్రామాలకు ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించకపోవడంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఆయా గ్రామాల్లో పాలన పూర్తిగా కుంటుపడింది. ఇప్పటికైనా విలీన పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించాలని ఆయా గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మురుగు తీయట్లేదు.. నెల రోజులుగా సైడ్ కాల్వల్లో ఉన్న మురుగును తీయడం లేదు. దీంతో పగలు, రాత్రి దోమలు కుడుతున్నాయి. రాత్రయితే నిద్ర ఉండట్లేదు. దోమలు కుట్టడంతో విష జ్వరాలు వస్తున్నాయి. తండాలో మురుగునీటి కంపుతో ఉండలేకపోతున్నాం. వెంటనే కాల్వల్లో మురుగును తీసేయాలి. \– ధరావత్ గోలీ, పెదతండా బురదలో ఇబ్బందులు.. వర్షం వస్తే తండాలో మోకాళ్ల లోతున బురద ఉంటుంది. అందులో నడవలేకపోతున్నాం. గతంలో సర్పంచ్కు చెబితే తీయించాడు. ఇప్పుడు ఎవరికి చెప్పాలో తెలవడం లేదు. రోడ్లమీద చెత్త పెరిగిపోతుంది. తండాలో ఉండాలంటేనే నరకం గుర్తుకొస్తుంది. – ధరావత్ అస్లీ, చిన్నతండా ప్రత్యేకాధికారిని నియమించాలి.. గ్రామాలను కార్పొరేషన్లో విలీనం చేసి చేతులు దులుపుకున్నారు. నెల రోజులైనా అధికారి లేకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం స్పందించి విలీన గ్రామాలకు వెంటనే ప్రత్యేకాధికారులను నియమించాలి. – పొదిల సతీష్, వెంకటగిరి మున్సిపల్ అధికారులదే.. విలీనమైన ఐదు పంచాయతీలు తమ శాఖ పరిధిలో లేవు. ఆ గ్రామాలు మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమయ్యాయి. ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ తరఫున అభివృద్ధి కోసం ఒక్క రూపాయి ఖర్చు చేసే అవకాశం లేదు. ప్రత్యేకాధికారులను నియమించే అంశం తమ పరిధిలో లేదు. అదంతా మున్సిపల్ అధికారులే చూసుకోవాలి. – శ్రీనివాసరెడ్డి, డీపీఓ కోర్టు స్టే ఉంది.. మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైన ఐదు పంచాయతీలకు సంబంధించి కోర్టు స్టే ఉంది. ప్రస్తుతం ఏమీ చేయలేని పరిస్థితి. ఆ గ్రామాలు పూర్తిగా తమ పరిధిలోకి రాలేదు. కాబట్టి ఈ విషయంలో ప్రత్యేకాధికారులను నియమించలేం. – జోగినిపల్లి శ్రీనివాసరావు, కార్పొరేషన్ కమిషనర్ -
ముంపు.. ముప్పు
ఈ ఫొటోలో కనిపిస్తున్నది వాగులు, కాలువలు కాదు. నగరం నడిబొడ్డున ఉన్న జ్యోతినగర్లోనిది. ఇటీవల కురిసిన చిన్న వర్షాలకే డ్రెయినేజీలు నిండి రోడ్లన్నీ వాగులై ప్రవహిం చాయి. ఇళ్లలోకి నీళ్లు చేరి ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. రాత్రంతా కష్టపడి ఇళ్లలో చేరిన నీటిని బయట పారబోసేందుకు తిప్పలుపడ్డారు. నాలుగు డివిజన్ల వరద నీళ్లు చిన్న డ్రెయినేజీల నుంచి వెళ్లడం గగనంగా మారింది. ఇది ఈ ఒక్క రోజు సమస్య కాదు. 20 ఏళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. వర్షం కురిసిన ప్రతిరోజూ ప్రజలు జాగారం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో పేరు గడిస్తున్న కరీంనగర్ను నగర సమస్యలు వెక్కిరిస్తున్నా యి. ఉన్నత ప్రమాణాలతో ఉత్తమ ర్యాంకులు సాధిస్తున్న నగరం.. స్థానికంగా ప్రజలను మెప్పించలేకపోతోంది. చిన్నపాటి వర్షం వస్తే చాలు నగరమంతా అతలాకుతలమవుతోంది. ఇక లోతట్టు ప్రాంతాల పరిస్థితి మరీ దయనీయం. ఇటీవలే కేరళ రాష్ట్రంలో వర్షం సృష్టించిన బీభత్సం అంతాఇంతా కాదు. పెద్దపాటి వర్షం కురిస్తే నగరం జలమయంలో చిక్కుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేకపోవడమే దీనంతటికి కారణం. ప్రస్తుతం నగరంలో డ్రెయినేజీ నిర్మాణాలు నడుస్తున్నా.. ‘ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి’ అన్న చందంగా ఉంది పనుల ప్రగతి. – కరీంనగర్కార్పొరేషన్ కరీంనగర్కార్పొరేషన్: కరీంనగర్ నగరపాలక సంస్థలో ఒక్క వానకే చాలా ప్రాంతాల్లోని వీధులు జలమయమవుతున్నాయి. డ్రెయినేజీలు పొంగి పొర్లుతూ మురుగునీరు ఇళ్లలోకి చేరి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ సమస్య 20 ఏళ్లుగా ఉన్నా.. శాశ్వత పరిష్కారం చూపలేకపోతున్నారు. గతానుభవాలను పాఠాలుగా స్వీకరించాల్సిన అధికారులు ఎప్పటిలాగే హడావిడి చేసి వదిలేస్తున్నారు. పాలకులు సైతం హామీలకు పరిమితమై పనులను పక్కనబెడుతున్నారు. చిన్న వానలకే చెరువులను తలపిస్తున్న నగరంలో ఇక భారీ వర్షాలు, వరదలు వస్తే పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మిగిలింది. కేరళ తరహాలో వర్షాలు పడితే మన పరిస్థితేంటనే ఆందోళన ప్రజల్లో నెలకొంది. నగరంలో అభివృద్ధి పనుల కోసం కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తున్నా అవసరమైన పనులు జరగకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలు వస్తే జరిగే నష్టం మామూలుగా ఉండదని తెలిసినప్పటికీ ఆ స్థాయిలో పనులు కాకపోవడం గమనార్హం. ముందుచూపు కరువాయె.. కరీంనగర్ నగరపాలక సంస్థ ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టడం లేదు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు కాలం వెల్లదీస్తున్నారు. బల్దియా ఇంజినీరింగ్ విభాగంలో ముందు చూపు కరువైంది. వరద నీటి ఉధృతిని బట్టి డ్రెయినేజీలు నిర్మించడం లేదు. ఏళ్లుగా సమస్య ఉన్నప్పటికీ శాశ్వత పరిష్కారం చూపడంలో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికీ నగరంలోని పలు ప్రాంతాల్లో డ్రెయినేజీల నిర్మాణం అస్తవ్యస్తంగా తయారైంది. చిన్న వానకే డ్రెయినేజీలు పొంగిపొర్లుతూ మురుగునీరంతా ఇళ్లలోకి వచ్చి చేరుతోంది. కేరళలో జరిగిన జలప్రళయాన్ని తలచుకుని నగర ప్రజలు భయాందోళనకు గురువుతున్నారు. 2016 సెప్టెంబర్లో భారీ వర్షాలు కురువగా లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటితో మునిగిపోయాయి. ఆ సమయంలో మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్సింగ్ వరద ప్రాంతాల్లో సందర్శించి యుద్ధ ప్రాతిపదికన నూతన డ్రెయినేజీల నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రెండేళ్లు గడిచినా ఇప్పటికీ అతీగతీ లేకుండా పోయింది. కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నామని చెబుతున్న అధికారులు అవసరమైన చోట మాత్రం పనులు చేపట్టడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లోతట్టు జలమయం.. పలు డివిజన్లలోని లోతట్టు ప్రాంతాలు వర్షాకాలంలో చెరువులను తలపిస్తున్నాయి. జ్యోతినగర్, కురుమవాడ, ముకరంపుర, హరిహరనగర్, రాంనగర్, కరీంనగర్ డైరీ వెనుక ప్రాంతం, కోతిరాంపూర్, లక్ష్మీనగర్, భగత్నగర్, రాంచంద్రాపూర్కాలనీ, ఇందిరానగర్, అశోక్నగర్, హౌజింగ్బోర్డుకాలనీ, హుస్సేన్పుర, ఆమెర్నగర్, కోతిరాంపూర్ తదితర ప్రాంతాలు చిన్న వర్షానికే జలమయమవుతున్నాయి. వరదనీటిని మళ్లించడానికి ప్రణాళికాబద్ధంగా డ్రెయినేజీలు ఏర్పాటు చేయాల్సిన అధికారులు మురుగునీటి డ్రెయినేజీల ద్వారానే వరద నీరు వెళ్తోందని నిమ్మకుండి పోయారు. అయితే.. వరద నీటి తాకిడికి డ్రెయినేజీలన్నీ పొంగిపొర్లుతున్నాయి. దీంతో వరద నీరు ఎక్కడికక్కడ నిలిచి చెరువులను తలపిస్తోంది. ప్రధాన రహదారుల పరిస్థితి కూడా ఇలాగే ఉండడంతో వర్షం పడే సమయంలో ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. స్లమ్లకంటే అధ్వానం.. డ్రెయినేజీల నిర్మాణంలో ప్రణాళికాలోపంతో లోతట్టు ప్రాంతాలు ఉన్న డివిజన్లు స్లమ్ ఏరియాలుగా మారుతున్నాయి. కేవలం డ్రెయినేజీల లోపంతోనే ఈ సమస్య వస్తోంది. నీరు వెళ్లే మార్గాన్ని బట్టి డ్రెయినేజీల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. 15, 45 డివిజన్లలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. అయితే.. 40, 43, 44వ డివిజన్ల నుంచి వరద నీరు ఈ ప్రాంతాల మీదుగానే వెళ్తుండడంతో సమస్య తీవ్రంగా మారింది. అదేవిధంగా 14వ డివిజన్ ఇందిరానగర్, 1వ డివిజన్ సుభాష్నగర్, 8వ డివిజన్ హుస్సేనిపుర, 25వ డివిజన్ కోతిరాంపూర్లలో సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. వరద నీటికి తగిన విధంగా డ్రెయినేజీలు లేకపోవడం ఇబ్బందికరంగా మారుతోంది. వర్షం వెలిసిన తర్వాత ఆ ప్రాంతాలన్నీ బురదమయంగా మారి స్లమ్ ఏరియాలను తలపిస్తున్నాయి. నడవడానికి కూడా వీలులేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెద్ద డ్రెయినేజీలే పరిష్కారం.. భారీ వర్షాలు పడితే కలిగే ముప్పు నుంచి బయటపడాలంటే వరద నీటితో మునుగుతున్న లోతట్టు ప్రాంతాల్లో పెద్ద పెద్ద డ్రెయినేజీలు కట్టడమే దీనికి పరిష్కారమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డ్రెయినేజీలు పెద్దగా చేపట్టాలంటే రోడ్డును తవ్వడం తప్ప వేరే మార్గం లేదు. రోడ్డు మధ్యలో పెద్ద డ్రెయినేజీ నిర్మాణం చేపట్టి దానిపై స్లాబు వేస్తేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని స్థానికులు భావిస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుక్కోవాల్సిన అవసరం ఉంది. డ్రెయినేజీల నిర్మాణానికి రూ.20 కోట్లు.. లోతట్టు ప్రాంతాల్లో వరద ఉధృతిని తట్టుకునేలా డ్రెయినేజీల నిర్మాణానికి రూ.20 కోట్లతో పనులు చేపడుతున్నాం. నగరంలో ఎక్కడ ముంపు ప్రాంతముంటే అక్కడ పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు పూర్తిచేశాం. కొన్ని ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయి. త్వరలోనే కేటాయించిన నిధులు వెచ్చించి పనులన్నీ పూర్తిచేస్తాం. వరద నీటితో ప్రజలు ఇబ్బందులు పడకుండా తగిత చర్యలు చేపడతాం. – రవీందర్సింగ్, మేయర్ -
వరదలొస్తే ఏం చేస్తారు?
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘పెన్నానది పక్కనే అపార్టమెంట్ల నిర్మాణం చేపట్టారు. ఒకవేళ వరదలొస్తే ఏం చేస్తారు?, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు’ అని పీఏసీ (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ) చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అధికారులను ప్రశ్నించారు. సోమవారం ఆయన నెల్లూరులోని 54వ డివిజన్లో జానర్దన్రెడ్డికాలనీలో నిర్మిస్తున్న అపార్ట్మెంట్లను తన బృందంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడారు. నదికి వరదొస్తే ఎంతమేర తాకిడికి గురవుతుందని అడిగిన ప్రశ్నకు అధికారులు నీళ్లు నమిలారు. నది పక్కనే ఇటువంటి నిర్మాణాలు చేపట్టే సమయంలో అన్ని శాఖలను సమన్వయం చేసుకోవాలన్నారు. ఇరిగేషన్ శాఖ వద్ద ఉన్న పాత రికార్డులను çస్టడీ చేసి వరద తాకిడి లేని ప్రాంతంతో నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ సందర్బంగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్కుమార్ యాదవ్ ఈ ప్రాంత ప్రజల సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రవాహం వచ్చి వరదల తాకిడికి గురై ప్రజలు నష్టపోతే ఎవరు బాధ్యత వహిస్తారన్నారు. అపార్ట్మెంట్లు నిర్మించే ముందు భూసార పరీక్షలను ప్రభుత్వ సంస్థలతో కాకుండా ప్రయివేట్ సంస్థలతో చేయించారని బుగ్గనకు చెప్పారు. అధికారులు చెబుతున్నట్లు పెన్నానది పరీవాహక ప్రాంతం కాకపోతే పక్కనే నివాసాలు ఏర్పరచుకుని ఉన్న వందలాది కుటుంబాలకు రెవెన్యూ అధికారులు ఎందుకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదన్నారు. వరదలొస్తే అపార్ట్మెంట్లు మునిగిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. ఇళ్ల కోసం వినతి జనార్దన్రెడ్డికాలనీలో హిజ్రాల సంఘ నాయకురాలు అలేఖ్య సిటీ ఎమ్మెల్యే అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ రవిచంద్రకు ఇళ్ల స్థలాల కోసం వినతిపత్రం ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ 44 మంది పేద హిజ్రాలకు ఇళ్లు మంజూరు చేశారని, అయితే ఇంకా ఇళ్లు కేటాయించలేదని వారి దృష్టికి తెచ్చారు. ఆదిత్య నగర్లో పర్యటన నెల్లూరు(సెంట్రల్): నగరంలోని ఆదిత్య నగర్ ప్రాంతంలో అండర్గ్రౌండ్ డ్రెయినేజీ పనులను పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, సిటీ ఎమ్మెల్యే అనిల్కుమార్ యాదవ్తో కలిసి పరిశీలించారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే బుగ్గన దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో కమిటీలో సభ్యులు పిల్లి సుభాష్చంద్రబోస్, అప్పలనాయుడు, బీద రవిచంద్ర పాల్గొన్నారు. డ్రెయినేజీ పనులతో ప్రజల అవస్థలు రాజేంద్రనాథ్రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు సుదీర్ఘకాలంగా చేస్తుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. గుంటలు తవ్వి పూడ్చకుండా పనులు చేస్తుండటంతో ప్రజలు ప్రమాదాలబారిన పడటం తన దృష్టికి వచ్చిందన్నారు. గుంటలు తవ్విన స్థానంలో వేసిన రోడ్లు కూడా ఇళ్లున్న వాటికంటే ఎత్తులో ఉండటంతో వచ్చే సమస్యలను ప్రజలు తెలియజేశారన్నారు. పబ్లిక్హెల్త్ అధికారులు ఇటువంటి వాటిని గుర్తించాలన్నారు. పెద్ద ప్రాజెక్టులు చేపడుతున్న సమయంలో పబ్లిక్హెల్త్ అధికారులు పెద్ద నగరాల్లో జరుగుతున్న పనులను పరిశీలిస్తే అవగాహనతో పనులు చేయవచ్చన్నారు. అయితే అందుకు భిన్నంగా అధికారులు నెల్లూరులో వ్యవహరిస్తున్నారని, దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని చెప్పారు. పెన్నా నది ఒడ్డునే పెద్ద నిర్మాణాలు చేపట్టే సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వరదలు సంభవిస్తే ఎటువంటి రక్షణ చర్యలు తీసుకున్నారో అధికారులు చెప్పలేపోవడం దారుణమన్నారు. అనంతరం చైర్మన్ జనార్దన్రెడ్డికాలనీలో నగరపాలకసంస్థ ఆధ్వర్యంలోని ఐదు మిలియన్ లీటర్ల సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి కర్మాగారాన్ని పరిశీలించారు. దాని పనితీరు, ఎప్పటిలోగా పూర్తవుతుంది తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. చైర్మన్ వెంట కమిటీ సభ్యులు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్చంద్రబోస్ (వైఎస్సార్సీపీ), కె.అప్పలనాయుడు, టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, కార్పొరేషన్ కమిషనర్ అలీంబాషా పలు శాఖల అధికారులున్నారు. -
డ్రైనేజీలో దొరికిన అప్పుడే పుట్టిన బిడ్డ
-
మినరల్ కాదు.. గరళం
పాలకుల అసమర్థత.. అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి నగర ప్రజలు కాలకూట విషాన్ని తాగుతున్నారు. ప్రాణాధారమైన జీవజలాన్ని అందించలేక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రూ.కోట్ల బడ్జెట్ అంటూ గొప్పలు చెప్పుకుంటున్న పాలకులు తాగునీటి కోసం అందులో 0.02 శాతం నిధులు కూడా ఖర్చు చేయడం లేదని నగర పాలక సంస్థ లెక్కలే చెబుతున్నాయి. అధికార పార్టీ నేతలు నగర ప్రజలకు అన్ని ప్రాంతాలకు రెండు పూటలా తాగునీటిని సరఫరా చేస్తున్నామని అనేక సందర్భాల్లో ప్రచారం చేసుకున్నారు. వాస్తవంగా చూస్తే అందులో సగం మందికి కూడా నీటి సరఫరా కావడం లేదని నీటి లెక్కలే తేల్చుతున్నాయి. నగరవాసి, మున్సిపల్ మంత్రి నారాయణ ప్రజలకు మినరల్ వాటర్ ఇస్తామని చెబితే..మేయర్ అబ్దుల్ అజీజ్ ఓజోన్ వాటర్ అందిస్తామని ఇలా నిత్యం గొప్పలు చెబుతున్నారు. వాస్తవంగా కాలుష్యపూరితమైన కోలీఫాం జలాన్ని తాగిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నగరంలో 7 లక్షలు మంది జనాభా ఉండగా, 1.50 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ప్రతి వ్యక్తికి రోజుకు సగటున 90 నుంచి 100 లీటర్ల నీటి సరఫరా చేయాల్సి ఉండగా అధికారులు 105 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ పర్ డే) వంతున సరఫరా చేయాలని కాకి లెక్కల బడ్జెట్ను రూపొందించారు. అయితే నగర పాలక సంస్థ అధికారులు 85 ఎంఎల్డీ వంతున నీటిని సరఫరా చేస్తున్నట్లు రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. కానీ వాస్తవంగా అందుబాటులో ఉన్న నీటి వనరులు, సరఫరా చేస్తున్న నీటి లెక్కలు తేల్చితే 60 ఎంఎల్డీ వంతున కూడా సరఫరా చేయడం లేదని స్పష్టమవుతోంది. మొక్కుబడిగా క్లోరినేషన్ నగర ప్రజలకు సరఫరా చేసే నీటిలో క్లోరిన్ కలిపి పూర్తిగా శుద్ధి చేసి క్లోరినేషన్ ప్రక్రియ నిర్వహించాలి. అప్పుడే బాక్టీరియా కొంత మేరకు చనిపోయే అవకాశం ఉంది. కానీ అది మొక్కుబడిగా కూడా జరగడం లేదు. ముఖ్యంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల వద్ద ట్యాంకులు శుద్ధి చేయకపోవడం, వచ్చిన నీటిని శుద్ధిచేసి విడుదల చేయడంలేదు. కేవలం అలం, ఆర్ఎస్ఎఫ్, క్లోరిన్ బస్తాలు నీటిలో వేసి నీటిని వదులుతున్నారు. వాస్తవానికి చెరువు నీరు కావడంతో నీటిలో ఎటువంటి మినరల్స్, పోషకాలు ఉండవు. కానీ నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండడంతో ఈ కోలిఫాం ప్రబలడానకి ఆస్కారం ఉందని వైద్యులు చెబుతున్నారు. కాల్చిన చెట్టు బొగ్గును నీటిలో వేస్తే నీటిని శుభ్రం చేయడంతోపాటు రంగు, రుచిని మార్చే అవకాశం ఉంది. ఇది పూర్తి శాస్త్రీయ పద్ధతి. ఈ ప్రక్రియపై కూడా ఎప్పుడూ అధికారులు దృష్టి సారించలేదు. ప్రధానంగా స్టోరేజీ ట్యాంక్లో ఉండాల్సిన క్లోరోమీటర్తో పాటు ఇతర పరికరాలు సైతం తుప్పుపట్టి మూలనపడ్డాయి. ఏటా తాగునీటి సరఫరా ఖర్చు రూ.2.6 కోట్లే! నగరపాలక సంస్థ వార్షిక బడ్జెట్ రూ.1,500 కోట్లని పాలకులు గప్పాలు కొట్టుకుంటున్నా.. నగర ప్రజల తాగునీటి అవసరాల కోసం కేవలం రూ.2.6 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అంటే వార్షిక బడ్జెట్లో 0.02 శాతం మాత్రమే ఖర్చు చేస్తున్నారని స్పష్టమవుతోంది. వందల కోట్లు వార్షిక బడ్జెట్ ఉన్నా నగరంలో కనీసం అవసరాలకు సరిపడా నీరు ఇవ్వలేని దుస్థితిలో నగర పాలకులు ఉన్నారు. మంత్రి మినరల్ అంటే.. మేయర్ ఓజోన్ నగరంలో 7.5 లక్షల జనాభా ఉంటే కనీసం 3 లక్షల మందికి కూడా తాగునీరు సరఫరా చేయడం లేదు. అది కూడా పనికి రాని నీటిని తాగునీటిగా సరఫరా చేస్తున్నారు. నగరానికి చెందిన పి.నారాయణ రాష్ట్ర మున్సిపల్శాఖ మంత్రిగా, నగర మేయర్గా అబ్ధుల్ అజీజ్ ఉన్నారు. ఇద్దరు నగర ప్రజలకు సురక్షిత తాగునీరు అందిస్తామని నిత్యం ప్రకటనలు గుప్పిస్తుంటారు. ఒకరికి ఒకరు పోటాపోటీగా హామీలు ఇస్తున్నారు. మంత్రి నారాయణ అయితే ప్రతి ఇంటికి మినరల్ వాటర్ సరఫరా చేస్తామని చెబితే, మేయర్ అజీజ్ ఇంకో అడుగు మందుకు వేసి నగరంలో ఓజోన్ ప్లాంట్లు పెట్టి పూర్తిగా ఓజోన్ నీటి సరఫరా చేస్తామని ప్రకటించారు. వారంలో సగటున మూడు రోజులు మున్సిపల్ శాఖ మంత్రి పర్యటించే ప్రాంతంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నా పాలకులు కనీసం మెక్కుబడిగా అయినా స్పందిచని పరిస్థితి. గతేడాది నవంబర్ నుంచి నగరంలో కోలిఫాం బాక్టీరియా నీరు సరఫరా అవుతుందని అధికారులు మొదలు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల వరకు అందరూ చెబుతున్నా చర్యలు తీసుకోకపోవటం నగరపాలక దుస్థితికి నిదర్శనం. తాగునీరు దారుణంగా ఉంది నగరపాలక సంస్థ కుళాయిల నుంచి వచ్చే నీరు చూస్తే చాలా దారుణంగా ఉంటున్నాయి. వచ్చే నీళ్లు కూడా ఎప్పుడు వస్తాయో తెలియదు. వచ్చిన నీళ్లు కూడా మురికిగా దుర్గంధం భరితంగా ఉంటున్నాయి. దీంతో వాటిని వాడుకోవాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. – కుమారి, నెల్లూరు ఇంత దారుణమా మున్సిపల్ నీళ్లు తాగాలంటేనే భయం వేసే పరిస్థితి నెలకొంది. ఎక్కడ బడితే అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. ఏ పైపు ఎక్కడ తెగిపోయి, నీటి పైపుల్లో కలుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నీటిని వాడితే జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. – శివప్రసాద్, నెల్లూరు శరీర అవయవాలకు ప్రమాదం కోలిఫాం బాక్టీరియా ఉన్న నీటిని తాగితే శరీర అవయవాలు పాడయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ బాక్టీరియా ఉన్న నీటిని తాగిన వారికి విరోచనాలు కావడం, జ్వరం రావడం, మలంలో రక్తం పడటం, ఇన్ఫెక్షన్స్, కడుపు నొప్పి వస్తుంది. వీటన్నింటిని కలిపి డీసెంట్రీ జబ్బు అంటారు. డీహైడేషన్ వచ్చి కిడ్నీ పనితీరుపై ప్రభావం చూపుతుంది. కిడ్నీ సమస్య వల్ల ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి తాగేనీటిని కాచి చల్లార్చి వడపోసుకుని తాగాలి. – డాక్టర్ పీకే రెడ్డి, -
డ్రైనేజీ నీళ్లతో ఏం చేశారంటే...
సాక్షి, తిరువనంతపురం: సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో, కేరళ అధికారుల్లో కదలిక తీసుకొచ్చింది. హోటల్ సిబ్బంది మురుగు నీటితో ప్లేట్లు కడుగుతుండటం గమనించిన ఓ యువకుడు.. వీడియో తీసి వైరల్ చేశాడు. వివరాల్లోకి వెళ్లితే.. అలప్పుజా మున్సిపాలిటీ పరిధిలోని ఓ హోటల్ ప్రాంగణం వర్షాల కారణంగా వరద నీటితో నిండిపోయింది. పైగా హోటల్ డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతినటంతో ఆ నీరు కూడా వరద నీటిలో కలిసిపోయింది. ఈ క్రమంలో పక్కనే ఉన్న ఓ థియేటర్కు.. ఓ యువకుడు సినిమా చూసేందుకు వచ్చాడు. సరిగ్గా అదే సమయంలో ఆ దృశ్యం కనిపించేసరికి వీడియో తీసి.. వాట్సాప్ గ్రూప్లకు పంపించాడు. అది కాస్త వైరల్ కావటం.. ఆ వీడియో మున్సిపాలిటీ అధికారుల దృష్టికి రావటంతో హోటల్ను సీజ్ చేసి.. యాజమానికి జరిమానా విధించారు. -
మురుగునీటితో హోటల్ సిబ్బంది చేసిన నిర్వాకం
-
తొలకరి జల్లులు.. వ్యాధులు మొదలు
వానకాలం ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతోంది. ప్రస్తుతం చెదురుమదురు జల్లులు మాత్రమే కురుస్తున్నాయి. అయితే వానలు పూర్తిస్థాయిలో కురవడం ప్రారంభమయితే మురుగు కాలువలు పొంగిపొర్లుతాయి. చెత్తాచెదారాలు ఎక్కడికక్కడ పేరుకుపోయి నీటి వనరులు కలుషితమవుతాయి. ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా వ్యాధులు అంతుచూస్తాయి. నెల్లూరు(బారకాసు): వర్షాకాలం ప్రారంభంలోనే తొలకరితో మొదలయ్యే వ్యాధులు ఓ పట్టాన అంతు చిక్కవు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల విషయంలో వీటిని కట్టడి చేయడం సామాన్య విషయం కాదు. వర్షాలు పూర్గిగా పడక ముందే డయేరియా బాధితులు ఆస్పత్రులకు రావడం ప్రారంభమైంది. అయితే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధులు దరికి చేరవని వైద్య నిపుణుల పేర్కొంటున్నారు. డ్రైనేజీ వ్యవస్థ వల్లే వ్యాధులు నగరంలో అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజ్ వ్యవస్థ వల్ల అతిసార వంటి వ్యాధులు ప్రబలుతున్న విషయం తెలిసిందే. మంచినీటి పైపులైన్లలో లీకులు ఏర్పడి తాగునీరు కలుషితవుతోంది. అనంతరం ఆ నీటిని తాగిన ప్రజలు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రుల పాలవుతున్నారు. కాగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని శనివారం కలెక్టర్ ముత్యాలరాజు సమావేశం నిర్వహించి జిల్లా వైద్యారోగ్య, పంచాయితీరాజ్ శాఖల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా 12 సంచార వాహనాలు ఏర్పాటు చేశారు. సీజనల్ వ్యాధులకు కారణాలివే ఈ కొలైన్, సాల్మోనెల్లా, రోటా వైరస్ అనే వేల రకాల వైరస్లు, బ్యాక్టీరియా నీరు, ఆహారంలో కలిసినప్పుడు అతిసార, డయేరియా వ్యాధులు సోకుతాయి. కొన్ని రకాల వైరస్ల కారణంగా నీళ్ల విరోచనాలతో పాటు, రక్త విరోచనాలు కూడా అయ్యే అవకాశాలున్నాయి. గాలిలో తేమ ఎక్కువగా ఉండటం, వర్షంలో తడవడం వల్ల జలుబుతో పాటు వైరల్ ఫీవర్లు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. అతిసార వ్యాధికి కారణాలు కలుషిత నీరు, ఆహారం.లక్షణాలురోజులో 10 నుంచి 20 సార్లు నీళ్ల విరేచనాలతో పాటు వాంతులు అవుతుంటాయి. కలుషిత నీటి వల్ల వచ్చే ఈ వ్యాధి రోగి కుటుంబ సభ్యులతో పాటు ఆ ప్రాంతంలో అధిక సంఖ్యలో ఒకేసారి సోకుతుంది. రోగి త్వరగా డీహైడ్రేషన్కు గురై షాక్లోకి వెళ్లిపోతారు. ఈ వ్యాధి చిన్నారులు, మధుమేహ రోగులు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కళ్లు లోతుకు పోవడం, నీరసించిపోవడం, చురుకుదనం తగ్గి, మాట్లాడలేక పోవడం, చివరికి మూత్రం కూడా తగ్గి ఆ ప్రభావం కిడ్నీలపై పడుతుంది. అతిసారకు గురైన వారిని సాధ్యమైనంత త్వరగా ఆస్పత్రికి తీసుకువెళ్లాలి డయేరియా వ్యాధికి కారణాలు కలుషిత నీరు, కలుషిత ఆహారం, నిల్వ ఉన్న ఆహారం తీసుకోవడం లక్షణాలు నీళ్ల విరేచనాలు అవుతాయి. రోజులో నాలుగు నుంచి ఐదుసార్లు విరోచనం అయితే డయేరియాగా భావించాలి. చికిత్స ఎక్కువ సార్లు విరేచనాలు అవడం వల్ల శరీరంలోని నీరు, లవణాలు, పొటాషియం, గ్లూకోజ్ తగ్గిపోయి రోగి షాక్లోకి వెళ్లిపోతాడు. బీపీ పడిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రెండు మూడు సార్లు నీళ్ల విరేచనాలు అయినప్పుడు తక్షణమే వైద్యుని వద్దకు వెళ్లి చికిత్స పొందడం మంచిది. రక్త విరేచనాలు కలుషిత ఆహారం వల్ల వస్తాయి. తీవ్రమైన కడుపునొప్పితో రక్త విరేచనాలు అవుతుంటాయి. రక్తంతో కూడిన విరేచనం అవడం వల్ల ఇతర వ్యాధులని ప్రజలు అపోహ పడుతుంటారు. వీరి మలాన్ని పరీక్ష చేసి వ్యాధి కారకాన్ని గుర్తించాలి. జాగ్రత్తలు డయేరియా సోకిన రోగికి మామూలు వ్యక్తులు, చిన్నపిల్లలు దూరంగా ఉండాలి. లేకుంటే వారికి కూడా సోకే అవకాశం ఉంటుంది. రోగిని పట్టుకున్నప్పుడు చేతులను సబ్బుతో కడుక్కోవడం ద్వారా వ్యాధి సోకకుండా 90 శాతం అరికట్టవచ్చు వ్యాధి సోకిన రోగికి కొబ్బరినీళ్లు, మజ్జిగ, బార్లీనీళ్లు, ఓఆర్ఎస్ ద్రావణం ఇవ్వాలి. విరేచనాలు అవుతున్నప్పుడు పాలు, పండ్లు, ఆకుకూరలు ఇవ్వకూడదు. వేయించిన బ్రెడ్, లైట్ టీ, దోరగా పండిన అరటి పండు, అన్నం, పప్పు తీసుకోవచ్చు. విరేచనం తర్వాత తప్పనిసరిగా సుబ్బుతో చేతులు కడుక్కోవాలి. విరేచనాలు అవుతున్నప్పుడు ఒక లీటర్ నీటిలో ఓఆర్ఎస్ ప్యాకెట్ను కలిపి 3 నుంచి 4 గంటల వ్యవధిలో మొత్తం తాగాలి. -
బీర్ బాటిళ్ల జామ్.. అసెంబ్లీ వాయిదా!!
బీర్ బాటిళ్ల కారణంగా అసెంబ్లీ వాయిదా పడటం చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్ర విధాన్ భవన్లోని పవర్ హౌజ్ గదిలోకి నీళ్లు చేరటంతో సభను వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం అసెంబ్లీ సెక్రెటరీ ప్రకటించారు. అయితే అందుకుగల కారణం తెలిశాక అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ గత 57 ఏళ్లలో సమావేశాలు వాయిదా పడటం ఇది రెండోసారి. పవర్ హౌజ్లో నీరు చేరటంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా సభను వాయిదా వేశారు. అయితే భారీ వర్షం.. విధాన్ భవన్ డ్రైనేజీ బ్లాక్ కావటంతో నీరంతా టాన్స్ఫార్మర్ ఉన్న రూమ్లోకి చేరినట్లు అధికారులు తేల్చారు. దీంతో శుక్రవారం స్వయంగా స్పీకర్ హరిబౌ బగాదే స్వయంగా క్లీనింగ్ చర్యలను పర్యవేక్షించారు. తీరా సిబ్బంది డ్రైనేజీని శుభ్రపరుస్తుండగా బీరు బాటిళ్లు, ప్లాస్టిక్ కవర్లు భారీ మొత్తంలో బయటపడటంతో అంతా ఖంగుతిన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై దుమారం మొదలైంది. కాంగ్రెస్తోపాటు, శివ సేన.. బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ప్రభుత్వం పనితీరు ఇదేనని, నాగ్పూర్లో తొలిసారి వర్షాకాల సమావేశాలను నిర్వహిస్తుండగా ఏర్పాట్లు సరిగ్గా చేయలేకపోయారని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. -
వాన నీటిలో నారసింహుడు
యాదగిరికొండ(ఆలేరు) : రూపుదిద్దుకుంటున్న యాదాద్రి ప్రధానాలయంలోని స్వయంభు గర్భాలయం ముం దున్న ముఖమండపం బుధవారం రాత్రి కురిసిన వాననీటితో పూర్తిగా నిండిపోయింది. స్వయంభుమూర్తుల వద్దకు సైతం నీళ్లు వెళ్లాయని పనిచేసే కూలీలు పేర్కొన్నారు. ఇది చాలా అపచారమని, మనం కాళ్లతో తొక్కిన నీరు స్వామి వారిని తాకితే మంచిది కాదని కొందరు అర్చకులు తెలిపారు. ఆ నీటిలోనే నిలబడి ఆరగింపు, ఆరాధన, అభిషేకం కానిస్తున్నారు. కనీసం ఆలయ అర్చకులైనా ఈ విధానం సరైంది కాదని అధికారులకు చెప్పడం లేదు. స్వయంభుమూర్తుల వద్ద నీటిలోనే నిత్యకైంకర్యాలు మమ అనిపిస్తున్నారు. నిర్మాణానికి ముందే ఈ విధంగా వాన నీరు వస్తే ఏ చర్యలు తీసుకోవాలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు అంటున్నారు. ప్రస్తుతానికి మోటార్లతో నీటిని తోడేస్తున్నారు. ప్రతి నిర్మాణానికి డ్రెయినేజీ ముఖ్యమైంది. కానీ ఇంత పెద్ద నిర్మాణం చేపట్టిన అధికారులు వర్షపు నీరు వెళ్లే మార్గం ఆలోచించలేక పోయారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఆర్కిటెక్టు ఆనందసాయి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్రావులు మట్లాడుతూ కొండపూర్తిగా రాయితో నిండి ఉంద,ని రాయిని పగలకొట్టడం జరగలేదని తెలిపారు. కానీ భవిష్యత్లో డ్రెయినేజీ బయటకు కనిపించకుండా చేసి ఎవరూ ఊహించని రీతిలో నిర్మించనున్నట్టు చెప్పారు. -
పాపం.. పసిప్రాణం
వాళ్లు అభం శుభం తెలియని చిన్నారులు.. ఏది ప్రమాదమో.. ఏది ప్రమాదం కాదో తెలియని పసి వయసు వారిది.తోటి పిల్లలతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డారు. కడప నగరంలో ఓ నాలుగేళ్ల బాలుడు ఆడుకునేందుకు వెళ్లి డ్రైనేజీ కాలువలో శవమై తేలాడు.. పెనగలూరు మండలంలో మరో బాలుడు ఆడుకునేందుకు వెళ్లి చెరువులో పడి ప్రాణాలు వదిలాడు. ఈ రెండు సంఘటనలు మృతుల కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చాయి. కడప అర్బన్ : అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడికి నాలుగేళ్ల వయస్సులోనే నిండు నూరేళ్లు నిండిపోయాయి. తన సహచర చిన్నారులతో కలిసి రెండు రోజుల క్రితం ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటికి వెళ్లిన బాలుడు డ్రైనేజీ కాలువలో శవమై తేలడంతో ఆ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతంగా మారింది. కడప అర్బన్ సీఐ దారెడ్డి భాస్కర్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. కడప సాయిపేటకు చెందిన మహబూబ్ హుసేన్, సర్తాజ్బేగం దంపతుల కుమారుడు షేక్ మహమ్మద్ తౌసిఫ్ హుసేన్ (4) ఈనెల 5వ తేది సాయంత్రం తన సహచర చిన్నారులతో కలిసి ఆడుకునేందుకు బయటికి వెళ్లాడు. తర్వాత కనిపించలేదు. దీంతో కంగారు పడిన తౌసిఫ్ తల్లిదండ్రులు, బంధువులు అన్నిచోట్ల వెతికి పోలీసులను ఆశ్రయించారు. వారు ఈనెల 6వ తేదీ రాత్రి కేసు నమోదు చేశారు. తర్వాత దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గురువారం స్థానికులు డ్రైనేజీ కాలువలో ఇరుక్కుపోయిన బాలుడి మృతదేహాన్ని గమనించి బయటికి తీశారు. అప్పటికే శరీరమంతా ఉబ్బిపోయి తీవ్ర దుర్వాసనతో ఉంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. చిన్నారి తౌసిఫ్ మృతదేహాన్ని అంత్యక్రియలకు తీసుకు వెళతామని, పోస్టుమార్టం అవసరం లేదని బంధువులు పోలీసులను కోరారు. అయితే కేసు నమోదు చేసిన తర్వాత బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాల ని, అప్పుడే మరణానికి కారణం తెలుస్తుందని చెప్పి రిమ్స్ మార్చురీకి తరలించారు. మృతదేహాన్ని సందర్శించిన ఎమ్మెల్యే సంఘటన గురించి తెలుసుకున్న కడప ఎమ్మెల్యే ఎస్బీ అంజద్బాషా రిమ్స్ మార్చురీలో ఉన్న తౌసిఫ్ మృతదేహాన్ని సందర్శించారు. అక్కడున్న బాలుడి తల్లిదండ్రులను ఓదార్చారు. డ్రైనేజీ కాలువలో పడి మృతి చెందడం దురదృష్టకరమన్నారు. డ్రైనేజీ కాలువలో పూడికలు తీయాలని, చిన్నారులు తిరిగే ప్రాంతంలో ఇనుప కంచెలు ఏర్పాటు చేస్తే మంచిదన్నారు. -
లక్డీకపూల్లో దారుణం: నాలాలో పసికందు మృతదేహం
-
హైరదాబాదీల ఆందోళన
-
ఎన్నిసార్లు చెప్పాలి..?
విశాఖసిటీ: ప్రజలు ఇబ్బంది పడే చోట చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయాలని ఎన్నిసార్లు చెప్పాలి.? వర్షాకాలం వచ్చేస్తున్నా డ్రైనేజీ నిర్మాణం పూర్తికాకపోతే ఎలా? నాణ్యతతో కూడిన నిర్మాణాన్ని జూన్ నెలాఖరుకల్లా పూర్తి చేయాలంటూ జీవీఎంసీ కమిషనర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సాక్షి’లో ఈనెల 31న ‘మురుగు కాల్వలో కాసుల వేట’ పేరుతో ప్రచురితమైన కథనంపై కమిషనర్ స్పందించారు. గురువారం ఉదయం కాల్వ నిర్మాణ పనులను పరిశీలించారు. కోస్టల్ బ్యాటరీ నుంచి చేపట్టిన యూజీడీ కల్వర్టు పనుల్ని జూన్ నెలాఖరునాటికి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. తరచూ చెబుతున్నప్పటికీ పనులు సక్రమంగా నిర్వహించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బీచ్ సందర్శకులకు అసౌకర్యం కలగకుండా నాణ్యతతో కూడిన నిర్మాణాన్ని చేపట్టాలని ఆదేశించారు. ఈ పర్యటనలో ఎస్ఈలు వినయ్కుమార్, పల్లంరాజు, ఈఈలు గణేష్కుమార్, మహేష్, కేశవరెడ్డి, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
అదృశ్యమైన యువతి మృతదేహం లభ్యం
పశ్చిమగోదావరి,గణపవరం: గణపవరం మండలం కేశవరం గ్రామంలో శనివారం అదృశ్యమైన యువతి యనమదుర్రు మురుగు కాలువలో గుర్రపు డెక్కకింద శవమై తేలడంతో ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనమైంది. ఈ హత్య కేసును గణపవరం పోలీసులు ఛేదించారు. ఆదివారం యువతి మృత దేహాన్ని కాలువలోంచి వెలికితీసి పోస్ట్మార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలో మంచినీటి చెరువు సమీపంలో ఒక మహిళకు చెందిన చున్నీ, చెప్పులు, చెవి రింగుతో పాటు రక్తపు మరకలు కూడా కనిపించడంతో ఎవరో మహిళ హత్యకు గురైందనే ప్రచారం జోరుగా సాగింది. ఈ విషయం గ్రామంలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో కూడా తీవ్ర సంచలనం కల్గించింది. గణపవరం పోలీసులు గ్రామానికి వచ్చి సంఘటన స్థలంతో పాటు చుట్టూ గాలించిన ఎలాంటి ఆధారాలు లభించలేదు. డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేసినా, సమీపంలోని చెరువులో వలలతో వెతికించినా మహిళ ఆచూకీ లభించలేదు. దీంతో పాటు ఆ యువతితో సహజీవనం చేస్తున్న వ్యక్తి కూడా అదృశ్యమవడంతో కేసు మిస్టరీ వీడలేదు. అసలు ఆమె హత్యకు గురైందా? లేక మరే కారణం వల్లైనా రక్తపు మరకలు వచ్చాయా అనేకోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చివరకు ఆదివారం యువతి మృత దేహం లభ్యమవడంతో హత్యకేసు మిస్టరీ వీడింది. గణపవరం సీఐ శ్రీనివాసయాదవ్ సమాచారం ప్రకారం .., చాగల్లు మండలం మార్కొండపాడుకు చెందిన గుబ్బల శ్రీను అనే యువకుడు లక్ష్మీ అనే యువతితో కలిసి గణపవరం మండలం కేశవరం గ్రామంలోని బంధువు మునసా రాజయ్య ఇంట్లో కొద్ది రోజులుగా వారితో పాటే ఉంటున్నాడు. రాజయ్య, అతడికుమారుడు వీరబాబు, గుబ్బల శ్రీను మధ్య ఈ నెల 11న రాత్రి ఘర్షణ జరిగింది. అదే రోజు రాత్రి వీరు ముగ్గురు కలిసి లక్ష్మిని హత్య చేశారు. వీరందరి మధ్య పెనుగులాట వలన ఆ స్థలంలో యువతి చున్నీ, చెప్పులు, గాయమవడంతో రక్తపు మరకలు కనిపించాయి. ఎటువంటి ఆధారాలూ దొరక్కుండా చేయాలని ముగ్గురూ కలసి మృతదేహాన్ని సమీపంలోని యనమదుర్రు మురుగు కాలువలో గుర్రపుడెక్క కింద పూడ్చిపెట్టారు. ఆదివారం ఉదయం గుర్రపుడెక్కలో నుంచి మహిళ కాళ్లు కనిపించడంతో స్థానికులు వీఆర్వో చంద్రశేఖర్కు సమాచారం ఇవ్వడంతో ఆయన గణపవరం పోలీసులకు తెలిపారు. ఏలూరు డీఎస్పీ ఈశ్వరరావు, గణపవరం సీఐ శ్రీనివాసయాదవ్, ఇన్చార్జి ఎస్సై వీరబాబు సంఘటనా స్థలికి వచ్చి మృతదేహం వెలికి తీయించి పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితులు ముగ్గురూ పరారీలో ఉన్నారని వీరి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయని సీఐ శ్రీనివాస యాదవ్ తెలిపారు. -
శవాలై తిరిగొచ్చారు..
ఆ పసి మొగ్గలకు నీళ్లలో దిగి ఆడుకుంటే బాగుంటుందని తెలుసు.. కానీ నీళ్లలో ఈదాలని మాత్రం తెలియదు. తోటి మిత్రులతోపాటు కుంటలో తామూ దిగాలని తెలుసు.. కానీ ఆ కుంట ఎంత లోతు ఉంటుందో మాత్రం తెలియదు.అందరూ కలిసి నీళ్లలో ఉత్సాహంగా మునిగి తేలొచ్చని తెలుసు.. కానీ ఆ నీళ్లలో మునిగితే ఊపిరాడదని మాత్రం తెలియదు. గుంతలో దిగితే అమ్మనాన్న దండిస్తారని తెలుసు.. కానీ ఆ గుంత తమను మింగేస్తే వారి గుండెలు బద్దలవుతాయని మాత్రం తెలియదు.అందుకే రాజధాని ప్రాంతంలో అభంశుభం తెలియని ముగ్గురు చిన్నారులు రహదారి డ్రెయినేజీ గుంతలో పడి మృత్యువు ఒడిలో మునిగిపోయారు.పట్టుమని పదేళ్లు నిండకుండా కన్నపేగుపై నూరేళ్లకు సరిపడా విషాదం మిగిల్చి శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. దొండపాడు(తుళ్లూరురూరల్) : ఇంటిలో సందడిగా అప్పటి వరకు కళ్లెదుట అడుకున్న పిల్లలు అనంతలోకాలకు వెళ్లారనే సమాచారం తెలియడంతో ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. తుళ్లూరు మండలం దొండపాడు గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు శనివారం ఎన్–15 రహదారికి అంతర్గత డ్రెయినేజీ కోసం తీసిన పూడికలో ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డారు. బండి సాద్విక్(10) ఉప్పలపాటి అమల(10), ఉప్పలపాటి దినేష్(7) మృతుల్లో ఉన్నారు. శవాలై తిరిగొచ్చారే.. దొండపాడు గ్రామానికి చెందిన ఉప్పలపాటి రామకృష్ణ, త్రివేణిలకు అమల, దినేష్ సంతానం. అక్కాతమ్ముడు ఇద్దరు కలిసిమెలసి ఉండేవారు. తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుని జీవనం సాగించే వారు. రాజధాని ప్రాంతం కావడంతో పిల్లలకు మంచి చదువులు చదివించాలని ప్రైవేటు పాఠశాలలో చేర్పించారు. స్థోమతకు మించినా రెక్కల కష్టంతో చదివిస్తున్నారు. వారిపైనే ఆశలు పెట్టుకుని బతుకుతున్నారు. పగలు చేసిన కష్టమంతా సాయంత్రానికి బిడ్డలను చూసుకుని మరిచిపోయే వారికి .. శనివారం గుండె పగిలే కష్టం మిగిలింది. ఆడుకుంటానికి వెళ్లిన బిడ్డలు విగతజీవులై రావడంతో శోకసంద్రంలో మునిగిపోయారు.‘ఇప్పుడే ఇద్దరు బిడ్డలకు స్నానం చేయించి..ఎండ ఎక్కువగా ఉంది బయటకు వెళ్లవద్దని చెప్పి.. పనులకు వెళ్లామయ్యా..కొద్ది సేపటికే శవాలుగా ఇంటికి తిరిగొచ్చారే’..అంటూ పిల్లల మృతదేహాలపై పడి ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. ఇక మేమెవరి కోసం బతకాలంటూ ఆ తండ్రి కుప్పకూలిపోయాడు. వీరిని చూసిన ప్రతి ఒక్కరి గుండె కన్నీటి చెమ్మగా మారింది. కడుపుకోత మిగిల్చావు కదయ్యా.. చిన్నారి సాద్విక్ తల్లి దేవకి కూలీ పని, తండ్రి కిరణ్ అటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటారు. వీరికి ఇద్దరు బిడ్డలు. పెద్ద కుమారుడు సాద్విక్. కుమారుడి మృతి చెందిన విషయం తెలుసుకుని తండ్రి కిరణ్ స్పృహ కోల్పోయారు. తల్లి దేవకి ‘ఎంత పని చేశావు నాయనా.. కడుపుకోత మిగిల్చావు కదయ్యా’ అంటూ కన్నీరుమున్నీరైంది. ‘నా కొడుకుకి జరిగిన విధంగా ఎవరికీ జరగకూడదు...ఏ తల్లికి కడుపుకోత ఉండకూడదు.. త్వరగా ఆ పూడికను పూడ్చి వేయండయ్యా’ అంటూ విలపించింది. నిర్మాణ సంస్థలపై ఆగ్రహం... నిర్మాణ సంస్థల అధికారులు సంఘటన స్థలానికి రాకపోవడంపై గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ఇంత జరిగినా వారిని పిలవరా ? అని పోలీసులు, ఏడీసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణ సంస్థల ప్రతినిధులు వచ్చే వరకు రహదారిపై రాకపోకలు నిలిపివేస్తామంటూ హెచ్చరించారు. దీంతో తుళ్లూరు డీఏస్పీ పీ శ్రీనివాస్ గ్రామస్తులతో మాట్లాడి ఎన్ 15 రహదారి నిర్మాణ సంస్థ ప్రతినిధులను పిలిపించారు. గ్రామ పెద్దల సమక్షంలో మృతుల తల్లిదండ్రులకు చేయూతనిస్తామని వారితో భరోసా ఇప్పించారు. -
మురుగు తీసి..సమస్య తీర్చి..!
లింగోజిగూడ: మురుగునీరు రోడ్లపైకి వస్తుండడంతో స్థానికుల ఇబ్బందులను తొలగించేందుకు గురువారం హయత్నగర్ కార్పొరేటర్ సామ తిరుమల్రెడ్డి రంగంలోకి దిగారు. హయత్నగర్ డివిజన్ పరిధిలోని నర్సింహారావునగర్, శారదానగర్ జంక్షన్ వద్ద గడ్డిపొలాల యజమానులు డ్రైనేజీ మ్యాన్హోల్ను ధ్వంసం చేయడంతో మురుగునీరు పొంగి రోడ్లపైకి వస్తోందని అధికారులకు విన్నవించినా వారు పట్టించుకోలేదని కార్పొరేటర్ తిరుమల్రెడ్డి తెలిపారు. ప్రజల ఇబ్బందులను తాత్కాలికంగా తొలగించేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో కాల్వలోకి దిగి శుభ్రం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సమస్య శాశ్వత పరిష్కారానికి అధికారులు డ్రైనేజీ మ్యాన్హోల్ను నిర్మించాలని ఆయన కోరారు. -
నాగోల్ ఆర్టీఏ స్పెషల్.. వాహనాలకు మురుగు టెస్ట్
డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఏ కార్యాలయానికి వెళితే ఏం చేస్తారు..? ముందు వంకరటింకర ట్రాక్పై టెస్ట్లు పెడతారు. ఎగుడుదిగుడు రోడ్డుపైనా డ్రైవింగ్ నైపుణ్యం పరీక్షిస్తారు. కానీ నాగోల్ ఆర్టీఏ కార్యాలయంలో వీటికి అదనంగా ‘ముగురు టెస్ట్’ కూడా పెడతారు. మోకాల్లోతు నీటిలో వాహనాలను పరుగులు పెట్టించేవారికే లైసెన్స్ ఇస్తారన్నమాట..! లైసెన్స్ లేదనో.. ఇన్సూరెన్ చేయించలేదనో.. లేక సరైన వాహన పత్రాలు లేవనో నాగోల్ ఆర్టీఏ అధికారులు పట్టుకెళ్లిన వాహనాలకుకూడా మురుగు టెస్ట్లు చేస్తున్నారు. కావాలంటే ఒక్కసారి నాగోల్ ఆర్టీఏకు వెళ్లి చూడండి.. పట్టుబడిన మీ వాహనాల పరిస్థితిని తెలుసుకోంది. ఎందుకంటే వివిధ కేసుల్లో సీజ్ చేసి నాగోల్ ఆర్టీఏ ప్రాంగణంలో ఉంచిన ఆటోలు, బైకులు, కార్లు నాలుగు రోజులుగా మురుగు నీటిలో నానుతున్నాయి. సాక్షి, సిటీబ్యూరో: ప్రతి రోజు వందలాది మందికి డ్రైవింగ్ పరీక్షలు పెట్టి లైసెన్సులు జారీ చేసే నాగోల్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ సైతం నీటిలో మునిగిపోయింది. ట్రాక్లు, వాహనాల స్క్రాబ్యార్డు, కొత్తవాహనాలకు రిజిస్ట్రేషన్ చేసే కార్యాలయంతో సహా పలు కేంద్రాలు నాలుగు రోజులుగా నీటోలోనే మునిగి ఉన్నాయి. దీంతో పలు ట్రాక్లలో డ్రైవింగ్ పరీక్షలు నిలిపివేశారు. మోటారు వాహన నిబంధనల మేరకు స్వాధీనం చేసుకున్న సుమారు 500 వాహనాల్లో చాలా వరకు నీట మునిగాయి. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రైవేట్ బస్సులు, లారీలు, డీసీఎంలు, తదితర ఖరీదైన వాహనాలు సైతం ఇందులో ఉన్నాయి. మరోవైపు ట్రాక్ అంతా దుర్వాసన వ్యాపించింది. నాలా ఉప్పొంగిన ప్రతిసారీ ఇంతే.. హైదరాబాద్లోనే అతి పెద్ద పరీక్షా కేంద్రమైన నాగోల్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్కు చుట్టుపక్కల ఉన్న కాలనీల నుంచి భారీగా మురుగునీరు వచ్చి చేరుతున్నప్పటికీ ఇటు జీహెచ్ఎంసీ అధికారులు కానీ, అటు రవాణాశాఖ ఉన్నతాధికారులు గానీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పైగా ఈ సమ స్యపై ఆర్టీఏ నుంచి ఫిర్యాదు అందని కారణంగా జీహెచ్ఎంసీ పట్టించుకోలేదు. మురుగునీటిని తొలగించడం తమ విధి కాదన్నట్లుగా రవాణా అధికారులు భావించడం వల్ల 12 ఎకరాల విస్తీర్ణంలో 6 డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్లతో ఎంతో ప్రతిష్టాత్మకంగా కట్టించిన నాగోల్ ట్రా క్లో సగానికిపైగా నీటిలో మునిగిపోయింది. ఏటా ఇదే దుస్థితి... శాస్త్రీయమైన పద్ధతిలో, రహదారి భద్రతా నిబంధనలకు అనుగుణంగా డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించి వాహనదారులకు లైసెన్సులు జారీచేసేందుకు 2005లో నాగోల్ ట్రాక్ను నిర్మించారు. రాష్ట్రంలో ఈ తరహా ట్రాక్ పరీక్షలు మొదట ఇక్కడే మొదలయ్యాయి. రహదారులపై ఉండే మిట్టపల్లాలు, మలుపులు తదితర డ్రైవింగ్ టెస్ట్లకు అనుగుణంగా ఇక్కడ ట్రాక్లు నిర్మించారు. ఇలాంటి అతి పెద్ద ట్రాక్లో చాలాకాలంగా మురుగు నీరు చేరుతూనే ఉంది. అటు ఎల్బీనగర్ నుంచి ఇటు ట్రాక్కు దిగువన ఉన్న ఆదర్శనగర్ వరకు కనీసం 10 కాలనీల మురుగునీరు అంతా ఒకే నాలా నుంచి ప్రవహిస్తుంది. ఈ నాలా ఉప్పొంగిన ప్రతిసారీ ట్రాక్ మునిగిపోతుంది. ‘ఎలాంటి భారీ వర్షాలు లేవు. వరదలు లేవు. కానీ మురుగునీరు మాత్రం ట్రాక్ను ముంచేస్తుంది’.. అని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ఇదే పరిస్థితి ఎదురవుతున్నప్పటికీ శాశ్వత పరిష్కార చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. నిలిచిపోయిన సేవలు.. ప్రస్తుతం నాగోల్ ట్రాక్లో ‘హెచ్’ ఆకృతిలో ఉన్న 2 ట్రాక్లు, మరో ద్విచక్ర వాహన ట్రాక్ మురుగుతో నిండిపోయాయి. దీంతో వాహనదారుల డ్రైవింగ్ పరీక్షలు స్తంభించాయి. మొత్తం 6 ట్రాక్లలో మూడింటిలో మురుగు చేరడంతో మిగతా ముడూ ట్రాక్లలోనే పరిమితంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు మలక్పేట్ ఆర్టీఏ కార్యాలయానికి చెందిన రిజిస్ట్రేషన్ పనులకు కూడా తీవ్ర ఆటంకం ఏర్పడింది. ప్రతి రోజు మలక్పేట్కు చెందిన సుమారు 200 కొత్త వాహనాలకు నాగోల్లో రిజిస్ట్రేషన్ చేస్తారు. అలాగే పాతవాటికి ఫిట్నెస్ ధృవీకరిస్తారు. ప్రస్తుతం ఆర్సీ కార్యాలయం, వాహనాలకు పరీక్షలు నిర్వహించే షెడ్డు నీట మునగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నాలుగు రోజులుగా నాగోల్ ట్రాక్ నీటిలో మునిగి ఉన్న విషయం ఆర్టీఏ ఉన్నతాధికారులకు తెలిసినా పట్టనట్టు వ్యవహరించడం వినియోగదారులకు అందజేసే పౌరసేవల్లోని డొల్లతనాన్ని ప్రతిబింబిస్తోంది. -
ఉసురుతీసిన డ్రెయిన్
ఆమె వయసు 60 ఏళ్లు.. ఇంట్లో కాలక్షేపం చేయాల్సిన వయసు.. భర్తతో వేరుగా ఉండడంతో కుటుంబ భారం ఆమెపై పడింది. ఇంకా బతుకుపోరు సాగిస్తూనే ఉంది.. పొట్టకూటి కోసం ప్రతిరోజు ఇళ్లలో పనికి వెళ్తోంది.. రోజులాగే గురువారం పనికి వెళ్తుండగా డ్రెయిన్ కబళించింది... ఈ ఘటన కేఎల్రావునగర్లో చోటుచేసుకుంది. చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): కేఎల్రావునగర్ పిళ్లా సింహచలం వీధిలో గురజాపు దుర్గ(60) తన కుమార్తె సరస్వతితో కలసి ఉంటోంది. దుర్గ భర్త చిన్నారావు కొన్నేళ్లుగా భార్య నుంచి విడిగా ఉంటున్నాడు. దుర్గ, చిన్నారావులకు మొత్తం 5 గురు సంతానం, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ఒక కుమారుడు ఏడేళ్ల కిందట మృతి చెందాడు. కుమార్తె సరస్వతి భర్త చనిపోవడంతో తల్లి వద్దే ఉంటోంది. దుర్గ స్థానికంగా ఉండే ఇళ్లలో పనిచేస్తూ వచ్చే డబ్బులతో ఇంటి అద్దె, కుటుంబ పోషణ చూస్తోంది. ప్రమాదం ఎలా అంటే.. కేఎల్రావునగర్ మొదటి లైను వైపు నుంచి పని చేసే ఇంటికి దుర్గ వెళ్తూ డ్రెయిన్ దాటేందుకు ప్రయత్నించింది. డ్రెయిన్పై మూత లేకపోవడంతో జారి పడింది. డ్రెయిన్లో పడిన ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా ఆమె అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. అధికారుల నిర్లక్ష్యం.. అధికారుల నిర్లక్ష్యంతో ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు ఆరోపించారు. పనులు చేపట్టిన సంస్థ సకాలంలో పూర్తి చేయకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి అండగా.. మరో వైపు మృతురాలి కుటుంబానికి నష్ట పరిహారం ఇచ్చే వరకు మృతదేహాన్ని తరలించేది లేదని స్థానిక కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ నేతలు పట్టుబట్టారు. తొలుత మృతదేహాన్ని ఇంటికి తరలించాలని కోరిన పోలీసులు, తీరా కేసు నమోదు చేశాం.. పోస్టుమార్టంకు తరలించాలని కోరారు. దీంతో నాయకురాలు నన్నం దుర్గాదేవి, స్థానిక కార్పొరేటర్ నాగోతి నాగమణి, వైఎస్సార్ సీపీ నాయకులు విశ్వనాథ రవి, కట్టా మల్లేశ్వరరావు, కూరాకుల నాగ, పిళ్లా సూరిబాబు, టీడీపీ నాయకులు గుర్రం కొండలు బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. సీఐ మురళీకృష్ణ, వైఎస్సార్ సీపీ, టీడీపీ నాయకుల సమక్షంలో ఎల్అండ్టీ అధికారులతో చర్చించారు. చివరకు బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇచ్చేందుకు అంగీకరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. -
ప్లాస్టిక్ భూతం!
గ్రేటర్లో ప్లాస్టిక్ భూతం కోరలు చాస్తోంది. పేరుకు నిషేధం అమల్లో ఉన్నా బహిరంగ ప్రదేశాలు, నివాస సముదాయాలు, మార్కెట్లు..మాల్స్..ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కవర్లే దర్శనమిస్తున్నాయి. నిత్యం మన నగరంలో రెండు కోట్లకు పైగా ప్లాస్టిక్ కవర్లు ఉపయోగిస్తున్నారు. ఇవి క్రమంగా మహానగరంలోని ప్రధాన నాలాలు, వరద, మురుగునీటి పైపులైన్లలోకి చేరుతుండడంతో మురుగు నీటి ప్రవాహానికి తరచు ఆటంకాలు తలెత్తుతున్నాయి. వేసవి నేపథ్యంలో జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు ఇటీవల పలు ప్రాంతాల్లో డీసిల్టింగ్ ప్రక్రియ చేపట్టగా...పలు పైపులైన్లు, వరదనీటి కాల్వల్లో వెలికితీసిన వ్యర్థాల్లో 30 శాతం ప్లాస్టిక్ కవర్లే ఉన్నాయి. ఇవి నీటి ప్రవాహాన్ని నిరోధిస్తూ వరదలకు కారణమవుతున్నాయి. నిషేధం అమలుపై జీహెచ్ఎంసీ, పరిశ్రమలు, పీసీబీ తదితర విభాగాలు సీరియస్గా దృష్టి సారించకపోవడం..ప్రజలు, వ్యాపారుల్లో అవగాహన లేమి నగరవాసుల పాలిట శాపంగా మారుతోంది. సాక్షి, సిటీబ్యూరో:నగరంలో ప్లాస్టిక్ కవర్లు విచ్చలవిడిగా ఉపయోగిస్తున్న కారణంగా అవి వరద, మురుగు నీటి కాలువలు, పైపులైన్లలోకి చేరుతున్నాయి. వీటి వల్ల మురుగు ప్రవాహానికి పలు చోట్ల ఆటంకాలు ఎదురై ప్రధాన రహదారులు, వీధులు మురుగుకూపంగా మారుతున్నాయి. నిత్యం రెండు కోట్ల ప్లాస్టిక్ కవర్ల వినియోగం..? గ్రేటర్ జనాభా కోటికి చేరువైంది. ప్రతీ వ్యక్తి దైనందిన జీవితంలో కూరగాయలు, పండ్లు ఇతర నిత్యావసర సరుకులు, షాపింగ్ అవసరాలకు సరాసరిన రెండుచొప్పున వివిధ మందాలు కలిగిన ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తున్నట్లు పర్యావరణ వేత్తలు అంచనావేస్తున్నారు. గ్రేటర్ పరిధిలో రోజుకు సుమారు రెండుకోట్ల ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తుండడం పట్ల ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రెండేళ్లక్రితం వీటి వినియోగం రోజుకు 1.40 కోట్లు మాత్రమేనని చెబుతున్నారు. వినియోగిస్తున్న కవర్లలోనూ 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల కవర్లే సింహభాగం ఉంటున్నాయి. వీటిపై నిషేధం అమల్లో ఉన్నప్పటికీ ప్లాస్టిక్ కవర్ల వినియోగం ఎక్కడా తగ్గుముఖం పట్టకపోగా క్రమంగా పెరగడం గమనార్హం. ఈ కవర్లు గాలి, నీరు, నేల, భూగర్భజల కాలుష్యానికి ప్రధానంగా కారణమౌతున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రక్షాళనలో 30 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలే..! గ్రేటర్ పరిధిలో సుమారు 6 వేల కిలోమీటర్ల మేర మురుగునీటి పైపులైన్లు, మరో 1500 కిలోమీటర్ల మేర నాలాలు విస్తరించి ఉన్నాయి. వేసవి కార్యాచరణ ప్రణాళిక అమల్లో భాగంగా జీహెచ్ఎంసీ, జలమండలి విభాగాలు ఆయా పైపులైన్లు, నాలాల్లో పూడిక తీత పనులు చేపట్టాయి. ఈ పనుల్లో భాగంగా తొలగిస్తున్న ఘన వ్యర్థాల్లో సుమారు 30 శాతం ప్లాస్టిక్ కవర్లే దర్శనమిస్తున్నట్లు సంబంధిత అధికారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు, మాల్స్, రెస్టారెంట్ల నుంచి పెద్దమొత్తంలో ప్లాస్టిక్ కవర్లు తొలుత చెత్తలో అటు నుంచి క్రమంగా మురుగునీటి పైపులైన్లు, నాలాల్లోకి చేరుతుండడంతో మురుగు ప్రవాహానికి తరచూ ఆటంకాలు తలెత్తి మురుగునీరు ఉప్పొంగి సమీప కాలనీలు, బస్తీలను ముంచెత్తుతున్నాయి. తూతూమంత్రంగానే నిషేధం.. గ్రేటర్ పరిధిలో 50 మైక్రాన్లలోపున్న ప్లాస్టిక్ కవర్లను నిషేధించినప్పటికీ పూర్తిస్థాయిలో అమలవుతున్న దాఖలాలు కనిపించడంలేదు. బల్దియా అధికారులు దాడులు చేసి అక్రమార్కులపై తరచూ జరిమానాలు విధిస్తున్నప్పటికీ వారిలో మార్పు కనిపించడంలేదు. ఇక మహానగరం పరిధిలో సుమారు వెయ్యి వరకు ప్లాస్టిక్ కవర్ల తయారీ సంస్థలుండగా..వీటిలో నిబంధనల ప్రకారం అనుమతి పొందిన కంపెనీలు సగమైనా లేవన్నది పరిశ్రమల శాఖ వర్గాలు చెబుతుండడం గమనార్హం. అంటే ప్లాస్టిక్ కవర్ల తయారీ మొదలు వినియోగం వరకు ఎక్కడా పటిష్ట నిఘా, నియంత్రణ, కఠిన శిక్షలు, అవగాహన లేకపోవడంతో ప్లాస్టిక్ మహమ్మారిని తరిమికొట్టడంలో ఆయా విభాగాలు చతికిలపడుతున్నట్లు సుస్పష్టమౌతోంది. జనచేతనే కీలకం.. ప్లాస్టిక్ వినియోగం విషయంలో చట్టాలెన్ని ఉన్నా ప్రజల్లో అవగాహన, చైతన్యమే కీలకమని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. ఇంటి నుంచి మార్కెట్లు, షాపింగ్కు వెళ్లే సమయంలో పేపర్బ్యాగులు, గోనెసంచులను వెంట తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. పండ్లు, కూరగాయాలు, మాంసం సహా ఇతర నిత్యావసరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కవర్లలో ఇంటికి తీసుకురావద్దని సూచిస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లు వాటి మందాన్ని బట్టి విఛ్చిన్నమై పర్యావరణంలో కలిసేందుకు 200–1000 సవత్సరాలు పడుతుండడంతో ఈ పరిణామం పర్యావరణానికేకాదు మానవ ఆరోగ్యంపైనా దుష్ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లు భూగర్భజలాలను సైతం విషతుల్యంగా మార్చేస్తున్నాయంటున్నారు. -
తల, మొండెం వేరు చేసి.. గోనె సంచిలో కుక్కి
భైంసా: ఎక్కడో హత్య చేసి.. వేరు చేసిన తల, మొండాన్ని గోనె సంచిలో కుక్కిన దుండగులు శుక్రవారం నిర్మల్ జిల్లా భైంసా పట్టణం నరసింహనగర్ రోడ్డు లోని డ్రైనేజీలో పడేశారు. ఉదయం డ్రైనేజీని శుభ్రం చేసేందుకు వచ్చిన పారిశుధ్య సిబ్బంది సంచిని బయటకు తీయగా తల రాలి కిందపడింది. భయ కంపితులైన వారు పోలీసులకు సమాచారం అందించగా, డీఎస్పీ అందె రాములు ఘటనాస్థలానికి చేరుకుని పోలీసు జాగిలాలతో తనిఖీ చేయించారు. మృతుడి తలను భైంసాలోని ఏరియ ఆస్పత్రిలో భద్రపరిచారు. సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు దుండగులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. -
పాస్బుక్లో నాలా భూములూ నమోదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతుల అదీనంలో ఉన్న వ్యవసాయేతర (నాలా) భూములను కూడా పక్కాగా రికార్డు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ భూములకు పెట్టుబడి సాయం పథకం అమలు నేపథ్యంలో వ్యవసాయేతర భూములకు ఎట్టి పరిస్థితుల్లో సాయం అందకుండా చూడటంతో పాటు భవిష్యత్తులో క్రయవిక్రయ లావాదేవీలను సులభతరం చేసేందుకు నాలా భూముల వివరాలను కూడా రైతుల పాస్ పుస్తకంలో నమోదు చేయనున్నారు. ఇందుకోసం పాస్పుస్తకంలో ప్రత్యేక కాలమ్ను ఏర్పాటు చేస్తున్నారు. కాగా, భూరికార్డుల ప్రక్షాళన అనంతరం రాష్ట్రంలో మొత్తం 15,16,873 ఎకరాల వ్యవసాయేతర భూములు ఉన్నట్లు తేలింది. అందులో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 2.65 లక్షల పైచిలుకు ఎకరాలు ఉన్నాయి. -
సమస్యల.. బాబుక్యాంపు
కొత్తగూడెం (అర్బన్) : పట్టణంలోని బాబుక్యాంపు ఏరియాలో సమస్యలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా కూడా పట్టించుకోవడం స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాబుక్యాంపులో ఇటీవల జరిగిన రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఇరువైపులా డ్రెయినేజీల నిర్మాణం చేపట్టారు. అందులో భాగంగా రోడ్డు తవ్వకాలలో వెలువడిన మట్టి డ్రెయినేజీలలో పూడుకుపోయి మురికి నీరు ముందుకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. డ్రెయినేజీలలో మురికి నీరు నిండిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. స్థానికులు చెత్తచెదారం రోడ్డుపై, డ్రైనేజీలలో వేయడం వలన మురికి నీరు ముందుకు వెళ్లే అవకాశం లేదు. దీని వలన దోమలు, ఈగలు వ్యాప్తి చెందుతున్నాయని పేర్కొం టున్నారు. డ్రైనేజీలో పేరుకపోయిన మట్టి, చెత్తను తొలగించి మురికి నీరు ముందుకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. బాబుక్యాంపు పరిధిలోని చెమన్బస్తీ, బర్మాక్యాంపు ఏరియాలలో డ్రైనేజీలు లేక రోడ్లపైనే మురికి నీరు పారుతుంది. ప్రమాదభరితంగా సంపులు బాబుక్యాంపు ఏరియాలోని కొన్ని విధుల్లో మ్యాన్ హోల్స్ ప్రమాదభరితంగా ఉండడం వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో తెలియని వారు అందులో పడి గాయాలపాలవుతున్నారు. సం పుపై మూతలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులు, సిబ్బందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సంపుపై మూతను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. పారిశుద్ధ్య వ్యవస్థను మెరుగుపర్చాలి బర్మాక్యాంపు, చమన్బస్తీ ఏరియాల్లో పారిశుద్ధ్య వ్యవస్థను మెరుగు పర్చాలి. కొన్ని చోట్ల డ్రైనేజీలు లేకపోవడం వలన రోడ్లపై మురికి నీరు పారుతుంది. – అనసూర్య, బాబుక్యాంపు సంపులపై మూతలు ఏర్పాటు చేయాలి సింగరేణి పంపులకు సంబంధించిన సంపులు రోడ్ల వెంబడి ఉన్నాయి. వాటిపై మూతలు లేకపోవడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయి. చిన్నపిల్లలు పడితే ప్రాణనష్టం జరిగే అవకాశముంది. – సరిత, బాబుక్యాంపు -
పేరుకున్న మురుగు
ఖమ్మం (సహకారనగర్) : నగరంలోని 25వ డివిజన్లోని విజయ్నగర్కాలనీ–2లోని పలు ప్రాంతాల్లోని ప్రజలు సమస్యలతో అల్లాడుతున్నారు. అనేక కాలనీల్లో సైడ్ కాల్వలు లేక పోవడంతో ఎక్కడి మురుగు అక్కడే పేరుకపోతోంది. దీంతో దుర్వాసనతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. మురుగును తొలగించటంలో అధికారులు జాప్యం చేయడం మూలంగా మురుగు కంపుతో దినదినగండంగా గడపాల్సిన పరిస్థితి నెలకొందని స్థానికులు ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది మురుగును తొలగించటంలో నిర్లక్ష్యం చేస్తుండగా అధికారులు మాత్రం దృష్టి కేంద్రీకరించటం లేదని విమర్శిస్తున్నారు. నిత్యం మురుగు వాసనే.. విజయ్నగర్కాలనీ–2లోని పలు వీధుల్లోని ప్రజలు మురుగు కంపు భరించలేకపోతున్నామని చెబుతున్నారు. పొద్దున లేచింది మొదలు పడుకునేవరకు ఆ దుర్వాసననే పీల్చుకోవాల్సి వస్తోందని, చిన్న పిల్లలు రోగాలబారిన పడుతున్నారని పేర్కొన్నారు. వర్షాకాలం నుంచి వేసవి కాలం వచ్చేంత వరకు కూడా నిత్యం మురుగు సమస్య వేధిస్తూనే ఉందనే ఆరోపణలున్నాయి. గతంలో ఒకట్రెండు సార్లు స్థానికులు ఫిర్యాదు చేయగా సమస్యను పరిష్కరించిన అధికారులు ఆ తర్వాత పట్టించుకోవటం లేదనే చెబుతున్నారు. డివిజన్లోని పలు ప్రధాన రహదారులతోపాటు అంతర్గత రహదారుల వెంట కూడా సైడ్డ్రెయిన్లు లేకపోవటంతో ఎక్కడి మురుగు అక్కడే నిలిచిపోవటంతో స్థానికంగా నివాసం ఉండేందుకు ఆసక్తి కనబర్చటం లేదనే ఆరోపణలున్నాయి. మొలిచి, ఎండి.. మురికికూపంగా.. ఖాళీ స్థలాలు అధికంగా ఉండటంతో ఆయా ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి అడవిని తలపిస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం మురికికూపండా మారాయిని, గతంలో కురిసిన వర్షం నీరు ఇంకా అక్కడే నిలిచి ఉండటం, అందులో నాచు విపరీతంగా పెరిగి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోందని స్థానికులు మండిపడుతున్నారు. అధికారులు ఖాళీ స్థలాల నిర్వాహకులకు నోటీసులు ఇచ్చి ఆయా ప్రాంతాలను శుభ్రం చేయించటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అధికారులు స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించటంలో పూర్తిగా విఫలమవుతున్నారని ఆయా ప్రాంతాలవాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా స్థానికుల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
అడుగడుగునా సమస్యలే..
ఖమ్మంఅర్బన్ : నగరంలోని మమత వైద్యశాల రోడ్డులోని కాలనీల ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ‘పైన పఠారం, లోన లొటారం’ అన్న చందంగా మారింది. రోడ్డుకు ఇరువైపుల పదుల సంఖ్యలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి. వారంతా క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తున్నా కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు లోఓల్టేజీ సమస్యను తీర్చాలనే అభిప్రాయంతో ఏడాదిన్నర కిందట సబ్స్టేషన్ నిర్మాణం కోసం రూ.కోటి నిధులు కేటాయించి, నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత ఆ స్థలం కోర్టు వివాదంతో పనులు నిలిచి పోవడంతో సమస్య తీరలేదు. పరిసరాల కాలనీల పరిధిలో లోఓల్టేజీ సమస్యతోపాటు తరచూ అంతరాయం జరుగుతూ ఇబ్బంది పడుతున్న నివాసులు వాపోతున్నారు. కాలనీలో అందమైన భవనాలు ఉన్నాయి. కొన్ని రహదారులకు డ్రెయిన్లు ఉన్నప్పటికీ రెగ్యులర్గా శుభ్రం చేయక పోవడం వల్ల కంపచెట్లు అల్లుకుని ఆనవాళ్లు లేకుండా పోయాయి. కచ్చా డ్రెయిన్లు ఉన్న వీధుల్లో మురుగునీరు పోయే విధంగా లేక పోవడంతో ఎక్కడి మురుగు అక్కడ నిలిచి కంపు కొడుతోందని కాలనీవాసులు వాపోతున్నారు. మురుగునీరు నిలవడంతో దోమలు, పశువులు స్వైరవిహారం చేస్తున్నాయని కాలనీవాసులు వాపోతున్నారు. రోడ్లు కూడా పూర్తిస్థాయిలో నిర్మించలేదని, ఖాళీ స్థలాల్లో కూడా పెద్ద పెద్ద కంపచెట్లు పెరిగి చిన్న పాటి అడవిని తలపిస్తున్నాయి. రాఘవయ్యనగర్, వరదయ్యనగర్, ఒయాసిస్రోడ్డు తదితర 22వ డివిజన్, 10వ డివిజన్, 11వ డివిజన్ పరిధిలోని నివాసులు సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. ఈ కాలనీల పరిధిలో నుంచి లకారం చెరువుకు నీరు అందించే మేజర్ కాలువ లైనింగ్ లేకపోవడంతోపాటు ఇళ్లు ఆనుకొని ఉండటం వల్ల నీరు కలుషితం కావడంతోపాటు నీరు నిలిపివేసి తర్వాత సమీపంలోని నివాసాల వాడకం నీరు చేరి మురుగు కంపు కొడుతోందని గృహ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు లేదు.. డ్రెయిన్లు లేవు... తమ కాలనీలో రోడ్డు లేదు. డ్రెయిన్లు లేకపోవడం వల్ల మురుగుకంపు వస్తోంది. ఖాళీ స్థలాల్లో కంపచెట్లు పెరిగి భయంకరంగా మారాయి. పారిశుద్ధ్య కార్మికులు రాక పోవడం వల్ల డ్రెయిన్లు అధ్వానంగా మారుతున్నాయి. పన్నులు మాత్రం క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాం. కానీ, కార్పొరేషన్ నుంచి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. -మందడపు వెంకటేశ్వరరావు, కాలనీవాసి సబ్స్టేషన్ పూర్తయితే విద్యుత్ సమస్య ఉండదు మమత వైద్యశాల రోడ్డులో సబ్స్టేషన్ నిర్మాణం పూర్తయితే ఆ ప్రాంతంలో విద్యుత్ సమస్యలు దాదాపు ఉండక పోవచ్చు. ప్రస్తుతం రోటరీనగర్ సబ్ స్టేషన్ నుంచి ఇవ్వాల్సి వస్తోంది. దీంతో అధికలోడు కారణంగా అప్పుడప్పుడు సమస్య ఎదురవుతోంది. తాత్కాలికంగా సమస్యల నుంచి గట్టెక్కడానికి 100 కేవీ ట్రాన్స్ఫార్మర్లు 160 కేవీగా మార్చేందుకు 3 ట్రాన్స్ఫార్మర్ల కోసం ప్రతిపాదనలు పంపాం. కొత్తగా మరో 100 కేవీ ట్రాన్స్ఫార్మర్లు 10 మంజూరుకు ప్రతిపాదనలు పంపాం. అవి మంజూరైతే సమస్య చాలా వరకు తగ్గుతుంది. -జె.శ్రీధర్రెడ్డి, విద్యుత్ ఏఈ -
మురుగు పరుగు
మురుగు రోడ్లపై పారుతుండటంతో స్థానికులు అవస్థలుపడుతున్నారు. స్వచ్ఛభారత్, స్వచ్ఛగ్రామంపై విస్తృతంగా ప్రచారంచేసే నాయకులు స్థానిక పారిశుద్ధ్య సమస్యలు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు వాపోతున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా ఉందని, వ్యాపారాలు చేసుకోలేకపోతున్నామని చిరువ్యాపారులు చెబుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాలని కోరుతున్నారు. అల్లాదుర్గం(మెదక్) : అల్లాదుర్గం బస్టాండ్ ప్రాంతంలో మురుగు కాల్వ నిండింది. ఈ ప్రాంతంలో చికెట్, మటన్ దుకాణాలు ఉన్నాయి. ఇళ్ల వాడకం నీరు, కోళ్ల వ్యర్థాలు కాల్వలో వేస్తుండటంతో మురుగు పారుదల నిలిచిపోతోంది. ఫలితంగా మురుగు రోడ్లపై పారుతోంది. అంతేకాకుండా బస్టాండ్ పరిసర నివాసాల మరుగుదొడ్ల పైపులుకూడా మోరీకి కలపడంతో దుర్వాసన వస్తోందని, ఆ ప్రాంతంలో ముక్కుమూసుకుని నిలబడాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇక చికెన్ షాపు యజమానులు వ్యర్థాలను ఎల్లమ్మ దేవాలయం పరిసరాల్లో వేస్తుడటంతో దుర్వాసన భరించలేకపోతున్నామని చెబుతున్నారు. సమస్యపై సర్పంచ్, పంచాయతీ అధికారులకు ఫిర్యాదుచేసినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదని మండిపడుతున్నారు. ఇక మురుగు కాల్వలకు కలిపిన పైపులు చెత్తాచెదారంతో నిండి జామవుతుండటంతో ఈ పరిస్థితి నెలకొందని తెలిపారు. మురుగు కాల్వలు, పైపులు శుభ్రం చేస్తే సమస్య పరిష్కారమవుతుందన్నారు. ప్రజల అవస్థలు, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. దుర్వాసనతో ఇబ్బంది మురుగు పారుగుదల నిలిచి రోడ్లపై పారుతుండటంతో దుర్వాసన వస్తోంది. హోటళ్లలో ఉండలేని పరిస్థితి నేలకొంది. అ«ధికారులు పట్టించుకోవడంలేదు. పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాలి. -గడ్డం రమేశ్, హోటల్ యజమాని, అల్లాదుర్గం మురుగంతా రోడ్డు పైనే మురుగు కాల్వలు చెత్తాచేదారంతో నిండిపోయాయి. మురుగంతా రోడ్డుపైనే. బస్టాండ్ ప్రాంతంలో తోపుడు బండ్ల వ్యాపారులు ఎక్కువ. వారు నిలబడలేని పరిస్థితి. దుర్వాసనతో ఇబ్బందిపడుతున్నాం. – అశ్సు, పండ్ల వ్యాపారి, అల్లాదుర్గం -
డ్రోన్లతో అభివృద్ధి పనుల పరిశీలన
సాక్షి, అమరావతి: ఇకపై మున్సిపాలిటీల్లో జరిగే అభివృద్ధి పనుల్ని డ్రోన్ల నుంచి తీసుకునే ఫుటేజీల ద్వారానే తెలుసుకుంటామని, దీన్నిబట్టే మున్సిపాలిటీలకు ర్యాంకులు ఇస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. బుధవారం ఆయన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మార్చి నాటికి డ్రోన్లను అందించాలని, డ్రోన్ నుంచి 3 వేల చదరపు కిలోమీటర్ల మేరకు ఫుటేజీలు తీసి పంపించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. వచ్చే మార్చి 15 నాటికి మున్సిపాలిటీలకు 200 డ్రోన్లను అందించాలని ఆదేశించారు. డిసెంబర్ నాటికి డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని, ఈ పనుల్ని షాపూర్జీ పల్లోంజీకి అప్పగించినట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలో 444 కిలోమీటర్ల మేరకు పెద్ద, చిన్నతరహా డ్రైన్లను నిర్మించేందుకు ఎల్అండ్టీకి పనులప్పగించామని, ఇవి నవంబర్ 1లోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వెలగపూడిలోని సచివాయంలో స్మార్ట్ సైకిళ్ల సవారీని సీఎం చంద్రబాబు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని మాస్టర్ప్లాన్ ప్రకారం సీఆర్డీఏ పరిధిలో సైకిల్ సవారీకి ప్రత్యేకంగా ట్రాక్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. -
మురుగు పారేదెలా..
మంచిర్యాలటౌన్ : మంచిర్యాల పట్టణంలోని రాంనగర్లో డ్రెయినేజీలు పూర్తిగా చెత్తతో నిండిపోయాయి. దీంతో మురు గు నీరు సరిగ్గా పారడం లేదు. ఒకే చోట నీరు నిలిచి పోవడంతో దుర్గంధం వెదజల్లుతుంది. దోమలు విజృంభిస్తున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. నిత్యం ఇక్కడ చెత్తకుప్పగా తయారు కావడం వల్ల వాసన భరించలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పట్టించుకుని డ్రెయినేజీలో చెత్తా చెదారాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. -
మురుగు లేకుండా చూడాలి
బెల్లంపల్లి : కన్నెపల్లి మండల కేంద్రంలో ఉన్న కస్తూరిబా బాలికల విద్యాలయానికి వెళ్లే దారి మురుగు నీరుతో బురదమయంగా ఉంటుంది. మురుగు కాలువ నిర్మించకపోవడంతో రోడ్డుపై నీరు ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఈ మార్గం మీదుగా రాకపోకలు చేసే ప్రజలు, విద్యార్థులు అసౌకర్యానికి గురవుతున్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
మురికి కాలువలో పసిపాప మృతదేహం
సాక్షి, జనగాం: కళ్లు తెరిచి వారం రోజులు కూడా కాలేదు. కానీ నిండు నూరేళ్లు నిండిపోయాయి.. కాదు కాదు నింపేశారు. ఎవరు చేశారో తెలీదు కాని ఈ ప్రపంచంలోకి వచ్చిన వారం రోజులకే ఆ పసిప్రాణాన్ని మురికి కాలువలో కలిపేశారు. వివరాల్లోకి వెళ్తే జనగామ జిల్లాలో మరో దారుణం జరిగింది. కళ్లు తెరిచి వారం రోజులు కాకుండానే రోజుల వయసున్న పసిపాప మృతదేహం మురికి కాలువలో కనిపించింది. పాప చేతికి ఉన్న ట్యాగ్పై నవనీత, నర్సింహులు అనే పేర్లు ఉన్నాయి. స్థానికులు ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మార్వాడీలకు పరిశుభ్రతంటే తెలియదు
నంద్యాల అర్బన్: ‘మార్వాడీలకు పరిశుభ్రతంటే తెలియదు. ఇళ్లలోని చెత్తా చెదారాన్ని మురుగు కాలువల్లో వేస్తూ అపరిశుభ్రతకు కారణమవుతున్నారు’ అని శాసనమండలి చైర్మన్ ఎన్ఎండీ ఫరూక్ వ్యాఖ్యానించారు. కాలువలు చెత్తతో నిండి మురుగునీరు రోడ్లపైకి వస్తోందని, ఇందుకు కారణమైన మార్వాడీలపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని 9వ వార్డులో జరిగిన ‘జన్మభూమి–మాఊరు’ కార్యక్రమంలో గురువారం ఆయన మాట్లాడారు. పరిశుభ్రతకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలకు కొందరు విఘాతం కలిగిస్తున్నారని మండిపడ్డారు.బైర్మల్ వీధిలోని తన ఇంటి పరిసరాల్లో ఉంటున్న మార్వాడీలు చెత్తంతా మురుగు కాలువల్లో వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులైన మార్వాడీలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
వెంకటయ్య..వెరీ లక్కీ
సోమాజిగూడ: ఓ సాధారణ పారిశుధ్య కార్మికుడు ఫైవ్ స్టార్ హోటల్ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. జీహెచ్ఎంసీ కార్మికుడు వెంకటయ్యకు ఆ అదృష్టం దక్కింది. చిత్తశుద్ధితో పారిశుధ్య విధులు నిర్వహించి దేశవ్యాప్త గుర్తింపు పొందిన వెంకటయ్యను సోమాజిగూడలోని మెర్క్యుర్ హోటల్ నిర్వాహకులు సోమవారం జరిగిన వార్షికోత్సవానికి ప్రత్యేకంగా ఆహ్వానించి గౌరవించారు. అంకితభావంతో విధులు నిర్వహించే వారికి సమాజంలో మంచి గౌరవం ఉంటుందనడానికి వెంకటయ్య ఉదాహరణ అని ఈ సందర్భంగా కమిషనర్ బి.జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. నాడు టీచర్.. నేడు టాయిలెట్ నిర్వాహకుడు అశోక్ నగర్లోని పబ్లిక్ టాయిలెట్ నిర్వాహకుడైన సంజయ్ కుమార్ను ప్రపంచ టాయిలెట్ డే సందర్భంగా రవీంద్ర భారతిలో జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. అశోక్నగర్లోని గౌరవ గృహాన్ని నిర్వహిస్తున్న సంజయ్ కుమార్ ఝా తన కుటుంబంతో అదే ప్రాంతంలో నివసిస్తూ 24 గంటలు టాయిలెట్ను నిర్వహిస్తున్నాడు. డిగ్రీ పూర్తి చేసి గతంలో బీహార్లో టీచర్గా పని చేసిన సంజయ్ ప్రస్తుతం టాయిలెట్ నిర్వహణ ద్వారా నెలకు రూ.15 వేలకు పైగా ఆదాయం పొందుతున్నాడని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర్రెడ్డి, కమిషనర్లు సంజయ్కుమార్ ఝాను అభినందించారు. -
‘వరద’కు శాశ్వత పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలతో హైదరాబాద్ నగరంలో ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నామని.. మురుగు కాల్వల నిర్వహణను మెరుగుపర్చుతున్నామని మంత్రి కె.తారకరామారావు తెలిపారు. బుధవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ‘హైదరాబాద్లో డ్రైనేజీ, వరద నీటి సమస్యల’పై ఎమ్మెల్యేలు జాఫర్ హుస్సేన్, జి.కిషన్రెడ్డి, కౌసర్ మొయినుద్దీన్, వివేకానంద్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తదితరులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానమిచ్చారు. ‘‘జీహెచ్ఎంసీలో 1,221 కిలోమీటర్ల పొడవైన వరద నీటి డ్రైనేజీ వ్యవస్థ మాత్రమే ఉంది. ఇది సరిపోకపోవడంతో వర్షాకాలంలో పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడానికి కారణమవుతోంది. చెరువులు, నాలాల ఆక్రమణల కారణంగా ప్రవాహ సామర్థ్యం తగ్గింది. దీంతో రూ.230 కోట్లతో 47 డ్రైనేజీల్లో అంతరాయాలను తొలగించేందుకు పనులు చేపట్టాం. నీరు నిలిచిపోయే 13 ప్రాం తాలను గుర్తించి చర్యలు చేప ట్టాం. జీహెచ్ఎంసీ నిధు లతో 63 చెరువులను అభివృద్ధి చేస్తున్నాం. మిషన్ కాకతీయ నిధులతో మరో 20 చెరువుల అభివృద్ధికి ప్రతి పాదనలు చేశాం. వరద నీటి ప్రవాహానికి అడ్డుగా ఉండే 346 ముఖ్యమైన రోడ్లను గుర్తించాం. మురుగుకాల్వలు, నాలాల విస్తరణతో నివాసాలు కోల్పోయే పేదలకు పరిహారం ఇస్తున్నాం. వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించనున్నాం. మెట్రో రైల్ నిర్మాణం కోసం రోడ్ల మధ్యలో నిర్మిస్తున్న డివైడర్ వల్ల వరద నీటి ప్రవాహం ఆగిపోతోంది. దీంతో అవసరమైన చోట డివైడర్లలో ఖాళీలు ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే వర్షాకాలం నాటికి వరద నీటితో సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నాం..’’అని కేటీఆర్ వివరించారు. రుణమాఫీ పూర్తయింది టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో పంట రుణాల మాఫీని పూర్తి చేసిందని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి చెప్పారు. వడ్డీ మాఫీ కాని వారికి వెంటనే జమ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ అడిగిన ప్రశ్నకు పోచారం సమాధానమిచ్చారు. రుణాలను, వడ్డీని ఒకేసారి మాఫీ చేశామని, ఈ ప్రక్రియ పూర్తయిపోయిందని ఆయన తెలిపారు. 5,011 మంది కాంట్రాక్టు అధ్యాపకులకు లబ్ధి: కడియం రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాలు పెంచడంతో 5,011 మంది లబ్ధి పొందారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. టీఆర్ఎస్ సభ్యుడు ఎం.సుధీర్రెడ్డి అడిగిన ప్రశ్నకు కడియం సమాధానమిచ్చారు. వాస్తవానికి కాంట్రాక్టు అధ్యాపకుల సర్వీసు క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని.. హైకోర్టు ఆదేశం మేరకు ఆ ప్రక్రియ ఆగిపోయిందని చెప్పారు. దాంతో ప్రభుత్వం కాంట్రాక్టు అధ్యాపకుల వేతనాలు పెంచిందన్నారు. జూనియర్ కాలేజీలో పనిచేసేవారికి రూ.18 వేల నుంచి రూ.37,100కు.. డిగ్రీ కాలేజీ వారికి రూ.20,700 నుంచి రూ.40,370కి.. పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేసే వారికి రూ.19 వేల నుంచి రూ.40,270కు పెంచామన్నారు. దివ్యాంగులకు 4% రిజర్వేషన్లు: తుమ్మల కేంద్ర ప్రభుత్వ చట్టం మేరకు రాష్ట్రంలోనూ దివ్యాంగుల రిజర్వేషన్లను మూడు నుంచి నాలుగు శాతానికి పెంచనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ అంశంపై ఎమ్మెల్యేలు కె.లక్ష్మణ్, కిషన్రెడ్డిలు అడిగిన ప్రశ్నలకు తుమ్మల సమాధానమిచ్చారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో నెలకు రూ.1,500 చొప్పున ఆసరా పింఛన్లు ఇస్తున్నామన్నారు. వికలాంగుల సంక్షేమానికి రాష్ట్రంలో ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసే అంశం పరిశీలనలో ఉందన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బస్సుల్లో ప్రయాణించాలి: మహేందర్రెడ్డి రాష్ట్రంలోని ఎంపిక చేసిన బస్టాండ్లలో 31 మినీ థియేటర్లను నిర్మించనున్నామని.. దాంతో ఆర్టీసీకి రూ.4 కోట్ల ఆదాయం సమకూరుతుందని మంత్రి మహేందర్రెడ్డి శాసనసభలో వెల్లడించారు. ఆర్టీసీకి ఆదాయం అంశంపై ఎమ్మెల్యేలు దాస్యం వినయ్భాస్కర్, శ్రీనివాస్గౌడ్, టి.జీవన్రెడ్డి, కిషన్రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, పువ్వాడ అజయ్కుమార్, సున్నం రాజయ్య తదితరులు అడిగిన ప్రశ్నలకు మహేందర్రెడ్డి సమాధానమిచ్చారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో 101 పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని.. వాటితో రూ.40 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పారు. స్పీకర్ మధుసూదనచారి తరహాలోనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నెలకోసారి అయినా బస్సులలో తిరిగాలని మంత్రి సూచించారు. -
ఎమ్మెల్యే చింతమనేని చిందులు
లింగారావుగూడెం (ఏలూరు రూరల్) : దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి చిందులు తొక్కారు. కాలనీలో డ్రెయినేజీ, రోడ్డు లేక అవస్థలు పడుతున్నామని అడిగిన పాపానికి వారికి చెందిన బడ్డీకొట్టును వెంటనే పంచాయతీకి తరలించాలని అధికారులను ఆదేశించారు. తననే ప్రశ్నిస్తారా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు మండలం మాదేపల్లి శివారు గ్రామమైన లింగారావుగూడెంలో చింతమనేని ప్రభాకర్ మంగళవారం ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం చేపట్టారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆయన స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కాలనీలో పర్యటించారు. గూడెంలోని టీడీపీ మాజీ నాయకుడు, మాజీ సర్పంచ్ కొరపాటి తిరుపతిస్వామి ఇంటి వరకూ చేరుకున్నారు. ఆ సమయంలో తిరుపతిస్వామి భార్య మారతమ్మ, ఆమె కుమారుడు కాలనీలో డ్రైయినేజీ వ్యవస్థ సరిగా లేదని, రోడ్డు నిర్మించాలని ఎమ్మెల్యేను కోరారు. ఎంతో కాలంగా వేడుకుంటున్నా పట్టించుకోలేదన్నారు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో వారి ఇంటి గోడపై వైఎస్సార్ కుటుంబం స్టిక్కర్ అంటించి ఉండడంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చి మీ కాలనీ అభివృద్ధి చేస్తారంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. అదే అక్కసుతో తిరుపతిస్వామి ఇంటి ముందు ఉన్న బడ్డీకొట్టును చూశారు. రోడ్డు, డ్రెయినేజీకి అడ్డుగా ఉందంటూ వెంటనే బడ్డీకొట్టును తొలగించాలని అధికారులను ఆదేశిం చారు. దీంతో గ్రామకార్యదర్శి అనిల్తో పాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ తమ సిబ్బందితో బడ్డికొట్టును గునపాలతో పెకలించి ఆఘమేఘాల మీద తొలిగించారు. ట్రాక్టర్పై ఎక్కించి హుటాహుటిన పంచాయతీ కార్యాలయానికి తరలించారు. 30 ఏళ్లుగా టీడీపీకి సేవలు మాజీ సర్పంచ్ తిరుపతిస్వామి ముప్పై ఏళ్లుగా టీడీపీలో ఉన్నారు. టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కమిటీ సభ్యుడుగా కూడా సేవలందించారు. 2001 నుంచి 2006 వరకూ సర్పంచ్గా పనిచేసి టీడీపీ బలోపేతానికి కృషి చేశారు. చింతమనేని వ్యవహారశైలి నచ్చక కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల వైఎస్సార్ కుటుంబం కార్యక్రమంలో పాల్గొని పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న చింతమనేని ఆయనపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని స్థానిక నాయకులు తెలిపారు. టీడీపీకి ఎంతో సేవ చేశారని స్థానిక నేతలు చెప్పినప్పటికీ పట్టించుకోకుండా ఆయనకు చెందిన బడ్డీకొట్టును తీయించారు. -
‘చెత్త’శుద్ధి
జీవన కాలమ్ బస్సు కదులుతుంటే ఒకే ఒక్క సమస్య నా కళ్లకు కట్టింది. ఇన్ని లక్షల మంది నివసించే దేశంలో ‘చెత్త’ సమస్య కదా! అదీ జపాన్లో నేను మా మిత్రుడిని అడిగిన మొదటి ప్రశ్న. ఆయన నవ్వాడు: ‘‘అడగాల్సిన మొదటి ప్రశ్న ఇదే’’ అన్నాడు. జపాన్లో టోక్యో నగరానికి 80 కిలోమీటర్ల దూరంలో నారిటా అనే ఊరిలో విమానాశ్రయం. అక్కడి నుంచి టోక్యోకి బస్సులో రెండు గంటల ప్రయాణం. మా మిత్రుడు తీసుకెళ్లాడు. దారి పొడుగునా ముప్పయ్ నలభై అంతస్తుల భవనాలు. లక్షలాది ఇళ్లు. జపాన్ చిన్న ద్వీపం. పురోగతిలో ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఉంది. ఏమిటి దీని గొప్పతనం? బస్సు కదులుతుంటే ఒకే ఒక్క సమస్య నా కళ్లకు కట్టింది. ఇన్ని లక్షల మంది నివసించే దేశంలో ‘చెత్త’ సమస్య కదా! అదీ జపాన్లో నేను మా మిత్రుడిని అడిగిన మొదటి ప్రశ్న. ఆయన నవ్వాడు: ‘‘అడగాల్సిన మొదటి ప్రశ్న ఇదే’’ అన్నాడు. జపాన్లో చెత్త చాలా విలువైన వస్తువు. మరో విలువైన వస్తువు– స్థలం– చిన్న దేశం కనుక. పాలకులు తాటిచెట్టుకీ, తాత పిలకకీ ముడివేశారు. ప్రతిచోటా రెండు రకాలైన చెత్తని వేయడానికి డబ్బాలుంటాయి. తడి చెత్త, పొడి చెత్త. పొడి చెత్తని కొన్ని రసాయనాలతో కలిపి ఇటుకలుగా చేస్తారు. దేశం చుట్టూ ఉన్న సముద్ర జలాలలో నింపి– స్థలాన్ని పెంచుకుంటారు. అలా పూడ్చిన స్థలం మీదే ఒసాకా విమానాశ్రయాన్ని నిర్మిం చారు. అంతేకాదు. 2020లో జరుగుతున్న ఒలింపిక్స్ స్టేడియం– కెంగో కుమాలోన స్టేడియంని ఇలాంటి స్థలం మీదే నిర్మించారు. మా మిత్రుడు– తెలుగు మిత్రుడు– కిళ్లీ వేసుకుని నడిరోడ్డు మీద తుపుక్కున ఉమ్మడం హక్కుగా భావించే తెలుగు మిత్రుడు– నేను తాగిన కూల్డ్రింక్ డబ్బాలో కొంచెం ఉండిపోయిందని దాన్ని పడేసే చెత్తబుట్టని వెతుక్కుంటూ కిలోమీటరు నడిచాడు! దేశంలో నేలబారు పౌరుడికి తన కర్తవ్యాన్ని వంటబట్టించిన దేశం ప్రపంచానికి మార్గదర్శి కాక ఏమౌతుంది? ఇప్పుడు మన చెత్తకథ. భారతదేశంలో–125 కోట్ల పైబడిన జనాభా ఉన్న దేశంలో–చెత్తకి కొద్దిరోజుల్లో సంవత్సరానికి ఢిల్లీ నగరమంత స్థలం కావలసి ఉంటుందట. ఈ విషయాన్ని శాస్త్ర, పర్యావరణ పరిరక్షక కేంద్రం ప్రకటించింది. మనది సమృద్ధిగా చెత్తని ఉత్పత్తి చేసే దేశం. చెత్తని గుట్టలు గుట్టలుగా పోయడం కార్పొరేషన్ల హక్కు. వాటి కాలుష్యం వర్ణనాతీతం. ఎవరికీ పట్టదు. ఈ మధ్యనే తడి చెత్త, పొడి చెత్త అంటున్నారు కాని, కేరళలో అళప్పుళ, గోవా రాష్ట్రాలు తప్ప ఎవరూ పట్టించుకోవడంలేదట. చెత్త మన హక్కు. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే– అతి చిన్నదేశం స్వీడన్– అలా చెప్తే చాలామందికి తెలియదు. ప్రపంచానికి నోబెల్ బహుమతులని ఏటేటా ఇచ్చే, మన సౌకర్యాలకి ఓల్వో బస్సులని తయారుచేసే దేశం– చెత్తతో బయోగ్యాస్నీ, విద్యుచ్ఛక్తినీ, ఇంటి ఉష్ణోగ్రతలని పెంచే సాధనాలనీ తయారు చేసుకుంటోంది. ఎంత ముమ్మరంగా చేస్తోందంటే– వారి దేశంలో తయారయే చెత్త చాలక 980 లక్షల టన్నుల చెత్తని సాలీనా దిగుమతి చేసుకుంటోందట. ఇది అనూహ్యమైన విషయం. దిగుమతి అవుతున్న చెత్త ఫొటో చూడండి. ఇందులో మళ్లీ ఇళ్లలో తయారయే చెత్తని– జపాన్లాగే సముద్రాన్ని నింపి స్థలాన్ని పెంచుకునే కార్యానికి వినియోగిస్తున్నారు. 2011 నుంచి ఇలా సముద్ర స్థలాన్ని కలుపుకోవడానికి ప్రతీ ఇంటిలో తయారవుతున్న చెత్తలో ఒక శాతాన్ని వినియోగిస్తున్నారట. 2012లో ఈ చెత్త వినియోగ విభాగం సలహాదారుడు కాటన్నా ఓస్ట్లుండ్– మా దేశం మాకు కావలసినంత చెత్తని ఇవ్వడం లేదని వాపోయాడు. నార్వే, ఇంగ్లండ్, ఇటలీ, రుమేనియా, బల్గేరియాల నుంచి చెత్తని వీరు దిగుమతి చేసుకుంటున్నారు. మనం స్వీడన్ దాకా వెళ్లనక్కరలేదు. జపాన్లో బతుకుతున్న తెలుగువారిని దిగుమతి చేసుకుని– ఆ దేశపు క్రమశిక్షణని ఎలా పాటించాలో నేర్చుకుంటే ‘ఎందుకు పాటించాలో’ పెద్దలు చెప్తారు. అయితే చెత్తలో మనతో పోటీ పడే దేశం మరొకటి ఉంది. అమెరికా. చెత్త గుట్టలు గుట్టలుగా ప్రారంభమయి ప్రస్తుతం అవి కొండలని తలపిస్తున్నాయట. ఏతావాతా దేశానికి కావలసింది వ్యక్తిగత సంస్కారం. పరిపాలకులకు కావలసింది వారిని, వారి ఆలోచనా సరళిని మార్చే చిత్తశుద్ధి. రోజూ దైనందిన జీవితంలో సతమతమయ్యేవారి పొట్ట కొట్టే నాయకుడో, అధికారో పౌరుని అక్రమ శిక్షణని సంస్కరించలేడు. నిజానికి మన దేశంలో చెత్తని మించిన ‘చెత్త’ వ్యక్తుల బుర్రల్లో ఉంది. మనం చేసే పనుల్లో చెత్తపనులు కోకొల్లలు. మొదట వాటిని గుర్తు పట్టి, వేరు చేసి recycle చేసుకోగలిగితే మన మనస్సుల్ లోenergy levels పెరుగుతాయి. అనవసరమైన వ్యర్థాలు తొలగుతాయి. పరిశుభ్రపరుచుకోవడంలో సమాజానికి, వ్యక్తికి పెద్ద తేడా లేదు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి నిలపాలనే జపాన్ లోని తెలుగు మిత్రుడి బుర్రలో ‘అక్రమ శిక్షణ’ అనే చెత్తని ఆ దేశం తొలగించగలిగిందని మనం గుర్తించాలి. గొల్లపూడి మారుతీరావు -
జలసిరికి దుర్గతి
చెరువుల్లో చేరుతున్న నీరు ♦ ఆక్రమణల గుప్పెట్లో కాలువలు ♦ మూతపడుతున్న జమీందారు నాటి కాలువ ♦ నీటి ప్రవాహానికి కనిపించని దారి ♦ సీఎం నియోజకవర్గంలో ఇదీ పరిస్థితి ప్రతినీటి చుక్కనూ ఒడిసి పట్టి నిల్వ చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. ఇప్పుడు ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే చెరువుల్లోకి నీరు చేరుతున్నా అవి పొలానికి చేరే దారి లేక అయోమయ పరిస్థితి నెలకొంది. కాలువలు ఆక్రమణదారుల చేతిలో చిక్కుకున్నాయి. ఫలితంగా నీటి ప్రవాహానికి దారీతెన్నూ కనిపించడం లేదు. తాజాగా పడుతున్న వర్షపు నీరు వృథా అవుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కుప్పం : కుప్పం కరువు కోరల్లో చిక్కుకున్న నియోజకవర్గం..అంతేకాదు సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఎక్కువసార్లు ఎన్నికైన నియోజకవర్గమిది. తాజాగా ఆశాజనకంగా కొంచెం వర్షం పడుతోంది. ఈనీరు వ్యవసాయ అవసరాలు తీరుస్తుందనుకుంటే పొరపాటే. చెరువుల నుంచి నీరు వెళ్లే మార్గాలన్నీ ఆక్రమణల పరమయ్యాయి. ఉదా హరణకు దళవాయికొత్తపల్లె చెరువు నుంచి పెద్దబంగారునత్తం చెరువు వరకు ఉన్న సప్లై ఛానల్ పరిస్థితే ఇందుకు ఉదాహరణ.ఇన్నాళ్లూ నీరు తగినంత చేరకపోవడంతో ఎవరూ దీనిని పట్టించుకోలేదు. 12 ఏళ్ల పాటు చెరువులు ఎండిపోయాయి. సప్లై ఛానళ్లుగా ఉన్న కాలువలు మూతపడిపోయాయి. ఇవి కాస్తా ఆక్రమణలకు గురయ్యాయి. ప్రస్తుతం వర్షాలతో నీరు చెరువుల్లో చేరుతోంది. అయితే నీటి ప్రవాహానికి ఇబ్బందికరంగా మారింది. హెచ్పీ రోడ్డులోని రాజుకాలువ ఆక్రమణల వల్ల ఆనవాలే లేకుండా పోయింది. నియోజకవర్గంలోని పెద్ద చెరువులుగా పేరుపొందిన దళవాయికొత్తపల్లె చెరువు, పెద్దబంగారునత్తం చెరువుల మధ్య అనుసంధానంగా ఉన్న సప్లైఛానల్ మూతపడింది. డీకేపల్లె చెరువు కాలువ, దాని చుట్టూ ఉన్న వ్యవసాయ భూములు రియల్ఎస్టేట్ పరిధిలోకి వెళ్లిపోయాయి. హెచ్పీ రోడ్డులో కాలువను ఆక్రమించుకుని భవనాలు కూడా నిర్మించారు. కాలువ ఆనవాలు కనపడకుండా ఆక్రమించుకుని నిర్మాణాలు వెలిశాయి. ప్రధాన బ్రిడ్జి వద్ద ప్రస్తుతం రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించిన ఆక్రమణ వ్యర్థ పదార్థాలను ఈ కాలువల్లో వేయడం వల్ల పూర్తిగా మూతపడింది. వంద ఎకరాలు విస్తరించివున్న జమీందారునాటి కాలువ నీటి ప్రవా హానికి ఆస్కారం లేకపోవడంతో ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలో జిల్లాలో కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. వివిధ పథకాల కింద చెరువుల లోతట్టు భాగం తవ్వారు. దీంతో చెరువుల్లో నీటి మట్టం పెరిగింది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షానికి నియోజకవర్గంలోని చెరువులన్నీ నిండాయి. దళవాయికొత్తపల్లె చెరువు మొరువ దశకు చేరుకుంది. మరో రెండు రోజులు వర్షాలు కురిస్తే దళవాయికొత్తపల్లె చెరువు మొరువతో నీరు హెచ్చి ఇళ్లపైకి దూసుకొచ్చే ప్రమాదముంది. ఇక్కడున్న కాలువ ఆక్రమణకు గురి కావడం, మూసివేయడం వలన నీటి ప్రవాహానికి మార్గం లేదని, ఇళ్లల్లోకి చొరబడే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. -
ఎవరిదీ పాపం!
ఎవరిదీ పాపం అని నిలదీస్తున్నారు కానినాడ నగరపాలక సంస్థ పౌరులు. రూ.1993 కోట్ల నిధులతో కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడానికి ముందుకు వచ్చింది. ఇందులో రూ.75 కోట్లతో డ్రైనేజీ వ్యవస్థను చక్కదిద్దేందుకు అవకాశం ఉంది. టీడీపీ ప్రభుత్వం చిత్తశుద్ధి లోపం ఫలితంగా నిధులు మంజూరుకు నోచుకోలేదు. ఈ నగరానికి పాలక వర్గం లేకపోవడంతో అడిగే నాథుడే లేకుండా పోయారు. ఎన్నికలు ఏడేళ్ల ముందే జరిగి ఉంటే ఈ దుస్థితి ఉండేది కాదని నగరవాసులు భావిస్తున్నారు. -
శ్రమ పాఠం!
బురదలో కాలు పెట్టాలంటే వెనకడుగు వేస్తాం. మురుగు నీరు కనిపిస్తే పక్కకు తప్పుకుంటాం. కంపు వాసన వస్తే.. ముక్కు మూసుకుని పరుగు తీస్తాం. అలాంటిది.. ‘కంపు’రం పుట్టించే మురుగు మధ్య సాగుతున్న పోరాటం ఆవేదనా భరితమే. చుట్టుపక్క పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోలేని సోమరులకు వీరి జీవనం ఓ పాఠం. పీకల్లోతు బురద.. చిమ్మచీకటి అలుముకున్న సొంరంగాలు.. తొనుకుబెనుకు లేకుండా శ్రమించే శ్రామికులకు ‘సాక్షి’ సలాం. - జిల్లా కేంద్రంలోని కాలువల్లో పేరుకుపోయిన పూడిక తొలగింపునకు కాకినాడకు చెందిన 30 మంది కార్మికులు నిరంతరాయంగా శ్రమిస్తున్నారు. అండర్గ్రౌండ్ డ్రెయినేజీల్లో వీరు పడుతున్న శ్రమను చూసి నగర ప్రజలు ఆవేదనా భరిత హృదయాలతో అక్కడి నుంచి భారంగా ముందుకు కదులుతున్నారు. ఫొటోలు: జి.వీరేష్ -
అమృత్ ... అక్కరకొచ్చేనా!
మచిలీపట్నం : చారిత్రక నేపథ్యం ఉన్న బందరు పట్టణంలో ఇప్పటికీ కనీస వసతులు నామమాత్రంగానే ఉన్నాయి. రోడ్లు, డ్రెయిన్లు, తాగునీటి సమస్య వంటివి పట్టణ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం 2015లో అటల్ మిషన్ ఫర్ రెజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్ (అమృత్) పథకంలో మచిలీపట్నం మున్సిపాలిటీకి చోటు కల్పించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తాయని పాలకులు ప్రచారం చేశారు. రూ.613 కోట్లతో ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపారు. అయినా 2015–16వ ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.3.14 కోట్లు మాత్రమే నిధులు మంజూరయ్యాయి. అమృత్ పథకంలో మచిలీపట్నం పురపాలక సంఘం చేరినా అందుకు అనుగుణంగా పనులు జరగని పరిస్థితి నెలకొంది. పట్టణంలో ప్రతి వీధిలోనూ పాత తాగునీటి పైప్లైన్ స్థానంలో నూతన పైప్లైన్ వేసేందుకు ఇటీవల సర్వే నిర్వహించారు. ఈ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. రెండేళ్లలో ఎటువంటి పనులు చేయకపోడంతో అమృత్ పథకం అక్కరకు వచ్చేనా.. అని పట్టణ వాసులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ప్రతిపాదనలు ఇలా... మచిలీపట్నం పురపాలక సంఘాన్ని అమృత్ ప్రాజెక్టులో చేర్చడంతో భారీగా అభివృద్ధి పనులు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి పురపాలక సంఘం ద్వారా ప్రతిపాదనలు పంపారు. మంచినీటి సరఫరాకు రూ.246.25 కోట్లు, భూగర్భ డ్రెయినేజీకి రూ.222.59 కోట్లు, వరద నీటి పారుదల డ్రెయినేజీకి రూ.84.69 కోట్లు, అర్బన్ ట్రాన్స్పోర్ట్కు రూ.49.60 కోట్లు, గ్రీనరీ, పార్కుల అభివృద్ధికి రూ.10.71 కోట్లు మొత్తం రూ.613.84 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. కేంద్ర ప్రభుత్వం రూ.3.14 కోట్లు నిధులు విడుదల చేయగా, ఇంటింటికీ కుళాయి కనెక్షన్, పైప్లైన్ల ఏర్పాటు, రిజర్వాయర్ల నిర్మాణం కోసం రూ.2.64 కోట్లు, పార్కులు, గ్రీనరీ అభివృద్ధికి రూ.50 లక్షలు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. మచిలీపట్నంలోని ప్రధాన పార్కు మినహా ఇతర ఉద్యానవనాలు సక్రమంగా అభివృద్ధి చేయలేదు. రూ.59 కోట్లతో ఐదు ఓవర్ హెడ్ ట్యాంకులు భాస్కరపురం, రుస్తుంబాద, చిలకలపూడి, వలందపాలెం, 28వ వార్డులో నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారుచేశారు. వాటిలో రూ.1.48 కోట్లతో చేపట్టే వలందపాలెంలోని ఓవర్హెడ్ ట్యాంక్ పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. మిగిలిన ఓవర్హెడ్ ట్యాంకులను ఎప్పటికి నిర్మిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. డ్రెయినేజీ నిర్మాణం ఎప్పటికో... మచిలీపట్నం సముద్ర మట్టానికి రెండు అడుగుల దిగువన ఉంది. కొద్దిపాటి వర్షం కురిసినా వర్షపునీరు రోడ్లపైనే ప్రవహిస్తూ ఉంటుంది. మురుగునీరు త్వరగా డ్రెయిన్ల ద్వారా సముద్రంలో కలవదు. టీడీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి డ్రెయినేజీ పనులను చేస్తామని చెబుతూ వస్తున్నారు. రూ. 68 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినా, ఇవి కాగితాలకే పరిమితమయ్యాయి. టెండర్లు పిలిచామని చెబుతున్నా, ఎప్పటికి ఖరారు చేస్తారు, పనులు ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయం తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం వర్షాకాలంలో కొద్దిపాటి వానకే రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. వేధిస్తున్న సిబ్బంది కొరత అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు మున్సిపల్ కార్యాలయంలో సరిపడా సిబ్బంది లేరు. మచిలీపట్నం పురపాలక సంఘంలో ఒక డీఈ పోస్టు ఖాళీగా ఉంది. ఆరుగురు ఏఈలకు ఒక్కరే పనిచేస్తున్నారు. టౌన్ప్లానింగ్లో సూపర్వైజర్లు ఆరుగురు ఉండాల్సి ఉండగా, ఇద్దరే ఉన్నారు. అధికారులు, సిబ్బంది లేకుండా అమృత్ పథకం, ఇతర పనులు ముందుకు వెళ్లడం కష్టమే. కాబట్టి సిబ్బందిని నియమించి, అమృత్ పథకాన్ని సక్రమంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. -
రాంనగర్లో డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణకు రూ.82.40 లక్షలు
♦ విడుదల చేసిన జలమండలి ♦ వెల్లడించిన కార్పొరేటర్ శ్రీనివాస్రెడ్డి ♦ అధికారులతో సమీక్షా సమావేశం ♦ సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు ముషీరాబాద్: రాంనగర్ డివిజన్లో డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణకు జలమండలి రూ.82.40 లక్షల నిధులు విడుదల చేసిందని కార్పొరేటర్ వి.శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఈ విషయమై చిలకలగూడ వాటర్వర్క్స్ డీజీఎం శ్రీధర్రెడ్డి, మేనేజర్ హకీం హుస్సేన్, శ్రీనివాస్లతో కార్పొరేటర్ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. డివిజన్లోని 10 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. అక్కడ తీసుకుబోయే చర్యలు, ఖర్చు చేయనున్న నిధుల వివరాలు వెల్లడించారు. -
జీహెచ్ఎంసీలో భారీ స్కాం
-
‘యనమదుర్రు’ ప్రక్షాళనకు చర్యలు
భీమవరం టౌ న్ : యనమదుర్రు డ్రెయి న్ ప్రక్షాళన దిశగా జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు దృష్టి సారించారు. యనమదుర్రు డ్రెయి న్ జలాలు నిర్జీవంగా మారడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో యనమదుర్రు డ్రెయి న్ ను ప్రక్షాళన చేస్తామని ప్రభుత్వం గత ఏడాది ప్రకటించింది. అయినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. గొంతేరు డ్రెయి న్ ను మరో యనమదుర్రు కానివ్వబోమని గోదావరి మెగా ఆక్వాఫుడ్పార్కు నిర్మాణ వ్యతిరేక పోరాట కమిటీ ఉద్యమిస్తున్న నేపథ్యంలో గతనెల 25న భీమవరంలో రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శిక్షణ పరిశ్రమల శాఖ మంత్రి పితాని సత్యనారాయణ, జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. యనమదుర్రు డ్రెయి న్ ప్రక్షాళనకు ప్రణాళిక సిద్ధం చేయాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఆదేశించారు. రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధులు, రైతులు ఇలా అన్ని వర్గాల నుంచి యనమదుర్రు డ్రెయి న్ కాలుష్యానికి పరిశ్రమలు, మున్సిపాలిటీలు గ్రామాల నుంచి వస్తున్న మురుగు, చెత్త కారణమంటూ స్పష్టం చేశారు. ఈ మేరకు పర్యావరణ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎస్.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అధికారుల బృందం శుక్రవారం మున్సిపల్ కమిషనర్ సీహెచ్ నాగనర్సింహరావుతో కలిసి యనమదుర్రు డ్రెయి న్ ను పరిశీలించారు. ట్రీట్మెంట్ ప్లాంట్లపై చర్చ యనమదుర్రు డ్రెయి న్ లో మురుగునీరు కలిసే చోట సావేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఎక్కడెక్కడ అవసరమో పరిశీలించారు. దెయ్యాలతిప్ప ప్రాంతంలో, భీమవరం పట్టణం రెస్ట్హౌస్ రోడ్డు శివారు గంగానమ్మ గుడి ప్రాంతంలో, అందరికీ ఇళ్లు నిర్మాణానికి కేటాయించిన 82 ఎకరాల స్థలం వద్ద ఎస్టీపీలు నిర్మాణంపై చర్చించారు. అమృత్ పథకంలో 5 ఎంఎల్డీ ఎస్టీపీ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని కమిషనర్ సీహెచ్ నాగనర్సింహరావు వివరించారు. మరో 5 ఎంఎల్డీ ఎస్టీపీ నిర్మాణానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎస్.వెంకటేశ్వర్లు బృందం యనమదుర్రు డ్రెయి న్ లో మురుగు కలుస్తున్న ప్రాంతాల ఫొటోలు తీసుకున్నారు. డ్రెయి న్ ప్రక్షాళనకు సంబంధించి మున్సిపల్ అధికారులతో చర్చించారు. మున్సిపల్ డీఈ శ్రీకాంత్, టౌ న్ ప్లానింగ్ అధికారులు వారి వెంట ఉన్నారు. -
జీహెచ్ఎంసీలో భారీ స్కాం
హైదరాబాద్: జీహెచ్ఎంసీ నాలాల్లో మురుగు మాదిరిగా కాంట్రాక్టర్లలోఅవినీతి పెరిగిపోయింది. చేయని పనులకు నకిలీ బిల్లులతో కోట్లల్లో దిగమింగుతున్నారు. తాజాగా నాలాల్లో పూడికతీత పేరుతో కోటి రూపాయలకుపైగా పక్కదారి పట్టించిన వైనం వెలుగులోకి వచ్చింది. మురుగుకాల్వల్లో తొలగించిన పూడికను టూ వీలర్స్..4 వీలర్స్ లో తరలించినట్టు కాంట్రాక్టర్లు కోటి పద్దెనిమిది లక్షల రూపాయల మేర నకిలీ బిల్లులు సృష్టించారు. అనుమానం వచ్చిన అధికారులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. ఇందులో జీహెచ్ఎంసీ ఏఈల హస్తం ఉన్నట్లు అధికారులు తేల్చారు. దీంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో సంబంధం ఉన్న 12మంది ఏఈలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
పిల్లలతో డ్రైనేజ్ క్లీన్ చేయించిన వార్డెన్
-
వ్యక్తి ఆత్మహత్య
- మురుగు కాలువ విషయంలో గొడవ నందవరం: మండల పరిధిలోని టి.సోమలగూడూరు గ్రామానికి చెందిన నరసింహులు(48) అనే వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ జగన్మోహన్ బుధవారం విలేకరులకు తెలిపారు. అదే గ్రామానికి చెందిన శీను, పెద్దయ్య, మల్లన్న, నరసింహులు మధ్య మురుగు కాలువ నీటి విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. నిందితులు.. నరసింహులును నానాదుర్బాషలాడడంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. పురుగు మందు తాగడంతో గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూమృతి చెందాడు. కుమారుడు శ్రీరాములు ఫిర్యాదు మేరకు ముగ్గురి నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
‘పచ్చ’ వాకిళ్లు పదిలం
-ఇతరులవి పొక్లెయిన్ కోరలకు ఫలహారం -మురుగుకాలుల నిర్మాణంలో ద్వంద్వనీతి -టీడీపీ నేతల ప్రాబల్యంతో అధికారుల వివక్ష రాజమహేంద్రవరం సిటీ : నగరంలో మురుగుకాలువల నిర్మాణంలో ‘సమన్యాయం’ అనే దానిపై ‘పొక్లెయిన్’ కోరల్లో నుజ్జునుజ్జవుతోంది. నిర్మాణానికి అడ్డం వచ్చే ఇళ్లలో అధికార టీడీపీ వాళ్లవి ఉంటే కాలువ దారిని అష్టవంకరలతో మళ్లిసున్నారు. అదే మిగిలిన వారి ఇళ్లు అడ్డం వస్తే నిస్సంకోచంగా పగులగొట్టి నిర్మాణం సాగిస్తున్నారు. నగరంలో దాదాపు రూ.7 కోట్ల వ్యయంతో పాతకాలపు మురుగు కాలువల పునర్నిర్మాణం చేపట్టారు. నగరాభివృద్ధిలో భాగంగా చేపడుతున్న నిర్మాణాలకు ఎవరికి చెందిన అక్రమ కట్టడాలు అడ్డంకిగా ఉన్నా తొలగించాల్సిన అధికారులు ద్వంద్వనీతిని అనుసరిస్తున్నారు. ‘దేశం’ వారి నివాసాల వద్ద ఒంపులే ఒంపులు కాలువల నిర్మాణానికి ఆటంకమయ్యే ఆక్రమణలను తొలగించాల్సిన నగర పాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులు అధికార పార్టీకి చెందిన వారికి ఓ న్యాయం, మిగిలిన వారికి ఇంకో న్యాయం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ వారి కట్టడాలున్న చోట వాటి జోలికి పోకుండా ఒంపులతో కాలువ నిర్మిస్తూ.. అదే మిగిలిన వారి కట్టడాలు అడ్డంగా ఉంటే ఆగమేఘాల మీద జేసీబీలతో తొలగిస్తున్నారు. ఏవీ అప్పారావు రోడ్లో వైట్హౌస్ ఎదురుగా శ్రీనివాసా గార్డెన్స్లో కాలువ నిర్మాణం ఓ అధికార పార్టీ నాయకుని ఇంటి వరకూ తిన్నగానే సాగింది. అక్కడి నుంచి నిర్మాణం తిన్నగా జరగాలంటే ఆ నాయకుని ఇంటి మెట్లతో పాటు మూడడుగుల మేర అడ్డంగా ఉన్నాయి. అంత మేరా అడ్డంకిని తొలగించి, కాలువను తిన్నగా నిర్మించాల్సిన అధికారులు.. ఆ ఇంటి దిగువమెట్టుపైన కూడా కనీసం గునపు మొన పడకుండా కాలువను వంపు తిప్పి నిర్మించారు. అలాగే దేవీచౌక్లో కూడా అధికార పార్టీ వారి భవనం చెక్కు చెదరకుండా కాలువనే దారి మళ్లించారు. కమిషనర్ ఏమంటారు? అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ప్రాబలత్యంతో ఇంజినీరింగ్ అధికారులు ప్రదర్శిస్తున్న వివక్ష నగరవాసులను విస్మయపరుస్తోంది. అధికార పార్టీకి చెందిన వారి కట్టడాల మెట్లను సైతం ముట్టుకోకుండా ఎంతైనా ఒంపులు తిప్పి కాలువలు నిర్మిస్తున్న అధికారులు ఇతరుల ఇళ్లను, నిర్మాణాలను తక్షణమే తొలగించడంపై ధ్వజమెత్తుతున్నారు. అధికార పార్టీ వారికో న్యాయం, ఇతరులకో న్యాయం అమలు చేయడంపై మండిపడుతున్నారు. పారదర్శకతకు పెద్ద పీట వేస్తున్నట్టు చెప్పే కమిషనర్ విజయరామరాజు కాలువల నిర్మాణంలో బాహాటంగా జరుగుతున్న ఈ వివక్షపై ఏమంటారని ప్రశ్నిస్తున్నారు. -
వడివడిగా అడుగులు
- రాజమహేంద్రవరంలో డ్రైనేజీలు, జంక్షన్ల విస్తరణ - ముంపు, ట్రాఫిక్ సమస్యలకు చెక్ - దశాబ్దాల సమస్యలకు పరిష్కారం - స్థలాలు కోల్పోతున్నవారికి టీడీఆర్ బాండ్లు - విక్రయించే అవకాశం ఉండడంతో అంగీకరిస్తున్న స్థల యజమానులు సాక్షి, రాజమహేంద్రవరం : సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం రూపురేఖలు మారనున్నాయి. దశాబ్దాల నుంచి ఉన్న డ్రైనేజీ, ట్రాఫిక్ సమస్యల పరిష్కారంపై నగరపాలక సంస్థ యంత్రాంగం దృష్టి పెట్టింది. పెరిగిన అవసరాలకు అనుగుణంగా బ్రిటిష్ కాలం నాటి డ్రైనేజీలు, జంక్షన్లను విస్తరించే పనిని ఆరంభించింది. ఉభయ గోదావరి జిల్లాల వాణిజ్య రాజధానిగా భాసిల్లుతున్న రాజమహేంద్రవరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. పెరిగిన నగర పరిధికి అనుగుణంగా రోడ్లను విస్తరించలేదు. పలు కారణాలవల్ల 1975 మాస్టర్ప్లాన్ పూర్తిస్థాయిలో అమలు జరగలేదు. వై జంక్షన్ నుంచి లాలాచెరువు వరకూ ఉన్న గ్రాండ్ ట్రంక్ రోడ్డు (జీఎన్టీ) రోడ్డు తప్ప నగరంలో మరే రోడ్డు 100 అడుగులు లేదు. అలాగే నగరంలోని అనేక జంక్షన్లు ఇరుకుగా ఉన్నాయి. దీనికితోడు ఆక్రమణల వల్ల ఆయా జంక్షన్లలో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా కంబాలచెరువు, తాడితోట, దేవీచౌక్, ఏవీ అప్పారావు రోడ్డు, జాంపేట, శ్యామలా సెంటర్, షెల్టాన్ హోటల్, ఆర్టీసీ కాంప్లెక్స్ తదితర జంక్షన్లలో వాహనాల రద్దీ తీవ్రంగా ఉంటోంది. సిగ్నల్ వ్యవస్థ కూడా సరిగా పని చేయకపోవడంతో తరచూ ఆయా జంక్షన్ల వద్ద ట్రాఫిక్ జామ్ అవుతోంది. జంక్షన్లు, డ్రైనేజీలను విస్తరించాలన్న ప్రతిపాదనలు చాలా కాలం నుంచి ఉన్నా అవి ఆచరణలోకి రాలేదు. 2015 పుష్కరాలకు ఈ పనులు పూర్తి చేయాలని నగరపాలక సంస్థ భావించినా సాధ్యపడలేదు. తాజాగా 2031 నాటికి నగర అభివృద్ధిని ఊహిస్తూ రూపొందించిన మాస్టర్ప్లాన్కు నగరపాలక సంస్థ ఆమోద ముద్ర వేసింది. దానికి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ కావడమే ఇక మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో నగరంలోని ముఖ్యమైన డ్రైనేజీలు, జంక్షన్లను విస్తరించే పనిలో నగరపాలక సంస్థ యంత్రాంగం నిమగ్నమై ఉంది. తాడితోట జంక్షన్ నుంచే ఆరంభం నగరంలో జంక్షన్లు విస్తరించే పనిని నగరపాలక సంస్థ యంత్రాంగం తాడితోట నుంచి ప్రారంభించింది. ప్రస్తుతం ఇక్కడ రోడ్డు వెడల్పు దాదాపు 45 నుంచి 50 అడుగులు ఉంది. పాత మాస్టర్ప్లాన్ (1975) ప్రకారం ఈ రోడ్డును 80 అడుగులకు విస్తరించాల్సి ఉన్నా జరగలేదు. రైల్వే అండర్పాస్ బ్రిడ్జి నుంచి మోరంపూడి వెళ్లే వైపు దుకాణాలను అధికారులు తొలగిస్తున్నారు. రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ అధారంగా ఇరువైపులా 40 అడుగుల చొప్పన 80 అడుగుల మేర రోడ్డు ఉండేలా భననాలను తొలగించాలని నిర్ణయించి అమలు చేస్తున్నారు. స్థలాలను కోల్పోతున్నవారికి నష్టపరిహారంగా ట్రాన్సఫరబుల్ డెవలప్మెంట్ రైట్(టీడీఆర్) బాండ్లు జారీ చేస్తున్నారు. ఇప్పటికే ఆరుగురికి వారు కోల్పోతున్న స్థలానికి అనుగుణంగా బాండ్లు పంపిణీ చేశారు. డ్రైనేజీ విస్తరణ షురూ బ్రిటిషు కాలం నాటి డ్రైనేజీ వల్ల వర్షాకాలంలో తరచూ నగరం ముంపునకు గురవుతోంది. జంక్షన్ల వద్ద ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. చిన్నపాటి వర్షం కురిసినా శ్యామలా సెంటర్, తాడితోట సెంటర్ తదితర ప్రాంతాల్లో రోడ్లు మోకాలు లోతు నీళ్లలో మునిగిపోతాయి. వర్షపు నీరు వేగంగా వెళ్లేందుకు అనువైన వెడల్పుతో డ్రైనేజీలు లేకపోవడమే సమస్యకు అసలు కారణం. ఈ నేపథ్యంలో డ్రైనేజీ వ్యవస్థను సమూలంగా మార్చే చర్యలను నగరపాలక సంస్థ ఆరంభించింది. పాత డ్రైన్ల స్థానంలో కొత్తగా అవసరానికి తగినట్లు వెడల్పు చేస్తూ నిర్మిస్తోంది. ఇప్పటికే దేవీచౌక్లో పూర్తి చేయగా, పేపర్మిల్లు రోడ్డు, జాంపేట, తాడితోట ప్రాంతాల్లో డ్రైనేజీలకు అవసరమైన స్థలం కోసం నిర్మాణాలను తొలగిస్తోంది. తాడితోట నుంచి షెల్టాన్ హోటల్ వరకూ పాత మాస్టర్ప్లాన్ ప్రకారం 80 అడుగులకు రోడ్డును విస్తరించేందుకు యంత్రాంగం పని చేస్తోంది. దీనికోసం ముందుగా కుడివైపు మార్కింగ్ చేసిన మేరకు భవనాలను తొలగిస్తోంది. టీడీఆర్ బాండ్ అంటే? రోడ్ల విస్తరణ లేదా మరే ఇతర అభివృద్ధి పనులకైనా ప్రైవేటు స్థలాలను ప్రభుత్వం తీసుకుంటుంది. ఇందుకు స్థల యజమానులకు పరిహారంగా నగదు, లేని పక్షంలో టీడీఆర్ బాండ్లు ఇస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో స్థల యజమానులకు ఈ తరహా బాండ్లు ఇచ్చే పద్ధతి అమలు జరుగుతోంది. ఈ విధానంలో యజమాని కోల్పోయే స్థలం (గజం) రిజిస్ట్రేషన్ విలువను పొందుపరుస్తూ, నష్టపోతున్న స్థలానికి రెట్టింపు విలువతో టీడీఆర్ బాండ్ ఇస్తారు. ఉదాహరణకు 10 గజాల స్థలం (గజం విలువ రూ.25 వేలు) కోల్పోతున్న యజమానికి 20 గజాల విలువైన బాండ్ను జారీ చేస్తారు. ఈ విధానాన్ని జిల్లాలోనే మొదటిసారిగా రాజమహేంద్రవరంలో అమలు చేస్తున్నారు. టీడీఆర్ బాండ్ వల్ల లాభమేంటంటే.. టీడీఆర్ బాండ్ తీసుకున్న వ్యక్తి తాను కోల్పోయిన స్థలానికి రెట్టింపు నిర్మాణం ఆదే ప్రాంతంలో చేపట్టవచ్చు. ఉదాహరణకు 300 గజాల స్థలంలో 50 గజాలు రోడ్డు విస్తరణలో కోల్పోతే మిగిలిన 250 గజాల్లో నిబంధనల ప్రకారం పరిమితి మేరకు భవన నిర్మాణం చేపట్టవచ్చు. యజమాని తాను కోల్పోయిన 50 గజాల స్థలం మేరకు రెట్టింపు (100 గజాలు) విస్తీర్ణంతో ఆ భవనం పైన మరో అంతస్తు నిర్మించుకోవచ్చు. ఇందుకు నగరపాలక సంస్థ ఎలాంటి అభ్యంతరమూ చెప్పదు. లేదంటే ఈ బాండ్లను విక్రయించుకోవచ్చు. ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మించినవారు వీటిని కొనుగోలు చేస్తే ఆ భవనాన్ని సక్రమమైనదిగా నగరపాలక సంస్థ గుర్తిస్తుంది. ఈ వెలుసుబాటు ఉండడంతో స్థల యజమానులు కూడా టీడీఆర్ బాండ్లు తీసుకునేందుకు అంగీకరిస్తున్నారు. స్థల యజమానులు సహకరిస్తున్నారు నగరంలో ట్రాఫిక్, ముంపు సమస్య లేకుండా జంక్షన్లు, డ్రైనేజీలను విస్తరిస్తున్నాం. ఇప్పటికే పలుచోట్ల డ్రైనేజీలు విస్తరించే పని ప్రారంభించాం. తాడితోట నుంచి షెల్టాన్ వరకూ ప్రస్తుతం పాత మాస్టర్ప్లాన్ ప్రకారం 80 అడుగుల మేరకు భవనాలు తొలగిస్తున్నాం. కొత్త మాస్టర్ప్లాన్కు ప్రభుత్వం ఆమోదం లభించాక అందులో నిర్ణయాలను 2031లోపు ఎప్పడైనా అమలు చేయవచ్చు. స్థల యజమానులకు టీడీఆర్ బాండ్లు జారీ చేస్తున్నాం. -
ఇట్లయితే ఎట్టా బతకాలమ్మా?
- కాల్వల శుభ్రత లేదు.. దోమల నియంత్రణ పట్టదు - అర్ధరాత్రి నీటి సరఫరా - ఎంపీ బుట్టా రేణుక ఎదుట సమస్యలను ఏకరువు పెట్టిన పాతబస్తీవాసులు కర్నూలు (ఓల్డ్సిటీ): ‘కాల్వల్లో పూడిక పేరుకుపోతున్నా తొలగించరు.. ఫలితంగా దుర్వాసనతోపాటు దోమల బెడద పెరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.. కుళాయిలకు అర్ధరాత్రి సమయాల్లో నీటిని సరఫరా చేస్తుండడంతో నిద్ర మేల్కొని జాగరణ చేయాల్సి వస్తోంది.. ఇలా ఎంతకాలం’ అంటూ కర్నూలు నగర పాతబస్తీవాసులు ఎంపీ బుట్టా రేణుక వద్ద ఏకరువు పెట్టారు. వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ ఇటీవలే 3, 4, 5 వార్డుల్లో పర్యటించారు. కుమ్మరివీధి, నాయీబ్రాహ్మణుల వీధి, ఛత్రీబాగ్, బండిమెట్ట ప్రాంతాల్లోని ప్రజలు సమస్యలతో సహవాసం చేస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఆదివారం పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక వార్డు పర్యటనలో భాగంగా ఆయా ప్రాంతాలను సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘క్లీనింగ్ లేదు, దోమల నివారణా లేదు, అర్ధరాత్రి నీళ్లు వస్తే ప్రజలు ఎలా పట్టుకుంటారు.. వాసన వచ్చే నీళ్లు ఎలా తాగుతారు.. పాతబస్తీ ప్రజలు ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమృత్ పథకం కింద కేంద్రం నుంచి విడుదలవుతున్న నిధులను సక్రమంగా వినియోగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇవ్వాల్సి ఉందన్నారు. బండిమెట్ట వీధిలో నిర్మించిన పురుషుల మరుగుదొడ్లు ఆరేళ్లుగా ప్రారంభానికి నోచుకోలేదని, మహిళల మరుగుదొడ్లలో సరైన నీటిసదుపాయం లేకపోవడం వల్ల వాడుకోలేకపోతున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్రెడ్డి ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. నాగమయ్యకట్టకు అరుగు నిర్మించాలని, దోమల బాధ నుంచి గట్టెక్కించాలని, మంచినీటి ఎద్దడిని నివారించాలని, సీసీరోడ్లు, కాల్వలు నిర్మించాలని కోరారు. 34-102 ఇంటి వద్ద బోరింగ్ పనిచేయడం లేదని, వీధిలైటు లేదని స్థానికులు ఎంపీకి విన్నవించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత సమస్యలపై అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎంపీ వారకి హామీ ఇచ్చారు. హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ కాలువలను వారం రోజులకోసారి కూడా శుభ్రం చేయడం లేదని, దోమల నివారణలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారని పేర్కొన్నారు. నిర్వహణ లోపం వల్ల పాతబస్తీ ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, నగరపాలక సంస్థ అధికారులు అవసరమైతే ఎక్కువమంది సిబ్బందిని నియమించి సమస్యలు తీర్చాలని కోరారు. వారి వెంట పార్టీ నాయకులు ఎస్.ఎ.రహ్మాన్, బోదెపాడు భాస్కర్రెడ్డి, రవీంద్రనాథ్రెడ్డి, హరినాథ్రెడ్డి, రామ్మోహన్రెడ్డి, శేషుబాబు, మాజీ కార్పొరేటర్ దాదామియ్య, డి.కె.రాజశేఖర్, పేలాల రాఘవేంద్ర, మహ్మద్ తౌఫిక్ తదితరులు పాల్గొన్నారు. -
డ్రైనేజీలో పడి ఇద్దరు కార్మికులు మృతి
కుత్బుల్లాపూర్: నగరంలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలోని ఓ కంపెనీలో విషాదం చోటు చేసుకుంది. ఎక్సెల్ ఓవెన్ శాక్స్ ప్రైవేటు లిమిటెడ్లో డ్రైనేజీ సంప్లో పడి ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. మృతి చెందిన వారు బెంగాల్ కు చెందిన అజయ్సింగ్(23), విజయ్సింగ్(30)లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
15రోజులకే నిండిన నూరెళ్లు..
జీడిమెట్ల(హైదరాబాద్సిటీ): తల్లి ఒడిలో జోలపాటలతో హాయిగా నిదురించవలసిన ఆ పసికందు మృతదేహమై నాలాలో పడిఉంది. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. వివరాలు..షాపూర్నగర్ రైతు బజారు వద్ద గురువారం ఉదయం హమాలీ పని చేయడానికి వచ్చిన కూలీ మేషయ్య నాలాలో పడిఉన్న పసికందు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న జీడిమెట్ల పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పసిపాప కు 15 రోజుల వయసు ఉంటుందని మేషయ్య ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. సమీపంలో ఉన్న ఆస్పత్రుల్లో గడిచిన పదిహేను రోజుల్లో ఎవరెవరు ప్రసవించారన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. -
నడిరోడ్డుపై కుంగిన డ్రైనేజీ పైపులైన్
హైదరాబాద్: సికింద్రాబాద్లో నడిరోడ్డుపై డ్రైనేజీ పైపులైన్ కుంగింది. క్లాక్టవర్ సమీపంలోని రోడ్డులో గురువారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరుగలేదు. అయితే, కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలుసుకుని అప్రమత్తమైన అధికారులు వెంటనే ఆ ప్రాంతంలో రాకపోకలను క్రమబద్ధీకరించారు. అనంతరం వాటర్వర్క్స్ యంత్రాంగాన్ని రప్పించి మరమ్మతులు చేపట్టారు. -
జీవన సిత్రం.!
ఈ చిత్రాన్ని చూస్తే ‘శ్రమ జీవుల స్వేదానికి ఖరీదు కట్టే షరాబులు లేరు’ అన్న మహాకవి శ్రీశ్రీ మాటలు గుర్తుకు వస్తున్నాయి కదూ? ఔను! మన ఇంటి ఎదుట కొద్ది పాటి రోత ఉంటే కాలు కూడా పెట్టలేం. దుర్వాసన వస్తే భరించలేం. మరీ మలమూత్రాలు కలగలసిన మురుగు కాలువను ఈ కష్టజీవులు నిండా మునిగి శుభ్రం చేశారు. వీరి శ్రమను చూసిన వారు ముక్కన వేలేసుకున్నారు. అనంతపురం నడిబొడ్డున ఉన్న మరువ వంకను వట్టి చేతులతోనే గురువారం వీరు శుభ్రం చేయడానికి పూనుకున్నారు. ఓ వైపు భరించలేని దుర్వాసన.. మరో వైపు పురుగుపుట్ర సంచారం వారిని ఇబ్బంది పెడుతున్నా... పగిలిన గాజు పెంకులు గుచ్చుకుంటున్నా... ఒట్టి కాళ్లతో కాలువలో దిగి చేతులతో వ్యర్థాలను తొలగించారు. - వీరేష్, సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
డిష్యుం..డిష్యుం
► శాఖల మధ్య సమన్వయ లోపం ► కాల్వల పూడికతీతపై నువ్వా.. నేనా సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ప్రజాపనుల శాఖ, స్థానిక సంస్థల మధ్య సమన్వయ లోపం ప్రజల పాలిట శాపంగా మారింది. నగరంలో ప్రవహించే కాల్వల పూడికతీత పనుల బాధ్యత నీదంటే నీదనే వాదనలతో ఘర్షణ వాతావరణం నెలకొంది. దక్షిణ చెన్నై శివార్లలో 20కిపైగా చిన్నపాటి నదులు, చెరువులు ఒకటితో ఒకటి కలిసిపోయినట్లుగా మారిపోయి ఉన్నాయి. ప్రజా పనుల శాఖ పరిధిలో ఈ చెరువులు ఉన్నాయి. చేంబాక్కం, మాడంబాక్కం, రాజకీళంబాక్కం, సేలయూరు, సిటిలంబాక్కం, నెమిలిచ్చేరి, పల్లవరం, కీళ్కట్టలై, కోవిలంబాక్కం, పల్లికరనై చెరువులు ఒకదానికి ఒకటిగా అనుసంధానమై ఉన్నాయి. వర్షాకాలంలో ఒక చెరువు నిండితే దాని నుంచి పొంగే నీరు మరో చెరువులోకి ప్రవహించేలా పంటకాల్వల నిర్మాణం జరిగింది. ఈ కాల్వలన్నీ ప్రజాపనులశాఖ పరిధిలోనివి. ఈ చెరువులు, కాల్వల నిర్వహణ, పర్యవేక్షణ పూర్తిగా ప్రజా పనులశాఖదే బాధ్యతని ప్రభుత్వ రికార్డుల్లో స్పష్టంగా పేర్కొని ఉంది. అయితే చెరువుల్లోకి వరదనీరు ప్రవహింపజేసే కాల్వలు కొన్నేళ్లుగా పూడికతీతకు నోచుకోక డ్రైనేజీ నీటితో నిండిపోయి ఉన్నాయి. ఈ మురుగునీరు పొంగిపొర్లిఇతర చెరువుల్లో చేరుతూ మంచినీటిని సైతం మురుగునీరుగా మార్చేస్తున్నాయి. డ్రైనేజీ నీరు సక్రమంగా పారుదల జరిగేలా బాధ్యత వహించాల్సిన స్థానిక సంస్థలు ప్రజా పనులశాఖపైకి నెట్టివేస్తూ మిన్నకుండి పోతున్నాయి. డ్రైనేజీ నీటి బాధ్యత స్థానిక సంస్థలది కాబట్టి తమ జోక్యం ఉండదని ప్రజాపనుల శాఖ పట్టించుకోవడం మానేసింది. ఇలా స్థానిక సంస్థలు, ప్రజాపనులశాఖలు సమన్వయంగా వ్యవహరించడం మానివేసి ఘర్షణ పడుతున్నాయి. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే నవంబర్, డిసెంబర్ మాసాల్లో కురిసే వర్షాల వరదనీరు జనావాసాల్లోకి ప్రవహించే ప్రమాదం ఉంది. బాధ్యతా రాహిత్యమైన ఈ వ్యవహారంపై ప్రజాపనుల శాఖకు చెందిన ఒక అధికారి మాట్లాడుతూ నగర శివార్లలోని అనేక కాలువలు, చెరువులు ఆక్రమణలకు గురై ఉన్నాయని, అన్ని పంటకాలువల్లోనూ డ్రైనేజీ నీరే ప్రవహిస్తోందని అంగీకరించారు. అసలు ఈ సమస్యకు ప్రధాన కారణం స్థానిక సంస్థల నిర్వాహకులని ఆయన ఆరోపించారు. కాల్వల్లో పూడిక తీత పనులను నిర్వహించక వరద ముంపు ఏర్పడితే ప్రభుత్వానికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత స్థానిక సంస్థలదేనని ఆయన అన్నారు. పూడిక తీత పనుల్లో ప్రజాపనుల శాఖ జోక్యం చేసుకున్నట్లయితే కాల్వల్లోకి డ్రైనేజీ నీరు ప్రవహించకుండా పూర్తిగా అడ్డుకోవాల్సి వస్తుందని, దీని వల్ల ఏర్పడే పరిణామాలకు స్థానిక సంస్థలే జవాబు చెప్పుకోవాలని ఆయన చెప్పారు. స్థానిక సంస్థల, ప్రజాపనుల శాఖ అధికారులు పరస్పర నిందారోపణలు ప్రజలకు తలనొప్పిగా మారాయి. పూడిక తీత పనుల చేయకపోవడం, చెరువులు, కాల్వల ఆక్రమణలే గత ఏడాది డిసెంబర్ వర్షాలు చెన్నై నగరాన్ని ముంచెత్తాయి. అన్ని శాఖలపైనా అజమారుుషీ కలిగిన జిల్లా కలెక్టర్ ఈ సమస్యపై జోక్యం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
జనధనంతో.. ప్రైవేటుకు ప్రయోజనం..
నిబంధనలకు నీళ్లొదిలిన తుని మున్సిపల్ అధికారులు పట్టణంలో అనేక ప్రాంతాల్లో కచ్చా డ్రెయిన్లూ కరువే.. టీడీపీ వారి లేఅవుట్కు రూ.28 లక్షలతో కాలువ నిర్మాణం ఎగువ నుంచి నీరు పోవడానికేనని సాకులు తుని : వడ్డించే వాడు మనవాడైతే చాలు.. బంతి చివర కూర్చున్నా నష్టం లేదన్నది సామెత. దీన్ని తుని పురపాలకసంఘం అధికారులు కొంచెం మార్చి ‘మనవాడైతే అసలు బంతిలో కూర్చోకపోయినా విందుకు లోటు లేదు’ అంటున్నారు. ప్రజాధనాన్ని ప్రజల కోసం కాక రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ధారాదత్తం చేస్తున్నారు. తుని పట్టణంలోని అనేక ప్రాంతాల్లో కనీసం రోడ్లు, కాలువలు లేవు. వీటికి సంబంధించి ప్రతిపక్షానికి చెందిన కౌన్సిలర్లు విజ్ఞాపనలిచ్చినా నిధులు లేవని చెప్పి మున్సిపల్ అధికారులు కాలయాపన చేస్తున్నారు. అదే అధికారులు ప్రైవేటు లే అవుట్ కోసం ప్రజాధనంతో అధికారికంగా కాలువ నిర్మాణం చేపట్టారు . అది అధికార పార్టీకి చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్కు సంబంధించిన వారి లే అవుట్ కావడంతో నిబంధనలు సడలించారు. రూ.28 లక్షలతో యుద్ధప్రాతిపదికన కాలువ పనులు చేపట్టారు. నిబంధనలు ఇలా.. ఏదైనా వ్యవసాయ భూమిని లే అవుట్ వేయాలంటే మార్కెట్ విలువలో పది శాతం భూమి మార్పిడి ఫీజు చెల్లించాలి. కాలువలు, రోడ్లు, విద్యుత్ సదుపాయం లే అవుట్ వేసినవారే సమకూర్చాలి. మొత్తం స్థలంలో పది శాతాన్ని ప్రజావసరాలకు మార్ట్గేజ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ సక్రమంగా ఉంటేనే డీటీపీసీ లేదా ఉడా అనుమతులు ఇస్తాయి. గతంలో తుని పరిసర ప్రాంతాల్లో సుమారు 270 ఎకరాల్లో అనధికార లే అవుట్లు వేశారు. ఇందుకు సంబంధించి రూ.30 కోట్ల మేర చెల్లించాలని ఉడా అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు తాజాగా పట్టణానికి ఆనుకుని ఉన్న మున్సిపల్ వైస్ చైర్మన్ కుటుంబసభ్యులకు చెందిన 15 ఎకరాల్లో ఉడా లే అవుట్ వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన అనుమతుల కోసం దాఖలు చేసిన దరఖాస్తుల్లో రోడ్లు, కాలువలు, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలను కల్పిస్తామని పేర్కొన్నారు. 60 అడుగుల రోడ్లు, మేజర్ డ్రెయిన్లను ఏర్పాట చేయాల్సిన బాధ్యత లే అవుట్ వేసే వారిదే. ఇందుకు భిన్నంగా మున్సిపల్ అధికారులు ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన సొమ్ముతో అధికార పార్టీకి చెందిన రియల్ఎ స్టేట్ వ్యాపారికి చెందిన లే అవుట్ లో కాలువ నిర్మిస్తున్నారు. విశేషమేమిటంటే అదే లే అవుట్కు అనుకుని మరో లే అవుట్ వ్యాపారి పక్కా రోడ్లు, కాలువలు, విద్యుత్ లైను ఏర్పాటు చేశారు. ఇక్కడ మాత్రం విరుద్ధంగా జరుగుతోంది. కనీస సదుపాయాలకు నోచని 18కి పైగా మురికివాడలు పట్టణంలోని 18కి పైగా మురికివాడల్లో కనీస సదుపాయాలు లేవు. రోడ్లు, కాలువలు ఏర్పాటు చేయాలని ఏళ్ల తరబడి ప్రజలు అడుగుతున్నా నిధుల కొరత ఉందని చెప్పి అధికారులు తప్పించుకుంటన్నారు. కొండవారిపేట, డ్రైవర్స్ కాలనీ, బ్రహ్మాల కాలనీ, సాయినగర్, వారదరపు పేట, రామకృష్ణా కాలనీ, ఇసుకలపేట, ఉప్పరగూడెం తదితర ప్రాంతాల్లో కచ్చా కాలువలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు తమ ప్రాంతాల్లో పరిస్ధితిని వివరించినా స్పందన లేదని ప్రజలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ వ్యక్తుల వ్యాపారానికి మేలు చేకూర్చేందుకు రూ.28 లక్షలను ధారపోయడాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఇలాంటి అనుచితాలు మాని, ప్రజాధనాన్ని ప్రజోపయోగానికే ఖర్చు పెట్టాలంటున్నారు. కాగా ఎగువ ప్రాంతంలో నీరు పోవడానికి దారి లేకపోవడంతో సదరు లే అవుట్ యజమానిని అభ్యర్థించి అటుగా కాలువను ప్రజల కోసం కాలువను నిర్మిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ ఎస్.వెంకటరమణ చెప్పారు. ఇందులో ఎవరి ఒత్తిళ్లూ లేవని, నిబంధనల ప్రకారం లే అవుట్ యజమాని రోడ్లు, కాలువలు నిర్మించాల్సే ఉంటుందని అన్నారు. -
పల్లెకు సుస్తీ
– గ్రామాల్లో కార్యదర్శులు, పారిశుద్ధ్య కార్మికుల కొరత – పంచాయతీల్లో పెరుగుతున్న సమస్యలు – నిధుల వినియోగంలో స్వలాభాపేక్ష – రోగాలకు నిలయాలుగా మారిన పల్లెలు పల్లెటూళ్లు పట్టణాలకు పట్టుకొమ్మలు. కాని ఆ పల్లెటూళ్ల ఆలనా.. పాలన చూడాల్సిన దిక్కులేక మురికి కూపాలుగా మారిపోయాయి.ఏ చిన్న సమస్య ఎదురైనా ప్రధాన కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావడంతో ప్రజలు అలసి పోవడం మినహా సమస్యకు పరిష్కారం మాత్రం లభించడం లేదు. అనంతపురం సిటీ : జిల్లాలో ఉన్న 1003 గ్రామ పంచాయతీలను ప్రభుత్వం 542 క్లస్టర్లుగా విభజించింది. వీటిని కూడా గ్రేడ్–1 నుంచి గ్రేడ్ 4గా నాలుగు విధాలుగా స్థాయి కల్పించింది. ఈ లెక్కన 542 క్లస్టర్లకు 542 మంది గ్రామ కార్యదర్శులు ఉండాలి. కాని 480 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. 62 స్థానాలు ఖాళీగా నిలిచి పోయాయి. ఏళ్ల తరబడి ఈ స్థానాలను భర్తీ చేయక పోవడంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. ఆస్తి పన్ను వసూళ్లు చేయడానికి ఆయా గ్రామాల్లో కార్యదర్శులు లేక పోవడంతో పదుల సంవత్సరాలుగా పన్ను చెల్లింపులు జరగలేదు. ఫలితంగా పంచాయతీల ఆదాయానికి భారీ గండి∙పడింది. పారిశుద్ధ్యం పట్టేదెవరికీ..? గ్రామ పంచాయతీల్లో తాగునీరు తర్వాత పారిశుద్ధ్యమే ప్రధాన అంశం. పంచాయతీల ఆదాయంలో 30 శాతం శానిటేషన్ పనులకు వెచ్చించాలి. ప్రజాప్రతినిధులు, అధికారులు దీనికి చివరి ప్రాధన్యతను ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. 10 సంవత్సరాలకు పైగా చాలా పంచాయతీల్లో కార్యదర్శులు లేరు. శానిటేషన్ సిబ్బంది నియామకాలు ప్రభుత్వం చేపట్టలేదు. దీంతో పారిశుద్ధ్యం నిర్వహణ అధ్వానంగా తయారైంది. ఇటీవల కాంట్రాక్టు కార్మికులను రోజువారి వేతనం చొప్పున నియమించుకునే అవకాశం కల్పించినా నిబంధనల మేరకు ఇబ్బందులు అదేస్థాయిలో ఉన్నాయి. దీంతో అధికారులు పూర్తి స్థాయిలో పారిశుద్ధ్య సిబ్బందిని నియమించుకోలేకపోతున్నారు. ఇన్ని సమస్యల మధ్య గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దడం ఎండమావే అవుతుంది. వృథా ఖర్చులే ఎక్కువ జిల్లాలో ఎక్కువ ఆదాయం వస్తున్న సుమారు 26 పంచాయతీల్లో కాంట్రాక్టు సిబ్బంది ఉన్నారు. మైనర్ పంచాయతీల్లో సిబ్బంది ఊసే లేదు. ఫలితంగా ప్రజలు ప్రాణాంతకమైన వ్యాధుల బారిన పడుతున్నారు. ఉన్న పంచాయతీ కార్యదర్శుల్లో కూడా చాలా మంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పంచాయతీల్లో పాలకవర్గాలు ఏర్పడి రెండేళ్లు కావస్తోంది. 2013–14 సంవత్సరానికి గాను ప్రభుత్వం 13వ∙ఆర్థిక సంఘం ని«ధులు రూ. 15.71 కోట్లు, స్టేట్ ఫైనాన్స్ కమీషన్ ద్వారా రూ 5.17 కోట్లు విడుదలయ్యాయి. తాజాగా 14వ ఆర్థికS సంఘం నిధులు కూడా రూ. 53 కోట్లు విడుదలై మరో రెండు రోజుల్లో ఖాతాలకు చేరనున్నాయి. గతంలో వచ్చిన నిధులు చాలా వరకు వథాగా ఖర్చు చేసినట్లు సీజినల్ వ్యాధుల తీవ్రతే స్పష్టం చేస్తోంది. ప్రస్తుత నిధులైనా సక్రమంగా గ్రామాల అభివద్ధికి వినియోగించేలా అధికారులు చర్యలు తీసుకుని పాలక వర్గాలకు మార్గదర్శకాలివ్వాలని పలువురు కోరుతున్నారు. -
మురుగుతో అవస్థలు
నివాసాల మధ్య మురుగు నీటి కుంటలు కొరవడిన పారిశుద్ధ్య నిర్వహణ రోగాల బారినపడుతున్న చిన్నారులు సమస్యను పరిష్కరించాలంటున్న స్థానికులు గజ్వేల్ రూరల్: ఇళ్ల పరిసరాలలో మురుగు నీరు నిలుస్తుందని... వాటిలో పందులు స్వైర విహారం, దోమల బెడదతో రోగాల బారిన పడుతున్నామని వాసవీనగర్ కాలనీవాసులు వాపోతున్నారు. నగర పంచాయతీ పరిధిలోని 2వ వార్డు వాసవీనగర్ కాలనీలోని పలు నివాస ప్రాంతాల మధ్య మురుగునీరు చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కాలనీలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే పల్లపు ప్రాంతంలోని నీరు పారదల లేక నిలిచిపోవడంతో కుంటగా తయారైంది. రోజుల తరబడి నీరు నిలిచిపోవడంతో పాచిపట్టి దుర్గంధం వెదజల్లుతోందని, దీనికితోడు పందులు సంచరిస్తుండటంతో దోమల బెడదల ఎక్కువైందని చెబుతున్నారు. కాగా వాసవీనగర్లోని పలుప్రాంతాల్లో నివాస గృహాల మధ్య పశువుల వ్యర్థ పదార్ధాలను నిల్వచేస్తుడటంతో పందుల సంచారం ఎక్కువైందని వివరించారు. మురికినీరు నిల్వ ఉండటంతో తమ మలేరియా, డెంగ్యూ లాంటి రోగాలు ప్రబలు తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. నగర పంచాయతి పరిధిలో నిరంతరం పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాల్సి ఉన్నా అటువంటి చర్యలు తీసుకునదాఖలాలు లేవని స్థానికులు మండిపడుతున్నారు. ముందుగా సమస్య ఉన్న ప్రాంతాలను యుద్ధప్రాతిపధిక గుర్తించాలని, అలాగే పారిశుద్ధ్యంపై అవగాహన చర్యలు, నిరంతర పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు. నీరు లేకుండా చూడాలి ఇళ్ల మధ్యన చాలా కాలంగా నీరు నిలిచి ఉండడంతో దుర్వాసన వస్తోంది. పైగా ఈ మురికినీటి గుంటలు పందులకు ఆవాసాలు మారాయి. అధికారులు స్పందించి ఇళ్ల మధ్య మురుగు నీరు లేకుండా చర్యలు చేపడితే బాగుంటుంది. - రేణుక, గృహిణి పిల్లలకు రోగాలు ఇళ్ల మధ్య నీరు చేరడంతో దోమల బెడద ఎక్కువైంది. పిల్లలు అంటువ్యాధుల బారినపడుతున్నారు. ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. మురుగు నీల్వ ఉండకుండా కాలువల గుండా బయటకు వెళ్లే ఏర్పాటు చేస్తే బాగుంటుంది. - ఎల్లవ్వ -
నాలాల ఆక్రమణలపై ఉక్కుపాదం
కూల్చివేతలు షురూ అక్టోబరు 3 వరకు కూల్చివేతలు పైలట్ ప్రాజెక్టుగా భద్రకాళీ, వడ్డేపల్లి నాలాలు చెరువుల కబ్జాలపై నజర్, నోటీసుల జారీ ప్రభుత్వ ఆదేశాలు అమలు : మేయర్ నరేందర్ సాక్షి, హన్మకొండ : నాలాల విస్తరణపై గ్రేటర్ వరంగల్ కార్పోరేషన్ గట్టి చర్యలు ప్రారంభించింది. నాలాల వెంట అడ్డదిడ్డంగా ఉన్న∙అక్రమ కట్టడాలపై కొరడా ఝులిపించింది. వడ్డేపల్లి నాలా వెంబడి నయింనగర్ పెద్దమోరీ దగ్గర వెలిసిన నిర్మాణాలను కూల్చివేశారు. గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్ దగ్గరుండి ఈ పనులు పర్యవేక్షించారు. అధికార యంత్రాంగం భారీ యంత్రాల సహయంతో ఈ పనులు నిర్వహిస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగరం అతలాకుతలమైంది. నగరంలో ఉన్న వడ్డేపల్లి, భద్రకాళీ చెరువులు ఉప్పొంగాయి. ఈ చెరువుల కింద ఉన్న నాలాలు అక్రమ నిర్మాణాల కారణంగా కుచించుకుపోవడంతో వరద నీరు ముందుకు పోక జనావాసాలను ముంచెత్తింది. దీంతో నాలాల వెంబడి కబ్జాలు, అక్రమ నిర్మాణాలు తొలగించేందుకు గ్రేటర్ వరంగల్ కార్పోరేషన్ పాలకవర్గం యుద్ధ ప్రతిపాదికన చర్యలు చేపట్టింది. తొలివిడతగా బుధ, గురువారాల్లో భద్రకాళీ, వడ్డేపల్లి నాలాల వెంబడి సర్వేలు చేపట్టి, అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా గురువారం చేపట్టిన కార్యక్రమంలో వడ్డేపల్లి నాలాపై నయీంనగర్ పెట్రోల్ బంక్ నుంచి చైతన్య కాలేజి వరకు మొత్తం 18 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించగా 13 నిర్మాణాలు కూల్చివేశారు. ఇందులో ప్రహరిగోడలు, మరుగుదొడ్లు, స్నానపు గదులు, పశువుల దొడ్ల వంటివి ఉన్నాయి. మిగిలిన ఐదు అక్రమ నిర్మాణాలను నేడు కూల్చివేయనున్నారు. అక్టోబరు 3 నుంచి రెండోవిడత అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమం తిరిగి కొనసాగించనున్నారు. సర్వేల ఆధారంగా... రాష్ట్ర పురపాలకశాఖ కమిషనర్ నుంచి నగరంలో ఉన్న నాలాల వెడల్పు, ఆక్రమణలు, నగరంలో ఉన్న చెరువుల పూర్తి నీటి సామర్థ్యం (ఫుల్ టాంక్ లెవల్, ఎఫ్టీఎల్), బఫర్జోన్ల వివరాలు తెప్పించారు. వీటి ఆధారంగా బుధ, గురువారాల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టి అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ఉపక్రమించారు. ఈ నివేదిక ప్రకారం నగరంలో ఉన్న వడ్డేపల్లి, భద్రకాళి వంటి ప్రధాన నాలాలతో పాటు ఏడు చెరువుల దగ్గర ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు. అక్రమ భవనాల యజమానులకు నోటీసులు జారీ చేశారు. పదిహేను రోజుల తర్వాత వీటిపై చర్యలు తీసుకోనున్నారు. భవిష్యత్తులో నాలాలు, చెరువులు ఆక్రమణకు గురికాకుండా ఉండేందుకు ఇరిగేషన్, రెవెన్యూ, సర్వేల్యాండ్ రికార్డ్స్ విభాగాల సహకారంతో సంయుక్త సర్వేను చేపట్టనున్నారు. బడా షాక్... గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థ బుధవారం చేపట్టిన పైలట్ ప్రాజెక్టు నగరంలో సంచలనం రేపింది. తొలిదశలో అధికారులు బడా విద్యా సంస్థలకు చెందిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం పట్ల హర్షం వ్యక్తం అవుతోంది. నయీంనగర్ పెద్దమోరి వంతెన సమీపంలో ఉన్న వాగ్దేవి ఉన్నత పాఠశాల (నాలను ఆక్రమించుకుని నిర్మాణం చేపట్టిన) ప్రహరిని జెసీబీతో కూల్చివేశారు. గురువారం ఉదయం 9:30 గంటలకు చైతన్య విద్యాసంస్థలకు చెందిన ప్రహరి, భవనాల నిర్మాణాలపై సర్వే చేపట్టి అక్రమ నిర్మాణాలకు తేలిన భవనాలను కూల్చివేయనున్నారు. బడా విద్యాసంస్థలకు చెందిన సంస్థలపైనే తొలి వేటు వేయడంతో అక్రమ నిర్మాణాలపై గ్రేటర్ వైఖరి స్పష్టంగా తేటతెల్లమైంది. దీంతో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో గుబులు మొదలైంది. కూల్చివేతలో పాల్గొన్న సిబ్బంది, అధికారుల్లో మనోసై్థర్యం నింపేందుకు నగర మేయర్ నన్నపునేని నరేందర్ దగ్గరుండి పనులు పర్యవేక్షించారు. పైరవీలకు తావులేదు - మేయర్ నన్నపునేని నరేందర్ రాష్ట్ర సీఎం చంద్రశేఖర్రావు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశనం మేరకు ఆక్రమణలకు గురైన నాలాలు, చెరువులను కబ్జాదారుల కబంధహస్తాల నుంచి విముక్తి కల్పిస్తున్నాం. ఇటీవల 22 సెంటిమీటర్ల వర్షం కురిస్తే, ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. పలుచోట్ల ఆస్తినష్టం జరిగింది. నగరంలో చెరువులు, నాలాల ఆక్రమణలకు గురవ్వడమే దీనికి కారణం. ఇలాంటి పరిస్థితి భవిష్యత్తులో ఉండొద్దన్న ఉద్దేశ్యంతో 44 సెంటిమీటర్ల వర్షం కురిసినా నగరం ముంపు బారిన పడవద్దనే ఉద్దేశ్యంతో ఆక్రమణల తొలగింపునకు శ్రీకారం చుట్టాం. ఈ ఆపరేషన్కు పూర్తి సహకారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. భవిష్యత్తులో గ్రేటర్ వరంగల్లో ఎంత పెద్ద వర్షం కురిసినా నగరం ముంపునకు గురికావద్దన్న లక్ష్యంతో స్పెషల్ డ్రైవ్ చేపట్టాం. అక్రమ నిర్మాణాల కూల్చివేతలో ఎలాంటి పైరవీలకు తావులేదు. గతంలో మాదిరి కాకుండా అక్రమ నిర్మాణాల కూల్చివేతలో పెద్దవాళ్ల అక్రమ నిర్మాణాలు, వాణిజ్య సముదాయాలను ముందుగా టార్గెట్ చేస్తున్నాం. వీరి నిర్మాణాలు కూల్చివేత అనంతరమే ఇతర నిర్మాణాల జోలికి వెళ్తాం. పేద వాళ్ల ఇళ్లు కూల్చివేయడం తప్పనిసరి అయితే వారికి ప్రత్యామ్నాయ మార్గాలను చూపుతాం. అందులో భాగంగా రెండు పడకగదుల ఇళ్లు కేటాయిస్తాం. -
గుంటూరు డ్రైనేజీలో పడి బాలుడు మృతి
-
విషవాయువు విడుదల డ్రైనేజీలో మంటలు
-
సంగారెడ్డిలో జోరువాన
సంగారెడ్డి పట్టణంలో బుధవారం మధ్యాహ్నం గంటపాటు భారీ వర్షం కురిసింది. పట్టణంలోని డ్రైనేజీలు పొంగిపొర్లాయి. నిన్నమొన్నటి వరకు ఎండలు దంచి కొట్టడంతో ఇబ్బంది పడ్డ జనం ఈ వర్షంతో వాతావరణం చల్లబడడంతో ఉపశమనం పొందారు.- సాక్షి ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి -
చిన్నారిని మింగిన మురికి కాల్వ
– మురుగు నీరు వెళ్లకుండా అడ్డేసిన వ్యక్తి – ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు – కాల్వలో అధికంగా నీరు ఉండటంతో చిన్నారి మృతికి కారణం ఎమ్మిగనూరు రూరల్: ఒక్కగానొక్క కుమార్తె. ఈనెల 1వ తేదీన మూడో పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆ ఆనందం మరిచిపోకముందే చిన్నారి లోకం విడిచింది. చిన్నారి ప్రమాదవశాత్తు ఇంటి ముందు ఉన్న మురికి కాల్వ పడి మతి చెందిన సంఘటన ఎమ్మిగనూరులో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానిక సంజీవయ్య నగర్కు చెందిన నాగరాజు, సుధ దంపతులకు పల్లవి(3) ఒక్కగానొక్క కుమార్తె. భార్త కార్పెంటర్ పనికి వెళ్లగా భార్య కుమార్తె కోసం ఇంటి వద్దనే ఉండిపోయింది. ఆమె ఇంటిలో పని చేస్తుండగా చిన్నారి ఆడుకునేందుకు బయటకు వచ్చింది. కొద్దిసేపటికి పనికి వెళ్లిన నాగరాజు ఇంటికి చేరుకున్నాడు. కుమార్తె కనిపించకపోవడంతో చుట్టుపక్కల ఇళ్లలో గాలించినా లేకపోవడంతో అనుమానంతో ఇంటి ముందు ఉన్న మురికి కాల్వలో చూశాడు. కుమార్తెకు వేసిన గౌను కనిపించడంతో కాలువలో దిగి చూడగా అప్పటికే చిన్నారి మతి చెందింది. కుమార్తె మతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే పాప ప్రాణం తీసింది: నాగరాజు ఇంటి మీదుగా వెళ్తున్న మురికి కాల్వ నీరు ముందుకు వెళ్లకుండా ఓ వ్యక్తి తన స్థలంలో రెండు రోజుల క్రితం అడ్డుకట్ట వేశాడు. దీంతో నీరంతా కాల్వలోనే నిలిచిపోయింది. విషయాన్ని స్థానికులు మున్సిపల్, ఎమ్మెల్యే దష్టికి తీసుకెళ్లారు. అయినా చర్యలు తీసుకోకపోవడంతో చిన్నారి మతికి కారణమైంది. తమ బిడ్డ మతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని చిన్నారి తల్లిదండ్రులు విలపిస్తున్నారు. -
'మ్యాన్ హోల్' బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
హైదరాబాద్: మ్యాన్ హోల్ ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. మృతుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. డ్రైనేజీ నిర్వహణను యంత్రీకరణ ద్వారా నిర్వహించాలని భట్టి విక్రమార్క తెలిపారు. కాగా, మృత్యు కుహరాల్లా మారిన మ్యాన్హోల్లు నలుగురిని మింగేశాయి. జలమండలి అధికారులు, పనులు చేపట్టిన కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. రెక్కాడితేగాని డొక్కాడని ముగ్గురు కార్మికులతోపాటు వారిని కాపాడబోయిన మరో వ్యక్తి మృత్యువాత పడ్డారు. మాదాపూర్లో ఈ దుర్ఘటన జరిగింది. మాదాపూర్లో శనివారం ఈ దుర్ఘటన జరిగిన సంగతి తెలిసిందే. -
పత్తాలేని స్పెషల్ డ్రైవ్
సంగారెడ్డి మున్సిపాలిటీ: పట్టణంలో పారిశుద్ధ్యం మెరుగుకు ఈ నెల 2నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని మున్సిపల్ అధికారులు చెప్పినా ఆచరణలో మాత్రం ఎక్కడా కనిపించడంలేదు. వర్షకాలంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంటుందని, అంటువ్యాధుల తీవ్రంగా ఉటుందని అందుకు స్పెషల్ డ్రైవ్ చేసి పరిస్థితి చక్కదిద్దాల్సిందిగా ఇటీవల నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో సభ్యులు సూచించారు. ఆందుకు అనుగుణంగానే వార్డుల వారీగా ప్రతి రోజు రెండు వార్డుల్లో స్పెషల్ డ్రైవ్ ఈనెల 2 నుంచి ప్రారంభిస్తామని ఇన్చార్జి కమిషనర్ పేర్కొన్నారు. కాని ఇంత వరకు ఏవార్డులో కూడా పారిశుద్ధ్య నివారణకు గాను చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోయింది. దీంతో పట్టణంలో పారిశుద్ధ్యం సమస్య తీవ్రంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు. ప్రధానంగా మురుగు( స్లమ్) కాలనీల్లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉందంటున్నారు. ఇప్పటికే పట్టణంలోని సంజీవ్నగర్కు చెందిన ఒక వ్యక్తి డెంగ్యూ బారిన పడి మృతి చెందిన సంఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా వ్యాధి నివారణకు చర్యలు తీసుకోవడంలో వైద్య సిబ్బంది, మున్సిపల్ అధికారులు పూర్తిగా విఫలమైనట్లు ప్రజలు పేర్కొంటున్నారు. ప్రధాన రహదారిపై ఉన్న మోర్ సూపర్ మార్కెట్ పక్కన మటన్, చికెన్ వ్యాపారులు వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేస్తుండడంతో కాలనీలో దుర్గంధం వస్తుందని, దీనికితోడు రాత్రిళ్లు దోమలు స్వైరవిహారం చేస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మురుగు కాల్వలు సైతం లేకపోవడంతో వరద, డ్రైనేజీ నీరు ఇళ్ల మధ్యనే నిల్వ ఉంటున్నట్లు కాలనీకి చెందిన సుశీల తెలిపారు. ఈ విషయంపై కాలనీకి చెందిన తాము పలుమార్లు కమిషనర్తో పాటు స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్కు సైతం ఫిర్యాదులు చేసినా తమ సమస్యను పరిష్కరించడంలేదన్నారు.. ఇప్పటికే వర్షం కారణంగా బురుద మయం కావడంతో పాటు నడువలేని పరిస్థితి నెలకొందన్నారు. మీరైన పట్టించుకోరూ.. తమ కాలనీలో నెలకొన్న కనీస సమస్యలను మీరైన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ను కోరుతున్నా. తాము పలుమార్లు మున్సిపల్ కమిషనర్, చైర్పర్సన్లకు విన్నవించినా స్పందించలేదు. ఎమ్మెల్యేకు సైతం తెలిపాం. మురుగుకాల్వలను నిర్మించాలని కోరాం.. అయినా స్పందించలేదు. మీరైన దళిత కాలనీపై దృష్టి పెట్టాలి. - సుశీల,కాలనీవాసి సంజవ్నగర్ -
‘ప్లంబర్’తో ఒలింపిక్స్కు...
బ్రిటన్ జట్టు ముందు జాగ్రత్త రియో: ఒలింపిక్ విలేజ్లో సౌకర్యాలు బాగా లేవు... నల్లాలు లీక్ అవుతున్నాయి, డ్రైనేజీ సమస్యలు కూడా ఉన్నాయి... రియోలో అడుగు పెట్టిన దగ్గరినుంచి చాలా మంది ఆటగాళ్లు చేస్తున్న ఫిర్యాదులు ఇవి. బ్రిటన్ జట్టు మాత్రం వీటికి పరిష్కారం కనుక్కుంది! ఎవరో వస్తారని, బాగు చేస్తారని ఎందుకు సమయం వృథా చేయడం. మనమే చేసుకుంటే పోలా అనుకుంది. అందుకే ఒలింపిక్స్కు తమ జట్టుతో పాటు ప్లంబర్ను కూడా తీసుకుపోయింది. ‘మాతో పాటు ప్లంబర్ను తీసుకొచ్చాం. అతడికి పెద్దగా పని పడకపోతే మంచిదే. కానీ ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే బాగు చేసుకోవచ్చు. ఆటగాళ్లకు సౌకర్యంగా కూడా ఉంటుంది’ అని బ్రిటన్ చెఫ్ డి మిషన్ మార్క్ ఇంగ్లండ్ చెప్పడం విశేషం. -
అభివృద్ధికి నోచుకోని పేరుకలపూడి
డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం మౌలిక వసతులు లేని లేఅవుట్ కాలనీ సమస్యలు పరిష్కరించాలని స్థానికుల విజ్ఞప్తి పేరుకలపూడి (దుగ్గిరాల) : మండలంలోని పేరుకలపూడి గ్రామంలో సమస్యలు తిష్టవేశాయి. గ్రామంలో సుమారు 3500 మంది జనాభా ఉండగా 2700 మంది ఓటర్లు ఉన్నారు. వర్షాకాలం ఆరంభం కావడంతో డ్రైనేజీ సమస్య మరింత జఠిలంగా మారి ఇళ్ల ముందు వర్షపు నీరు చేరి దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. దీంతో రోగాల బారినపడే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్గత రోడ్లు అభివృద్ధికి నోచుకోకపోవడంతో చిన్నపాటి వర్షానికే చిత్తడిగా మారుతున్నాయి. గ్రామ శివారులో ప్రభుత్వం 52 మంది పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసింది. ఇళ్ల స్థలాలు కేటాయించి నేటికి 15 ఏళ్లు గడుస్తున్నా లే అవుట్ కాలనీ అభివృద్ధికి నోచుకోలేదు. మెరకతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో కొత్త కాలనీలో ఎవరూ ఇళ్లు నిర్మించేందుకు ముందుకు రావడంలేదు. క్రమంగా ప్లాట్లకు ఏర్పాటుచేసిన సరిహద్దు రాళ్లు సైతం శిథిలమయ్యాయి. దీంతో లబ్ధిదారులకు కేటాయించిన సరిహద్దులు చెరిగిపోయాయి. ఇదిలా ఉండగా కొందరూ గతిలేక ఈ దుర్భర పరిస్థితుల్లోనే గూడు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. కాలనీలో మౌలిక వసతులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురువుతున్నారు. వెంటనే ప్లాట్లకు సరిహద్దులు నిర్మించి కాలనీలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మురుగుతో అవస్థలు పేరుకలపూడి గ్రామంలో మురుగు సమస్య అధికంగా ఉంది. కొన్ని రోడ్లలో మురుగు కాల్వలు లేక ఇంటి ముంగిట చేరి ఇబ్బందికరంగా మారుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉన్న మురుగు కాల్వను బాగు చేసే వారు కరువయ్యారని వారు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించే విధంగా కృషిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మురుగు కాల్వలు నిర్మించాలి గ్రామంలో మురుగు సమస్య అధికంగా ఉంది. కాల్వలు లేకపోవడంతో వర్షను నీరు ఇళ్ల ముందుకు వస్తున్నాయి. నిల్వ ఉన్న నీటిపై దోమలు వ్యాప్తి చెంది రోగాల బారినపడే అవకాశం ఉంది. అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలి. -బచ్చల సుమతి, పేరుకలపూడి మౌలిక వసతులు కల్పించాలి పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో మెరక సమస్య ప్రధానంగా ఉంది. ప్రస్తుతం తాము ఉండడానికి స్థలం కొరత ఏర్పడడంతో చేసేదిలేక ఇక్కడే నివాసం ఉంటున్నాం. వీధిదీపాలు సైతం లేకపోవడంతో రాత్రివేళల్లో విషసర్పాలు వస్తున్నాయి. -శృంగారపాటి లక్ష్మి, పేరుకలపూడి డ్రైనేజీ సమస్య పరిష్కారానికి ప్రణాళిక రూపొందించాం డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు ప్రణాళికలు రూపొందించాం. రెండు మూడు రోజుల్లో గ్రామంలో మురుగు కాల్వ పూడికతీత పనులు ప్రారంభిస్తాం. గ్రామంలోని ప్రధాన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తాం. -శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి -
ఎడాపెడా..ఐటీఢీఏ
♦ అతిగా వ్యవహరిస్తున్న ‘అటవీ’ అధికారులు ♦ ఆస్పత్రుల్లో అస్తవ్యస్తంగా డ్రెయినేజీలు ♦ వాడివేడిగా ఐటీడీఏ పాలక మండలి సమావేశం ♦ హాజరైన మంత్రులు చందూలాల్, డాక్టర్ లక్ష్మారెడ్డి, తుమ్మల ఐటీడీఏ పాలకమండలి సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి తుమ్మల, చిత్రంలో మంత్రులు చందూలాల్, లక్ష్మారెడ్డి, ఎంపీ పొంగులేటి, కలెక్టర్ లోకేష్ కుమార్, ఐటీడీఏ పీఓ రాజీవ్ గాంధీ హన్మంతు, గిరిజన సంక్షేమ శాఖ డెరైక్టర్ లక్ష్మణ్, జెడ్పీచైర్పర్సన్ కవిత సాక్షిప్రతినిధి, ఖమ్మం/అశ్వారావుపేట : ‘హక్కు పత్రాలుండి.. పోడు చేసుకుంటున్న గిరిజనులపై దాడులకు పాల్పడుతున్నారు. అక్రమంగా కేసులు పెడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా భూమినే నమ్ముకున్న గిరిపుత్రులు కుటుంబాలను పోషించుకుంటున్నారు. అవి మా భూములంటూ అటవీ శాఖాధికారులు ఇప్పుడు అడ్డు తగులుతున్నారు. హక్కు పత్రాలున్నా.. అడుగుపెట్టనివ్వరా? ఇదెక్కడి న్యాయం? సీఎం కేసీఆర్, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న చెప్పినా.. అటవీ శాఖ అధికారులు పట్టించుకోరా? పీహెచ్సీలు శిథిలావస్థకు చేరాయి. మందు బిళ్లలు సకాలంలో అందడం లేదు. ఆస్పత్రుల్లో డ్రెయినేజీలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. వైద్య సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వర్షాకాలం వచ్చేసింది. ఇంకెప్పుడు చికిత్సలు మొదలుపెడతారు’.. అంటూ ఐటీడీఏ పాలక మండలి సమావేశంలో ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడు సమస్యపై ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులతోపాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా అటవీ శాఖ అధికారుల తీరుపై మండిపడ్డారు. దాదాపు ఐదు నెలల తర్వాత అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో ఐటీడీఏ పాలక మండలి సమావేశం శుక్రవారం నిర్వహించారు. కలెక్టర్ డీఎస్.లోకేష్కుమార్ అధ్యక్షత వహించగా.. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి, రోడ్లు, భవనాలు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, గిరిజన సంక్షేమ శాఖ డెరైక్టర్ లక్ష్మణ్ హాజరయ్యారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వరకు అటవీ భూములు, పోడు సమస్య, వైద్యం తదితర అంశాలపై వాడివేడిగా చర్చ కొనసాగింది. పోడు భూముల సమస్యపైనే ప్రజాప్రతినిధులు ముక్తకంఠంతో గిరిజనుల సమస్యలను లేవనెత్తి.. అటవీ అధికారుల తీరును నిరసిస్తూ.. వారి సమస్యలను పరిష్కరించాలని మంత్రులకు విన్నవించారు. తొలుత వైద్యంపై చర్చించారు. ఆ తర్వాత పోడు భూములు, విద్య, సంక్షేమం, ట్రైకార్ రుణాలపై చర్చించారు. ఆశ్రమ పాఠశాలలకు ప్రహరీలు, అంతర్గత రహదారులు లేవని సభ్యులు చెప్పగా.. జిల్లాలో రూ.8.21కోట్ల ప్రతిపాదనలు పంపామని, అంతర్గత రహదారులకు రూ.5.74కోట్లతో ప్రతిపాదనలు పంపామని, నిధులు మంజూరు కాగానే దశలవారీగా పనులు చేపడతామని పీఓ రాజీవ్ గాంధీ హన్మంతు చెప్పారు. ఐటీడీఏ, ఆశ్రమ పాఠశాలల్లో ఫలితాలు నానాటికీ తగ్గుతున్నాయని.. అధికారులు పరిశీలించాలని కోరగా.. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఎప్పటికప్పుడు సమీక్షించాలని పీఓ అన్నారు. దుమ్ముగూడెం తహసీల్దార్ ఆదివాసీల పట్ల చులకనగా ప్రవర్తిస్తున్నారని.. అసలు పనిచేయని తహసీల్దార్పై చర్య తీసుకునే వారే లేరని సమావేశంలో లేవనెత్తారు. అతడిని బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే హెచ్చరించామని.. మార్పు రాకుంటే చర్య తీసుకుంటామని కలెక్టర్ లోకేష్కుమార్ చెప్పారు. జిల్లాలో ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని.. అనుమతి లేకుండా పాఠశాలలు నడుపుతున్నారని, ప్రైవేటు పాఠశాలలకు ఫీజులు చెల్లించలేక గిరిజనులు అప్పుల పాలవుతున్నారని పలువురు జెడ్పీటీసీలు ఆవేదన వ్యక్తం చేశారు. పోడు భూములు, వైద్యంపై చర్చించిన అంశాల వరకే మంత్రులు సమావేశంలో ఉన్నారు. తర్వాత మిగిలిన రెండు అంశాలపై కలెక్టర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు చర్చించారు. విషజ్వరాలను నివారించాలి.. సభ్యులు లేవనెత్తిన పలు అంశాలపై మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. విష జ్వరాలను ఏజెన్సీలో పూర్తిస్థాయిలో నివారించేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ముందస్తుగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే మందులు, కిట్స్ సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. గతంలో అవగాహన లేకపోవడంతో విషజ్వరాలతో చాలా మంది గిరిజనులు చనిపోయారన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లాలో అక్కడక్కడ పీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రుల్లో మరమ్మతులు ఉన్నాయో? వాటిని రెండు, మూడు నెలల్లో బాగు చేయిస్తామన్నారు. రాష్ట్రంలో ఈ సీజన్లో తొలుత జిల్లాలోని ఏజెన్సీలోనే పర్యటించినట్లు చెప్పారు. సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటామన్నారు. ఫీల్డ్కు వెళ్లరు.. ఏం జరుగుతుందో తెలియదు.. అటవీ శాఖ అధికారులు ఫీల్డ్కు వెళ్లరని, అక్కడ ఏం జరుగుతుందో కూడా వారికి తెలియదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అటవీ శాఖ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో కార్పొరేట్ స్థాయిలో వందెకరాల్లో వ్యవసాయం చేస్తున్న వారిని అటవీ అధికారులు ఎందుకు అరెస్ట్ చేయడం లేదన్నారు. కొద్ది మొత్తంలో పోడు చేసుకుని జీవనం కొనసాగిస్తున్న గిరిజనులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించారు. 2005 తర్వాత ఆక్రమించిన భూములపై అటవీ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అటవీ హక్కుల చట్టంలో గిరిజనులకు ఇచ్చిన భూములను అభివృద్ధి చేసుకోవద్దనే నిబంధనలు ఏమైనా ఉన్నాయా? అని ఆయన అటవీ అధికారులను ప్రశ్నించారు. సమావేశంలో జేసీ దివ్య, జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్బాబు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఫారెస్ట్ కన్జర్వేటర్ నర్సయ్య, జెడ్పీ సీఈఓ నగేష్, డ్వామా పీడీ జగత్కుమార్రెడ్డి, డీఈఓ రాజేష్, జిల్లా అధికారులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు. -
పైన పటారం...
‘బెస్ట్ కాలనీ’ సరిహద్దులో వరెస్ట్ వినయ్నగర్ కాలనీ బస్టాండ్లో డ్రైనేజ్ సమస్య 40 ఏళ్ల నాటి వ్యవస్థతో పదేళ్లుగా ఇబ్బందులు 250 మీటర్లు మార్చేందుకు జలమండలి కక్కుర్తి సిటీబ్యూరో: అది సైదాబాద్లోని ఐఎస్ సదన్ చౌరస్తాను ఆనుకుని ఉన్న వినయ్నగర్ కాలనీ... గతేడాది బెస్ట్ కాలనీగా ఎంపికై బల్దియా నుంచి రూ.10 లక్షల నజరానా అందుకుంది. అయితే కాలనీ లోపల హుందాగానే ఉన్నా సరిహద్దులో మాత్రం డ్రైనేజ్ వ్యవస్థ దుర్భరంగా మారింది. దాదాపు 40 ఏళ్ల నాటి పైప్లైన్ను కేవలం 250 మీటర్ల మేర మర్చడంలో ప్రభుత్వ విభాగాల కక్కుర్తితో 10 ఏళ్లగా స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని కాలనీ సంఘం ఆరోపిస్తోంది. ఐఎస్ సదన్ చౌరస్తాలోని మసీదు/దేవాలయం నుంచి దాదాపు 250 మీటర్ల మేర ఏళ్ల నాటి డ్రైనేజ్ పైప్ లైనే ఉంది. ఈ ప్రాంతంలో పదేళ్లుగా వాణిజ్య, నివాస సముదాయాలతో పాటు వసతిగృహాలు పెరగడంతో వాటి నుంచి బయటకు వచ్చే మురుగునీరు ఎన్నో రెట్లు పెరిగింది. చౌరస్తా నుంచి చంపాపేట్ వెళ్లే సాగర్ హైవే. వినయ్నగర్ కాలనీ సరిహద్దుల్లోనే ఇబ్రహీంపట్నం/దేవరకొండకు వెళ్లే బస్సులు నిలిపే బస్టాప్ సైతం ఉంది. ప్రధానంగా రద్దీ వేళల్లోనే పాత పైప్లైన్ కారణంగా మ్యాన్హోల్స్ పొంగి బస్టాండ్తో పాటు రహదారిని ముంచెత్తుతోంది. దీంతో ప్రయాణికులు అవస్థలుఎదుర్కొంటున్నారు. ఐఎస్ సదన్ చౌరస్తా వెంబడి జీవనం సాగించే చిరువ్యాపారులు, ఆటో స్టాండ్కు ఆటో ఎక్కేందుకు వచ్చే స్థానికులు మురుగు నీటిలోంచే వెళ్లాల్సి వస్తోంది. సమస్యను పరిష్కరించాలని ‘ఏడేళ్లుగా ఈదీబజార్లోని జలమండలి అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. ఇప్పటి వరకు అధికారులు కనీసం ఎస్టిమేట్స్ కూడా తయారు చేయలేదు. సోమవారం చంద్రాయణగుట్టలోని జలమండలి జనరల్ మేనేజర్ నాగేంద్రకుమార్ను కలిశాం. గరిష్టంగా మూడు రోజుల్లోపు అంచనాలు తీయారు చేయాల్సిందిగా ఈదిబజార్ అధికారుల్ని ఆదేశించారు. కేవలం 250 మీటర్ల మేర పైప్లైన్ మార్చడానికి ఇన్నాళ్లు కాలయాపన చేస్తూ స్థానికుల్ని, ప్రయాణికుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు’ అని వినయ్నగర్కాలనీ హౌసింగ్ సొసైటీ కార్యదర్శి అవినాష్ కె.రౌత్ అన్నారు. -
ఇంకా అలాగే..
తొలగని గాలివాన కష్టాలు అంధకారంలో పలు కాలనీలు సిటీబ్యూరో: నగరంలో శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షంతో తలెత్తిన పరిస్థితులు ఇంకా చక్కబడలేదు. జీహెచ్ఎంసీ ప్రధాన రహదారులకు ప్రాధాన్యమిచ్చి పనులు చేసినప్పటికీ, కాలనీలు, బస్తీలు, సబ్లైన్లలో కూలిన చెట్లను ఇంకా తొలగించలేదు. ఆయా విభాగాల మధ్య సమన్వయలేమి వల్ల పనుల్లో జాప్యం జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో కూలిన చెట్లు తొలగిస్తే కానీ తాము విద్యుత్ లైన్లు బాగుచేయలేమని విద్యుత్శాఖ సిబ్బంది వెనుదిరుగుతున్నారు. కూలిన భారీ చెట్ల తరలింపు పనులు బైలైన్లలో ఇంకా పూర్తికాలేదు. దాంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం వచ్చిన గాలివాన వల్ల ఏర్పడ్డ ఇబ్బందులపై శుక్ర, శనివారాల్లో జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్కు 564 ఫిర్యాదులు అందాయి. వాటిలో కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు తదితరమైనవి ఉన్నాయి. కాగా, మూడురోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రాజేంద్రనగర్లోని ఇబ్రహీంబాగ్లో ప్రజలు ఆదివారం స్థానిక సబ్స్టేష న్ ముందు ఆందోళనకు దిగారు. అందిన ఫిర్యాదుల్లో ప్రధానమైనవి.. కూలిన చెట్లు : 266 విద్యుత్లేని ప్రాంతాలు : 176 కూలిన విద్యుత్ స్తంభాలు : 47 డ్రైనేజి సమస్య ఉన్న ప్రాంతాలు : 16 -
ఏదీ ప్రక్షాళన
► ముంచుకొస్తున్న వర్షాకాలం ► పూడుకుపోయిన డ్రైనేజీలు ► చినుకుపడితే రహదారులు గోదారే పట్టించుకోని అధికారులు సాక్షి,సిటీబ్యూరో: వర్షాకాలం సమీపిస్తున్నా అధికార యంత్రాంగం కళ్లు తెరవడంలేదు. ఇటీవల నగరంలో కురిసిన కొద్దిపాటి వర్షాలకే రహదారులు గోదారులను తలపించాయి. డ్రైనేజీలు ఉప్పొంగగా, మూతలు లేని మ్యాన్హోళ్ల వద్ద వరదనీరు సుడులు తిరిగింది. గ్రేటర్లో మురుగు నీటిపారుదల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటమే ఆందుకు కారణం. అయినా అధికారులు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. జీహెచ్ఎంసీ, జలమండలి విభాగాల మధ్య సమన్వయ లేకపోవడమే ఇందుకు కారణమని విమర్శలు ఉన్నాయి. నిలువెల్లా నిర్లక్ష్యం..! వేసవి పూడికతీత పనులు చేపట్టేందుకు కాగితాలపై ప్రణాళికలు సిద్ధంచేసిన జలమండలి అధికారులు ఆచరణలో విఫలమయ్యారు. గ్రేటర్ పరిధిలో 5000 కిలోమీటర్ల మేర మురుగునీటి పారుదల వ్యవస్థకు చెందిన పైపు లైన్లున్నాయి. ఇందులో 1500 కిలోమీటర్ల మేర పైప్లైన్లలో పూడిక పేరుకుపోయింది. వీటిని యుద్ధ ప్రాతిపదికన ఎయిర్టెక్ యంత్రాలతో శుద్ధిచేస్తేనే వర్షాకాలంలో నీటి ప్రవాహానికి ఆటంకం ఉండదు. అయితే జలమండలి దీనిపై దృష్టి సారించకపోవడంతో నిత్యం డ్రైనేజీ లైన్లు పొంగి పొర్లుతున్నాయి. జలమండలి మెట్రో కస్టమర్ కేర్ సెంటర్కు రోజూ 200కు పైగా ఫిర్యాదులు అందుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గ్రేటర్ పరిధిలో సుమారు 1500 కిలోమీటర్ల మేర ఒపెన్ నాలాలు, డ్రైనేజిలున్నాయి. వీటి పర్యవేక్షణ బాధ్యతను జీహెచ్ఎంసీ చూస్తోంది. వీటిలో ఇప్పటివరకు సగం మేర మాత్రమే పూడిక తీశారు. మిగతా చోట్ల చెత్తా చెదారం పేరుకుపోవడంతో వరదనీటి ప్రవాహానికి తరచూ ఆటంకాలు ఏర్పడుతుండడంతో సమీప బస్తీలు, కాలనీలు జలమయమవుతున్నాయి. పలు నాలాలకు ఫెన్సింగ్ లేదు. నాలుగేళ్ల క్రితం పెద్ద నాలాలకు అరకొర రక్షణ ఏర్పాట్లు చేసి మహానగరపాలక సంస్థ చేతులు దులుపుకోవడం గమనార్హం. ఎక్కడి చెత్త అక్కడే.. ఏటా వేసవిలో డ్రైనేజి పైపు లైన్లలో పూడికతీత తొలగించడం ఆనవాయితీ. ఈసారి పనులు పూర్తిచేయడంలో జలమండలి అలసత్వం ప్రదర్శిస్తుండటంతో ముంపు భయంతో స్థానికులు అందోళన చెందుతున్నారు. దీనిపై కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు జలమండలి క్షేత్రస్థాయి అధికారులు,అత్యవసర కాల్సెంటర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకునేవారు కరువయ్యారు. మత్యు బిలాలదీ అదే పరిస్థితి..... గ్రేటర్లో అడుగడుగునా నోళ్లు తెరచుకున్న మ్యాన్హోళ్లకు మూతలు లేక పోవడం నగర దుస్థితికి అద్ధంపడుతుంది. పగిలిపోయి శిథిలా వస్థలో ఉన్న మత్యుబిళాలపై మూతలు ఏర్పాటుచేయడంలో ఇటు జలమండలి, అటు జీహెచ్ఎంసీలు విఫలమౌతున్నాయి. నగరంలో 1.50 లక్షల మ్యాన్హోళ్లుండగా ఇందులో 25 వేల వరకు మూతలు లేకపోవడం గమనార్హం. కిర్లోస్కర్ కమిటీ సిఫారసులు బుట్టదాఖలు.. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ, వరదనీటి కాల్వల ఆధునికీకరణకు కి ర్లోస్కర్ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ ఏడేళ్ల క్రితం విలువైన సిఫారసులు చేసింది. వీటిని గ్రేటర్ పరిధిలో అమలు చేయాలంటే రూ.6 వేల కోట్లు అవసరమవుతాయని జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొంటున్నా.. నిధులను కేటాయించడంలో నగరపాలక సంస్థ చేతులెత్తేయడంతో పరిస్థితి నానాటికి ప్రమాదకరంగా మారుతోంది. -
చక..చకా.. అవుట్ఫాల్ డ్రెయిన్ పనులు
► పనులైపై డీసీపీ కాళీదాసు ఆరా..! ► త్వరగా పూర్తి చేసేందుకు వీఎంసీ చర్యలు చిట్టినగర్ : కేఎల్రావునగర్ అవుట్ఫాల్ డ్రెయిన్ పనులు వేగం పుంజుకున్నాయి. ఓ వైపున రైల్వే అధికారులు డ్రెయిన్ వెంబడి తమ హద్దులను నిర్ణయించినప్పటికీ కార్పొరేషన్ వెనుకంజ వేయకుండా పనుల వేగం పెంచింది. పనుల తీరుపై కాంట్రాక్టర్తో పాటు కార్పొరేషన్ అధికారులపై మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేయడంతో మంగళవారం తెల్లవారే సరికి పనిముట్లు, అదనపు కార్మికులను రంగంలోకి దింపారు. ఈఈ ఓం ప్రకాష్, డీఈ కోటేశ్వరరావు పనులను పర్యవేక్షించడమే కాకుండా ఎప్పటికప్పుడు పనుల పురోగతిని కమిషనర్ మొబైల్కు ఫొటోల రూపంలో పంపుతూ కమిషనర్ ఆదేశాలను ఆచరణలో పెడుతున్నారు. మూడు పొక్లెయిన్లతోపాటు నీటిని తోడే మెషిన్లు పెట్టారు. గోతుల్లో బెడ్ ఏర్పాటు చేయడంతోపాటు సైడ్ వాల్స్ కోసం బాక్స్లను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం రైల్వే డీఆర్ఎం డ్రెయిన్ వద్దకు విచ్చేసి పనులను పరిశీలించే అవకాశం ఉందని తెలియడంతో కొత్తపేట పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్రెయిన్ వద్దకు డీసీపీ కాళిదాసు డ్రెయిన్ నిర్మాణం వివాదస్పదంగా మారుతుండటంతో నగర డీసీపీ కాళీదాసు, వెస్ట్ ఏసీపీ జి.రామకృష్ణ అంబేద్కర్నగర్కు విచ్చేశారు. డ్రెయిన్ నిర్మాణం కోసం తీసిన గోతులు ఎవరి హద్దుల్లో ఉన్నాయనే వివరాలతోపాటు సోమవారం రైల్వే సిబ్బంది పాతిన గడ్డర్లను, సరిహద్దులను పరిశీలించారు. వీఎంసీ డీఈ కోటేశ్వరరావును వివరాలను అడిగి తెలుసుకోవడమే కాకుండా ఈఈ ఓం ప్రకాష్తో ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుతం త్వరగా పనులు పూర్తి చేసేందుకు అవసరమైన సామాగ్రి, కూలీలను ఏర్పాటు చేయాలని సూచించారు. -
ఇవేం పైపులైన్లు?
తీవ్రంగా కలుషితమవుతున్న జలాలు పురాతన పైపులైన్లే కారణం గుర్తించిన అధికారులు నూతన పైపులైన్ల ఏర్పాటుకు చర్యలు.. ఏడు నీటి నమూనాల్లో బ్యాక్టీరియా కలకలం.. సిటీబ్యూరో: నగరంలో పురాతన మంచినీటి పైపులైన్లు, డ్రైనేజి పైపులైన్లు ఒకదానిపై మరొకటి ఉన్న చోట కలుషిత జలాల సమస్య తరచూ తలెత్తుతోంది. ఇటీవల సరూర్నగర్ పరిధిలోని కామేశ్వర్రావు నగర్, అల్వాల్లోని రాజీవ్నగర్, అంబేద్కర్నగర్, మలక్పేట్లోని ప్రిన్స్ బాడీగార్డ్లేన్, చర్చికాలనీ, రామంతాపూర్లోని గోకుల్నగర్లో కలుషిత జలాల సమస్య ఉత్పన్నమైన విషయం విదితమే. ఈనేపథ్యంలో జలమండలి అధికారులు రంగంలోకి దిగి కలుషిత జలాలకు కారణాలను గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో పురాతన ఆర్సీసీ, ఏసీ, పీవీసీ, హెచ్డీపీఈ మంచినీటి సరఫరా పైపులను భూమి నుంచి 5 నుంచి ఆరు అడుగుల లోతున ఏర్పాటు చేశారు. వీటిపై నుంచి నూతనంగా మురుగు నీటి పైపులైన్లు వేయడంతో మంచినీరు, మురుగు నీటి పైపులైన్లకు ఏర్పడిన స్వల్ప లీకేజీలతో కలుషిత సమస్య ఉత్పన్నమైంది. ఆయా ప్రాంతాల్లో తక్షణం పురాతన మంచినీటి పైపులైన్ల స్థానే నూతన పైపులైన్లను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. హడ్కో సంస్థ మంజూరు చేసిన రుణంతో ఆయా ప్రాంతాల్లో ఈ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని జలమండలి ఎండీ బి.జనార్దన్రెడ్డి అధికారులను ఆదేశించారన్నారు. ఇక ఆయా ప్రాంతాల్లో గుంతల్లో ఏర్పాటు చేసిన పిట్ట్యాప్లను తక్షణం తొల గించాలని స్థానికులకు సూచించామని జలమండలి వర్గాలు తెలిపాయి. 11247 నీటి నమూనాలకు పరీక్షలు.. మార్చి 1 నుంచి 24 వరకు నగర వ్యాప్తంగా 11,247 మంచినీటి నమూనాలకు ఇన్సిట్యూట్ ఆఫ్ హెల్త్సిస్టమ్స్ ల్యాబుల్లో పరీక్షలు నిర్వహించినట్లు జలమండలి ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో ఏడు నీటి నమూనాల్లో మాత్రమే బ్యాక్టీరియా ఆనవాళ్లున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో కలుషిత జలాల సమస్యను నివారించామని ప్రకటించింది. ఇక రోజువారీగా నగరం నలుమూలల నుంచి 2180 నీటి నమూనాలను సేకరింంచి ఇన్సిట్యూట్ ఆఫ్ హెల్త్సిస్టమ్స్, ఇన్సిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ల్యాబుల్లో పరీక్షిస్తున్నామన్నారు. నీటి నమూనాల సేకరణకు సెల్ఫ్హెల్ప్గ్రూపు మహిళల సహకారం తీసుకుంటున్నామన్నారు. కలుషిత జలాలపై అందిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని ఎండీ బి.జనార్దన్రెడ్డి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సీజీఎం, జీఎం, డీజీఎం, మేనేజర్లకు ఆదేశాలిచ్చారన్నారు. -
మురికికాల్వలో పడి చిన్నారి మృతి
తాండూరు: పారాడుతూ వెళ్లిన ఓ పసివాడు మురికి కాల్వలో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. అప్పటి వరకు ఇంట్లో సందడి చేసిన చిన్నారి కనిపించకపోయే సరికి ఆందోళన చెందిన తల్లి ఇంటి చుట్టూ వెతకగా మురికి కాల్వలో శవమై కనిపించాడు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా తాండూరు పట్టణం మల్రెడ్డిపల్లి వద్ద శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎమ్మెల్యేకు మంత్రి పీతల ఝలక్
డ్రెయిన్ గట్టు తవ్వకాన్ని అడ్డుకున్న పీతల సుజాత మంత్రిపై మండిపడుతున్న భీమవరం ఎమ్మెల్యే భీమవరం : భీమవరంలో ఇళ్లస్థలాల పూడిక వ్యవహరంలో అడ్డగోలుగా తవ్వుతున్న గొంతేరు డ్రెయిన్ గట్టు తవ్వకానికి మంత్రి పీతల సుజాత అడ్డుకట్ట వేశారు. దీంతో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) తలకు బొప్పికట్టింది. ఈనెల 17న ‘గట్టు కీడు తలపెట్టెనోయ్’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి మంత్రి సుజాత స్పందించారు. దీంతో డ్రెయిన్ గట్టు తవ్వకం పనులను తక్షణం నిలిపివేయాలంటూ జలవనరుల శాఖ అధికారులకు ఆదివారం మౌఖిక దేశాలు ఇవ్వడంతో పనులు నిలిచిపోయాయి. భీమవరం పట్టణంలో పేదలకు ఇళ్లు నిర్మించడానికి గ్రంధి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో 82 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అనంతరం ఎమ్మెల్యేగా ఎన్నికైన పులపర్తి రామాంజనేయులు ఏడేళ్ల అనంతరం ఆ భూమి పూడికతో పాటు భీమవరం మండలం గొల్లవానితిప్పలో సేకరించిన మరో 16 ఎకరాల భూమి పూడిక పనులకు శ్రీకారం చుట్టారు. అయితే ఈ పూడికకు సీఏడీ భూముల్లో అక్రమంగా తవ్వుతున్న చెరువుల్లోని మట్టి, యనమదుర్రు, గొంతేరు డ్రెయిన్ గట్ల మట్టిని తవ్వి తర లిస్తున్నారు. కోట్లాది రూపాయల వ్యయంతో డ్రెయిన్లలో పూడిక తీసి ఆ మట్టిని గట్లుపై వేశారు. అయితే ప్రస్తుతం ఇళ్లస్థలాల పూడికకు డ్రెయిన్ల గట్ల మట్టిని తవ్వడం వల్ల భవిష్యత్తులో గట్లు బలహీనపడే అవకాశాలు ఉన్నాయి. రైతులు, సమీప ఇళ్లకు వరద ముప్పు పొంచి ఉండే పరిస్థితులు ఏర్పడనున్నాయి. దీనిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా డ్రెయిన్స్లో గుర్రపుడెక్క, తూడు కుళ్లిన మట్టితో స్థలాలను పూడ్చడం వల్ల పునాధి ఏ మేరకు పటిష్టంగా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. స్థానికుల గోడును ‘సాక్షి’ అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చింది. ఇదే తరుణంలో వీరవాసరం మండలంలోని డ్రెయిన్ మట్టి తరలింపును, సమస్యను అక్కడి ప్రజలు రాష్ట్రమంత్రి పీతల సుజాత దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రి సొంత మండలం కావడంతో వెంటనే స్పందించి డ్రెయిన్ గట్ల తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు. ఈ విషయం భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు దృష్టికి వెళ్లడంతో మంత్రి జోక్యంపై తీవ్రంగా స్పందించినట్టు తెలిసింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇళ్లస్థలాల పూడిక చేపడితే అభివృద్ధిని స్వయంగా మంత్రే అడ్డుకుంటున్నారని మండిపడినట్టు సమాచారం. ఇప్పటికే మంత్రి సొంత మండలమైన వీరవాసరంలో సుజాతకు ఎటువంటి విషయాలు తెలియచేయకుండా ఎమ్మెల్యే వ్యవహారాలు చేస్తున్నారని, గతంలో వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలున్న సమయంలో డ్రెయిన్ల గట్టు తవ్వకం తాజాగా కొత్త వివాదానికి దారితీసిందని టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
దాహం.. దాహం!
అప్పుడే మొదలైన తాగునీటి కష్టాలు పట్టణ వాసులకు కలుషిత నీరే గతి కాలం చెల్లిన పైపులైన్లు.. లీకేజీలు మురుగు కాల్వల్లో కలిసి.. నీరు కలుషితం అవసరం ఎక్కువ.. సరఫరా తక్కువ తప్పు పట్టిన పైపులైన్లు కొన్నిచోట్ల.. మురుగు కాల్వల్లోంచి వెళ్లే లైన్లు మరికొన్ని చోట్ల.. తాగునీటిని కలుషితం చేస్తున్నాయి.. ఇంకా చెప్పాలంటే పురుగులమయం చేస్తుంటే.. చాలా ప్రాంతాల్లో గంట, ముప్పావుగంట సరఫరా అవుతున్న నీరు ప్రజల గొంతు తడపలేకపోతోంది. కొండవాలు, శివారు ప్రాంతాల్లో నిత్యం నీటిగండమే. విశాఖ మహానగరంలోనే ఈ పరిస్థితి ఉంటే.. జిల్లాలోని భీమిలి, అనకాపల్లి, నర్సీపట్నం, యలమంచిలి పట్టాణాల్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. నర్సీపట్నంలో అయితే రోజు విడిచి రోజు నీరు అందిస్తున్నారు. వేసవి ప్రారంభంలోనే దాహంతో అల్లాడిపోతున్న పట్టణ ప్రజల కష్టాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ‘సాక్షి’ అందిస్తున్న సమగ్ర కథనం.. విశాఖపట్నం: జిల్లా జనాభా 44 లక్షలు కాగా.. ఇందులో సగానికి పైగా జనాభా విశాఖ మహానగరం(జీవీఎంసీ), నర్సీపట్నం, యలమంచలి మున్సిపాలిటీల్లోనే ఉంటున్నారు. జీవీఎంసీ జనాభా 22.50 లక్షల పైమాటే. నగరంలో తాగునీటి డిమాండ్ రోజుకు 85 మిలియన్ల గ్యాలన్లు కాగా ప్రస్తుతం 68 మిలియన్ల గ్యాలన్లు మాత్రమే సరఫరా చేస్తున్నారు. నగర పరిధిలో పారిశ్రామిక, తాగునీటి అవసరాలు తీర్చే ప్రధాన ప్రాజెక్టుల్లో ఏలేరు ప్రధానమైనది. ఆ తర్వాత రైవాడ, మేహాద్రిగెడ్డ, తాటిపూడి, గంభీరం, గోస్తని, ముడసర్లోవ రిజర్వాయర్లు ఉన్నాయి. వీటిలో నీటినిల్వలు క్రమేపీ తగ్గుతున్నాయి. ఏలేరు నుంచి 130 ఎంజీడీల నీరు రావాల్సి ఉండగా ప్రస్తుతం 60 ఎంజీడీలు మాత్రమే విశాఖకు చేరుతోంది. దిగువ మధ్యతరగతి, సామాన్య, నిరుపేదలు పూర్తిగా కుళాయిల నుంచి వచ్చే ఈ బురద నీటినే తాగుతుంటే.. ఎగువ మధ్య తరగతి.. ఉన్నతవర్గాల వారు ఆర్వో ప్లాంట్ల నుంచి కొనుగోలు చేసే వాటర్ టిన్లపై ఆధారపడుతున్నారు. జిల్లాలోని పట్టణాల వారీగా పరిస్థితి ఎలా ఉందంటే.. ప్రతిపాదనలకే పరిమితం ఏలేరు పైపులైన్ల పనులకు రూ.1905 కోట్లు ఖర్చవుతుందని అంచనా. అనకాపల్లి నీటి సరఫరా వ్యవస్థను రూ.85 కోట్లతో అభివృద్ధి చేయాలని ప్రతిపాదన ఉంది. వేసవి నీటి నిల్వ ట్యాంకులు ఇంకా ప్రతిపాదన దశలోనే ఉన్నాయి. కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కింద 170 ఎంజీడీల నీటిని నిల్వ ఉంచొచ్చు. పాతపైపులైన్లను మార్చాలన్న ప్రతిపాదన కార్యరూపం దాల్చడం లేదు. ఏటా నీటి ట్యాంకర్లు, పంపింగ్ మోటార్లు, పైపులైన్ల మరమ్మతుల కోసం రూ.5 కోట్లు ఖర్చు చేస్తున్నా శాశ్వత పరిష్కారం దిశగా అడుగు పడడం లేదు. నర్సీపట్నం.. రోజు విడిచి రోజు నర్సీపట్నంలో రోజు విడిచి రోజు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే రెండు రోజులకోసారి ఇస్తున్నారు. ఇస్తున్న నీరు రంగు మారడంతో పాటు కుళాయిల నుంచి పురుగులు వస్తుండడంతో గుడ్డకట్టి నీటిని పట్టుకుంటున్నారు. పలు చోట్ల కుళాయిలకు హెడ్లు లేక నీరు వృథా అవుతోంది. మున్సిపాలిటీ పరిధిలోని 27 వార్డుల్లో 60 వేల మంది జనాభా ఉంది. రోజుకు సగటున మనిషికి 80 లీటర్ల నీటిని అందించాల్సి ఉంది. ప్రస్తుతం 45 లీటర్ల నీటిని అందిస్తున్నట్లు మున్సిపల్ అధికారులు చెబుతున్నప్పటికీ వాస్తవంగా 30 లీటర్ల కంటే తక్కువే ఇస్తున్నారు. దుగ్గాడ వద్ద వరహా నదిలో పంపుహౌస్ ఏర్పాటు చేసినా పెరిగిన జనాభా అవసరాలకు తగిన విధంగా తాగునీరు సరఫరా చేయటం లేదు. మరోవైపు కాలం చెల్లిన పైపులైన్లకు ఎక్కడికక్కడ లీకేజీలు ఏర్పడి తాగునీరు వృథా అవుతోంది. నిత్యం మరమ్మతులు చేసినప్పటికీ లీకేజీలను అరికట్టలేకపోతున్నారు. పైపులైన్లు మురుగు కాల్వల్లో ఉండటం వల్ల లీకేజీల ద్వారా తాగునీరు కలుషిత మవుతోంది. యలమంచిలి.. బోప్వెల్స్ నీరే గతి యలమంచలి పట్టణ శివారువాసులకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. రాంనగర్, వేణుగోపాలస్వామి గుడి ప్రాంతం, పాతవీధి, కాశీవాని వీధిలకు పూర్తి స్థాయిలో రక్షిత నీరు అందించేందుకు రూ.76 కోట్లతో డీపీఆర్కు పంపించారు. లక్ష జనాభా ఉన్న మున్సిపాల్టీలకే మంజూరు చేస్తామని ప్రభుత్వం తేల్చి చెప్పడంతో ఈ ప్రాజెక్టుపై ఆశలు ఆవిరైపోయాయి. ప్రస్తుతం ఎస్.రాయవరం మండలం సోమిదేవిపల్లి వద్ద వరహా నదిపై ఏర్పాటుచేసిన బోర్వెల్స్ పథకం ద్వారా యలమంచలి పట్టణానికి నీటి సరఫరా జరుగుతోంది. రోజుకు ఉదయం ఆరు నుంచి ఏడుగంటల వరకుమాత్రం ఇస్తారు. వాటర్ట్యాంకర్ల ద్వారా శివారు ప్రాంతాలకు సరఫరా చేస్తుంటారు. -
వాట్ యాన్ ఐడియా!
కరువు కాలం.. మోరీ నీరూ వదలం వర్గల్: తీవ్ర వర్షాభావం.. తాగు నీటి కష్టాలు తెచ్చి పెట్టింది. భూగర్భజలం అడుగంటడంతో గుక్కెడు నీటికి పరితపిస్తున్న గడ్డు కాలం. ఇక నిర్మాణాలకు నీటితిప్పలు చెప్పనలవి కాదు. మురుగు నీటిని సైతం వదలని పరిస్థితి. ఇందుకు మెదక్ జిల్లా వర్గల్ మండలం నెంటూరులో ఏఎన్ఎం భవన నిర్మాణ పనులకు మోరీ నీటిని జాగ్రత్తగా వాడుకుంటున్న తీరే నిదర్శనం. ఊరు నుంచి వచ్చే మోరీ నీళ్లను నిర్మాణ పనులు జరుగుతున్న భవనం సమీపంలో అడ్డుకట్ట వేసి ఇలా ఆపేశారు. ఆ నిల్వ నీటిలో ఓ చిన్న సింగిల్ఫేజ్ మోటర్ పెట్టి తోడుకుంటున్నారు. నిర్మాణ పనులకు ‘నీటి’ కరువును అధిగమిస్తున్నారు. వాట్ యాన్ ఐడియా..!! -
హైదరాబాద్ అభివృద్ధి మా చలవే..
► గ్రేటర్పై ఆశల జల్లు ► ప్రతి ఇంటికి ఉచిత నల్లా, గ్యాస్పైప్లైన్ ► ప్రపంచస్థాయి ప్రమాణాలతో డ్రైనేజీ వ్యవస్థ ► టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి గ్రేటర్ పీఠంపై జెండా ఎగరేసేందుకు విపక్షాలు కంకణం కట్టుకున్నాయి. గెలుపు తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మహానగర ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ-టీడీపీ కూటమి ఆదివారం గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోలను ఆవిష్కరించాయి. వాటిలో పేదలకు వరాల జల్లు కురిపించాయి. హైదరాబాద్ నగరంలోని ప్రతి గృహానికి ఉచిత వంట గ్యాస్ పైప్లైన్ వేస్తామని, వచ్చే 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో డ్రైనేజీ వ్యవస్థలో మార్పు తెస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. పేదలకు పక్కా ఇళ్లు, మొబైల్ ఆస్పత్రులు, ప్రతి ఇంటికి ఉచిత రక్షిత మంచి నీరు అందిస్తామని బీజేపీ-టీడీపీ కూటమి ప్రకటించింది. హైదరాబాద్: ‘అప్నా షహర్, సబ్కా షహర్, హమ్ సబ్కా షహర్’.. గ్రేటర్ పోరులో కాంగ్రెస్ నినాదమిది. ఆదివారం గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. మొత్తం 28 ప్రాధాన్య అంశాలతో కార్యచరణను ప్రకటించారు. ఈ మేనిఫెస్టో పూర్తిగా ఇంగ్లిషులో వూత్రమే ఉండటం కొసమెరుపు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిధుల కేటాయింపు, అభివృద్ధిపై ‘ద గోల్డెన్ డికేడ్ ఆఫ్ హైదరాబాద్’ పేరిట కరపత్రాన్ని ఆవిష్కరించారు. తమ హయాంలోనే నగరాభివృద్ధి జరిగిందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. అభివృద్ధి తామే చేశామంటూ టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం సిగ్గుచేటన్నారు. నగరానికి గోదావరి నీటి తరలింపు పనులు 95 శాతం కాంగ్రెస్ హయాంలో పూర్తయ్యాయన్నారు. సీఎం కేసీఆర్ తుగ్లక్ నిర్ణయాలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోందని విమర్శించారు. మెట్రోరైల్ ప్రాజెక్టు ఆలస్యానికి టీఆర్ఎస్ ప్రధాన కారణమని, అలైన్మెంట్ మారుస్తామని ప్రకటించి.. మళ్లీ పాతదే అంటూ గందరగోళం సృష్టించారని మండిపడ్డారు. ఫ్లై ఓవర్లు, స్కైవేలంటూ మభ్యపెడుతున్నారని, నగరంలోని మురికివాడల్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. బిల్డర్ అసోసియేషన్ వెంచర్లలలో 5 శాతం బలహీనవర్గాల కోటాను కేసీఆర్ ఎత్తేశారని, అలాంటి వ్యక్తి మూడు లక్షల ఇళ్లు కట్టిస్తారంటే ఎలా నమ్ముతామని ప్రశ్నించారు. జాగో, బాగో అంటూ సెటిలర్స్ ఇళ్లు కూల్చి గందరగోళం సృష్టించారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ సీమాంధ్రులకు పూర్తి అండగా ఉంటుందని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఆదాయం రూ.600 కోట్ల నుంచి 5 వేల కోట్లకు పెంచిన ఘనత తమదేనన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి విపక్షనేత షబ్బీర్ అలీ, ఉపాధ్యక్షుడు నాగయ్య, మేనిఫెస్టో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తండ్రిని మించిన తనయుడు కేటీఆర్: షబ్బీర్ వాగ్దానాలను మరిచిపోవడంలో కేటీఆర్ తండ్రిని మించిపోయాడని శాసనమండలి విపక్షనేత షబ్బీర్ అలీ విమర్శించారు. వంద సీట్లు గెలవకపోతే రాజీనామా చేస్తానని చాలెంజ్ చేసి అంతలోనే మాట మార్చారన్నారు. టీఆర్ఎస్ 100 సీట్లు సాధిస్తే రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధమన్నారు. టీఆర్ఎస్ విడుదల చేసిన మేనిఫెస్టో 2014 సాధారణ ఎన్నికలప్పుడు కేసీఆర్ ప్రకటించినట్టే ఉందన్నారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ మాట మార్చారని, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు హామీని ప్రస్తావించడమే లేదన్నారు. కేసీఆర్ మేనిఫెస్టోకే దిక్కులేనప్పుడు కేటీఆర్ది ఎలా అమలవుతుందని ప్రశ్నించారు. మేనిఫెస్టో ముఖ్యాంశాలు ► ప్రతీ ఇంటికి ఉచిత రక్షిత మంచినీరు, ఉచిత వంట గ్యాస్ పైప్లైన్ ► వచ్చే 25 ఏళ్లకు అనుగుణంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో డ్రైనేజ్ వ్యవస్థ ► హుస్సేన్సాగర్, మూసిని కాలుష్య రహితంగా మార్పు ► విదేశీ చదువుల కోసం వెళ్లే విద్యార్థులకు ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు ► హైదరాబాద్ హెరిటేజ్ను కాపాడడానికి ప్లాస్టిక్పై నిషేధం ► పచ్చదనం పెంచేందుకు ప్రత్యేక కార్యచరణ ► యువతకు అన్ని రంగాల్లో నైపుణ్యం పెంచేందుకు శిక్షణ తరగతులు ► యుద్ధప్రాతిపదికన వేస్ట్ మేనేజ్మెంట్ పవర్ప్లాంట్ల నిర్మాణం ► క్రీడా ప్రోత్సాహంపై ప్రత్యేక దృష్టి ► శ్మశానవాటికలను పెంచడంతో పాటు అధునాతన సౌకర్యాల కల్పన ► ప్రతి డివిజన్లోనూ మొబైల్ హెల్త్ ట్రాన్స్పోర్ట్ సేవలు. ఇందులో ఉచిత వైద్య పరీక్షలతో పాటు అత్యవసర, పీడియాట్రిక్, గైనిక్ నిపుణుల సేవలు ► ప్రతి డివిజన్లోనూ ఓపెన్ స్కూల్ ఏర్పాటుతో పాటు పౌష్ఠికాహారం, ఉచిత పుస్తకాల పంపిణీ. విద్య, యూనిఫాం, షూస్, స్కూలు బ్యాగులు అందజేత ► ప్రతి స్లమ్లోనూ ఒక బేబీ కేర్ సెంటర్ ఏర్పాటు ► 24 గంటలు విద్యుత్ సరఫరా, సోలార్ సిటీగా తీర్చిదిద్దేందుకు చర్యలు ► ఇళ్లులేని వారందరికీ రెండు పడకల ఇళ్లు నిర్మించి ఇవ్వడం. ► ఇంటి నిర్మాణ అనుమతులు మరింత సరళతరం. ► దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లోగా అనుమతులు మంజూరు ► చార్మినార్, ఉస్మానియా జనరల్ ఆస్పత్రి, హైకోర్టు వంటి చారిత్రక కట్టడాల ఆధునికీకరణ. పర్యాటక ప్రాంతాలకు మరింత ప్రోత్సాహం ► భూగర్భ జలాల పెంపునకు మరింత ప్రోత్సాహం ► యువతకు అన్ని రంగాల్లో నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహణ ► క్రీడల ప్రోత్సాహంపై ప్రత్యేక దృష్టి -
వరదలా వచ్చే నీళ్లను ఇట్టే పీల్చేస్తుంది!
♦ కొత్త ఫార్ములా కాంక్రీట్ రోడ్లకు రూపకల్పన ♦ 60 ఏళ్లు మన్నికతో ఉండే కాంక్రీట్ రోడ్లు సాక్షి సెంట్రల్ డెస్క్: నగరం ఒక కాంక్రీట్ జంగిల్. భారీ అపార్ట్మెంట్లు.. రోడ్లన్నీ కాంక్రీట్ మయం. దీంతో కురిసిన వర్షంలో చినుకు కూడా లోపలకు ఇంకే పరిస్థితి లేదు. చిన్న వర్షాలకే రోడ్లపై నీళ్లు పారతాయి. భారీగా కురిసే వాన వరద అవుతోంది. ఇదే అంతిమంగా పెనుముప్పుగా మారుతోంది. ఇలా ఇప్పుడు చెన్నైకి తలెత్తిన వరదముప్పు మొదలూ కాదు తుదీ కాదు. మరి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనడంలో భవిష్యత్తులో అయినా సాధ్యమా? కాంక్రీట్ రోడ్లను వాగులుగా మార్చేస్తున్న వరదలను నియంత్రించడం సాధ్యమా? అంటే.. ఎప్పుడో ‘ఔను’ అనేశారు యూరోపియన్ ఇంజనీరింగ్ నిపుణులు. కురిసిన వర్షపు నీటిని కురిసిట్టుగానే ఇముడ్చేసుకుని భూమిలోకి పంపించే టెక్నాలజీతో వారు రోడ్లను నిర్మించారు. నగరాల్లో వరద సమస్యలేకుండా చూసుకోవడంతో పాటు, భూగర్భ జలాన్ని పెంపొందించుకునే ప్రణాళికను కూడా వారు అమలు పెట్టారు. ఆ కాంక్రీట్కు దాహం ఎక్కువ...: వేడిగా ఉన్న పెనం మీద నీళ్లను విదిలిస్తే అవి ఎలా ఆవిరయిపోతాయో టాప్మిక్స్ పర్మియబుల్ కాంక్రీట్తో నిర్మించిన రోడ్లు మీద పడే వర్షపు చినుకుల పరిస్థితి అలాగే ఉంటుంది. చిన్న చిన్న చినుకులు.. కుండ పోత వాననే కాదు.. ఒక వాటర్ ట్యాంకర్ పంపు నుంచి ధారాపాతంగా నీళ్లను రోడ్డుపై వదిలినా.. అవి కొన్ని సెంటీమీటర్ల దూరం కూడా ముందుకు ప్రవహించవు. పడ్డచోటే ఇంకిపోతూ ఉంటాయి. అలా పీల్చేసుకునే తత్వం ఉంటుంది ఈ రోడ్డుకు. టాప్మిక్స్ పెర్మియబుల్గా వ్యవహరించే కాంక్రీట్కు దాహం ఆ స్థాయిలో ఉంటుంది. గణాంకాల ప్రకారం చెప్పాలంటే 60 సెకన్లలో 880 గేలన్ల నీటిని పీల్చేసుకోగలవు ఈ రోడ్లు. దీంతో ఎంత భారీ వర్షం వచ్చినా వరదనీరు కాదు కదా.. రోడ్లపై తడి కూడా ఉండదు. డ్రైనేజ్ సిస్టమ్కు అనుసంధానం..: ఒక డచ్ నిర్మాణరంగ సంస్థ ఈ రోడ్డును డిజైన్ చేసింది. ఈ ఫార్ములా ప్రకారం నీటిని పీల్చుకునే తత్వం ఉన్న కాంక్రీట్తో, పీల్చుకున్న నీటిని డ్రైనేజ్ సిస్టమ్కు అనుసంధానిస్తూ రోడ్లను నిర్మించుకోవచ్చు. భూమిలోకి ఇంకే నీటి శాతం కూడా చాలా వరకూ పెరుగుతుంది. ఈ రోడ్డు కనీసం 60 సంవత్సరాల పాటు మన్నుతుందని ఆ సంస్థ హామీ ఇస్తోంది. డచ్ గడ్డపై ఇళ్ల మధ్య, పార్కుల్లోనూ, గోల్ఫ్ కోర్టుల్లోనూ... ఈ తరహా రోడ్లు నిర్మితమయ్యాయి. వ రద ప్రభావిత ప్రాంతాల్లో ఇలాంటి రోడ్ల నిర్మాణం చాలా ఉపయుక్తమని రూపకర్తలు చెబుతున్నారు. -
డ్రైనేజీలో పసికందు మృతదేహం
తిరుపతి : చిత్తూరు జిల్లా తిరుపతిలోని ప్రసూతి ఆస్పత్రి సమీపంలోని పసికందు మృతదేహం లభ్యమైంది. శుక్రవారం ఉదయం డ్రైనేజీని శుభ్రం చేస్తున్న కార్మికులకు చిన్నారి మృతదేహం కనిపించింది. వెంటనే చిన్నారిని బయటకుతీసిన కార్మికులు ఆ విషయాన్ని డాక్టర్లకు, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
స్కావెంజర్ల నుంచి క్యాబ్ డ్రైవర్లుగా..!
ఇతరుల మలినాలను నెత్తినెత్తుకొని స్కావెంజర్లుగా పనిచేసిన వారి బతుకుల్లో ప్రస్తుతం కాస్త వెలుగులు నిండే పరిస్థితి కనిపిస్తోంది. ఇండియా రాజధాని ఢిల్లీలో తాజాగా కనిపిస్తున్న కొత్త మార్పు... మరి కొద్ది రోజుల్లో దేశంలోని ఇతర నగరాలకు వ్యాపించనుంది. కుల ప్రాతిపదికన తరతరాలుగా చేపడుతున్న వృత్తుల్లో అత్యంత నీచ స్థితిలో ఉన్న సఫాయీ కర్మచారీ వృత్తి, వివక్షలో చిక్కుకున్న జీవితాలు మెరుగు పరిచేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నంలో భాగంగా హస్తినలో వచ్చిన మార్పు కొన్ని కుటుంబాను తలెత్తుకుని గర్వంగా జీవించేలా చేస్తోంది. రోడ్లు ఊడుస్తూ, టాయిలెట్లు క్లీన్ చేస్తూ, డ్రైనేజీలు కడుగుతూ గడిపిన వారి తల్లిదండ్రుల జీవన విధానానికి ఇప్పుడా 250 మంది యువతులు స్వస్థి చెప్పారు. వేలల్లో జీతాలు వచ్చే క్యాబ్ డ్రైవర్లుగా మారారు. తమకు దగ్గరలోని పార్కుల్లోనే మార్సల్ ఆర్ట్స్ లో శిక్షణ పొంది, కాస్తంత ఆంగ్ల భాషనేర్చుకొని, మురికి వాడ నుంచి ఊబర్, ఓలా వంటి కమర్షియల్ టాక్సీ డ్రైవర్లుగా మారుతున్నారు. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సామాజిక న్యాయం, సాధికారత విభాగం ఢిల్లీ నగరంలోని పలు ప్రాంతాలనుంచి 9 వందల మంది మహిళలకు శిక్షణను ఇవ్వడం ప్రారంభించింది. ఇది ఒక్క ఢిల్లీ నగరానికే కాక దేశంలోని ముంబై, బెంగళూరు, కోల్ కతా, చెన్నై నగరాల్లో కూడ అమలు చేస్తామని మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ చెప్పారు. మా అమ్మ ఆ ఉద్యోగాన్ని పదేళ్ళ పాటు చేసింది. కానీ మేం మా జీవితాలు కాస్త మెరుగు పడతాయని ఆశిస్తున్నాం అంటుంది... రద్దీ ప్రాంతంలో డ్రైవింగ్ నేర్చుకుంటున్న ఇరవై రెండేళ్ళ ఓ ట్యాక్సీ డ్రైవర్. ఇక్కడ శిక్షణ తీసుకుంటున్న వారంతా 17 నుంచి 25 ఏళ్ళ మధ్య వయసుండి, ఢిల్లీలోని మాదంగీర్, సంగం విహార్, లాల్ కౌన్, అంబేద్కర్ నగర్ల నుంచి వచ్చిన వారే. వీరిలో కొందరు పదో తరగతి, ఇంటర్ వరకూ చదివిన వారు కూడ ఉన్నారు. ఇటువంటి వారు కొందరు శిక్షణ అనంతరం తాము స్వయంగా ట్రావెల్ ఏజెన్సీలను నిర్వహించుకుంటామని చెప్తున్నారు. కొందరైతే ఇటువంటి మార్పు తమ జీవితాల్లో వస్తుందని ఊహించలేదంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మోటార్ డ్రైవింగ్ స్కూళ్ళనుంచి మొదటిగా పది కార్లతో ఈ శిక్షణ తరగతులు మొదలు పెట్టారు. అయితే శిక్షణ ప్రారంభమైనప్పుడు మహిళల్లో ఆత్మ విశ్వాసం తక్కువగానే కనిపించినా ఇప్పుడు ఎంతో ఉత్సాహంగా డ్రైవింగ్ నేర్చుకొంటున్నారని గ్రేటర్ కైలాష్ ఆఫీస్ లోని నాగరాజ్ అంటున్నారు. అయితే మహిళలు ట్యాక్సీ డ్రైవర్లుగా ఉండాలంటే వారికి సెక్యూరిటీ పరమైన ఇబ్బందులు కూడ వచ్చే అవకాశం ఉంది. దీంతో సుమారు మూడు వేలమంది క్యాబ్ డ్రైవర్లకు ఢిల్లీలోని సిటీ పార్క్ లో మ్యానరిజమ్ పాఠాలు కూడ నేర్పుతున్నాం అంటున్నారు సీనియర్ ఎస్ జే ఈ అధికారి మునియప్ప నాగరాజ్. ప్రభుత్వం ద్వారా అమల్లోకి తెచ్చిన ఈ కార్యక్రమం వల్ల ఎంతోమంది జీవితాలు బాగుపడే అవకాశం ఉందని, అయితే అసలు మొత్తం ఢిల్లీలో సుమారు అరవై వేలమంది పఫాయీ కార్యికులకు కనీసం నెల జీతం వచ్చే అవకాశం కూడ లేదని ఓ ఎన్జీవో సంస్థ సభ్యురాలు దును రాయ్ అంటున్నారు. ఇటువంటి వారికి ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించాలని ఆమె సూచిస్తున్నారు. -
మురికి కాలువలో చిన్నారి మృతదేహం
తగరపువలస(విశాఖపట్నం): డ్రైనేజీలో ఐదునెలల బాబు మృతదేహం కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా తగరపువలస మండలం చిట్టివలస గ్రామంలో ఆదివారం ఉదయం జరిగింది. వివరాలు.. గ్రామంలోని మురికి కాలువలో చిన్నారి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. సుమారు నాలుగు ఐదు నెలల వయసు ఉన్న బాలుడు రెండు రోజుల కిందటే కాలువలో పడి ఉంటాడని తెలిపారు. బాబు తల్లిదండ్రులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. -
సంద్రమంత విషాదం
-
సంద్రమంత విషాదం
భోగాపురం తీరంలో తేలిన చిన్నారి అదితి మృతదేహం నిశ్చేష్టురాలైన విశాఖ నగరం శోకతప్తులైన తల్లిదండ్రులు గుండెలు పిండే విషాదం.. ముద్దులొలికే చిన్నారి మురుగు నీటిలో మునిగిపోయిందన్న వార్త ఈనెల 24వ తేదీ సాయంత్రం దావానలంలా వ్యాపించింది. నగరమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రభుత్వ యంత్రాంగం కదిలివచ్చింది. ఎలాగైనా అదితిని కాపాడాలని తపన పండింది. జీవీఎంసీ, నేవీ సిబ్బంది, పోలీసులు డ్రైనేజీ కాల్వలు, గెడ్డల్లో, సముద్రంలో ఏడు రోజులపాటు తీవ్రంగా గాలించారు. రకరకాల వార్తలతో ఈ వారమంతా ఉత్కంఠతో గడిచింది. చివరకు కన్నీరే మిగిలింది. - విశాఖపట్నం/పెదవాల్తేరు చిరునవ్వుల చిన్నారి ఛిద్రమైంది.. ఆమె అందాల మోము కనుమరుగైంది.. మబ్బులు వీడిన చందమామలా మళ్లీ కనిపిస్తుందని ఆశించినవారికి కన్నీరే మిగిలింది.. మురుగు కాలువలో పడి గల్లంతైన అదితి తిరిగివస్తుందని తల్లిదండ్రులతోపాటు యావత్తు విశాఖ ఎదురుచూసింది.. ఆ చిరునవ్వు సజీవంగా ఉండాలని, మళ్లీ తిరిగొచ్చి కుటుంబ సభ్యుల కళ్లలో వెలుగు నింపాలని వేయి దేవుళ్లకు మొక్కుకుంది.. కిడ్నాప్ అయివుంటుందని, పోలీసులు మిస్టరీని ఛేదించి, సజీవంగా తీసుకువస్తారని పెట్టుకున్న చివరి ఆశలు కూడా ఆవిరయ్యాయి.. వారం రోజులైనా జాడ తెలీకపోవడంతో నీటిపాలు కాకుండా ఎక్కడో క్షేమంగా ఉండేఉంటుందని మిణుకుమిణుకుమన్న ఆశ చీకట్లో కలిసిపోయింది.. అదితి మృతదేహం గురువారం సాయంత్రం దయనీయ స్థితిలో భోగాపురం సముద్ర తీరంలో శవమై తేలింది.. దుస్తులు, చెవిదుద్దులను బట్టి అది తమ గారా ల పట్టి అదితేననిగుర్తించి కుప్పకూలిపోయా రు.. అదితి తిరిగి రావాలని కుటుంబ సభ్యులు ఎంతగా కోరుకున్నారో.. నగర ప్రజలూ అంతగానే ఎదురుచూశారు. దుర్గంధభరితమైన మురికి కాల్వల్లో జీవీఎంసీ సిబ్బందితోపాటు సామాన్య జనం సైతం గాలించారు. ఫలితం దక్కలేదు. ప్రాణాలతో తీసుకురావాలన్న ఆశ నెరవేరలేదు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా ఉండివుం టే.. ఇలాంటి ప్రమాదాలు జరిగేవి కావన్న విమర్శకు జ వాబు లేదు. ఇది మాయని గాయం.. తీరని శోకం.. సముద్రమంత విషాదం సెప్టెంబర్ 24 సాయంత్రం 4 గంటలకు సీతమ్మధారలోని ఇంటి నుంచి అదితి డాక్టర్ వీఎస్ కృష్ణ కళాశాల రోడ్డు భానునగర్లోని ఐవోఎస్ ట్యూషన్ సెంటర్కు వెళ్లింది. నగరమంతా కుంభవృష్టి కురవడంతో వర్షం నీటితో మురుగు కాల్వలు పొంగిపొరలుతున్నాయి. సాయంత్రం 7 గంటల ప్రాంతం లో ట్యూషన్ ముగిశాక కారెక్కబోతూ వర్షం నీటితో నిండి న డ్రైనేజీలో పడిపోయింది. జీవీఎంసీ సిబ్బంది వచ్చి గా లింపు చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి ఒంటి గంట వరకు భానునగర్ నుంచి ఎంవీపీకాలనీ సెక్టార్ వరకు గెడ్డలో గాలించారు. పోలీస్ కమిషనర్ అమిత్గార్గ్, డీసీపీ త్రివిక్రమ్వర్మ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. సెప్టెంబర్ 25 వేకువజాము 5 గంటల నుంచి అదితి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భానునగర్ నుంచి ఇసుకతోట, ఎంవీపీకాలనీ మీదుగా లాసన్స్ బేకాలనీ వద్ద సముద్రంలో కలిసే గెడ్డ వరకు నాలుగు పొక్లయిన్లతో పూడికలు, చెత్తను తొలిగించారు. 250 మంది పారిశుధ్య, పోలీస్, అగ్నిమాపక సిబ్బంది గెడ్డలో చిన్నారి ఆచూకీ కోసం వెదికారు. నేవీ సిబ్బంది ఒక హెలికాప్టర్లో రుషికొండ నుంచి ఆర్కే బీచ్ వరకు సముద్రంలో గాలించారు. 15మంది గజ ఈతగాళ్లు గెడ్డ, సముద్రంలో వెదికారు. అదితి తాత ఫిర్యాదు మేరకు ఎంవీపీకాలనీ పోలీసులు అదితి అదృశ్యమైందని కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 26 ఉదయం నుంచి జీవీఎంసీ పారిశుధ్య సిబ్బంది గెడ్డలో వెతకడం ప్రారంభించారు. వందమంది వరకు భానునగర్ నుంచి లాసన్స్బేకాలనీ సముద్రం వరకు గాలించారు. నేవీ గజ ఈతగాళ్లు సైతం ఇందులో పాల్గొన్నారు. నేవీ డైవర్లు సముద్ర గర్భం లోపలికి వెళ్లి అదితి కోసం గాలించారు. హెలికాప్టర్ పైనుంచి సముద్రంలో గాలించారు. 10 బోట్లలో మత్స్యకారులు సముద్రంలో గాలించారు. పొక్లయిన్లతో మరోసారి గెడ్డలోని రాళ్లు తీసి క్షుణ్ణంగా వెదికారు. పోలీసులు కిడ్నాప్ అనుమానంతో అదితిని తీసుకురావడానికి వెళ్లిన కారు డైవర్ గురునాథాన్ని ప్రశ్నించారు. సెప్టెంబర్ 27 అదితి అదృశ్యం మిస్టరీగా మారింది. గెడ్డ, సముద్రంలో ఆచూకీ లభ్యం కాకపోవడంతో అనుమానాలు బలపడ్డాయి. అదితి సహవిద్యార్ధిని తాన్వీని పోలీసులు సమాచారం అడిగారు. అదితి డ్రైనేజీలో పడిపోవడం కళ్లారా చూశానని ఆమె స్పష్టం చేసింది. ఈ రోజు కూడా యధావిధిగా గెడ్డ సముద్రంలో మత్స్యకారులు, నేవీ సిబ్బంది గాలించారు. అదితి తండ్రి శ్రీనివాస్, తాత రమణమూర్తి కిడ్నాప్ చేసుంటారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కూడా కిడ్నాప్ కోణంలో దర్యాప్తు చేయాలని భావించారు. ఘటన స్థలాన్ని పరిశీలించి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న వారిని విచారించారు. సెప్టెంబర్ 28 అదితి ఆచూకీ కోసం గెడ్డలో నీటిని నిలిపి అన్వేషించారు. 50మంది మత్స్యకారులు పది పడవల్లో రుషికొండ నుంచి ఆర్కే బీచ్ వరకు సముద్రంలో 50 కిలోమీటర్ల మేర గాలించారు. అదితి ట్యూషన్ సెంటర్ పక్కనే ఉన్న మెడికల్ షాప్లోని సీసీ కెమెరాల పుటేజ్లను పోలీసులు పరిశీలించారు. ట్యూషన్కు వెళ్తున్న దృశ్యం అందులో రికార్డయింది. మున్సిపల్ పరిపాలన పట్టాణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి కరికాల్ వరినన్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. కమిషనర్ అమిత్గార్గ్ డీసీపీ త్రివిక్రమ్ వర్మ నేతృత్వంలో ప్రత్యేక ఇన్విస్టిగేషన్ టీమ్ను నియమించారు. సెప్టెంబర్ 29 అదితి ఆచూకీ కోసం జీవీఎంసీ, అగ్నిమాపక సిబ్బంది, మత్స్యకారులు గెడ్డ, సముద్రంలో గాలించారు. భీమిలి నుంచి ఫిషింగ్ హార్బర్ వరకు వలలతో వెదికారు. పోలీసులు మాత్రం కిడ్నాప్ కోణంలో విచారణ ప్రారంభించారు. కారు డైవర్ కాల్ డేటా, ఇతర వివరాలపై ప్రత్యేక బృందం దృష్టి సారించారు. నగరానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు అదితి అదృశ్యంపై ఆరా తీశారు. అదితి తండ్రి శ్రీనివాసరావు, తాత రమణమూర్తి సీఎంను కలిశారు. సెప్టెంబర్ 30 భీమిలి నుంచి గంగ వరం పోర్టు వరకు వంద కిలోమీటర్లమేర వెదికారు. రాత్రి 10 గంటల వరకు అదితి ఆచూకీ లభ్యం కాకపోవడంతో గాలింపును నిలిపివేస్తున్నట్టు జీవీఎంసీ ప్రకటించింది. సాయంత్రం అదితి తండ్రి శ్రీనివాసరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తమకు శత్రువులెవరూ లేరని, తమ పాప ఎక్కడో క్షేమంగా వుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అదితి ఆచూకీ తెలిపిన వారికి రూ.5 లక్షలు బహుమతి ప్రకటించారు. అక్టోబర్ 1 అదితి మృతదేహం గురువారం సాయంత్రం భోగాపురం తీరంలో బయటపడింది. -
అదితి.. ఏమైంది!?
-
డ్రైనేజీలో వ్యక్తి మృతదేహం లభ్యం
నిడదవోలు (పశ్చిమగోదావరి): డ్రైనేజీలో పడి ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని పశువుల ఆస్పత్రి సమీపంలో ఉన్న మురికి కాలువలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు స్థానికంగా నివాసముండే సత్యనారాయణ(42)గా గుర్తించారు. అతడి మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. -
ఎవరది !
మొహానికి ముసుగు ధరించాడు. మత్తు ఇంజెక్షన్లతో మోటార్ సైకిల్పై రయ్యిమంటూ దూసుకొచ్చాడు. కూతవేటు దూరంలోనే వేర్వేరుచోట్ల ఇద్దరు విద్యార్థినుల్ని ఆపాడు. ఏం చదువుతున్నారని అడిగాడు. వెంటతెచ్చిన మత్తు ఇంజెక్షన్లను క్షణాల్లో వారి శరీరంపై గుచ్చాడు. బాలికలు కేకలు వేయడంతో.. పొలాల్లోంచి రైతులు, కూలీలు, చుట్టుపక్కల జనం రావడంతో ఉడాయించాడు. వచ్చిన ఆగంతకుడు ఎవరు.. విద్యార్థినులపై మత్తు ఇంజెక్షన్లు ఎందుకు ప్రయోగించాడో అంతుచిక్కడం లేదు. ఉండి మండలం యండగండి ప్రాంతంలో శనివారం ఉదయం 15 నిమిషాల వ్యవధిలో రెండుచోట్ల చోటుచేసుకున్న ఈ ఘటనలు విద్యార్థినుల తల్లిదండ్రులను, పోలీసులను, అధికార యంత్రాంగాన్ని ఉలికిపాటుకు గురిచేశాయి. ఉండి/పాలకోడేరు : యండగండి-మైప గ్రామాల మధ్య యనమదుర్రు డ్రెయిన్ వంతెన ప్రాంతమది. మైప గ్రామానికి చెందిన అందుకూరి మెర్సీ (13) యండగండి హైస్కూల్లో 7వ తరగతి చదువుతోంది. ఎప్పటిలా శనివారం ఉదయం సైకిల్పై హైస్కూల్కు బయలుదేరింది. మెర్సీ యనమదుర్రు డ్రెయిన్ వంతెన సమీపంలోకి చేరుకోగా.. మొహానికి ముసుగు వేసుకున్న యువకుడు మోటార్ సైకిల్పై వెళ్లి బాలికను అటకాయించాడు. ఎక్కడికి వెళుతున్నావని అడిగాడు. బాలిక సమాధానం చెప్పేలోగానే తన చేతిలోని ఇంజెక్షన్తో ఆమె నడుం భాగంలో పొడిచాడు. సిరంజిలోని మందును శరీరం లోపలికి ప్రయోగించాడు. మెర్సీ బిగ్గరగా కేకలు వేయటంతో చుట్టుపక్కలవారు అక్కడకు చేరుకున్నారు. ఆగంతకుడు పారిపోగా, మెర్సీని యండగండిలో పీహెచ్సీకి తరలించారు. పావుగంట వ్యవధిలో అక్కడకు కిలోమీటరున్నర దూరంలోనూ ఇలాం టి ఘటనే చోటుచేసుకుంది. యండగండిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ఫస్టియర్ చదువుతున్న అదే గ్రామంలోని రాయనివానిగూడెంకు చెం దిన గుత్తుల వెంకటవరలక్ష్మి (16) సైకిల్పై కళాశాలకు వెళ్తుండగా.. అదే యువకుడు బైక్పై వెళ్లి ఆమెను అటకాయించాడు. ఏం చదువుతున్నావని అడిగాడు. సమాధానం చెప్పేలోపే ఆమె వంటిపైనా మత్తు ఇంజెక్షన్ పొడిచాడు. ఎందుకు ఇంజెక్షన్ చేశావని వరలక్ష్మి ప్రశ్నించగా.. ఇంకో ఇంజెక్షన్ చేస్తానని బెదిరించాడు. వరలక్ష్మి బిగ్గరగా అరవటంతో సమీపంలోని పొలంలో పనులు చేసుకుంటున్న రైతులు, కూలీలు, బాలిక తాతయ్య పరుగు పరుగున అక్కడికి చేరుకోగా.. ఆగంతకుడు పరారయ్యాడు. అతణ్ణి పట్టుకునేందుకు యండగండి గ్రామస్తులు బృందాలుగా విడిపోయి గాలించినా ప్రయోనం లేకపోయింది. బాలికలిద్దరికీ తొలుత యండగండి పీహెచ్సీలో ప్రాథమిక చికిత్స చేయిం చారు. వారిపై మత్తు ఇంజెక్షన్ల ప్రయోగం జరిగిందని గుర్తించిన వైద్యులు ఇద్దరినీ భీమవరంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలికలిద్దరూ కోలుకున్నారని వైద్యులు తెలిపారు. గుర్తు తెలియని యువకుడు బాలి కల్ని కిడ్నాప్ చేసేందుకు ఇంజెక్షన్లు ఇచ్చాడా లేక ఇది సైకో చర్యా.. లేక మరేదైనా కారణం ఉందా అనేది తేలలేదు. ఈ ఘటనతో విద్యార్థినుల తల్లిదండ్రులు కలవరపడ్డారు. తమ పిల్లల క్షేమ సమాచారం తెలుసుకునేందుకు పాఠశాలలు, కళాశాలలకు తరలి వెళ్లడం కనిపించింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆగంతకుడి కోసం గాలిస్తున్నారు. వివిధ కోణాల్లో దర్యాప్తు ఇద్దరు విద్యార్థినులపై మత్తు ఇంజెక్షన్ల ప్రయోగించిన ఘటనపై జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు ఉండి ఎస్సై రవివర్మ ఘటన స్థలాన్ని పరిశీలించారు. కలెక్టర్ కె.భాస్కర్, జిల్లా ఎస్పీ భాస్కర్భూషణ్ ఈ ఘటనపై ఆరా తీశారు. విద్యార్థినులపై కక్షతో ఆగంతకుడు ఈ ఘటనలకు పాల్పడ్డాడా లేక అతడు సైకోనా.. మరేదైనా కారణం ఉందా అనేవి అంతుబట్టని ప్రశ్నలుగానే ఉన్నాయి. పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. యండగండి సరిహద్దు గ్రామాలతోపాటు భీమవరం పరిసర ప్రాంతాల్లో పోలీస్ యంత్రాంగం నిఘా పెట్టింది. మఫ్టీలో పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. జిల్లా సరిహద్దుల్లోనూ ముసుగు వ్యక్తి కోసం గాలిస్తున్నారు. కోలుకుంటున్న విద్యార్థినులు భీమవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న మెర్సీ, వరలక్ష్మి కోలుకుంటున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ప్రభుత్వాసుపత్రి సూపరిండెంటెండ్ డాక్టర్ కె.ప్రభాకరరావు చెప్పారు. ఇంటర్మీడియెట్ విద్యార్థిని వరలక్ష్మికి బీపీ సాధారణ స్థాయికంటే తక్కువగా ఉందని, ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. వారు కోలుకున్న అనంతరం రక్త పరీక్షలు చేసి వారిపై ప్రయోగించిన మత్తు ఇంజెక్షన్ల స్థాయి ఏమిటి, వాటి ప్రభావం ఏమిటనే విషయాలను పరిశీలిస్తామని సూపరింటెండెంట్ చెప్పారు. -
మంగళగిరిలో భారీ వర్షం.. పొంగిన డ్రెయిన్లు
మంగళగిరి(గుంటూరు): గుంటూరు జిల్లా మంగళగిరిలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. సాయంత్రం 5.30 గంటల నుంచి 7.30 గంటల వరకు తెరిపి లేకుండా వాన పడింది. దీంతో డ్రెయిన్లు పొంగిపొర్లాయి. రహదారులు కాలవలయ్యాయి. జన జీవనం స్తంభించింది. రాకపోకలు స్తంభించాయి. -
పన్నుల పిడుగు
- కొంపముంచుతున్న డ్రెయినేజీ, వాటర్ చార్జీలు - ఏడు శాతం పెంపు - దొంగదెబ్బ తీసిన టీడీపీ - కౌన్సిల్ తీర్మానం ఏమైనట్టు? విజయవాడ సెంట్రల్ : నమ్మి ఓట్లేసిన జనాన్ని టీడీపీ దొంగదెబ్బ తీసింది. స్పెషల్ ఆఫీసర్ల పాలనలో పెంచిన డ్రెయినేజీ, వాటర్ చార్జీలను తగ్గిస్తామని ఏడాదిగా చెబుతున్న నగరపాలక సంస్థ పాలకుల మాటలు అంతా బూటకమని తేలింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి డ్రెయినేజీ, వాటర్ చార్జీలను మరో ఏడు శాతం మేర పెంచి అధికారులు నోటీసులు ఇస్తున్నారు. సుమారు రూ.3కోట్ల మేర ప్రజలపై పన్నుభారం మోపుతున్నారు. ఉదాహరణకు హనుమాన్పేట మచ్చా నర్సయ్య వీధిలోని అసెస్మెంట్ నంబర్ 1,07,634లో గత ఏడాది నీటి చార్జీలు ఆరు నెలలకు రూ.438 చెల్లిస్తే ఈ దఫా రూ.458 చెల్లించాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. అలాగే, డ్రెయినేజీ చార్జీని రూ.192 నుంచి రూ.204కు పెంచారు. నగరంలో 1,17,209 కుళాయి కనెక్షన్లు ఉండగా, ఇందులో 8,716 కమర్షియల్ కేటగిరీలో ఉన్నాయి. 67,113 డ్రెయినేజీ కనెక్షన్లకు 10,126 కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి. వీటన్నింటిపై ఏడు శాతం చార్జీలను పెంచేశారు. ఈ రెంటికీ కలిపి ప్రస్తుతం రూ.26.43 కోట్లు వసూలవుతుండగా, పెరిగిన ధరల ప్రకారం రూ.29.07 కోట్లకు చేరింది. మోత మోగించారు ప్రత్యేక అధికారుల పాలనలో నగరపాలక సంస్థలో పన్నులమోత మోగించారు. 2013 మార్చిలో స్పెషల్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ బుద్ధప్రకాష్, కమిషనర్ జి.పండాదాస్లు డ్రెయినేజీ, వాటర్ చార్జీలను 400 శాతం పెంచుతూ తీర్మానం చేశారు. ఏటా ఏడుశాతం చొప్పున పెంచేలా అందులో పేర్కొన్నారు. చెత్త, బిల్డింగ్ ఫీజులు, యూజర్ చార్జీలను అనూహ్యంగా పెంచారు. మూడున్నరేళ్ల స్పెషల్ ఆఫీసర్ల పాలనలో రూ.75 కోట్ల మేర ప్రజలపై పన్ను భారాలు పడ్డాయి. తాము అధికారంలోకి వస్తే వీటన్నింటినీ రద్దు చేస్తామని అప్పట్లో టీడీపీ నేతలు ప్రజలకు వాగ్దానం చేశారు. దీన్ని నమ్మి ప్రజలు ఓట్లేసి టీడీపీకి పట్టం కట్టారు. అధికారంలోకి వచ్చాక ఇలా.. నగరపాలక సంస్థలో టీడీపీ విజయం సాధించింది. స్పెషల్ ఆఫీసర్లు చేసిన తీర్మానం ప్రకారం గత ఏడాది ఏప్రిల్లో డ్రెయినేజీ, వాటర్ చార్జీలను ఏడు శాతం పెంచుతూ అధికారులు నోటీసులు ఇచ్చారు. గత ఆగస్టు 6వ తేదీన జరిగిన తొలి కౌన్సిల్ సమావేశంలో ప్రతిపక్షాలతో పాటు పాలకపక్షం కార్పొరేటర్లు పన్ను భారాలపై గళం ఎత్తారు. మాకు తెలియకుండా అధికారులే పన్నులు పెంచేశారంటూ మేయర్ కోనేరు శ్రీధర్ చెప్పారు. డెప్యూటీ మేయర్ గోగుల వెంకట రమణారావు స్పెషల్ అధికారుల పాలనలో పెంచిన డ్రెయినేజీ, వాటర్ చార్జీలను ఏటా ఏడు శాతం పెంచడానికి వీల్లేదని ప్రతిపాదన పెట్టారు. దీన్ని కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించి ప్రభుత్వానికి పంపింది. పన్నుల తగ్గింపునకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. దీంతో ఈ ఏడాది మరో ఏడు శాతం పెంచుతూ అధికారులు నోటీసులు ఇచ్చారు. త్వరలోనే తగ్గిస్తాం.. స్పెషల్ అధికారుల పాలనలో పెంచిన డ్రెయినేజీ, నీటి చార్జీలు తగ్గించాల్సిందిగా ప్రభుత్వానికి లేఖ రాశాం. మున్సిపల్ మంత్రి పి.నారాయణతో గతంలో చర్చించాం. త్వరలోనే ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుంది. అక్టోబర్ నుంచి నీటి చార్జీలను తగ్గించే అవకాశం ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నిలబెట్టుకుంటాం. - కోనేరు శ్రీధర్, మేయర్ పోరాడతాం.. టీడీపీ పాలకులు పన్ను భారాలతో ప్రజల నడ్డివిరుస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో పన్నులు తగ్గించాలంటూ చేసిన తీర్మానం ఏమైంది. కొత్తగా మరో ఏడుశాతం చార్జీలు పెంచారు. ఇందులో పాలకుల కుట్ర ఉంది. దీనిపై మేం నిలదీస్తాం. ప్రజల పక్షాన పోరాడతాం. - బండి నాగేంద్ర పుణ్యశీల, వైఎస్సార్ సీపీ ఫ్లోర్లీడర్ -
అడ్డగోలు గరికట్లు.. ఆదాయానికి తూట్లు
- పంచాయతీల రాబడికి గండి - దారి మళ్లుతున్న రూ.లక్షలు - పట్టించుకోని మత్స్యశాఖ - డెల్టాలో పలు డ్రెయిన్లలో ఇదే పరిస్థితి భీమవరం : డెల్టాలోని పలు ప్రాంతాల్లో అనధికార గరికట్లు రాజ్యమేలుతున్నాయి. ఫలితంగా ఆయా గ్రామ పంచాయతీలు, మత్స్యకార సొసైటీలకు చేరవలసిన రూ.లక్షల ఆదాయం దారి మళ్లుతోంది. కొందరు గ్రామ పెద్దలు మత్స్యశాఖతోపాటు మత్స్యకార సొసైటీలకు సంబంధం లేకుండా అనధికార గరికట్లతో లక్షలాది రూపాయలు బొక్కేస్తున్నారు. జిల్లాలోని డెల్టా ప్రాంతంలో పలు గ్రామాల్లో మేజర్, మైనర్, మీడియం డ్రెయిన్లు ఉన్నాయి. ఈ డ్రెయిన్లలో ఎటువంటి అనుమతి లేకుండా కొంతమంది వ్యక్తులు గరికట్లు ఏర్పాటుచేసి వాటిని పాట పెట్టి మరీ లక్షలాది రూపాయలు బొక్కేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే నెం. 2 అకౌంట్ పేరుతో గ్రామ పెద్దలు ఈ బోదె పాటల వల్ల వచ్చే ఆదాయాన్ని దారి మళ్లిస్తున్నారు. భీమవరం, మొగల్తూరు, న రసాపురం, వీరవాసరం, కాళ్ల, యలమంచిలి, ఆకివీడు వంటి మండలాల్లోని పలు గ్రామాల్లో ప్రవహిస్తున్న డ్రెయిన్లు, కాలువల్లో ఈ అనధికారిక గరికట్లు ఇబ్బడి ముబ్బడిగా వెలశాయి. అటు డ్రెయిన్లలోని మత్స్య సంపదను కొల్లగొట్టడంతోపాటు వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వానికి చెందకుండా కొంతమంది పెద్దలు గెద్దల్లా తన్నుకుపోతున్నారు. ఆయా గ్రామాల్లో గతంలో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో మత్స్యశాఖ అనుమతితో ఈ గరికట్లు అధికారికంగా నిర్వహించేవారు. వచ్చిన పాట సొమ్మును గ్రామ పంచాయతీ ఆదాయంలో జమ చేసేవారు. ఆ ఆదాయాన్ని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించేవారు. మరికొన్ని గ్రామాల్లో మత్స్య సహకార సంఘాలకు ఈ డ్రెయిన్లోని గరికట్లను అధికారికంగా మత్స్యశాఖ అధికారులు అప్పగించి వచ్చిన ఆదాయాన్ని ఆయా సొసైటీల ఆర్థిక పురోభివృద్ధికి కేటాయించేవారు. తద్వారా మత్స్యకార కుటుంబాల్లో వెలుగులు నింపేవారు. వీటన్నింటినీ పక్కనపెట్టి ఆయా గ్రామాల్లో గరికట్లు అనధికారికంగా వేస్తున్నారు. పట్టించుకోని మత్స్యశాఖ డెల్టాలోని పలు డ్రెయిన్లలో గరికట్లు వేసి మత్స్య సంపదను పట్టుకుంటున్నారు. ఒక్కొక్క డ్రెయిన్లో అనధికారికంగా వేసిన గరికట్లకు ఆయా డ్రెయిన్ల సామర్థ్యం, మత్స్య సంపదను బట్టి రూ. 5 లక్షల నుంచి 15 లక్షల వరకు ఆదాయం వస్తుంది. భీమవరం మండలంలోని బందాలచేడు, పొలిమేరతిప్ప, మందచేడు, ధనకాలువ, గునుపూడి సౌత్, మొగల్తూరు మండలంలో దర్భరేవు డ్రెయిన్, చింతరేవు కాలువ, నరసాపురం మండలంలో నల్లిక్రీక్, యలమంచిలి మండలంలో కాజా డ్రెయిన్, కాళ్ల మండలంలో బొండాడ డ్రెయిన్, రుద్రాయికోడు, స్ట్రైట్కట్ డ్రెయిన్, పెదకాపవరం డ్రెయిన్లపై అనధికారిక గరికట్లు వెలశాయి. ఆయా ప్రాంతాల్లోని మత్స్యశాఖ, రెవెన్యూశాఖ అధికారులు అక్రమ గరికట్ల ఏర్పాటు దారుల వద్ద కాసులకు కక్కుర్తిపడి ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఈ గరికట్ల ఆదాయంపై దృష్టి సారించాలని ఆయా గ్రామాలకు చెందినవారు ఉన్నతాధికారులను కోరుతున్నారు.