సమాచార పౌర సంబంధాల కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. హైదరాబాద్ మాసాబ్ట్యాంక్ ప్రాంతంలో ఉన్న ఈ కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. అవి ఇంకా ఎగసిపడుతూనే ఉన్నాయి. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక దళ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు.