గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ | kcr meets to governor ESL Narasimhan | Sakshi
Sakshi News home page

గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ

Published Wed, Nov 19 2014 12:27 AM | Last Updated on Tue, Aug 21 2018 11:41 AM

గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ - Sakshi

గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ

సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మంగళవారం రాత్రి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ నరసింహన్‌తో సమావేశమయ్యారు. సుమారు గంటా 20 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో... ఇంటర్ పరీక్షలపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదం, దానికి కారణాలు, పరిష్కారాలపై ప్రధానంగా చర్చించినట్టుగా సమాచారం. విద్యాశా ఖ పరిధిలో భవిష్యత్‌లో తలెత్తబోయే సమస్యలు, అంశాలు, పరిష్కారాలపైనా చర్చించినట్లు తెలుస్తోంది.

తెలంగాణలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు విడిగా సమ యం ప్రకటించడానికి కారణాలను కేసీఆర్ గవర్నర్‌కు వివరించారు. ఇక రాష్ట్ర విభజన నేపథ్యంలో వస్తున్న సమస్యలు, పరిష్కారాలపైనా మాట్లాడారు. వీటితో పాటు అసెంబ్లీ సమావేశాలు, ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్లు, దానికి దారితీసిన కారణాలు తదితర అంశాలపైనా గవర్నర్, సీఎం ఇష్టాగోష్టిగా మాట్లాడినట్టుగా తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement