rajbhavan
-
మమతా బెనర్జీ ‘నాట్ మై కప్ ఆఫ్ టీ’.. గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీని వ్యక్తి గతంగా గౌరవిస్తానని, ఆమెతో వృత్తి పరమైన సంబంధాలు ఉన్నాయని, అయితే రాజకీయవేత్త మమతా బెనర్జీ.. నాట్ మై కప్ ఆఫ్ టీ’ అని అన్నారు.మమతా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఆనంద బోస్ వ్యతిరేకిస్తున్నారు. ఈ తరుణంలో ఢిల్లీలో జరిగిన గవర్నర్ల సమావేశం అనంతరం పీటీఐతో జరిపిన ఇంటర్వ్యూలో గవర్నర్ ఆనంద్ బోస్ మాట్లాడారు. మమతా బెనర్జీతో ఉన్న సంబంధాల గురించి అడిగిన ప్రశ్నకు ఆనంద్ బోస్ మాట్లాడారు.మీరు ఏ మమతా బెనర్జీ గురించి అడుగుతున్నారు. నా ముందు ముగ్గురు మమతా బెనర్జీలు ఉన్నారు. ఒకరు వ్యక్తి మమతా బెనర్జీ..ఆమెతో నాకు మంచి అనుబంధం ఉంది. రెండవ వ్యక్తి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ..ఆమెతో నాకు వృత్తిపరమైన సంబంధాలు ఉన్నాయి. మూడవ వ్యక్తి రాజకీయ నాయకురాలు మమతా బెనర్జీ నాట్ మై కప్ ఆఫ్ టీ అని వ్యాఖ్యానించారు.వరుస వివాదాలుగత కొంతకాలంగా సీఎం మమతకు..గవర్నర్ ఆనందబోస్ మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. ప్రభుత్వం పంపిన బిల్లుల్ని గవర్నర్ ఆమోదించడం లేదని మమతా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతోపాటు రాజ్ భవన్లో ఆనందబోస్ ఓ మహిళాతో అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆరోపణలు గుప్పించింది. ఈ వరుస పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆనందబోస్ పశ్చిమబెంగాల్ ప్రభుత్వంపై కోల్కతా హైకోర్టులో దావా వేశారు. విచారణ చేపట్టిన కోర్టు హైకోర్టు ఆగష్టు 14 వరకు మధ్యంతర ఉత్తర్వులో గవర్నర్కు వ్యతిరేకంగా ఎటువంటి పరువు నష్టం కలిగించే లేదా తప్పుడు ప్రకటన చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. STORY | Concept of passive governor is gone: West Bengal Governor CV Anand BoseREAD: https://t.co/GNKBobRarN pic.twitter.com/niOE5dO3D4— Press Trust of India (@PTI_News) August 4, 2024 -
రాజ్భవన్కు ప్రగతిభవన్ చాలా దగ్గరగా ఉందన్న తెలంగాణ గవర్నర్ తమిళిసై.. ఇంకా ఇతర అప్డేట్స్
-
తెలంగాణ: రాజ్భవన్కు వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: వైఎస్ఆర్టీపీ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల.. రేపు(గురువారం) రాజ్భవన్కు వెళ్లనున్నారు. గవర్నర్ తమిళిసై తమిళిసై సౌందరరాజన్ను ఆమె భేటీ కానున్నారు. ఈ మేరకు అపాయింట్మెంట్ ఖరారు అయినట్లు సమాచారం. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై వైఎస్ షర్మిల.. గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. అక్రమంగా తనను అదుపులోకి తీసుకున్నారని, ఆ టైంలో వ్యవహరించిన తీరును ఆమె గవర్నర్కు వివరించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అరెస్టుపై సౌందరరాజన్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేశారు. ఆమె కారులో ఉండగానే.. లాక్కుంటూ వెళ్లిన దృశ్యాలు కలవరపెట్టాయని ఆమె ట్వీట్లో పేర్కొన్నారు. వైఎస్ఆర్టీపీ చీఫ్, మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె శ్రీమతి వైఎస్ షర్మిల అరెస్టుపై గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె కారు లోపల ఉన్నప్పుడు ఆ కారును దూరంగా లాగుతున్న దృశ్యాలు కలవరపెట్టాయి.@realyssharmila @PMOIndia @TelanganaDGP — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) November 30, 2022 -
నా ఫోన్లూ ట్యాపింగ్.. తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ‘‘నా వద్ద ఏడీసీగా పనిచేసిన తుషార్ భాసన్ పేరును, రాజ్భవన్ను ‘టీఆర్ఎస్ న్యూస్’ అనే అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలోకి లాగారు. అందులో రాజ్భవన్ పాలుపంచుకుందని ఆరోపణలు చేశారు. నా ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు. తుషార్ కొద్దిరోజుల కింద హైదరాబాద్కు వచ్చి నన్ను కలవాలని రెండు మూడు రోజులు కాల్ చేశారు. ఇలా నాకు ఎవరెవరు కాల్ చేస్తున్నారో వాళ్లు (రాష్ట్ర ప్రభుత్వం) కనుక్కున్నారు. నా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక పరిస్థితులు నెలకొని ఉన్నాయి’’ అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన ఆరోపణలు చేశారు. రాజ్భవన్ పారదర్శకమైన కార్యాలయమని, తాను అలాంటి కార్యకలాపాల్లో పాల్గొనలేదని స్పష్టం చేశారు. కావాలంటే తన ఫోన్ ఇచ్చేస్తానని, చూసుకోవచ్చని.. అంతా పారదర్శకంగా వ్యవహరిస్తానని పేర్కొన్నారు. బుధవారం గవర్నర్ తమిళిసై రాజ్భవన్లో మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు గవర్నర్ మాటల్లోనే.. ‘‘బిల్లులను ఆమోదించడానికి ఎలాంటి టైం లిమిట్ లేదు. ఆమోదించే వ్యక్తులకు వాటిని మదింపు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. నాకు అవసరమైనంత సమయాన్ని తీసుకుంటాను. నేను బిల్లులపై కూర్చున్నానని, సూపర్ పవర్ అని తప్పుడు ప్రచారాలు చేశారు. ఆరు బిల్లులు పంపించారు. ఒకదాని తర్వాత ఒక బిల్లును పరిశీలిస్తున్నా. నేను నియామకాల ప్రక్రియకు అడ్డంకిగా మారినట్టు తప్పుడు ప్రచారం చేశారు. కేవలం ఒకే నెల అయింది. బిల్లులను మదించడానికి నాకు సమయం వద్దా? బిల్లు పంపించి సింపుల్గా ఆమోదించేయాలంటే కుదరదు. వివరాలు కావాలి. వర్సిటీలకు చాన్స్లర్గా నాకు అన్ని హక్కులు ఉన్నాయి. రిక్రూట్మెంట్ బోర్డుకు సరైన వ్యక్తి ఉండాలి కదా. నా ఒత్తిడితోనే ప్రభుత్వంలో కదలిక గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజు నుంచే వర్సిటీల్లో బోధన, బోధనేతర పోస్టులను భర్తీ చేయాలని కోరుతూనే ఉన్నాను. వీసీలందరితో మాట్లాడి వర్సిటీల పరిస్థితులపై ప్రభుత్వానికి పెద్ద రిపోర్టు కూడా పంపాను. ఆ రిపోర్టు ప్రధాన ఎజెండా పోస్టుల భర్తీయే. నేను పదేపదే ఒత్తిడి చేయడంతోనే ఎనిమిదేళ్లు ఖాళీగా ఉన్న 13 వర్సిటీల వీసీ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది స్పష్టత మాత్రమే కోరాను వర్సిటీల్లో నియామకాలకు ఇప్పటికే ఒక విధానం ఉండగా కొత్త బోర్డు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? ఎలా ఏర్పాటు చేస్తారు, ఏ పద్ధతిని అనుసరిస్తారు?దీనికి చట్టబద్ధత ఉంటుందా? యూజీసీ ఒప్పుకుంటుందా? చైర్మన్గా ఎవరిని నియమిస్తారు? ఏం ప్రొటోకాల్ను పాటిస్తారు? ఏటా నియామకాలు చేస్తారా? యూనివర్సిటీ కేంద్రంగా నియామకాలుంటాయా? అన్ని వర్సిటీలను కలిపి కేంద్రీకృతంగా నియామకాలు చేపడతారా? వీటిపై స్పష్టత రావాలి. ఒకవేళ న్యాయపరమైన చిక్కులొస్తే బోధన, బోధనేతర సిబ్బంది లేక విద్యార్థులు ఇబ్బందిపడతారు. సత్వర నియామకాల కోసమే బోర్డు అని మీరు అంటున్నారు. బోర్డు ఏర్పాటుకు చాలా సమయం పడుతుంది. పారదర్శకంగా నియామకాలు జరగాలి. పక్షపాతం వల్ల అర్హులైన విద్యావేత్తలు నష్టపోరాదు. అందుకే బిల్లు విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత కోరాను. ఆరేడు నెలలుగా బిల్లులు ఆపినట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కేవలం ఒక నెల, ఆపై కొన్ని రోజులు మాత్రమే అయింది. రోజూ అనుమానాల నివృత్తి కోసం కొంత సమయం గడుపుతున్నాను. ప్రత్యేక బోర్డులు కలిగిన రాష్ట్రాలను సంప్రదిస్తే.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కిందే అవి పనిచేస్తున్నట్టు తెలిసింది. ప్రజాప్రయోజనాల రీత్యానే స్పష్టత కోరుతూ మంత్రికి లేఖ రాశాను. ఇలాగైతే ప్రగతిభవన్కు ప్రజల గొంతు చేరుతుందా? నేను ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నానని, లేఖ అందలేదని మంత్రి (సబితా ఇంద్రారెడ్డి) అనడం ఆశ్చర్యం కలిగించింది. సీఎం నుంచి లేఖ మంత్రికి చేరడానికి, రాజ్భవన్ నుంచి గవర్నర్ గొంతు మంత్రికి చేరడానికే ఇంత జాప్యం జరిగితే.. ప్రజల గొంతు ప్రగతిభవన్కు ఎలా చేరుతుంది? గవర్నర్ లేఖ రాశారా, లేదా? అని మంత్రి తెలుసుకుని ఉండాల్సింది. వాస్తవం తెలుసుకోకుండా రాజ్భవన్ను అప్రతిష్టపాలు చేయాలనుకుంటున్నారు. బిల్లుపై స్పష్టత కోసమే మంత్రిని రమ్మన్నాను. అగ్నివీర్ పథకంపై సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆందోళన చేస్తున్న వారిని రాజ్భవన్ ఎదుట ఆందోళన చేయాలంటూ (టీఆర్ఎస్) అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి పిలుపునివ్వడాన్ని గుర్తుంచుకోవాలి. ముందు ప్రభుత్వ వర్సిటీలను పట్టించుకోండి ప్రభుత్వ వర్సిటీల్లో మెస్లు, హాస్టళ్లు దుర్భరంగా ఉన్నాయి. బెడ్లు, టేబుళ్లు. ట్యూ బ్లైట్లు లేవు. పారిశుధ్యం లేదు. కలుషిత ఆహారం నిత్యకృత్యమైంది. ఈ పరిస్థితుల్లో ప్రైవేటు వర్సిటీలను అభివృద్ధి చేసేందుకు బిల్లు తెస్తారా? వాటి సంఖ్యను పెంచాలనుకుంటారా? ఎందుకు? విద్య వ్యాపారం కాదని సుప్రీంకోర్టు అన్నది. ముందు ప్రభు త్వ వర్సిటీల దుస్థితిని పట్టించుకోండి. ఆ తర్వాత ప్రైవేటు బిల్లు గురించి ఆలోచిద్దాం. గవర్నర్లే వీసీలుగా ఉండాలి వర్సిటీల చాన్స్లర్లుగా గవర్నర్లే ఉండాలి. వారిని తొలగించి సీఎంలను నియమించడంపై విస్తృత చర్చ జరగాలి. సెక్యులరిజంపై వ్యాఖ్యలు చేసినంత మాత్రాన తమిళనాడు గవర్నర్ను భర్తరఫ్ చేయాలని అక్కడి ప్రభు త్వం కేంద్రానికి లేఖ రాయాల్సిన అవసరం లేదు’ అని తమిళిసై స్పష్టం చేశారు. తెలుగు ప్రజల గురించి అలా అనలేదు తమిళనాడులో తెలుగు ప్రజలు ఆధిపత్యం చెలాయిస్తున్నారని తాను చెప్పలేదని, తన మాటలను వక్రీకరించారని ఓ ప్రశ్నకు గవర్నర్ తమిళిసై బదులిచ్చారు. తాను కేవలం మాతృభాష గురించి మాట్లాడానని వివరించారు. ఇక ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా నిరసనలు తెలపాలంటూ పలువురు పిలుపునివ్వడంపై గవర్నర్ స్పందించారు. ప్రధాని పర్యటనతో రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు వస్తాయని, దీనిని సానుకూల దృక్పథంతో చూడాలని సూచించారు. అందుకే ఖైదీల క్షమాభిక్షను తిరస్కరించా.. కేంద్ర హోంశాఖ నిబంధనలను పాటించకపోవడంతోనే ఖైదీల క్షమాభిక్ష ప్రతిపాదనలను తిరస్కరించినట్టు గవ ర్నర్ స్పష్టం చేశారు. జీవిత ఖైదీలను వెంటనే విడుదల చేయడం కుదరదని.. క్షణికావేశంలో నేరాలు చేసిన వారికే క్షమాభిక్ష వర్తిస్తుందని పేర్కొన్నారు. చదవండి: మంత్రి గంగులపై ఫిర్యాదు చేసింది నేనే -
తెలంగాణ రాజ్ భవన్ లో బతుకమ్మ సంబరాలు
-
రాజ్భవన్.. నివురుగప్పిన నిప్పు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తనపై వివక్ష చూపుతోందంటూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వంపై నేరుగా ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు గవర్నర్ల పాత్ర, ప్రభుత్వాలతో సంబంధాలకు సంబంధించిన అంశాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. నిజానికి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తమిళిసై స్థాయిలో బహిరంగంగా విమర్శలు చేసిన, ఆవేదన వ్యక్తం చేసిన గవర్నర్ మరొకరు లేరు. నాడు రామ్లాల్ నుంచి.. ఉమ్మడి ఏపీ, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటివరకు పనిచేసిన గవర్నర్లలో అత్యంత వివాదాస్పదుడిగా రామ్లాల్ పేరును చెబుతుంటారు. ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా రద్దు చేసిన గవర్నర్గా ఆయన చరిత్రకెక్కారు. తర్వాత కుముద్బెన్ జోషి గవర్నర్గా ఉన్నప్పుడూ నాటి ఎన్టీఆర్ ప్రభుత్వంతో పలు విషయాల్లో విభేదించి వార్తల్లో నిలిచారు. రాజ్భవన్లో జోగినులకు వివాహం జరిపించి సంచలనం సృష్టించారు. కొంతకాలం నాటి సీఎం ఎన్టీఆర్తో కుముద్బెన్ కోల్డ్వార్ సాగింది. నరసింహన్ హయాంలో.. ఉమ్మడి ఏపీ గవర్నర్గా నరసింహన్ పనిచేసిన కాలంలో పలుమార్లు రాజ్భవన్కు, ప్రభుత్వానికి మధ్య విభేదాలు వచ్చాయి. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న ఆ సమయంలో నరసింహన్ కొంత కఠినంగా వ్యవహరించారు. ఇక్కడి పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు పంపించారు. ఆయన హయాంలోనే రాష్ట్ర విభజన జరగడంతో.. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల బాధ్యతలను కొంతకాలం చూసుకున్నారు. ఈ సమయంలో హైదరాబాద్లో శాంతిభద్రతల పరిస్థితిపై వివాదం తలెత్తినప్పుడు.. సెక్షన్–8 ప్రయోగించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇక తెలంగాణ ప్రభుత్వం ఆమోదం కోసం పంపించిన మున్సిపల్ చట్టంపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తిప్పి పంపారు. మార్పులు చేసి తీసుకెళితే ఆమోదించారు. ప్రస్తుత గవర్నర్ తమిళిసై కూడా.. ప్రభుత్వం పాడి కౌశిక్రెడ్డిని గవర్నర్ కోటాలో నామినేట్ చేస్తే, ఆయనకు తగిన అర్హతలు లేవంటూ తిప్పిపంపారు. మరోవైపు పశ్చిమబెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర (ఉద్ధవ్ఠాక్రే సీఎంగా ఉండగా), కేరళ రాష్ట్రాల గవర్నర్లు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా పలు అంశాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో విభేదించి వివాదాస్పదులుగా నిలిచారు. ఇదీ చదవండి: గవర్నర్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రుల ఆగ్రహం.. -
హైకోర్టు సీజేగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణస్వీకారం చేశారు. మంగళవారం ఉదయం 10.15 గంటలకు రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆయనతో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, రాష్ట్ర మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర ప్రముఖులు కార్యక్రమానికి హాజరై నూతన సీజేకు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటివరకు సీజేగా బాధ్యతలు నిర్వహించిన జస్టిస్ సతీశ్చంద్ర శర్మ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయిన విషయం తెలిసిందే. తదుపరి సీజేగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పేరును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం మే 17న సిఫారసు చేయగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇటీవల ఆమోదించారు. ఈ మేరకు ఆయన నియామకాన్ని ప్రకటిస్తూ గత వారం కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసింది. అసోంకు చెందిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్ 2011 అక్టోబర్ 17న గువాహటి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013లో పూర్తిస్థాయి న్యాయమూర్తి అయ్యారు. 2021 అక్టోబర్ 22న తెలంగాణ హైకోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. దాదాపు 8 నెలల తర్వాత తెలంగాణ హైకోర్టు ఐదో ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్, సీఎం..చిరునవ్వులు, ముచ్చట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు 8 నెలల విరామం తర్వాత రాజ్భవన్కు వెళ్లడం రాజకీయంగా ప్రాధా న్యత సంతరించు కుంది. గవర్నర్తో విభేదాల నేపథ్యంలో సీజే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేసీఆర్ వెళ్తారా..? లేదా అన్న అంశం చర్చనీ యాంశమైన సంగతి తెలిసిందే. ఆ చర్చకు తెరదించుతూ సీఎం కేసీఆర్ రాజ్భవన్కు వెళ్లారు. గవర్నర్ తమిళిసైని ఆప్యాయంగా పలకరించి పూలబొకే అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్, సీఎంలు పరస్పరం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కొద్దిసేపు క్లుప్తంగా సంభాషించారు. ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుకుంటున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రాజ్భవన్లో గవర్నర్, ముఖ్యమంత్రి సుహృద్భావ వాతావరణంలో మాట్లాడుకున్నారని రాజ్భవన్ వర్గాలు తెలిపాయి. చివరిసారిగా జస్టిస్ సతీశ్చంద్ర శర్మ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో కేసీఆర్ రాజ్భవన్కు వెళ్లారు. అప్పట్నుంచి ఇప్పటి వరకు తమిళిసైతో సీఎం భేటీ కాలేదు. గవర్నర్ తన అధికార పరిధిని అతిక్రమించి పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని, రాజ్భవన్ను బీజేపీ కార్యకలా పాలకు అడ్డాగా మార్చారని రాష్ట్ర మంత్రులు గతంలో బహిరంగంగా ఆరోపణలు చేశారు. ఇందుకు ప్రతిగా.. రాష్ట్ర ప్రభుత్వం తనకు ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇవ్వడం లేదని, మహిళ అని చిన్నచూపు చూస్తోందని గవర్నర్ తమిళిసై విమర్శించారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీగా కౌశిక్రెడ్డి పేరును సిఫారసు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను గవర్నర్ తమిళిసై ఆమోదిం చకుండా పక్కన పెట్టడం, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగాన్ని ప్రభుత్వం రద్దు చేయడం, గవర్నర్ జిల్లా పర్యటనల సమయంలో కలెక్టర్లు, ఎస్పీలు హాజరుకాకపోవడం, గవర్నర్ ప్రజాదర్బార్ నిర్వహించడం వంటి పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. -
ఏఐసీసీ గేట్లు బద్ధలు కొట్టిన పోలీసులు!.. కాంగ్రెస్ ఆగ్రహం
ఢిల్లీ: ఢిల్లీ పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఈడీ విచారణ నేపథ్యంలో.. కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే.. కాంగ్రెస్ కార్యకర్తలను ఏఐసీసీ కార్యాలయంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం, ఆపై కార్యాలయంలోనే కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బుధవారం నిరసనలు కొనసాగుతున్న సమయంలో.. అక్బర్రోడ్డు వద్ద ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ముందు ఢిల్లీ పోలీసులతో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. ఒకానొక టైంలో ఏఐసీసీ గేట్లు బద్ధలు కొట్టి పోలీసులు కార్యాయంలోకి వచ్చి, తమ నేతలను అరెస్ట్ చేసినట్లు కాంగ్రెస్ ఆరోపణలకు దిగింది. ఈ పరిణామంపై పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సింగ్ సూర్జేవాలా తీవ్రంగా స్పందించారు. అసలు పార్టీ కార్యాలయంలోకి పోలీసులు ఎలా వస్తారని నిలదీశారు. పోలీసులు గుండాల్లా ప్రవర్తించారని మండిపడ్డారాయన. #WATCH Congress leader Sachin Pilot detained by police amid protests by party workers over the questioning of Rahul Gandhi by the Enforcement Directorate in the National Herald case#Delhi pic.twitter.com/smlKTJ62hS — ANI (@ANI) June 15, 2022 కాంగ్రెస్ ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. ఏఐసీసీ కార్యాలయం దగ్గర చాలా మంది వ్యక్తులు పోలీసులపై బారికేడ్లు విసిరారు. కాబట్టి గొడవ జరిగి ఉండవచ్చు. అంతేగానీ పోలీసులు ఏఐసీసీ కార్యాలయంలోకి వెళ్లి లాఠీఛార్జ్ చేయలేదు. పోలీసులు ఎలాంటి బలప్రయోగం చేయడం లేదు. మాతో సమన్వయం చేసుకోవాలని వారికి విజ్ఞప్తి చేస్తాం అని ఎస్పీ హుడా, స్పెషల్ సీపీ (ఎల్అండ్ఓ) తెలిపారు. మరోవైపు ఈడీ కార్యాలయం వద్ద టైర్లు కాల్చి నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. #WATCH | Delhi: Many people threw barricades at police near AICC office, so there might've been a scrimmage. But police didn't go inside the AICC office & use lathi charge. Police are not using any force. We will appeal to them to coordinate with us...: SP Hooda, Special CP (L&O) pic.twitter.com/umkUd7pAzz — ANI (@ANI) June 15, 2022 ఇదిలా ఉంటే.. ఏఐసీసీ కార్యాలయం వద్ద జరిగిన పరిణామంపై కాంగ్రెస్ నిరసనలకు పిలుపు ఇచ్చింది. గురువారం రాజ్భవన్ల ముట్టడికి ఏఐసీసీ పిలుపు ఇచ్చింది. ఈ పిలుపులో భాగంగా.. తెలంగాణలో రాజ్భవన్ ఎదుట కాంగ్రెస్ శ్రేణులు ధర్నా చేపట్టనున్నాయి. రాహుల్పై కేంద్రం కక్ష సాధింపు చర్యకు పాల్పడుతోందని తెలంగాణ కాంగ్రెస్ ఒక ప్రకటన విడుదల చేసింది. -
ముదిరిన పంచాయితీ..
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు రాష్ట్ర ప్రభుత్వానికి నడుమ సాగుతున్న ‘పంచాయితీ’ ముదిరి పాకాన పడింది. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వతీరు, టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై గవర్నర్ తీవ్రం గా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం తనను గౌరవించడం లేదని, రాజ్యాంగబద్ధంగా పనిచేయడం లేదనే రీతిలో వ్యాఖ్యలు చేశారు. ఇందుకు ప్రతిగా కొందరు రాష్ట్ర మంత్రులు కూడా అదే స్థాయిలో స్పందిస్తున్నారు. రాజ్భవన్ బీజేపీ పార్టీ కార్యాలయంలా మారిందని విమర్శలు గుప్పిస్తున్నారు. మోదీ, అమిత్ షాతో భేటీపై ఆసక్తి రాష్ట్ర ప్రభుత్వం తన పట్ల అనుసరిస్తున్న తీరుపై తమిళిసై గతంలోనే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడంతోపాటు రాజ్భవన్లో ఉగాది వేడుకల సందర్భంగా.. తాను శక్తిమంతురాలినని, బలవంతంగా ఎవరూ తన తలవంచలేరంటూ స్వ రం పెంచారు. అదే సమయంలో సీఎం, మంత్రులతో చర్చకు సిద్ధమని, ఎవరికైనా రాజ్భవన్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని కూడా అన్నారు. తాజాగా రెండు రోజులు ఢిల్లీలో మకాం వేసి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా ను కలవడం ద్వారా రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేపారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పాడి కౌశిక్రెడ్డి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించడం మొదలు మండలి ప్రొటెమ్ చైర్మన్ నియామకం, బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడం, మేడారం జాతర, యాదగిరిగుట్ట పర్యటనలో ప్రొటోకాల్కు తిలోదకాలివ్వడం తదితర అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. వీటిపై ఫిర్యాదులతోపాటు ప్రభుత్వ పా లన వైఫల్యాలు, శాంతిభద్రతలు, డ్రగ్స్, అవినీతి వంటి అం శాలపై గవర్నర్ నివేదిక సమర్పించినట్లు తెలిసింది. మీకే కాదు..మాకూ అవమానమే! రాష్ట్రంలో తనకు ఎదురైన అవమానాల గురించి కేంద్ర పెద్దలకు గవర్నర్ వివరించగా.. ‘ఈ అవమానం మీకే కాదు.. మాకూ జరిగినట్టు భావిస్తున్నాం’ అని వారు బదులిచ్చారని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరిగేలా రోడ్డు, రైలు మార్గాల్లో రాష్ట్రం నలుమూలలా పర్యటించేందుకు గవర్నర్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు, విజ్ఞాపనలను స్వీకరించడానికి వచ్చే నెల నుంచి రాజ్భవన్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ వివాదం రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన అంశంగా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. (చదవండి: బీజేపీ బెటాలియన్ ఏదైనా నాతో యాదాద్రికి వచ్చిందా?) -
సీఎం కేసీఆర్ సారొస్తారొస్తారా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉగాది రాజకీయాలు రంజుగా మారాయి. శుక్రవారం సాయంత్రం 7 గంటలకు రాజ్భవన్లో ముందస్తు ఉగాది వేడుకలను తలపెట్టిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావును ఆహ్వానించడం ఆసక్తి రేపుతోంది. సీఎంతోపాటు రాష్ట్ర మంత్రులు, విపక్షాల ముఖ్య నేతలు, ఇతర రంగాల ప్రముఖులకు కూడా రాజ్భవన్ నుంచి ఆహ్వానాలు వెళ్లాయి. అయితే విభేదాల కారణంగా చాలా కాలంగా రాజ్భవన్ గడప తొక్కని సీఎం కేసీఆర్.. ఇప్పుడు గవర్నర్ ఆహ్వా నం మేరకు వెళతారా, లేదా అన్నదానిపై చర్చ జరుగుతోంది. ‘నూతన సంవత్సరం సందర్భంగా పాత చేదు జ్ఞాపకాలను మరిచి కొత్తగా జీవితాన్ని ప్రారంభించాలని పెద్దలు అంటుంటా రని.. పరస్పరం ఆరోపణలు చేసుకునే స్థాయికి వెళ్లిన గవర్నర్, సీఎం మధ్య విభేదాలు ఉగాదితో సమసిపోతాయా?, కొనసాగుతాయా? అన్నది శుక్రవారం తేలిపోతుంద’ని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా రాజ్భవన్ ఉత్సవాలకు వచ్చే అవకాశం ఉంది. ఇలా ఒకరిపై ఒకరు నిత్యం విమర్శలు చేసుకునే నేతలంతా ఎదురుపడే నేపథ్యంలో మరింత ఆసక్తి నెలకొంది. మరోవైపు సీఎం కేసీఆర్ శనివారం ప్రత్యేకంగా ప్రగతిభవన్లోని జనహితలో ఉగాది వేడుకలను తలపెట్టారు. దానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానించారు. దానికి ఎవరెవరు హాజరువుతారనే దానిపై చర్చ జరుగుతోంది. విభేదాలకు చెక్ పడేనా? గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు సృష్టిస్తున్నారని, బీజేపీ రాజకీయాలకు రాజ్భవన్ అడ్డాగా మారిందని ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వమే గవర్నర్గా తనకు అందాల్సిన గౌరవాన్ని ఇవ్వడం లేదని తమిళిసై అంటున్నారు. ఎమ్మెల్సీగా పాడి కౌశిక్రెడ్డి పేరును రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసినప్పుడు గవర్నర్ ఆమోదించకుండా పెండింగ్లో ఉంచడంతో రాజ్భవన్, ప్రగతిభవన్ మధ్య విభేదాలు మొదటిసారిగా బహిర్గతమయ్యాయి. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం, ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడినప్పటి నుంచి దూరం పెరిగినట్టు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఇక సామాన్యుల నుంచి విన్నపాలు స్వీకరించడానికి రాజ్భవన్ గేటు వద్ద గ్రివెన్స్ బాక్స్ ఏర్పాటు చేయడం ప్రభుత్వానికి రుచించలేదు. ఇక గణతంత్ర వేడుకల సందర్భంగా ప్రభుత్వం పంపే ప్రసంగాన్ని గవర్నర్ చదవాల్సి ఉంటుంది. కానీ కోవిడ్ నేపథ్యంలో గణతంత్ర దినాన్ని సాదాసీదాగా నిర్వహించాలని, గవర్నర్ ప్రసంగం అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గవర్నర్ ఇందుకు భిన్నంగా గణతంత్ర వేడుకల్లో సొంతంగా ప్రసంగించారు. అందులో రాష్ట్రంలో వైద్య సదుపాయాలు మెరుగుపడాల్సి ఉందని గవర్నర్ పేర్కొనడం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. ప్రభుత్వ పెద్దలు కూడా దీనిపై తీవ్రస్థాయిలో ప్రతిస్పందించారు. ఈ క్రమంలోనే గవర్నర్ ప్రసంగం లేకుండానే శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. దానిని గవర్నర్ తప్పుపట్టారు కూడా. మరోవైపు సమ్మక్క–సారక్క జాతరలో పాల్గొనడానికి హెలికాప్టర్ కావాలని గవర్నర్ కోరితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. ఈ వరుస ఘటనల నేపథ్యంలో రాజ్భవన్, ప్రగతిభవన్ మధ్య విభేదాలు ముదిరాయన్న అభిప్రాయం నెలకొంది. ఇలాంటి సమయంలో ఉగాది వేడుకలకు సీఎం కేసీఆర్ను గవర్నర్ ఆహ్వానించడం చర్చనీయాంశమైంది. -
రాజ్భవన్లో గవర్నర్ పురోహిత్ను కలిసిన చన్నీ
-
రాజ్భవన్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు (ఫోటోలు)
-
రాజ్భవన్లో.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో..
-
రాజ్భవన్ పాఠశాలను సందర్శించిన గవర్నర్ తమిళిసై
-
చలో రాజ్భవన్: పోలీసుల ఓవరాక్షన్.. పరిగెత్తించి మరీ
Revanth Reddy Protest: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ శుక్రవారం చలో రాజ్భవన్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కార్యక్రమానికి హాజరవుతున్న కార్యకర్తలను, నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడమే కాక అరెస్ట్లకు దిగుతున్నారు. ముందుగా అనుమతి తీసుకుని.. శాంతియుతంగా నిరసన తెలపుతున్న తమను పోలీసులు అడ్డుకోవడం ఏంటని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో టీపీసీసీ ప్రెసెడింట్ రేవంత్ రెడ్డి ట్విట్టర్లో షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దీనిలో ఇందిరా పార్క్ దగ్గర నిరసన తెలపుతున్న వెంకట్ బల్మూర్ అనే కాంగ్రెస్ కార్యకర్తను పోలీసులు రోడ్డు మీద పరిగెత్తించి మరీ అరెస్ట్ చేశారు. ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేయడం కోసం దాదాపు ఏడేనిమిది మంది పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అనంతరం వెంకట్ని బలవంతంగా అక్కడ నుంచి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోని రేవంత్ రెడ్డి తన ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. ‘‘పోలీసులు దారుణ ప్రవర్తనకు నిదర్శనం ఈ వీడియో. ముందస్తు అనుమతితో శాంతియుతంగా నిరసన చేస్తున్న కార్యకర్తలను అరెస్ట్ చేశారు. పోలీసులు టీఆర్ఎస్ సర్కార్కు గులాం గిరి చేస్తున్నారు’’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. -
రాజ్భవన్ గేటుకు కాంగ్రెస్ జెండాలు, అధికారులు సీరియస్
సాక్షి, హైదరాబాద్: పెట్రో ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు చేపట్టిన చలో రాజ్భవన్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఇందిరాపార్క్ నుంచి రాజ్భవన్కు ర్యాలీకి కాంగ్రెస్ శ్రేణులు యత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఆధ్వర్వంలో కాంగ్రెస్ చేపట్టిన నిరసనను పోలీసులు నిలువరించారు. ఈ క్రమంలోనే అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎలాగైనా చలో రాజ్భవన్ కార్యక్రమం నిర్వహించాలని కాంగ్రెస్ యత్నించగా, దానిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో సహా పలువురు ముఖ్య నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. అరెస్ట్లు అప్రజాస్వామికం. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ చేపట్టిన చలో రాజభవన్కు వస్తున్న వేలాది మంది నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరా పార్కు వద్ద ధర్నా కోసం అనుమతికి దరఖాస్తు చేశామన్నారు. పోలీసులు.. గృహ నిర్బంధాలు, అరెస్టులు చేయడం రాజరిక పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. మరోవైపు పోలీసులను నుంచి తప్పించుకుని వచ్చిన కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు రాజ్భవన్ గేటుకు కాంగ్రెస్ జెండాలు కట్టడం చర్చనీయాంశమైంది. అంబర్ పెట్ పోలీస్ స్టేషన్ లో రేవంత్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్... జెండాలు కట్టిన వారిపై చర్యలు ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. భద్రతా వైఫల్యంపై సమీక్ష నిర్వహించారు. అధికారుల ఫిర్యాదుతో కాంగ్రెస్ జెండాలు పెట్టిన ఇద్దరిపైనా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే, రాజ్భవన్ గేట్ బయట ఉన్న సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలిసింది. కాంగ్రెస్ ధర్నా నేపథ్యంలో హుటాహుటిన సీసీ కెమెరాలు మరమ్మతు చేపట్టినట్టు సమాచారం. -
విద్యతోనే చిన్నారుల సమగ్ర అభివృద్ధి: బిశ్వభూషణ్ హరిచందన్
సాక్షి, అమరావతి: బాల్యం నుంచే సంపూర్ణ విద్యను అందించటం ద్వారా చిన్నారుల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. సంపూర్ణ విద్యతో జీవితంలో శ్రేష్ఠత’ అనే అంశంపై ప్రజాపిత బ్రహ్మ కుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయం నిర్వహించిన అంతర్జాతీయ విద్యా సదస్సులో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ముఖ్యఅతిథిగా వర్చవల్ విదానంలో రాజ్ భవన్ నుంచి పాల్గొన్నారు. గవర్నర్ మట్లాడుతూ ఆలోచనాపరులు, తత్వవేత్తలు ఊహించినట్లుగా కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్న ప్రపంచం, మనం ఇంతకు ముందు చూసిన ప్రపంచానికి భిన్నంగా మారుతుందన్నారు. సంపూర్ణ అభివృద్ధి సాధించిన పిల్లలు మేధో, మానసిక, శారీరక, భావోద్వేగ, ఆధ్యాత్మిక సామర్థ్యాలను కలిగి ఉండటం ద్వారా రోజువారీ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవటానికి సిద్దంగా ఉంటారని గవర్నర్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులలో పిల్లలలో నెలకొంటున్న ఒత్తిడి, ఆందోళన వారిలో అనిశ్చితికి దారితీస్తుందని, వారు నిర్బంధ వాతావరణంలో పెరగటం వల్లే ఈ పరిస్ధితులు ఏర్పడుతున్నాయని గవర్నర్ అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాలు తల్లిదండ్రులకు తమ చిన్నారుల భవిష్యత్తు పట్ల ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. భయం, ఆందోళన, అనిశ్చితి ఉన్న ఈ కాలంలో జీవితాన్ని ఇచ్చే విద్య అన్న అంశంపై దృష్టి పెడుతూ ఆధ్యాత్మిక, నైతిక విలువలను బోధించడం ద్వారా సమాజంలో దైవత్వాన్ని వ్యాప్తి చేయడానికి బ్రహ్మ కుమారిస్ చేస్తున్న కృషిని ప్రశంసనీయమన్నారు. చదవండి: షాకింగ్: భార్యను చెల్లిగా పరిచయం చేస్తూ పెళ్లి, ఆ పై.. -
రాజ్ భవన్ ముట్టడికి రైతుసంఘాల పిలుపు : ఢిల్లీ
-
తెలంగాణ : గవర్నర్ తమిళసైతో కాంగ్రెస్ నేతల బృందం భేటీ
-
గవర్నర్ తమిళిసైతో సీఎం కేసీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు శనివారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్తో రాజ్భవన్లో భేటీ అయ్యారు. ఇటీవల గవర్నర్ బాబాయి, తమిళనాడులోని కన్యాకుమారి ఎంపీ వసంత్కుమార్ మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. రాజ్భవన్కు వచ్చి సంతాపం తెలిపిన ముఖ్యమంత్రికి గవర్నర్ తమిళిసై ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి వెంట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్కుమార్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. అగస్తీశ్వరంలో అంత్యక్రియలు కాగా కరోనా వైరస్తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వసంత్కుమార్ శుక్రవారం రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు ఆదివారం ఉదయం కన్యాకుమారి జిల్లా అగస్తీశ్వరంలో జరగనున్నాయి. ఇక పదవీకాలం ముగియకుండా మరణించిన ప్రజాప్రతినిధుల నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగడం సహజం. అయితే వసంతకుమార్ ప్రాతినిధ్యం వహించిన కన్యాకుమారీ లోక్సభ నియోజకవర్గంలో అర్థ శతాబ్ధం విరామం తర్వాత ఉప ఎన్నికల పరిస్థితి చోటుచేసుకోవడం గమనార్హం. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో వసంత్కుమార్ గెలుపొందగా, ఆయన పదవీకాలం ఇంకా నాలుగేళ్లు ఉంది. -
పరిస్థితి అదుపులోనే..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా నియంత్రణకు, రోగులకు నాణ్యమైన చికిత్స అందించడానికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఎంతమందికైనా చికిత్స అందించేందుకు సంసిద్ధతతో ఉన్నామన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు పూర్తి నియంత్రణలోనే ఉన్నాయని, భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో సుమారు గంటన్నర పాటు సమావేశమయ్యారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, ఇతర వర్తమాన అంశాలపై సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. కరోనా రోగులకు ప్రభుత్వాస్పత్రుల్లో నాణ్యమైన చికిత్స అందిస్తున్నామని, కొందరు చేస్తున్న దుష్ప్రచారం వల్ల ప్రజలు హైరానాపడి ప్రైవేటు, కార్పొరేట్ ఆస్ప త్రుల చుట్టూ తిరుగుతున్నారని ముఖ్యమంత్రి గవర్నర్కు వివరించినట్టు సమాచారం. 1,200 మంది పీజీ వైద్యులతో పాటు 200 మంది పీహెచ్సీ వైద్యులను నియమించి ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలోపేతం చేయనున్నామని గవర్నర్కు నివేదించారు. కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బందికి ప్రోత్సాహకాలను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గుర్తుచేశారు. కొత్త సచివాలయ భవన సముదాయం నిర్మించడానికి ఏడాదిగా చేస్తున్న ప్రయత్నాలకు ఎట్టకేలకు అన్ని చిక్కు లు తొలగిపోయాయని, రాష్ట్ర అవసరాలకు తగ్గట్టు అద్భుతరీతిలో కొత్త సచివాలయ భవన సముదా య నిర్మాణానికి త్వరలో పనులు ప్రారంభించను న్నామని గవర్నర్ దృష్టికి సీఎం తీసుకెళ్లారు. సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతిభవన్తో పాటు గవర్నర్ కార్యాలయం రాజ్భవన్లో కొందరు ఉద్యోగులు కరోనా బారినపడిన విషయం ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. జిల్లాకో ప్లాస్మా బ్యాంకు ఏర్పాటు చేయాలి: గవర్నర్ జిల్లాకు ఒక ప్లాస్మా బ్యాంకును ఏర్పాటుచేయాలని, ప్లాస్మా దాతలకు ప్రోత్సాహకాలు అందించా లని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్యమంత్రి కేసీఆర్కు సూచించినట్టు సమాచారం. కొన్ని రోజులుగా తాను నిర్వహించిన సమావేశాలు, సదస్సుల్లో వివిధ రంగాల నిపుణుల నుంచి వచ్చిన సలహా సూచనలను గవర్నర్ ఈ సమావేశంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న వారు వైద్య పరీక్షల కోసం ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ కష్టాలు పడుతున్నారని, విస్తృత రీతిలో పరీక్షలు నిర్వహించాలని గవర్నర్ కోరినట్టు తెలిసింది. మొబైల్ ల్యాబ్లు ఏర్పాటు చేయాలని, ఇంటి నుంచి బయటకు రావడానికి ఇబ్బందిపడే వారికి ఇళ్ల వద్దే పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించినట్టు సమాచారం. ఏదైనా ప్రాంతంలో గణనీయ సంఖ్యలో పాజిటివ్ కేసులు బయటపడితే ఆ ప్రాంతం పరిధిలోని ప్రజలందరికీ పరీక్షలు నిర్వహించాలని గవర్నర్ విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. అలాగే, ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఫీజుల దోపిడీ, బెడ్ల కృత్రిమ కొరతపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయని, ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో కమిటీ వేసి ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని గవర్నర్ కోరినట్టు తెలిసింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్ల లభ్యత, వినియోగం, ఖాళీ బెడ్ల సంఖ్యను ఎప్పటికప్పుడు రోగులు తెలుసుకునేలా పారదర్శకమైన విధానాన్ని తీసుకురావాలని గవర్నర్ కోరినట్టు తెలిసింది. -
క్వారంటైన్లో మహారాష్ట్ర గవర్నర్
ముంబై : మహారాష్ట్ర రాజ్భవన్లో 18 మంది సిబ్బందికి కరోనా వైరస్ పాజిటివ్గా నిర్ధారణ కావడంతో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన వారిలో గవర్నర్తో సన్నిహితంగా మెలిగిన సిబ్బంది కూడా ఉన్నారు. బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్లకు కరోనా పాజిటివ్ రావడంతో వారిని నానావతి ఆస్పత్రికి తరలించిన అనంతరం గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన వార్తలతో మహారాష్ట్రలో కరోనా తీవ్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. మహారాష్ట్రలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. కోవిడ్-19 కేసులు ఏకంగా 2,50,000కు చేరువవడతో రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కిపడింది. కరోనా కట్టడికి పుణే జిల్లాలో జులై 13 నుంచి పదిరోజుల లాక్డౌన్ను ప్రకటించారు. థానే జిల్లాలో కూడా లాక్డౌన్ను ఈనెల 19 వరకూ పొడిగించారు. దేశంలో నమోదైన కరోనా కేసుల్లో 90 శాతం కేసులు మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో నమోదైనవే. ఇక 49 జిల్లాల్లోనే 80 శాతం కరోనా వైరస్ కేసులున్నాయని కోవిడ్-19పై ఏర్పాటైన మంత్రుల బృందం పేర్కొంది. చదవండి :కోవిడ్-19 : మందుల కొరతకు చెక్ -
ఏపీ గవర్నర్తో ట్రైనీ ఐఏఎస్ల భేటీ
సాక్షి, విజయవాడ : సమాజంలోని పేద వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేయవలసిన అతి పెద్ద బాధ్యత అఖిల భారత సర్వీసుల అధికారులపై ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. ఐఎఎస్ అధికారిగా పని చేయటం అంటే అత్యున్నత పౌర సేవకు అవకాశం పొందినట్లు భావించాలన్నారు. ప్రజా సమస్యలను సానుకూల దృక్పధంతో పరిశీలించగలిగినప్పుడే పరిష్కారాలు లభిస్తాయని గవర్నర్ పేర్కొన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు కేటాయించబడి, రాష్ట్ర సచివాలయంలో శిక్షణ పొందుతున్న ఐఎఎస్ అధికారులు సోమవారం రాజ్ భవన్లో గవర్నర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ముస్సోరీలో వీరు తీసుకోవలసిన రెండవదశ తప్పనిసరి శిక్షణా కార్యక్రమం వాయిదా పడింది. ఈ క్రమంలో వారిని రాష్ట్ర ప్రభుత్వం సచివాలయంలోని వివిధ విభాగాలలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. (ట్రైనీ ఐఏఎస్లతో సీఎం జగన్ సమావేశం) ట్రైనీ ఐఎఎస్ అధికారులతో గవర్నర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలుచేసే సంక్షేమ పథకాల ప్రయోజనాలను అర్హులైన లబ్ధిదారులకు చేరేలా చూడాలన్నారు. విధుల నిర్వహణలో మార్గదర్శక శక్తిగా రూపుదిద్దుకోవాలని సూచించారు. ప్రజా పరిపాలనలో పారదర్శకతకు కట్టుబడి ఉండాలని గవర్నర్ అన్నారు. జాతీయ సమైక్యతను ప్రోత్సహించడానికి, సాంఘిక సమానత్వం, మత సామరస్యం, ప్రాంతీయ అభివృద్ధి సాధనకు సివిల్ సర్వీస్ అధికారులు బాధ్యత వహించాలని గవర్నర్ అన్నారు. అనంతరం సీనియర్ ఐఎఎస్ అధికారి, గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాను ప్రత్యేకంగా కలిసి విభిన్న అంశాలపై సలహాలు, సూచనలు తీసుకున్నారు. గవర్నర్ను కలిసిన వారిలో అనుపమ అంజలి, ప్రతిష్ట మమగైన్, హిమాన్హు కౌశిక్, కల్పనా కుమారి, సూరజ్ డిజి, వైదిఖేర్, నుపర్ ఎకె శివాస్, మౌర్య నారపురెడ్డి, ఇమ్మడి పృధ్వీ తేజ్, ఖేతన్ ఘర్గ్, భార్గవ్ టి అమిలినేని, జాహ్నవి తదితరులు ఉన్నారు. -
ముస్లిం సోదరులకు ఏపీ గవర్నర్ శుభాకాంక్షలు
సాక్షి, రాజ్భవన్: క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికనే రంజాన్ పర్వదినం అని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఆయన ఆదివారం రాజ్భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసం ‘ఈద్ ఉల్ ఫితర్’ ముగిసిన శుభవేళ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర ఖురాన్ బోధనలు యుగ యుగాలుగా మానవాళిని ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు. రంజాన్ మాస పవిత్రతతో ప్రతి వ్యక్తి మానసిక పరివర్తన చెంది ప్రేమమూర్తిగా మారుతాడని ఆయన అన్నారు. రంజాన్ మాసంలో ఆధ్యాత్మిక ఆరాధనతో అనుబంధం మరింత బలపడుతుందని గవర్నర్ చెప్పారు. క్రమశిక్షణను అనుసరిస్తూ శాంతి, సౌభ్రాతృత్వాన్ని లోకానికి చాటడంలో రంజాన్ మాసం ప్రత్యేకంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. కఠోర ఉపవాసవ్రతం సహనాన్ని పెంచుతుందని గవర్నర్ తెలిపారు. సర్వమానవాళి సమానత్వాన్ని చాటుతూ, దాతృత్వాన్ని అలవరచే పండుగ రంజాన్ అని ఆయన చెప్పారు. రంజాన్ పండుగ వేళ ఇస్లాంను గౌరవించే ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షిసస్తునన్నానని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు. -
మా ఫ్యామిలీలో ఆరుగురికి కరోనా: కర్నూలు ఎంపీ
కర్నూలు (రాజ్విహార్): తన కుటుంబ సభ్యుల్లో ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చిందని కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. కర్నూలు నర్సింగరావుపేటలో ఉన్న తన సోదరుల కుటుంబ సభ్యులకు కరోనా సోకిందని, వీరంతా రాష్ట్ర కోవిడ్ హాస్పిటల్ (కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి)లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. కాగా ఎంపీ తండ్రి, సోదరుడితో పాటు మరో నలుగురికి కరోనా సోకగా వీరంతా, క్షేమంగానే ఉన్నట్లు ఆయన వెల్లడించారు. కోవిడ్ ఆస్పత్రిలో ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించిందన్నారు. (బయట తిరిగితే క్వారంటైన్కే ! ) కర్నూలులో కరోనా కేసులు ఎక్కువైపోతున్నాయని మీడియాలో వస్తున్న వార్తల వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారని, అయితే దీని గురించి భయపడాల్సిన పనిలేదని ఆయన అన్నారు. అమెరికా, స్పెయిన్లో కరోనా మరణాలు ఎక్కువగా ఉండటాన్ని చూసి ఇక్కడి వారెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. భారత్లో బీసీజీ వ్యాక్సిన్ వాడుతుండటం వల్ల ఇక్కడి ప్రజలకు రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుందని, అమెరికా లాంటి పరిస్థితి ఇక్కడ రాదని వివరించారు. లాక్ డౌన్ ఆంక్షలను రెడ్ జోన్లలో పొడిగించి.. గ్రీన్ జోన్లలో విడతల వారీగా ఎత్తివేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు రాజ్భవన్కు చెందిన నలుగురు సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. చీఫ్ సెక్యూరిటీ అధికారితో పాటు నర్సింగ్ సిబ్బందికి కరోనా సోకింది. (కేసులు అధికంగా నమోదైనా ఆందోళన చెందొద్దు) -
అప్రమత్తంగా ఉండండి.. ఆందోళన వద్దు
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ సోదర సోదరీమణులారా చేతులు బాగా కడుక్కోండి, దూరాన్ని పాటించండి. ఇంట్లోనే ఉండండి. ‘కోవిడ్’లక్షణాలు ఉన్నట్లు అనుమానాలు వస్తే డాక్టర్ను సంప్రదించండి. అప్రమత్తంగా ఉండండి. కానీ ఆందోళన పడకండి. ప్రభుత్వం మీతో ఉంది’అని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రజలకు భరోసా ఇచ్చారు. కోవిడ్ –19 ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె పిలుపునిచ్చారు. ప్రజలను రక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయని, ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును ప్రజలు పాటించాలని గవర్నర్ కోరారు. కేవలం భారతదేశమే కాకుండా ప్రపంచం కూడా ఈ భయంకర పరిస్థితిని ఎదుర్కుంటోందన్నారు. గతంలో మన పెద్దలు యుద్ధాలను చూశారని, ప్రస్తుత తరం వైరస్ రూపంలో ‘బయో వార్’ను ఎదుర్కొంటున్నదని గవర్నర్ వ్యాఖ్యానించారు. ప్రజలు భయాందోళనకు గురి కాకుండా అప్రమత్తంగా, నైతిక స్థైర్యాన్ని కలిగి ఉండాలని గవర్నర్ తమిళి సై సూచించారు. ‘కోవిడ్’పై పోరులో వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది, అధికారులు, ప్రజా రవాణా సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది చూపుతున్న చిత్తశుద్ధిని గవర్నర్ ప్రశంసించారు. ‘కోవిడ్’కు నివారణే చికిత్స అని, ఇళ్లలోనే ఉండి ఇంటి వద్ద నుంచే పనులు చేయాలని, విదేశాల నుంచి వచ్చే వారు 14 రోజుల సెల్ఫ్ క్వారంటైన్ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 22న రాజ్భవన్లో థ్యాంక్స్ గివింగ్ ప్రధాని మోదీ పిలుపుమేరకు ఈ నెల 22న ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు. ‘కోవిడ్’ను అరికట్టేందుకు పోరాడుతున్న వారికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ నెల 22న సాయంత్రం 5 గంటలకు రాజ్భవన్లో కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తమిళిసై వెల్లడించారు. రాజ్భవన్లో పనిచేసే ఉద్యోగులకు రోజూ థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి, ఉష్ణోగ్రతలు నమోదు చేస్తున్నామని, చేతులు శుభ్రం చేసుకోవడంపై తమ సిబ్బందికి అవగాహన కల్పించినట్లు గవర్నర్ వెల్లడించారు. 65ఏళ్లు పైబడిన వారిని బయటకు పంపకుండా చూసుకోవాలని, మురికివాడల్లో ఉండే వారు కూడా సబ్బుతో చేతులు కడుక్కునేలా అవగాహన కల్పించాలని గవర్నర్ సూచించారు. మీడియా సమావేశానికి వచ్చిన గవర్నర్కు రాజ్భవన్ వైద్య బృందం థర్మల్ స్క్రీనింగ్ చేశారు. -
'ఈ పండుగ ప్రజలందరికి సంతోషాన్నివ్వాలి'
సాక్షి, హైదరాబాద్ : సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజ్భవన్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతలు పాలు పొంగించి సంబరాల్లో పాల్గొన్నారు. తమిళి సై మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ అందరికి మరింత సంతోషాన్ని ఇవ్వాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో మరింత ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని, అందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తమిళనాడు, హైదరాబాద్ల మధ్య టూరిజం అభివృద్ధికి కృషి చేయనున్నట్లు వెల్లడించారు. రెండు రాష్ట్రాల్లో పురాతన ప్రకృతి సంపద బాగుందని, ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల సహకారంతో దీనిని మరింత ముందుకు తీసుకువెళతామని పేర్కొన్నారు. రాజభవన్లో ఇకనుంచి నెలకు ఒకసారి ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుంటామని తమిళిసై స్పష్టం చేశారు. -
సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణను సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. ఆవిర్భవించిన ఆరేళ్లలోనే ఎన్నో రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం, అక్షరాస్యత విషయంలో వెనుకబడి ఉండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో 100 శాతం అక్షరాస్యతను సాధించాలని కొత్త సంవత్సరం సందర్భంగా ప్రతినబూనామన్నారు. ప్రతి ఒక్క నిరక్షరాస్యుడికీ విద్య అందిస్తామన్నారు. బుధవారం ఆయన రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డితో కలిసి రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సాయంత్రం 4.30 గంటల నుంచి రాత్రి 8.00 గంటల వరకు జరిగిన ఈ సుదీర్ఘ భేటీలో సంపూర్ణ అక్షరాస్యత దిశగా అమలు చేయబోతున్న కార్యక్రమాలు, పల్లె ప్రగతి కార్యక్రమం లక్ష్యాలు, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రాష్ట్రానికి కలగనున్న ప్రయోజనాలతో పాటు వర్తమాన రాజకీయ అంశాలపై చర్చించినట్లు సమాచారం. జనవరి 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమం ప్రారంభమవుతోందని, ఇందులో భాగంగా గ్రామీణ నిరక్షరాస్యుల సమాచారాన్ని సేకరించి జాబితాల రూపకల్పన చేస్తున్నామన్నారు. ‘ఈచ్ వన్–టీచ్ వన్’నినాదంతో ప్రతీ విద్యావంతుడు ఓ నిరక్షరాస్యుడికి చదువు చెప్పాలని పిలుపునిచ్చామన్నారు. వచ్చే మూడు నెలల్లోగా సాధ్యమైనంత అధిక మంది నిరక్షరాస్యులు కనీసం రాయడం, చదవగలిగేలా అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తామని గవర్నర్కు వివరించినట్టు తెలిసింది. పరిశుభ్రమైన, ఆరోగ్యమైన పల్లెల కోసం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని సీఎం తెలిపారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నీళ్లతో మధ్యమానేరు జలాశయంలో జల కళ నెలకొందని, ఇక్కడి నుంచి 80–90 శాతం రాష్ట్రానికి తాగునీరు సరఫరా కానుందని తెలియజేశారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర, రాష్ట్రానికి ఉన్న ప్రత్యేకతలను ఈ సందర్భంగా సీఎం గవర్నర్కు సుదీర్ఘంగా వివరించినట్టు తెలిసింది. నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకున్నారని, అందుకే జల ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచి్చందని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అమలు చేసిన కార్యక్రమాలు, పథకాలు, సాధించిన ఫలితాలను గవర్నర్కు వివరించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ తాను బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తి చేసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 100 రోజుల పాలనపై తాను కేంద్రానికి పంపించిన నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, సాగునీరు, విద్యారంగాలకు ఇస్తున్న ప్రాధాన్యతలను వివరించినట్టు సీఎంకు గవర్నర్ తెలియజేసినట్టు తెలిసింది. రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో సేవా కార్యక్రమాలను సైతం గవర్నర్ ప్రస్తావించారు. -
గవర్నర్తో సీఎం జగన్ దంపతులు భేటీ
సాక్షి, విజయవాడ: రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజ్భవన్లో సోమవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాజ్భవన్కు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులకు గవర్నర్ కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా, సంయుక్త కార్యదర్శి అర్జునరావు తదితరులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్తో భేటీ అయిన సీఎం వైఎస్ జగన్ తమ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల పథకాల గురించి వివరించారు. త్వరలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్టు గవర్నర్కు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు, ఇతర అంశాలపై కొద్దిసేపు చర్చించారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతుల గౌరవార్థం గవర్నర్ దంపతులు రాజ్భవన్లో ప్రత్యేకంగా విందు ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శాలువాతో సత్కరించి మెమెంటో అందజేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా గవర్నర్ను సత్కరించి మెమెంటో అందజేశారు సీఎం జగన్ వెంట ముఖ్యమంత్రి కార్యక్రమాల కమిటీ ఛైర్మన్ తలశిల రఘురాం, సీఎం కార్యదర్శి ధనుంజయ రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు. -
ఉద్యోగాల పేరుతో మోసం
సాక్షి, విజయవాడ: రాజ్భవన్లో శాశ్వత ఉద్యోగాల వసూళ్ల కేసులో ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాజ్భవన్ మేనేజర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయగా ఇద్దరు నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. కాగా ఈ కేసులో నిందితులైన ఇద్దరు వ్యక్తులు సుమతి ఏజెన్సీకి చెందిన సూపర్వైజర్లుగా పోలీసులు గుర్తించారు. అలాగే వీరితో పాటు బయటి వ్యక్తుల పాత్ర ఎమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. -
సుమతి ఏజెన్సీ సర్వీసెస్పై గవర్నర్ ఆగ్రహం
సాక్షి, విజయవాడ: రాజ్భవన్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో అవకతవకలపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్భవన్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామంటూ సుమతి ఏజెన్సీ సర్వీసెస్ లక్షల్లో డబ్బులు డిమాండ్ చేశారు. 20 మంది దగ్గర డబ్బులు వసూలు చేసిన సుమతి ఏజెన్సీ సంస్థ మేనేజర్ మునిశంకర్పై బాధితులు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ ఈ ఉద్యోగాల అవకతవకలపై కార్యదర్శితో కమిటీ వేశారు. ఉద్యోగాల పేరిట వసూళ్లు నిజమేనని కమిటి నివేదిక ఇవ్వడంతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని విజయవాడ పోలీసు కమిషనర్ను గవర్నర్ ఆదేశించారు. అక్రమదందాకు తెరలేపిన సుమతి సంస్థ మేనేజర్ మునిశంకర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. -
రాజ్భవన్లో ఘనంగా దీపావళి వేడుకలు
-
'ఆర్టీసీ సమస్య ప్రభుత్వమే చూసుకుంటుంది'
సాక్షి, హైదరాబాద్ : రాజ్భవన్లో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. తమిళిసై మాట్లాడుతూ.. దీపావళి పండుగను ప్రజలందరూ ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.తెలంగాణ ప్రజలందరూ నన్ను అక్కలాగా భావిస్తున్నారని పేర్కొన్నారు. రాజభవన్లో ప్లాస్టిక్ను నిషేదించడంతో పాటు ఎప్పుడు పచ్చదనం ఉండేలా నిర్ణయించామని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ రహిత వస్తువులను రాజ్భవన్లో నిషేదించినట్లు వెల్లడించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో గిరిజన ఆశ్రమ పాఠశాలలను ఏర్పాటు చేయడం హర్షించతగ్గ విషయం. టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ రాములు తదితరులు గవర్నర్ దంపతులను కలిసి వారికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సమస్యలకు సంబంధించి గవర్నర్కు వినతిపత్రం సమర్పించారు. ఆర్టీసీ సమస్యను ప్రభుత్వమే చూసుకుంటుందని తమిళిసై తెలిపారు. -
రాజ్భవన్లో ప్రజాదర్బార్ కార్యక్రమం
-
అది నా వ్యక్తిగత జీవితంలో భాగం..
‘రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వేర్వేరు ప్రభుత్వాలు ఏర్పడగా ఇరువురు సీఎంల నడుమ పలు సందర్భాల్లో విభేదాలు తలెత్తాయి. సాధ్యమైనంత మేర చర్చల ద్వారా వాటిని సామరస్యంగా పరిష్కరించా. భేద, దండోపాయాలతో సంబంధం లేకుండా సామ, దానాలతోనే సమస్యలు పరిష్కరించా’ అని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తెలిపారు. అంతరాత్మ ప్రబోధం మేరకు నడుచుకోవడంతోపాటు వ్యక్తిగత ఎజెండా లేకపోవడంతో సరైన మార్గంలో వెళ్లానన్నారు. తాను ఏ గ్రూపునకూ మద్దతివ్వలేదని, రాజ్యాంగ నిబంధనలకు లోబడే పనిచేశానని చెప్పారు. కేసీఆర్, జగన్కు అనుకూలంగా పనిచేశాననే ఆరోపణలు సరికాదన్నారు. ఏ పనిలోనైనా విమర్శలు సహజమన్నారు. తొమ్మిదిన్నరేళ్లకుపైగా ఉమ్మడి ఏపీ, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల గవర్నర్గా పనిచేసిన నరసింహన్.. మంగళవారం రాజ్భవన్ దర్బార్ హాల్లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. గవర్నర్గా తనకు ఎదురైన అనుభవాలు, అనుభూతులను తనదైన చమత్కారపూరిత వ్యాఖ్యలతో పంచుకున్నారు. అలాగే తన శేషజీవితాన్ని ఎలా గడుపుతానో వివరించారు. గవర్నర్ల నియామకంలో పారదర్శకత, కేంద్రంలో సలహాదారు పదవి వంటి ప్రశ్నలపై ‘ఔటాఫ్ సిలబస్’అంటూ సమాధానం దాటవేశారు. నరసింహన్ పాలనానుభవాలు ఆయన మాటల్లోనే... – సాక్షి, హైదరాబాద్ కర్ఫ్యూ వాతావరణంలో బాధ్యతలు... ఉమ్మడి ఏపీ గవర్నర్గా బాధ్యతలు చేపట్టినప్పుడు కర్ఫ్యూ వాతావరణంలో హైదరాబాద్లో అడుగు పెట్టా. శాంతిభద్రతల సమస్యతోపాటు కొందరు ఎమ్మెల్యేల రాజీనామాతో పాలన కూడా అస్తవ్యస్తంగా ఉండేది. రాష్ట్రపతి పాలన విధించేందుకే నన్ను గవర్నర్గా పంపారనే వార్తలు వచ్చాయి. కానీ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పడంతోపాటు ఉద్యమంలో ఒక్క బుల్లెట్ కూడా కాల్చవద్దని చెప్పా. అలా జరిగితే ఉద్యమం పోలీసులకు వ్యతిరేకంగా మలుపు తిరుగుతుందని హెచ్చరించా. రాష్ట్ర విభజన జరిగితే ఇళ్లు, ఆస్తులు వదిలి వెళ్లాల్సి వస్తుందనే అపోహలు కొందరిలో ఉండేవి. కానీ రాజకీయ పార్టీలు, పోలీసులు, అధికారుల సహకారంతో అన్నింటినీ సమర్థంగా ఎదుర్కొన్నాం. రాష్ట్ర విభజన సమయంలో 3 నెలలపాటు రాష్ట్రపతి పాలనలోనూ కొన్ని సమస్యలు ఎదురైనా అందరి సహకారంతో ఎదుర్కొన్నా. ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ నేపథ్యంలో మొత్తం పరీక్షను రద్దు చేయడంపై అభ్యంతరాలు వచ్చినా లెక్కపెట్టలేదు. పుస్తకాలు రాయను.. రాజకీయాల్లో చేరను చెన్నైలోని వివిధ రెస్టారెంట్లలో దోసె, సాంబారు జుర్రుకుంటూ గడిపేస్తా. గవర్నర్గా పనిచేసిన కాలంలో చోటుచేసుకున్న ఘటనలపై పుస్తకం రాసే ఆలోచన లేదు. నేను రాజకీయాల్లో చేరను. జమ్మూకశ్మీర్ గవర్నర్గా పనిచేయడంపై నాకు ఏ ఆహ్వానమూ అందలేదు. సోనియా, మోదీ సహా ఒక్కోక్కరికీ ఒక్కో రకమైన పాలనా శైలి ఉంటుంది. నేను జీవితంలో ఏదీ జరగాలని కోరుకోను. ఛత్తీస్గఢ్, ఉమ్మడి ఏపీ, తెలంగాణ, ఏపీ గవర్నర్గా సుదీర్ఘకాలం పనిచేస్తానని ఊహించలేదు. వ్యక్తిగతంగా గత తొమ్మిదిన్నరేళ్లలో ఎన్నో విషయాలు నేర్చుకున్నా. కొన్నిసార్లు నరుడిగా, మరికొన్ని సార్లు సింహంగా, ఇంకొన్నిసార్లు నరసింహన్గా రూపాలు ధరించాల్సి వచ్చింది. గవర్నర్గా రాక మునుపు సాదాసీదా ఉండేవాడిని. శేషజీవితాన్ని నాకు ఇష్టమున్న రీతిలో గడుపుతా. పోలీసు అధికారిగా అత్యున్నత పదవిలో ఉన్నప్పుడు కుటుంబానికి సమయం ఇచ్చేవాడిని. మీరూ కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు మన రాష్ట్రం అనే భావనతో ఉండాలి. తెలంగాణ రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉంది. సర్వాధికారిని కాదు... తెలంగాణ ఉద్యమ సమయంలో శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చే సందర్భంలో డిసెంబర్ 31వ తేదీ తర్వాత ఏం జరుగుతుందని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా జనవరి 1వ తేదీ వస్తుందని బదులిచ్చా. దీంతో గవర్నర్ నరసింహన్ తెలంగాణ వ్యతిరేకి అంటూ విమర్శించారు. ఏదో సినిమాలో కూడా ఈ డైలాగ్ను పెట్టినట్లు గుర్తు. ‘సర్వాధికారి’ అంటూ ఓసారి నా శరీరానికి మహేశ్బాబు తలను కలిపి ఫొటో వేస్తే పరువునష్టం దావా వేస్తానని చెప్పా. నేను యూనిఫారం వేసుకున్నా. నేను అధికారినే తప్ప సర్వాధికారిని కాదు. అన్ని గుళ్లకూ వెళ్లలేదు... దేవుడి దయ, పెద్దల ఆశీస్సులు, ప్రజల ఆదరణతోనే గవర్నర్గా ఆటంకాలను అధిగమించా. ఏపీ, తెలంగాణ ప్రజల ఆదరాభిమా నాలు, మధుర జ్ఞాపకాలతో వెళ్తున్నా. ప్రతి అంశంపైనా నిర్మాణాత్మక విమర్శ అవసరమే. నేను గుళ్లకు వెళ్లడంపై మీడియాలో వచ్చే విమర్శలు సహా అన్ని రకాల వార్తలు చదువుతా. నేను గుడికి పోయి పాపాలు చేసి ఉండొచ్చు. నేను అన్ని గుడులకూ వెళ్లలేదు. కేవలం ఖైరతాబాద్ హనుమాన్, భద్రాచలం, యాదగిరిగుట్ట, తిరుమల దేవాలయాలనే సందర్శించా. దేవాలయాల సందర్శనపై వచ్చిన విమర్శలు కొన్నిసార్లు బాధించాయి. కొందరు పేకాట ఆడతారు. కొందరు మద్యం సేవిస్తారు. గుడులకు వెళ్లడం నా వ్యక్తిగత జీవితంలో భాగం. ఎమ్మెల్యేలు దాడి చేస్తారని ఊహించా.. ఉద్యమ సమయంలో ఏపీ ఉభయసభలను ఉద్దేశించి ప్రసం గించే సమయంలో శాసనసభ్యులు దాడి చేస్తారని ముందే ఊహించా. మైక్ లాక్కున్నా ప్రసంగం కొనసాగించేందుకు కార్డ్లెస్ మైక్ ధరించా. రక్తం కారినా ప్రసంగం ఆపొద్దని నిర్ణయించుకున్నా. ప్రసంగప్రతులు చింపేస్తారని కొన్ని అదనపు ప్రతులు వెంట తీసుకెళ్లా. సభ్యులు దూకడం, ఎగరడం వంటి వాటిని గమనిస్తూనే ప్రసంగాన్ని పూర్తి చేశా. అప్పుడు నవ్వడం మినహా ఏం చేయగలను? అదేరోజు సాయంత్రం నాగం జనార్దన్రెడ్డి ఓ వివాహ విందులో కలసి మీ ఆశీర్వాదాలు కావాలని అడిగారు. హోలీ సందర్భంగా ఓ నేత రాజ్భవన్లో రంగులు పూసి బయటకు వెళ్లాక గవర్నర్ గో బ్యాక్ అని నినాదాలు చేస్తానని ముందే చెప్పారు. రాజకీయ, వ్యక్తిగత, అధికారిక సంబంధాలను వేర్వేరుగా చూడటం వల్లే ఇన్నేళ్లపాటు పనిచేయగలిగా. నాతో పనిచేసిన సీఎంలంతా మంచివారే. -
రాజ్భవన్లో ‘ఎట్హోం’ కార్యక్రమం
-
తేనీటి విందులో పాల్గొన్న సీఎం జగన్
సాక్షి, విజయవాడ: రాజ్భవన్లో గురువారం జరిగిన ఎట్ హోం కార్యక్రమంలో సందడి నెలకొంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఇవాళ మధ్యాహ్నం రాజ్భవన్లో తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తొలిసారి ఏపీలో ఎట్ హోం కార్యక్రమం జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సామినేని ఉదయభాను, వసంతకృష్ణ ప్రసాద్, జోగి రమేష్, టీడీపీ నేతల కళా వెంకట్రావు, కనకమేడల రవీంద్ర, అశోక్ బాబు, బీజేపీ నేతల కన్నా లక్ష్మీనారాయణ, దిలీప్, అడపా నాగేంద్ర, చాగర్లమూడి గాయత్రి, సీపీఐ నేతలు రామకృష్ణ, జల్లి విల్సన్, పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు, నగర ప్రముఖులు హాజరయ్యారు. -
గవర్నర్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్రోద్యమాన్ని స్మరించుకోవడంతో పాటు దేశ అభ్యు న్నతికి పునరంకితం కావాల్సిన రోజన్నారు. ఎన్నో తరాల దేశ భక్తుల నిస్వార్థ పోరాటాలు, త్యాగాల ఫలితంగానే మనకు స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. దేశభక్తులందరినీ స్మరించుకునే సమయమని గవర్నర్ అన్నారు. నేడు రాజ్భవన్లో రక్షాబంధన్ వేడుకలు రాజ్భవన్లోని దర్బార్ హాలులో గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రక్షాబంధన్ వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గొననున్నారు. -
రాజ్భవన్లో గవర్నర్ హరిచందన్ పుట్టిన రోజు వేడుకలు
-
గవర్నర్గా విశ్వభూషణ్ ప్రమాణ స్వీకారం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్గా విశ్వభూషణ్ హరిచందన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయనతో రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. బుధవారం ఉదయం 11.29 గంటలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలసి విశ్వభూషణ్ కార్యక్రమ వేదికపైకి వచ్చారు. నూతన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్తో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం.. రాష్ట్ర గవర్నర్గా విశ్వభూషణ్ హరిచందన్ను నియమిస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ నెల 16న జారీ చేసిన ఉత్తర్వును చదివి వినిపించి, ప్రమాణస్వీకారం చేయాల్సిందిగా ఆయన్ను ఆహ్వానించారు. సరిగ్గా 11.30 గంటలకు జస్టిస్ ప్రవీణ్కుమార్.. హరిచందన్తో పదవీ ప్రమాణం చేయించారు. గవర్నర్ దేవుని సాక్షిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ సతీమణి సుప్రభ హరిచందన్ కూడా పాల్గొన్నారు. ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్గా ఈఎస్ఎల్ నరసింహన్ బాధ్యతలు నిర్వహించడం తెలిసిందే. ఇప్పుడు హరిచందన్ పదవీ ప్రమాణంతో రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్కు పూర్తి స్థాయి గవర్నర్ బాధ్యతలు చేపట్టినట్టయింది. నూతన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరుల గ్రూప్ ఫొటో కన్నుల పండువగా సాగిన కార్యక్రమం.. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నియమితులైన తొలి గవర్నర్ కావడంతో విశ్వభూషణ్ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం రాజ్భవన్లో కన్నుల పండువగా సాగింది. ప్రాంగణమంతటినీ రంగురంగుల పూలతో అలంకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసనమండలి చైర్మన్ ఎం.ఏ.షరీఫ్ గవర్నర్కు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి, ప్రతిపక్ష నేత ఎన్.చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రులు కళత్తూరు నారాయణస్వామి, పిల్లి సుభాష్చంద్రబోస్, ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, అంజాద్ బాష, పాముల పుష్పశ్రీవాణి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, మేకతోటి సుచరిత, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, పేర్ని నాని, అనిల్కుమార్ యాదవ్, మోపిదేవి వెంకటరమణ, ఆదిమూలపు సురేష్, చెరుకువాడ రంగనాథరాజు, తానేటి వనిత, వెలంపల్లి శ్రీనివాస్, మేకపాటి గౌతమ్రెడ్డి, ధర్మాన కృష్ణదాస్, అవంతి శ్రీనివాస్, బాలినేని శ్రీనివాసరెడ్డి, పినిపె విశ్వరూప్, ఎం.శంకరనారాయణ్, శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, గవర్నర్ కార్యదర్శి ఎం.కె.మీనా, డీజీపీ గౌతమ్ సవాంగ్, జీఏడీ ప్రిన్సిపల్ కార్యదర్శి ఆర్పీ సిసోడియా, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శామ్యూల్తో సహా పలువురు సీనియర్ అధికారులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తరువాత జరిగిన తేనీటి విందులో గవర్నర్తో సహా ఆహూతులందరూ పాల్గొన్నారు. అంతకుముందు రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులందరితో కలిసి రాజ్భవన్ ప్రాంగణంలో గ్రూప్ ఫొటో దిగారు. రాజకీయ దిగ్గజం.. విశ్వభూషణ్ హరిచందన్ ఒడిశాకు చెందిన ప్రముఖ రాజకీయవేత్త. ఒకప్పటి బన్పూర్ రాజవంశానికి చెందినవారు. ఆయన పూర్వీకులు కుర్దా జిల్లాలోని భటపడా గఢ్కు పాలకులుగా ఉన్నారు. హరిచందన్ 1934, ఆగస్టు 3న పరశురామ్ దంపతులకు జన్మించారు. విద్యార్థి దశ నుంచే చురుగ్గా వ్యవహరించేవారు. కళాశాల రోజుల్లో క్రీడాకారుడిగా, మంచి వక్తగా పేరు గడించడమేగాక విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పోరాడారు. పూరీ కళాశాల నుంచి ఎకనామిక్స్(ఆనర్స్) పట్టాను, కటక్ ఎమ్మెస్ లా కళాశాల నుంచి ఎల్ఎల్బీ డిగ్రీని పొందారు. ఒడిశా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 1971లో భారతీయ జనసంఘ్లో చేరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ 1977లో జాతీయ కౌన్సిల్ సభ్యులయ్యారు. 1980లో బీజేపీకి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిగాను, జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగాను పనిచేశారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం, స్వేచ్ఛకోసం రాజీలేని పోరాటాలు చేశారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి 1975లో జైలుకెళ్లారు. ఒడిశా హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. జయప్రకాష్ నారాయణ్ సంపూర్ణ విప్లవంలో యువనేతగా కీలక పాత్ర పోషించారు. ఉత్తేజపూరిత ప్రసంగాలు చేయడంలో దిట్ట అయిన హరిచందన్ 1977లో ఇందిరాగాంధీ పాలనకు వ్యతిరేకంగా రాష్ట్రమంతటా తిరిగి ప్రచారం చేశారు. 1977లో ఛిల్కా నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఒడిశా ప్రభుత్వంలో న్యాయ, ఆహార, పౌరసరఫరాలు, కార్మిక, ఉపాధి, గృహ నిర్మాణ, సాంస్కృతిక శాఖల మంత్రిగా వ్యవహరించారు. 1990లో బిజూ పట్నాయక్ మంత్రివర్గంలో ఆహార, పౌరసరఫరాల మంత్రిగా ఉన్నారు. 1996లో భువనేశ్వర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలుపొంది బీజేపీ శాసనసభాపక్ష నేతగా పనిచేశారు. మళ్లీ 2000 సంవత్సరంలో 97,536 ఓట్ల భారీ ఆధిక్యతతో అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. బీజేపీ–బీజేడీ ప్రభుత్వంలో రెవెన్యూ, న్యాయ శాఖల మంత్రిగా పనిచేశారు. 2004లోనూ తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒడిశా రాష్ట్రం కోసం, ఒడిశా ప్రజల కోసం రాజీలేని పోరాటాలు చేసిన హరిచందన్ రాష్ట్రంలో ప్రముఖ కాలమిస్ట్గానూ పేరుపొందారు. అనేక అంశాలపై వివిధ పత్రికల్లో వ్యాసాలు రాశారు. -
ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం.. ఇక రాజభవన్
సాక్షి, అమరావతి : విజయవాడలోని సూర్యారావుపేట పీడబ్ల్యూడి గ్రౌండ్ దగ్గర ఉన్న ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం..ఇక రాజభవన్గా వెలుగొందనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం గతంలో మాజీ సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయంగా ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్గా నర్సింహన్ వ్యవహరించారు. రాష్ట్రం విడిపోయి ఐదేళ్లు దాటినప్పటికీ గత చంద్రబాబు సర్కారు గవర్నర్ కోసం రాజభవన్ను కూడా నిర్మించకపోవడంతో..గవర్నర్ విజయవాడకు వచ్చినప్పుడల్లా ప్రైవేట్ హోటల్లో బస చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు రాష్ట్రానికి కొత్త గవర్నర్గా విశ్వభూషణ్ హరిచందన్ నియామకం జరగడంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయాన్ని రాజభవన్గా ప్రకటించడమే కాకుండా అందుకనుగుణంగా ఆ కార్యాలయాన్ని అధికారులు తీర్చిదిద్దుతున్నారు. -
రాజ్భవన్లో సీజేగా ప్రమాణస్వీకారం చేసిన చౌహాన్
-
రాజ్భవన్లో ఘనంగా ఉగాది వేడుకలు
-
వార్షిక క్రీడా పోటీలను ప్రారంభించిన గవర్నర్ దంపతులు
సాక్షి, హైదరాబాద్: రాజ్భవన్ ఉద్యోగులకు నిర్వహించే వార్షిక క్రీడాపోటీలను గవర్నర్ దంపతులు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ షటిల్ ఆడారు. ఆయన సతీమణి విమలా నరసింహన్ మహిళాఉద్యోగులతో కలసి క్యారమ్స్ ఆడారు. విజిలెన్స్ అవేర్నెస్ వీక్– 2018లో భాగంగా ముఖ్య కార్యదర్శి హర్ప్రీత్ సింగ్ రాజ్భవన్ ఉన్నతా«ధికారులు, ఉద్యోగులతో కలసి ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో గవర్నర్ సలహాదారు ఏపీవీఎన్ శర్మ, ఏకే మహంతి పాల్గొన్నారు. -
అసెంబ్లీ రద్దుపై గవర్నర్ ఆమోదం.. ఈసీకి అందజేత
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ రద్దు తీర్మానానికి గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు రాజ్భవన్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ను ఈసీ, అసెంబ్లీ కార్యదర్శికి రాజ్భవన్ వర్గాలు పంపాయి. ఈ మేరకు గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రెస్నోట్ రిలీజ్ చేశారు. ఆ వివరాలు.. తెలంగాణ ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గ సహచరులు గవర్నర్ను ఈ రోజు(06-09-2018) కలిసి తెలంగాణ రాష్ట్ర తొలి అసెంబ్లీని రద్దు చేయాల్సిందిగా తీర్మానించిన ప్రతిని గవర్నర్కు సమర్పించారు. సీఎంతోపాటు ఆయన మంత్రివర్గం చేసిన సిఫారసును గవర్నర్ ఆమోదించారు. కేసీఆర్తోపాటు ఆయన మంత్రివర్గాన్ని ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగించాల్సిందిగా గవర్నర్ కోరారు. గవర్నర్ వినతికి కేసీఆర్ అంగీకరించారు అని రాజ్భవన్ తన ప్రకటనలో వెల్లడించింది. -
బాలిక చదువు కుటుంబానికి వెలుగు
-
రాజ్భవన్ స్కూల్ వద్ద గందరగోళం
సాక్షి, హైదరాబాద్: వేసవి సెలవుల అనంతరం శుక్రవారం తెలంగాణలో పాఠశాలలు పున:ప్రారంభం అయ్యాయి. ఎండల తీవ్రత తగ్గనప్పటికీ.. రాష్ట్ర అవతరణ దినోత్సవం నేపథ్యంలో వేసవి సెలవులు ముందుకు జరిగాయి. వార్షిక విద్యా ప్రణాళికలను ఖరారు చేసిన ప్రభుత్వం.. సర్కారు బడుల్లో బడిబాటకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలోనే జూన్ 1 నుంచే పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో రాజ్భవన్ ప్రభుత్వం పాఠశాల ఈరోజు ప్రారంభమైంది. దీంతో అడ్మిషన్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ వద్ద బారులు తీరారు. అయితే ఇప్పటికే అడ్మిషన్లు పూర్తి అయ్యాయని స్కూల్ యాజమాన్యం వెల్లడించింది. పాఠశాల ప్రారంభమైన మొదటి రోజునే.. అడ్మిషన్లు ఎలా పూర్తి అవుతాయంటూ తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. తల్లిదండ్రులకు సర్దిచెప్పేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోంది. -
రాజ్భవన్ ముట్టడి యత్నం విఫలం
సాక్షి, బెంగళూరు: గవర్నర్ వజూభాయ్ వాలా సంఖ్యాబలం లేని బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు శుక్రవారం రాజ్భవన్ ముట్టడించేందుకు ప్రయత్నించారు. క్వీన్స్క్రాస్ రోడ్డులోని కేపీసీసీ ప్రధాన కార్యాలయం నుంచి రాజ్భవన్ వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు. రాజ్భవన్లోనికి చొచ్చుకెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్టు చేసి సమీపంలోని కబ్బన్పార్కుకు తరలించారు. దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నాయి. గవర్నర్, పోలీసుల తీరును నిరసిస్తూ పలువురు కాంగ్రెస్ నేతలు రాజ్భవన్ సమీపంలోని ఇండియన్ ఎక్స్ప్రెస్ చౌరస్తా వద్ద ధర్నాకు దిగారు. ‘ఛలో రాజ్భవన్’ కార్యక్రమంలో ఎంపీ మల్లికార్జున ఖర్గే, సీనియర్ నాయకుడు ఆజాద్, మాజీ సీఎం సిద్దరామయ్య, మాజీ హోంమంత్రి రామలింగారెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ పాల్గొన్నారు. బలపరీక్షలో నెగ్గేందుకు బీజేపీ తమ ఎమ్మెల్యేలకు గాలం వేస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఆధారాలతో ఆడియో క్లిప్పును విడుదల చేసింది. చిత్రదుర్గ గ్రామీణ ఎమ్మెల్యే బసనగౌడ దడ్డల్కు మంత్రి పదవితో పాటు భారీగా డబ్బు ఆశచూపినట్లు అందులో ఉంది. -
రేపు మధ్యాహ్నం ప్రమాణం చేస్తా : యడ్యూరప్ప
సాక్షి, బెంగళూరు : కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి గురువారం మధ్యాహ్నం 12.20 నిమిషాలకు ప్రమాణం స్వీకారం చేయబోతున్నట్లు బీజేపీ శాసనసభా పక్ష నేత బీఎస్ యడ్యూరప్ప పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు హాజరుకాబోతున్నట్లు వెల్లడించారు. ప్రమాణస్వీకారం కోసం బీజేపీ ఇప్పటికే ఏర్పాట్లను సైతం పూర్తి చేసినట్లు తెలిసింది. శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన అనంతరం యడ్యూరప్ప ఎమ్మెల్యేలతో కలసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్కు లేఖను సమర్పించిన విషయం తెలిసిందే. మరో వైపు ఒక స్వతంత్ర అభ్యర్థి బీజేపీకి మద్దతు ప్రకటించారు. దీంతో బీజేపీ బలం అధికారికంగా 105కు చేరుకుంది. మరోవైపు మిగిలిన ఎమ్మెల్యేల మద్దతు కోసం బీజేపీ వ్యూహాలు పన్నుతోంది. ఈలోగా యడ్యూరప్ప తరచూ సంచలన ప్రకటనలు చేస్తూ కాంగ్రెస్-జేడీఎస్లలో గుబులు పుట్టిస్తున్నారు. -
రాష్ట్రపతికి గవర్నర్ విందు
-
తమిళనాడు రాజ్భవన్లో మాంసాహారం నిషేధం
-
తమిళనాడు రాజ్భవన్లో మాంసాహారం నిషేధం
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ తన అధికార నివాసమైన చెన్నైలోని రాజ్భవన్లో మాంసాహారాన్ని నిషేధించారు. కనీసం కోడిగుడ్డు సైతం రాజ్భవన్లోకి ప్రవేశించరాదని షరతు పెట్టారు. రాజ్భవన్ సిబ్బంది మాంసాహారం తినాలని భావిస్తే బయటకు వెళ్లి తిని రావాలని గవర్నర్ సూచించారు. రాజ్భవన్కు వచ్చే కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులకు శాఖాహార వంటలే వడ్డించాలని నిర్ణయించారు. గత నెల 6న తమిళనాడు గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన మహారాష్ట్రకు చెందిన పురోహిత్ కొత్త పంథాలో వెళ్తున్నారు. తనను కలవడానికి రాజ్భవన్కు వచ్చేవారు పూలమాలలు, పుష్పగుచ్ఛాలు, శాలువాలు తేవద్దని సూచించారు. తమిళులతో మరింతగా మమేకమయ్యేందుకు తమిళం నేర్చుకుంటున్నారు. తమిళ అధ్యాపకుడు ఒకరు రాజ్భవన్కు వచ్చి గవర్నర్కు తమిళం నేర్పిస్తున్నారు. రాజ్భవన్కు పరిమితం కాకుండా కోయంబత్తూరు వెళ్లి అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఇకపై అన్ని జిల్లాల్లో సమీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రభుత్వ పాలనలో గవర్నర్ జోక్యంపై ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేయడంపై స్పందిస్తూ.. ప్రజాశ్రేయస్సు కోసమే తన ప్రయత్నమన్నారు. -
రాజ్భవన్లో రాఖీ వేడుకలు
-
ఉప రాష్ట్రపతి పోటీలో లేను
సాక్షి, హైదరాబాద్: ఉప రాష్ట్రపతి పదవికి పోటీకి నిర్ణయం తీసుకోలేదు.. అదంతా మీడియా సృష్టి.. దేవుడు ఏదీ తలిస్తే అదే జరుగుతుందని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. రంజాన్ ఉపవాసాల సందర్భంగా రాజ్భవన్లో బుధవారం ఆయన ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా గవర్నర్ ముస్లిం సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షాలు తెలిపారు. ‘‘ఇదీ చాలా మంచి మాసం..మనుసులోని చెడు భావాలను దూరం చేసి, మలీనం లేకుండా పవిత్రంగా ఉంచే మాసం..ముస్లిలంతా ద్వేష భావాన్ని వీడాలి..చెడు గురించి ఆలోచించ వద్దు..ఉపవాసంతో మంచితనం అలవడుతుంది..సంస్కారం అలవడుతుంది..అందరితో కలిసి సమైక్యంగా జీవించండి’ అని గవర్నర్ కోరారు. ఎవరికీ కీడు చేయవద్దు..దేవుడిని ప్రార్థిస్తూ మంచితనంతో మసలుకోవాలి కోరారు. పరస్పర సోదర భావం పెంపొందించుకొని, మంచి నడవడికతో జీవించాలన్నారు. జీవితంలో పది మందికి మేలు చేయాలని, సత్ప్రవర్తన, మంచితనం అలవర్చుకోవాలన్నారు. ఈ విందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు , మాజీ ముఖ్యమంత్రులు నాదెళ్ల భాస్కరరావు, కె.రోశయ్య, ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కె.మధుసూదన చారి, మండలి చైర్మెన్ స్వామి గౌడ్, విపక్ష నేత కె.జానారెడ్డి, మండలి విపక్ష నేత మహమ్మద్ అలీ షబ్బీర్, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, ఎండీ మహమూద్ అలీ, మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కేటీఆర్, ఈటల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి, మహేందర్ రెడ్డి, చందూలాల్, నాయిని నరసింహా రెడ్డి, ఎంపీ కే కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, డీజీపీ అనురాగ్ శర్మ, నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి, ఈఆర్సీ చైర్మెన్ ఇస్మాయిల్ అలీఖాన్, ఎమ్మెల్యేలు చింతల రామంచంద్రారెడ్డి, వివేకానంద, సోమారపు సత్యనారాయణ, ఎమ్మెల్సీలు సయ్యద్ అమీనుల్ జాఫ్రీ, పల్లారాజేశ్వర్ రెడ్డి, కర్నె ప్రభాకర్, శ్రీనివాస్ రెడ్డి, ఫారూఖ్ హుస్సేన్, మహమ్మద్ సలీం హాజరయ్యారు. వైజాగ్లో ఉన్నందుకే చంద్రబాబు రాలేకపోయారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైజాగ్లో ఉండడం వల్ల ఇఫ్తార్ విందుకు రాలేకపోయారని, ఆయన ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిని పంపించారని గవర్నర్ నరసింహన్ తెలిపారు. ఇఫ్తార్ విందు ముగింపు సందర్భంగా ఆయన మీడియాతో చిట్చాట్గా మాట్లాడుతూ పలు ప్రశ్నలకు బదులిచ్చారు. గవర్నర్ ఎవరికీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. మంగళవారం టీడీపీ నేతలు వచ్చి తనను కలిశారని, గురువారం కాంగ్రెస్ నేతలు వచ్చి కలవనున్నారన్నారు. టీఎస్పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి ఇఫ్తార్ విందుకు ఎందుకు హాజరు కాలేదో గురువారం ఆయన కలవడానికి వచ్చిప్పుడు ప్రశ్నిస్తానని సరదాగా వ్యాఖ్యానించారు. అంతకు ముందు ముస్లింలు ఒక పొద్డు విడిచే సమయంలో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్లు ముస్లిం సోదరులకు ఖజ్జూర పండ్లు, పళ్లు తినిపించారు. రోశయ్యకు ప్రత్యేక పలకరింపు గవర్నర్ ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్య దగ్గరికి వెళ్లి ప్రత్యేకంగా పలకరించారు. రోశయ్య పక్కన కూర్చొని కొద్ది నిమిషాలు మాట్లాడారు. రోశయ్య ఆరోగ్యం గురించి కుశల ప్రశ్నలు వేశారు. -
రాజ్భవన్లో ఉత్సాహంగా హోలీ సంబరాలు
హైదరాబాద్: రాజ్భవన్లో ఆదివారం ఉదయం హోలీ సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. గవర్నర్ నరసింహన్ దంపతులు ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుని సంబరాలు ప్రారంభించారు. గవర్నర్ ఉత్సాహంగా మీడియా ప్రతినిధులతోపాటు అందరికీ రంగులు జల్లుతూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ ఆనందోత్సాహాలతో హోలీ జరుపుకోవాలని గవర్నర్ దంపతులు కోరారు. ప్రజలందరూ సహజసిద్ధమైన రంగులతోనే హోలీ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. -
శశికళా?....పన్నీరా?
-
రాజ్భవన్ గుప్పిట్లో రహస్యం తలైవీ?...తలైవా?
-
రాజ్భవన్ గుప్పిట్లో రహస్యం తలైవీ?... తలైవా?
. తమిళనాడు గవర్నర్ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ . విద్యాసాగర్రావును కలసిన పన్నీర్, శశికళ - శాసనసభలో బల నిరూపణకు అవకాశమివ్వాలని పన్నీర్ విన్నపం - ఎమ్మెల్యేల పరేడ్కు శశికళకు అవకాశం ఇవ్వని గవర్నర్ - ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన పత్రాలను సమర్పించిన చిన్నమ్మ - తాజా పరిణామాలతో కేంద్రానికి నివేదిక పంపిన గవర్నర్ - పన్నీర్కు బలపరీక్ష అవకాశం ఇస్తారా?.. శశికళతో ప్రమాణం చేయిస్తారా? - కేంద్రం ఏం సూచిస్తుంది? గవర్నర్ ఏం చేస్తారు? - తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? - రెండు మూడు రోజుల్లో గవర్నర్ నిర్ణయం అంటున్న విశ్లేషకులు చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న తమిళ రాజకీయాలు రాజ్భవన్కు చేరాయి. మూడురోజులుగా ఎత్తులు పైఎత్తులతో ముఖ్యమంత్రి పదవికోసం పోటీ పడుతున్న అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం గురువారం సాయంత్రం ఇన్చార్జ్ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్రావుతో విడివిడిగా భేటీ అయ్యారు. తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన పత్రాలను సమర్పించిన శశికళ సీఎంగా ప్రమాణ స్వీకారానికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. అంతకుముందే గవర్నర్ను కలిసిన పన్నీర్ సెల్వం తాను రాజీనామాను ఉపసంహరించుకుంటానని, మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని, శాసనసభలో బలపరీక్షకు తనకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వారిద్దరి వాదనలనూ సావధానంగా విన్న విద్యాసాగర్రావు నిర్ణయం ప్రకటించకుండా మరింత ఉత్కంఠకు తెరలేపారు. తాజా పరిణామాలు, తన అభిప్రాయాలతో ఆయన గురువారం రాత్రి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. గవర్నర్ ఏం నివేదిక పంపారు? కేంద్రం ఏ మార్గదర్శనం చేస్తుంది? గవర్నర్ నిర్ణయం ఏమిటి? తమిళనాడు కాబోయే ముఖ్యమంత్రి తలైవీ (నాయకురాలు)నా? తలైవా (నాయకుడు)నా?... అనే ప్రశ్నలకు సమాధానంకోసం ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు శిబిరంలోని ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు శశికళ వర్గం, ఆకర్షించేందుకు పన్నీర్వర్గం ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. పన్నీర్ తన దూకుడును పెంచి శశికళను ఆత్మరక్షణలో పడేసేందుకు యత్నిస్తున్నారు. తమకు అవకాశం ఇవ్వకపోతే నేరుగా రాష్ట్రపతి ఎదుట ఎమ్మెల్యేలతో పరేడ్ నిర్వహించేందుకు శశికళ వర్గం ఏర్పాట్లు చేసుకుంటోంది. కేంద్రం ఆదేశాలతో గవర్నర్ జాప్యం చేయడం వల్లనే ఈ సంక్షోభం ఏర్పడిందని ఇప్పటికే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన కూడా ఈ వివాదాన్ని ఇంకెంతోకాలం పొడిగించలేరని, 2, 3 రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటించక తప్పదని... సంక్షోభానికి సమాధానం దొరుకుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. తమ వాదనలు వినిపించిన పన్నీర్, శశికళ తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలతో పరేడ్ నిర్వహించడానికి సమయం ఇవ్వాలని శశికళ బుధవారమే గవర్నర్ను ఫోన్లో కోరారు. ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం కూడా తన వాదన వినిపించేందుకు సమయం అడిగారు. అయితే గురువారం మధ్యాహ్నం వరకు గవర్నర్ ఇద్దరికీ సమయం కేటాయించలేదు. ఈలోపే ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్, డీపీజీ రాజేంద్రన్తో తాజా పరిణామాల గురించి వివరాలు తెలుసుకున్నారు. గవర్నర్ను కలిసేందుకు సాయంత్రం ఐదు గంటలకు పన్నీర్ సెల్వంకు, రాత్రి ఏడు గంటలకు శశికళకు సమయం కేటాయిస్తున్నట్లు గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో రాజ్ భవన్ వర్గాలు వారికి సమాచారం అందించాయి. అయితే ఆ తర్వాత శశికళ అపాయింట్మెంట్ను రాత్రి 7:30కి మార్చారు. ఎమ్మెల్యేలతో కాకుండా ఐదారుమందితోనే రావాలని రాజ్భవన్ నుంచి వచ్చిన వర్తమానం శశికళను నిరుత్సాహానికి గురి చేసింది. గవర్నర్ గురువారం సాయంత్రం 4 గంటలకు రాజ్భవన్కు చేరుకున్న వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో తాజా పరిస్థితులపై చర్చించారు. అనంతరం పన్నీర్తో 20 నిమిషాలు, శశికళతో 30 నిమిషాలు గవర్నర్ భేటీ అయ్యారు. శశికళ మద్దతుదారులు తనతో బలవంతంగా రాజీనామా లేఖపై సంతకం చేయించారని పన్నీర్ గవర్నర్కు తెలిపారు. . నిర్బంధం నుంచి ఎమ్మెల్యేలు బయటపడితే తనకే మద్దతిస్తారని, అసెంబ్లీలో బల నిరూపణకు అవకాశమివ్వాలని కోరారు. మరోవైపు మెజారిటీ ఎమ్మెల్యేల నిర్ణయం ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తనకు అవకాశం ఇవ్వాలంటూ శశికళ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన పత్రాలను సమర్పించారు. వారిద్దరి వాదనలూ ఆలకించిన గవర్నర్ తాను అన్ని కోణాల్లో పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని చెప్పి పంపారు. అయితే రాజ్భవన్ లోపల నుంచి బయటకు రాగానే అంతా మంచే జరుగుతుందని పన్నీర్ సెల్వం ధీమా వ్యక్తం చేయడం... శశికళ చిరునవ్వు లేకుండా బయటకు రావడం, మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించడం êంటి దృశ్యాలు అనేక రకాల చర్చలకు దారి తీశాయి. కేంద్రంతో పోరాటానికి శశికళ సిద్ధం రాజ్యాంగాన్ని కాపాడాల్సిన గవర్నర్ కేంద్ర ప్రభుత్వం మాట విని పన్నీర్ సెల్వంకు బలపరీక్షకు అవకాశం ఇచ్చినా, తనతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించకుండా వాయిదా వేసినా కేంద్ర ప్రభుత్వం మీద దండ యాత్ర చేయాలని శశికళ శిబిరం నిర్ణయించింది. శుక్రవారం సాయంత్రం వరకు వేచి చూసి గవర్నర్ నిర్ణయం తమకు అనుకూలంగా లేకపోతే ఎమ్మెల్యేలతో ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఎదుట పరేడ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బుధవారం రాత్రే 20 మంది ఎంపీలు ఢిల్లీకి చేరుకున్నారు. గవర్నర్ ఏం చేస్తారో! తమిళనాడులో అన్నా డీఎంకేను తన గుప్పిట్లో పెట్టుకోవడానికి ప్రధాని మోదీ పన్నీర్తో నాటకం ఆడిస్తున్నారని శశికళ మద్దతుదారులు ఇప్పటికే బహిరంగంగా ఆరోపణలు చేశారు. అయితే ఈ వివాదంతో తమకు ఎలాంటి సంబంధం లేదని తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందర్ రాజన్, కేంద్రమంత్రి వెంకయ్య వివరణా ఇచ్చారు. ఈ నేపథ్యంలో గవర్నర్ విద్యాసాగర్ రావు రాష్ట్ర రాజకీయ పరిణామాలపై కేంద్రానికి నివేదిక పంపడం మరో వివాదానికి దారి తీసే పరిస్థితి కనిపిస్తోంది. రాజ్యాంగం ప్రకారం అయితే గవర్నర్ శశికళతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించాలి. అక్రమాస్తుల కేసులో ఆమెకు ఇంకా శిక్ష పడనందువల్ల ఆమెను సీఎం చేయడానికి అడ్డంకి కాదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కానీ అదే కేసును బూచిగా చూపి కేంద్రం ఆమెను వేచి చూడాలని చెప్తే.. పన్నీర్కు పరోక్షంగా కొండంత మేలు చేసినట్లు అవుతుంది. ఈ సమయంలోపు శశికళ శిబిరంలోఉన్న ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకోవడానికి పన్నీర్కు అవకాశం లభిస్తుంది. లేదా పన్నీర్ సెల్వంకు బలపరీక్షకు అవకాశం ఇచ్చినా శశికళ తన శిబిరాన్ని కాపాడుకోవడం కష్టమే. ఏ విధంగానైనా పన్నీర్కు తగినంత మద్దతు వచ్చేంతవరకూ ఈ సందిగ్ధతను గవర్నర్ సాగదీయవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టు గానే పన్నీర్ దూకుడు పెంచారు. ప్రభుత్వంతో పాటు పార్టీని హస్తగతం చేసుకునే దిశగా వ్యూహాలు రచిస్తున్నారు. శశికళ విధేయులుగా ముద్రపడిన వారిమీద వేటు వేస్తూ, ఆమె వ్యతిరేకులైన ఇద్దరు ఐఏఎస్లపై ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేస్తూ స్పష్టమైన సంకేతాలు పంపిస్తున్నారు. దీంతోపాటు చిన్నమ్మ నివాస ముంటున్న పోయెస్ గార్డెన్ను జయలలిత స్మారకభవనంగా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాలన్నీ శశికళను ఆత్మరక్షణలో పడేశాయి. వీడని ఉత్కంఠ పోయెస్ గార్డెన్లో ఆదివారం మధ్యాహ్నం పన్నీర్ సెల్వంతో సీఎం పదవికి రాజీనామా చేయించడం, వెనువెంటనే చిన్నమ్మ శశికళను శాసనసభా పక్ష నాయకురాలిగా ఎన్నుకోవడం చక చకా జరిగిన విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకారం కోసం శశికళ గవర్నర్ను సంప్రదించడం, ఊటీలో విహార యాత్రలో ఉన్న ఆయన చెన్నైకి రాకుండా నేరుగా ఢిల్లీ వెళ్లడంతో రాజకీయం వేడెక్కింది. ఈలోపే మంగళవారం రాత్రి పన్నీర్ సెల్వం తిరుగుబాటు జెండా ఎగుర వేయడంతో తమిళనాడు రాజకీయాలు వేగంగా మలుపులు తిరిగాయి. రాష్ట్రంలో పాలనాపరమైన సంక్షోభం ఏర్పడినా గవర్నర్ చెన్నైకి రాకుండా ముంబైలో ఉండిపోవడం రాజకీయ దుమారం రేపింది. ప్రధాని మోదీ మీద, గవర్నర్ విద్యాసాగర్రావు మీద ప్రత్యక్ష యుద్ధానికి దిగేందుకు శశికళ తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలతో రాష్ట్రపతి వద్దకు వెళ్లే ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ విషయం గుర్తించిన గవర్నర్ గురువారం తన చెన్నై పర్యటనను అధికారికంగా వెల్లడించారు. ఆయన చెన్నైకి చేరుకుని పన్నీర్, శశికళతో చర్చించాక వెంటనే ఈ వివాదానికి తెర దించుతారని రాజకీయ వర్గాలు, ప్రజలు భావించారు. అయితే గవర్నర్ ఈ వివాదానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పరిష్కారం కోరడంతో అన్నా డీఎంకే రాజకీయ సంక్షోభానికి తెర దిగలేదు. గవర్నర్ రాజ్యాంగ బద్ధంగా వ్యవహరిస్తారా? లేక కేంద్ర ప్రభుత్వం ఏం చెబితే అది చేసి తానూ రాజకీయ నాయకుడేనని చాటుకుంటారా? అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. శాసనసభా పక్ష నాయకునిగా ఒకరిని ఎన్నుకున్నాక ప్రమాణస్వీకారాన్ని కేంద్రం తమ రాజకీయ ప్రయోజనాలకోసం వ్యూహాత్మకంగా జాప్యం చేయడమే సంక్షోభానికి కారణమని న్యాయవాది, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యానించారు. వీళ్ల రాజకీయ లక్ష్యాన్ని నెరవేర్చుకునే సాధనలో భాగంగానే అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు, ప్రజల మనోభావాలను సాకుగా చూపుతున్నారని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఇది భవిష్యత్తులోవిపరిణామాలకు దారితీయవచ్చని, తమకు నచ్చని వారిని అడ్డుకోవడానికి గవర్నర్ను ఓ సాధనంలా వాడుకునే దుస్సంప్రదాయానికి దారితీయవచ్చని వారు హెచ్చరిస్తున్నారు. -
రొంబ రాజకీయం
-
రాజ్భవన్లో ఘనంగా వేడుకలు
హైదరాబాద్: రాజ్భవన్లో కొత్త సంవత్సరం వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న పలువురు ప్రముఖులు, ప్రజలు గవర్నర్ నరసింహన్ దంపతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రజల సహకారంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు దేశానికి రోల్ మోడల్గా నిలువాలని ఆకాంక్షించారు. పరస్పర సహకారంతో అభివృద్ధి సాధించాలని సూచించారు. -
రాష్ట్రపతికి గవర్నర్ విందు
- హాజరైన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు - విద్యుత్ వెలుగులతో కాంతులీనిన రాజ్భవన్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ గౌరవార్ధం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం ఘనంగా జరి గింది. మంగళవారం రాజ్భవన్లో ఏర్పాటు చేసిన ఈ విందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎం లతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యా రు. సరిగ్గా రాత్రి 8కు ప్రణబ్ముఖర్జీ రాజ్భవ న్కు చేరుకున్నారు. గవర్నర్ దంపతులు నరసిం హన్, విమలా నరసింహన్ ఆయనకు స్వాగతం పలికారు. సీఎం కె.చంద్రశేఖర్రావు తన సతీ మణి శోభతో కలసి రాష్ట్రపతి రాకకు ముందే అక్క డికి చేరుకున్నారు. రాష్ట్రపతి వచ్చిన కొద్దిసేపటికి ఏపీ సీఎం చంద్రబాబు వచ్చారు. చంద్రబాబు, కేసీఆర్ అభివాదం చేసుకొని పరస్పరం పలకరిం చుకున్నారు. పుష్పగుచ్ఛం అందించి రాష్ట్రపతికి అభివందనం చేశారు. అనంతరం రాజ్భవన్ లాంజ్లో గవర్నర్తో పాటు ఇద్దరు సీఎంలు రాష్ట్రపతితో కూర్చున్నారు. సీఎంలిద్దరూ అంద రినీ పలుకరిస్తూ పలు అంశాలపై చర్చించుకు న్నారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, కేంద్రమంత్రులు దత్తాత్రేయ, సుజనాచౌదరి, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య, ఎంపీలు కె.కేశవరావు, కవిత, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు హరీశ్రావు, కేటీఆర్, కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, ఏపీ మంత్రులు చినరాజప్ప, యనమల, క్రీడాకారులు సానియా మీర్జా, పీవీ సింధు, రెండు రాష్ట్రాల సీఎస్లు, డీజీపీలు, పలువురు ఉన్నతాధికారులు విందులో పాల్గొ న్నారు. రాజ్భవన్ లాంజ్ను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. ఘుమఘుమలాడిన వంటకాలు విందులో ఏర్పాటు చేసిన వంటకాలు ఘుమఘుమలాడాయి. హైదరాబాద్ ప్రత్యే కతను చాటిచెప్పే హైదరాబాద్ సబ్జీ బిర్యానీ, మిర్చి కా సలాన్, పనీర్ కత్తా ప్యాజ్, లాసోని చిరోంజి పాలక్, ఆలు కట్లియా, హైదరా బాద్ కత్తీ దాల్, గోంగూర, వంకాయ, టమాట పచ్చడి, మలాయి కుల్ఫీ విత్ ఫాలుదా, జొన్న రొట్టె తదితర వంటకాలను వడ్డించారు. విందు అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు, గవర్నర్ దంపతులు రాష్ట్రపతికి వీడ్కోలు పలికారు. -
రాష్ట్రపతి ప్రణబ్కు గవర్నర్ విందు
-
‘ఎవరి చెవిలో పూలు పెడుతున్నారు’
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసుపై తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో దర్యాప్తు జరిపించాలని వైఎస్సార్ సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. చంద్రబాబుతో లాలుచి పడకుండా విచారణ చేయించాలని అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ కేసును నీరు గార్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సాంకేతిక అంశాలను అడ్డుపెట్టుకుని కేసు నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు చూస్తున్నారని అన్నారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి హుటాహుటిన హైదరాబాద్ వచ్చి గవర్నర్ ను కలవడంలోని ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ఓటుకు కోటు కేసులో నెల రోజుల్లో విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది. అస్సలు ఈ కేసు నిలవదని టీడీపీ నేతలు చెప్తుతున్నారు అదే సందర్భంలో ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడితో సుజనా చౌదరి భేటీ అయ్యారు వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఉదయం సుజనా చౌదరి హుటాహుటిన హైదరాబాద్ వచ్చారు గవర్నర్ తో హడావుడిగా సమావేశమయ్యారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడానని సుజనా చెబుతున్నారు ప్రత్యేక హోదా రాజ్యాంగపరమైన అంశమా? ఎవరి చెవిలో పూలు పెడుతున్నారు? రాజ్భవన్ అను వ్యవస్థను... వ్యవస్థలానే ఉంచాలని కోరుతున్నాం రాజ్భవన్ గౌరవాన్ని దెబ్బతీయొద్దని కోరుతున్నాం రాజ్భవన్ను రాజీభవనంగా, లాలుచిభవనంగాచేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం గవర్నర్ కు తెలంగాణ సీఎం ఏసీబీ డీజీ, అడ్వకేట్ జనరల్ బ్రీఫ్ చేస్తారు పరిపాలనలో భాగంగా వారు బ్రీఫ్ చేసివుండొచ్చు బీజేపీ అధ్యక్షుడితో జరిగిన భేటీలో ప్రత్యేక హోదా అంశాన్ని చర్చిస్తే దాన్ని ప్రధానికి నివేదించాలి గానీ, గవర్నర్ కు చెప్తారా? ఓటుకు కోట్లు కేసులో బీజేపీ మధ్యవర్తిత్వం వహిస్తోందని చెప్పదలిచారా? చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని రాజ్యాంగానికి అతీతులమని చెప్పాలనుకుంటున్నారా? రాజ్యాంగాన్ని కాపాడాల్సిన కేంద్రం, రాజ్భవన్ ఇలాంటి కార్యక్రమాలకు వేదిక కావడం సమంజసమా? కేసుల నుంచి బయటపడేందుకు చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలకు తాకట్టు పెట్టారని మొదట నుంచీ చెప్తున్నాం చంద్రబాబును ఎవరూ కాపాడలేరని చెప్పిన తెలంగాణ సీఎం ఎందుకు ముందుకు కదల్లేకపోతున్నారు? మొదటి చార్జిషీటులో చంద్రబాబు పేరు ఉన్నా ఆయనను ఎందుకు విచారించలేదు? సామాన్యులకు ఒక న్యాయం, సీఎంకు మరో న్యాయమా? రాజ్భవన్ లో ఏం జరిగిందో అధికారిక ప్రకటన ద్వారా ప్రజలకు తెలియాల్సిన అవసరముంది టెక్నికల్ అంశాలను అడ్డుపెట్టుకోవడం చంద్రబాబుకు అలవాటు అన్నిరోజులు మీవి కావని టీడీపీ నాయకులు, చంద్రబాబు గుర్తించాలి ఓటుకు కోట్లు కేసులో దర్యాప్తుపై తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రదర్శించాలి -
‘ఎవరి చెవిలో పూలు పెడుతున్నారు’
-
నా గొంతు కోసేస్తారా?
♦ న్యాయస్థానం తీర్పును గౌరవించరా? ♦ రాజ్భవన్ వద్ద ఎమ్మెల్యే రోజా ఆవేదన ♦ నేరాలకు పాల్పడిన వారిని పక్కన కూర్చోబెట్టుకుంటారని ధ్వజం సాక్షి, హైదరాబాద్: ‘ప్రజా సమస్యలపై తాను అసెంబ్లీలో ప్రశ్నిస్తున్నందుకు నా గొంతు కోసేస్తారా? శాసనసభకు స్పీకర్ సుప్రీం కాదనం.. అయితే, అందరూ కలిసి నన్ను ఉరితీయమంటే తీసేస్తారా?’ అని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆవేదనగా ప్రశ్నించారు. తనను ఏడాదిపాటు సస్పెండ్ చేస్తూ అసెంబ్లీ చేసిన తీర్మానంపై హైకోర్టు స్టే ఇచ్చినా అధికారపక్షం, స్పీకర్ అమలు చేయడానికి నిరాకరించడంతో ప్రతిపక్ష నేత జగన్, ఇతర ఎమ్మెల్యేలతో కలిసి రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ శాసనసభా వ్యవహారాల్లో తానేతప్పూ చేయలేదని, ప్రజా సమస్యలపైనా, మహిళలకు ఎదురవుతున్న ఇబ్బందులపైనా గళం విప్పడమే నేరమా? అని ప్రశ్నించారు. తనకు జరిగిన అన్యాయంపై న్యాయపోరాటం చేసి ఉత్తర్వులు పొందినా అసెంబ్లీకి రానీయకపోవడం అన్యాయమన్నారు. అధికారపక్షానికి న్యాయవ్యవస్థపై ఏ పాటి గౌరవం ఉందో ఇట్టే అర్థమవుతోందన్నారు. అసెంబ్లీ చీఫ్ మార్షల్ ఒక భద్రతాధికారిగా కాకుండా టీడీపీ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను సస్పెండ్ అయిన మరుసటి రోజు గత డిసెంబర్ 19న కూడా తనపట్ల దురుసుగా వ్యవహరించి ప్రాంగణంలోకి రాకుండా అనారోగ్యానికి గురవడానికి కారణమయ్యారన్నారు. తాను గురువారం సాయంత్రం 3 గంటలకే కోర్టు ఉత్తర్వులను అసెంబ్లీ కార్యదర్శికి ఇచ్చి శుక్రవారం నుంచి అసెంబ్లీకి వస్తానని పేర్కొన్నప్పటికీ శుక్రవారం రాకుండా అడ్డుకున్నారన్నారు. త నను లోనికి రానీయవద్దని స్పీకర్, కార్యదర్శి నుంచి ఆదేశాలున్నాయని చీఫ్ మార్షల్ చెబుతారేగానీ లిఖిత పూర్వకంగా ఉన్నాయా అంటే స్పందించరన్నారు. న్యాయవ్యవస్థను గౌరవించని వారు తాను హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసు వేసినపుడు వాదించడానికి అసెంబ్లీ తరపున న్యాయవాదులను ఎందుకు పంపాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై తాను మళ్లీ కోర్టుధిక్కరణ పిటిషన్ వేసి పోరాడతానన్నారు. వీళ్లంతా అర్హులా!? ప్రజా సమస్యలపై గట్టిగా మాట్లాడే తనను అసెంబ్లీలోకి రానివ్వరుగానీ, నేరాలకు పాల్పడిన వారిని పక్కన కూర్చోబెట్టుకుంటారా? అని చంద్రబాబును రోజా సూటిగా ప్రశ్నించారు. ‘బాధాకరమైన విషయమేమిటంటే ప్రజల గురించి మాట్లాడే నన్ను మాత్రం సభలోకి రానివ్వరు.. మహిళను కార్లోకి చెయ్యిపట్టి లాగి అసభ్యంగా ప్రవర్తించిన రావెల సుశీల్కు పూర్తి మద్దతిచ్చిన తండ్రి రావెల కిశోర్బాబును మాత్రం మంత్రి పదవి నుంచి తొలగించరు. పక్కనే కూర్చోబెట్టుకుంటారు. ఎమ్మార్వో వనజాక్షిని జుట్టుపట్టి లాగడమేకాక ఎస్ఐని, అటవీ అధికారిని కొట్టిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను చంద్రబాబు పక్కనే కూర్చోబెట్టుకుంటారు. కార్ రేసింగ్లో ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణానికి కారణమైన తన కుమారుడు బొండా సిద్ధార్థపై కేసు లేకుండా కాపాడినందుకు బొండా ఉమామహేశ్వరరావు మాత్రం న్యాయవ్యవస్థపై గౌరవం లేని విధంగా మాట్లాడతారు. ఎమ్మెల్యేను కదా అనే అహంకారంతో వంగలపూడి అనిత ఓ టీచర్ను కొట్టినా తప్పులేదు. (దక్కన్ క్రానికల్లో వార్త వచ్చింది) పార్టీ ఫిరాయించిన 8 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఓటింగే పెట్టకుండా మూజువాణితో అవిశ్వాస తీర్మానాన్ని వీగిపోయిందని ప్రకటించుకుంటారు. కానీ నా విషయంలో మాత్రం అన్యాయంగా వ్యవహరిస్తున్నారు’ అని రోజా అన్నారు. కాల్మనీ సెక్స్ రాకెట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు మాత్రం చట్టసభల్లో ఉండటానికి అర్హులేనా? అని ప్రశ్నించారు. ‘సీఎం చంద్రబాబు, మంత్రులు అచ్చెన్నాయుడు, దేవినేని, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి లాంటివారు ఎన్నిసార్లు సభలో అన్పార్లమెంటరీ పదజాలం వాడారో అందరికీ తెలుసు. కానీ స్పీకర్ వాటన్నింటినీ వింటారు, మేం వివరణ ఇవ్వబోతే మైక్ ఇవ్వరు’ అని రోజా మండిపడ్డారు. -
సభ నన్ను ఉరి తీయాలంటే తీసేస్తారా: రోజా
కోర్టుల కంటే కూడా అసెంబ్లీయే ఉన్నతమని అంటున్నారని.. రేపు రోజాను ఉరి తీయాలి అని సభ తీర్మానిస్తే నిజంగా తనను ఉరి తీసేస్తారా అని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రశ్నించారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నా తనను అసెంబ్లీలోకి అడుగు పెట్టనివ్వకపోవడంపై రాజ్భవన్లో గవర్నర్ కార్యదర్శిని కలిసి వినతిపత్రం ఇచ్చి వచ్చిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఈ రోజును బ్లాక్డేగా పరిగణిస్తున్నామని ఆమె అన్నారు. మనమంతా రాజ్యాంగాన్ని గౌరవిస్తామని, మనకు ఎక్కడైనా అన్యాయం జరిగితే కోర్టులకు వెళ్తే న్యాయం జరుగుతుందని వెళ్తామని చెప్పారు. ఎక్కడైనా తప్పులు జరిగితే కోర్టులు సవరిస్తాయని, వాటిని మనం పాటించాలని అన్నారు. కానీ ఏపీ అసెంబ్లీ న్యాయవ్యవస్థను ధిక్కరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కోర్టు ఉత్తర్వులను గురువారమే అసెంబ్లీ సెక్రటరీకి ఇచ్చానని, శుక్రవారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీకి వస్తానని లేఖ కూడా ఇచ్చానని.. వాటిని తీసుకుని అందినట్లు అక్నాలెడ్జిమెంటు కూడా ఇచ్చారన్నారు. కానీ ఈరోజు మాత్రం మార్షల్స్తో తనను లోపలకు రానివ్వొద్దని చెప్పారని ఆమె తెలిపారు. చీఫ్ మార్షల్ గణేశ్ బాబు టీడీపీ కార్యకర్తలా ప్రవర్తిస్తున్నారని రోజా ఆరోపించారు. గతంలో తాను సస్పెన్షన్ ఆర్డర్ తీసుకుందామని వచ్చినా బయటకు లాగేశారని, తన మీద మార్షల్స్ కూర్చోవడంతో రెండు గంటల పాటు స్పృహలేని పరిస్థితిలో ఉన్నానని.. చివరకు ఆస్పత్రిలో కూడా ఇన్ పేషెంటుగా చేర్చుకోవద్దని చెప్పారని గుర్తుచేశారు. అదే గణేశ్ బాబు ఈ రోజు మళ్లీ తనను అడ్డగించారని అన్నారు. హైకోర్టు ఉత్తర్వులున్నాయని చెప్పినా.. అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్ చెప్పారంటూ అడ్డుకున్నారని తెలిపారు. న్యాయవ్యవస్థ కన్నా స్పీకర్ పదవి పెద్దది అనుకుంటున్నారని, అలాంటప్పుడు మరి కోర్టుకు ఎందుకు లాయర్లను పంపారు, ఎందుకు వాదనలు వినిపించారని ఆమె ప్రశ్నించారు. చిత్తకార్తె కుక్కలాగ ఒక అమ్మాయిని కారులోకి లాగిన రావెల సుశీల్ తండ్రి కిశోర్ బాబు అసెంబ్లీలో కూర్చోడానికి అర్హుడా, ఎమ్మార్వో వనజాక్షిని, ఒక ఎస్ఐని, ఫారెస్ట్ అధికారిని కొట్టిన రౌడీషీటర్ చింతమనేని ప్రభాకర్ అసెంబ్లీలో కూర్చోవచ్చా? కాల్ మనీ సెక్స్ రాకెట్లో నిందితులైన బుద్దా వెంకన్న లాంటివాళ్లు మండలిలో ఉండొచ్చా అని రోజా సూటిగా ప్రశ్నించారు. చివరకు ఎమ్మెల్యే అయ్యానన్న అహంకారంతో టీచర్ని చెప్పు తీసుకుని కొట్టిన అనిత కూడా సభలో ఉన్నారన్నారు. పార్టీ ఫిరాయించినవాళ్లను సస్పెండ్ చేసి బయటకు పంపాల్సింది పోయి నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తనను అసెంబ్లీలోకి రానివ్వకుండా స్పీకర్, ముఖ్యమంత్రి, యనమల రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీళ్ల వల్ల ప్రజలకు, తమకు కూడా రక్షణ లేదని అన్నారు. ఇది కోర్టు ధిక్కారం కాబట్టి మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, రాష్ట్రంలో ఉన్న మహిళల సమస్యలు, తన నియోజకవర్గ సమస్యలపై పోరాడుతానని తెలిపారు. తాను ఇప్పటివరకు చేయని తప్పునకు శిక్ష అనుభవించానని, తన నోరు నొక్కేయడానికి ప్రయత్నించారని రోజా చెప్పారు. ఈ రెండేళ్ల కాలంలో బోండా ఉమా, అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, సాక్షత్తు చంద్రబాబు అనేక అన్ పార్లమెంటరీ పదాలు మాట్లాడారని.. కానీ తాను అలా ఏమీ మాట్లాడకపోయినా వాళ్ల ఇష్టానికి మాటలు రాసేసుకుని శిక్షలు వేసేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. వీళ్లకు ప్రజాస్వామ్యం మీద గానీ, కోర్టుల మీద గానీ గౌరవం లేదని.. అలాంటివాళ్లు చాలామంది మట్టిలో కలిసిపోవడం మనం చూశామని అన్నారు. తానేంటో రాష్ట్రంలో మహిళలందరికీ తెలుసని చెప్పారు. గర్భిణిగా ఉన్నప్పుడు కూడా రోడ్డు మీదకు వచ్చి మండుటెండలో ప్రజాసమస్యల మీద పోరాడటంతో తాను, తన కొడుకు చనిపోయేంత పరిస్థితి వచ్చిందని.. అలాంటి తాను మహిళల గురించి అగౌరవంగా మాట్లాడానంటే ఎవరైనా నమ్ముతారా అని ప్రశ్నించారు. -
రాజ్భవన్లో రాష్ట్రపతికి గవర్నర్ విందు
హైదరాబాద్ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మంగళవారం రాత్రి రాజ్భవన్లో విందు ఇచ్చారు. శీతాకాల విడిదికి హైదరాబాద్ వచ్చిన ప్రణబ్కు గవర్నర్ మర్యాదపూర్వకంగా ఈ విందు ఏర్పాటు చేశారు. ఈ విందు కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, ఆయన సతీమణి శోభాతో హాజరు కాగా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్రమంత్రులు అశోక్ గజపతిరాజు, బండారు దత్తాత్రేయ, తెలంగాణ మంత్రులు కడియం శ్రీహరి, నాయిని నర్సింహారెడ్డి, హరీశ్ రావు, ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి, తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ, ఏపీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్, సీపీఐ నారాయణ, ఇరు రాష్ట్రాల డీజీపీలు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వీరందర్నీ గవర్నర్ దంపతులు సాదరంగా ఆహ్వానించారు. ఈ విందు కార్యక్రమంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి కలిశారు. -
నేడు రాజ్భవన్లో రాష్ట్రపతికి గవర్నర్ విందు
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం రాజ్భవన్ను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి గౌరవార్ధం గవర్నర్ నరసింహన్ విందు ఇవ్వనున్నారు. ఈ విందులో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నాయుడు పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అయితే ప్రణబ్ రాకతో రాత్రి 7.30 నుంచి 8.30 వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, రాష్ట్రపతి ప్రణబ్ శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 31వ తేదీ వరకు హైదరాబాద్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. -
తలసాని వ్యవహారంపై సీఎస్కు రాజ్భవన్ లేఖ
గవర్నర్కు ఫిర్యాదుచేసిన ఎమ్మెల్యే గోపీనాథ్ ఫిర్యాదుతో పాటు లేఖను సీఎస్కు పంపిన రాజ్భవన్ వర్గాలు హైదరాబాద్: టీటీడీపీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, తెలంగాణరాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై ఇచ్చిన ఫిర్యాదుతో రాజ్ భవన్లో కదలిక ప్రాంభమైంది. పార్టీ ఫిరాయింపుల కింద తలసాని పై చర్యలు తీసుకోవాలని శనివారం గవర్నర్కు ఫిర్యాదు చేశారు. మాగంటి ఫిర్యాదు పై రాజ్ భవన్ వర్గాలు సీఎస్ రాజీవ్ శర్మకు సమాచారం పంపాయి. తలసానిని మంత్రిగా కొనసాగించడంపై తరచు ఫిర్యాదులు వస్తున్నాయని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. -
గవర్నర్ విందుకు కేసీఆర్ దూరం!
-
'రాజ్ భవన్ లో ఖాళీగా కూర్చోను'
హైదరాబాద్: రాజ్ భవన్ లోఖాళీగా కూర్చోనని తెలంగాణ, ఏపీ ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ వ్యాఖ్యానించినట్టు తెలిసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఎంట్రీ ట్యాక్స్'పై ఏపీ కాంగ్రెస్ నేతలు సోమవారం గవర్నర్ ను కలిశారు. ఈ సందర్భంగా వారి మధ్య అంతర్గత సంభాషణ చోటు చేసుకుంది. రెండు రాష్ట్రాల ప్రజల సమస్యలు తనకు తెలుసునని కాంగ్రెస్ నేతలతో గవర్నర్ అన్నారు. ప్రజాసమస్యలపై మాట్లాడిన మొదటి గవర్నర్ ను తానేనని చెప్పారు. ప్రజల కోసమే ఇద్దరు ముఖ్యమంత్రులను పిలిచి మాట్లాడానని గుర్తు చేశారు. తానేం చేశానో ప్రజలకు తెలుసునని, అందరికంటే ఒక అడుగు ముందే ఆలోచిస్తానని అన్నారు. ఏం చేసినా ఆలోచించి నిజాయితీ పనిచేశానని చెప్పారు. ఒకరితో చెప్పించుకునే రానీవ్వనని గవర్నర్ పేర్కొన్నారు. -
రాజ్భవన్లో ఘనంగా హోళీ వేడుకలు
హైదరాబాద్: రాజ్భవన్లో హోళీ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. గవర్నర్ దంపతులు హోళీ వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే కేంద్రమంత్రి దత్తాత్రేయ, బీజేఎల్పీ నేత లక్ష్మణ్లతోపాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ఈ హోళీ వేడుకల్లో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు గవర్నర్ ఈ సందర్బంగా హోళీ శుభాకాంక్షలు తెలిపారు. -
మంచిరోజులు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మహారాష్ట్ర-తెలంగాణ రాష్ట్రాల ను కలిపే గోదావరి చుట్టూ ఉన్న అపోహలు.. మరెన్నో జల జగడాలకు ఇక తెర పడినట్లే. ఏళ్ల తరబడిగా అపరిషృతంగా ఉన్న సమస్యలకు తెలంగాణ ప్రభుత్వం పరిష్కారం చూపినట్లే. మంగళవారం ముంబైలోని రాజ్భవన్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్తో తెలంగాణ సీఎం కేసీఆర్ జరిపిన చర్చలు సానుకూలంగా ముగి యడం శుభపరిణామంగా భావిస్తున్నారు.అంతర్రాష్ట జలవివాదాలలో కీ లకాంశాలుగా మారిన ప్రాణహిత-చేవెళ్ల, లెండి ప్రాజెక్టుల నిర్మాణానికి మార్గం సుగమమైంది. అంతకు ముం దే ఈ విషయంలో ప్రాథమిక చర్చలు జరిగాయి. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కావడంతో సరిహద్దులో మన జిల్లాకు సంబంధించి లెండి, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులు ముందు కు సాగుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సమన్వయంతో గోదారి జలాల వాడకం లెండి ప్రాజెక్టు పరీవాహక ప్రాంతంలోని నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించడంతోపాటు, ఈ ప్రాజెక్టు ద్వారా ఆరు టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి అవకాశం కలిగింది. గోదావరి నుంచి 160 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చని మహారాష్ర్ట సీఎం ఫడ్నవిస్ పేర్కొనట్లు ప్రకటించారు. లెండి ప్రాజెక్టు నిర్మాణం గురిం చి నిపుణుల కమిటీ ఏర్పాటు, ప్రాజెక్టు నిర్మాణం, నష్టపరిహారం చెల్లింపు, అనుమతులు, నీటివినియోగం తదితర అంశాలను ఆ కమిటే పర్యవేక్షిస్తుందని కూడా వెల్లడిం చారు. ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించినందున మహారాష్ర్ట సహకరించాలన్న సీఎం కేసీఆర్ కోరికపై ఫడ్నవిస్ను సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. గోదావరి జలాలను సమన్వయంతో వాడుకోవడంతోపాటు, అంతర్రాష్ట నీటిపారుదల ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసుకోవాలన్న ఇరు రాష్ట్రాల సీఎంల ప్రకటనపై జిల్లాలో సంతోషం వ్యక్తమవుతోంది. తొలగిన ఆటంకాలు 1984లో అప్పటి ప్రభుత్వాలు లెండి ప్రాజెక్టు నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. నాందేడ్ జిల్లా మథ్కేడ్ తాలూకా గోనేగావ్ వద్ద గల వాగుపై ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. పనులు మొదలైతే అయ్యాయి కానీ, 30 సంవత్సరాలు గడిచినా ప్రాజెక్టు పూర్తి కాలేదు. 11,214 ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యంగా చే పట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో పదే పదే ఇరు రాష్ట్రాల మధ్యన తలెత్తిన వివాదాలు అడ్డంకిగా మారాయి. 1984లో రూ.50 కోట్లు ఖర్చవుతుందని అంచనా వే యగా 2003 నాటికి అది రూ.275.84 కోట్లకు చేరింది. ప్రస్తుత అంచనా రూ.554.55 కోట్లు. ఇందులో రూ.318.45 కోట్లు మహారాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేయాల్సి ఉం డ గా, రూ.266.10 కోట్లు తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం రూ.189.79 కోట్లు మహారాష్ట్రకు చెల్లించిన తర్వాత, రాష్ట్ర విభజన అనంత రం పరిణామాలను కూడా చర్చించడంతో లెండికి ఇక అడ్డంకులు తొలగినట్లే అంటున్నారు. రాజన్న కలల ప్రాజెక్టుకు మోక్షం ప్రాణహిత ప్రాజెక్టుకు సంబంధించి మాహారాష్ట్రతో జల వివాదాలున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ఏడు జిల్లాలలో 16.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందాలి. జిల్లాలో 20, 21, 22 ప్యాకేజీ పనులు పూర్తయితే 3.04 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్టుగా డిజైన్ చేసిన దీనికి ఆయన మరణానంతరం ఆనేక ఇబ్బందులు తలెత్తాయి. జల వివాదాలు గండంగా మారినా, పాలకులు పరిష్కారం కోసం ఆలోచించలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు బుధవారం మహారాష్ర్టతో చర్చలు జరపడంతో పురోగతి ఉంటుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. జిల్లాలోని 20, 21, 22 ప్యాకేజీల ద్వారా నిజామాబాద్ జిల్లాతో పాటు కరీంనగర్, మెదక్ జిల్లాలకు కొంత ఆయకట్టుకు లబ్ధి జరుగుతుంది. 20వ ప్యాకేజీ జిల్లా పరిధిలోని ఎస్ఆర్ఎస్పీ నుంచి 25 టీఎంసీల నీటిని తోడి, నిజామాబాద్ మండలంలోని మాసాని జలాశయానికి తరలించేందుకు ఈ పనులు రూ. 892.67 కోట్లతో శ్రీకారం చుట్టారు. 21వ ప్యాకేజీ కింద రూ.1.143.78 కోట్లతో చేపట్టిన పనులలో మాసాని చెరువు నుంచి 8 టీఎంసీల నీటిని కాలువల ద్వారా, మరో 17 టిఎంసీల నీటిని ఎత్తిపోతల ద్వారా మంచిప్ప, కొడెం చెరువులను నింపాల్సి ఉంది. ఇలా అనేక ప్యాకేజీల పనులు సాగుతున్నా.. జల వివాదాలు పరిష్కారం కాకపోతే ప్రయోజనం ఉండదని భావిస్తున్న తరుణంలో ఇరు రాష్ట్రాల మధ్యన చర్చలు జరగడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. -
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు నష్టం:పొన్నాల
హైదరాబాద్: సచివాలయాన్ని ఎర్రడ్డకు, చెస్ట్ ఆస్పత్రిని అనంతగిరికి తరలించాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కేసీఆర్ ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా గాంధీభవన్ నుంచి రాజ్ భవన్ వరకు శనివారం పాద యాత్ర నిర్వహించనున్నట్లు పొన్నాల చెప్పారు. సచివాలయ మార్పును ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్కు వినతిపత్రం ఇవ్వనున్నామని పొన్నాల తెలిపారు. హైదరాబాద్ చెత్తసిటీ అంటూ సీఎం మాట్లాడటం సరైందికాదన్నారు. ఈ వ్యాఖ్యలు పెట్టుబడులకు అనుకూలమైన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేలా ఉన్నాయని పొన్నాల విమర్శించారు. హైదరాబాద్ బెస్ట్ సిటీ అవార్డును కేటీఆర్ తీసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నందునే హైదరాబార్ అభివృద్ధి గురించి చెబుతూ కేసీఆర్ ప్రజలని మభ్యపెడుతున్నారని పొన్నాల తెలిపారు. -
తెలంగాణ వాదనకు గవర్నర్ ఒప్పుకోలేదు!
ఎంసెట్ విషయంలో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదంపై రాజ్ భవన్ వర్గాలు వివరణ ఇచ్చాయి. ఎంసెట్ నిర్వహణ హక్కు తెలంగాణ ప్రభుత్వానికే ఉంటుందన్న ఆ సర్కారు వాదనకు గవర్నర్ నరసింహన్ ఒప్పుకొన్నారన్న వానదలో నిజం లేదని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. రెండు రాష్ట్రాల్లో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని మాత్రమే గవర్నర్ సూచించనట్లు తెలిపాయి. అయితే.. తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మాత్రం గవర్నర్ నరసింహన్ను కలిసి వచ్చిన తర్వాత.. తమ వాదనతో గవర్నర్ ఏకీభవించినట్లు చెప్పారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఎంసెట్ నిర్వహించే హక్కు తమకే ఉంటుందని, కావాలంటే ఆంధ్రప్రదేశ్కు కూడా తామే నిర్వహిస్తామని అన్నారు. -
రాజ్భవన్లో న్యూ ఇయర్ వేడుకలు
-
రాజ్భవన్లో న్యూ ఇయర్ వేడుకలు
హైదరాబాద్ : రాజ్భవన్లో నూతన సంవత్సర వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. వివిధ రంగాలు చెందిన ప్రముఖులు, స్కూలు విద్యార్థులతో పాటు సాధారణ ప్రజలు రాజ్భవన్కు తరలి వచ్చారు. గవర్నర్ నరసింహన్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ దంపతులతో ప్రత్యేకంగా ఫోటోలు కూడా దిగారు. -
ఆదర్శ కమిషన్గా పేరు తీసుకురండి
టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యులకు గవర్నర్ నరసింహన్ సూచన సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ నియామకాల్లో పారదర్శకంగా వ్యవహరిస్తూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్కు (టీఎస్పీఎస్సీ) ఆదర్శ కమిషన్గా పేరు తీసుకురావాలని గవర్నర్ నరసింహన్ సూచించారు. కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి, సభ్యులు విఠల్, చంద్రావతి, మతీనుద్దీన్లు శనివారం రాజ్భవన్లో గవర్నర్ను కలిసి, కమిషన్ను నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ప్రతిభావంతులకు ఉద్యోగాలివ్వడం ద్వారానే బంగారు తెలంగాణ సాధ్యం అవుతుందని, ఆ దిశగా కృషి చేయాలని వారికి సూచించారు. తాను టీం సభ్యునిగా ఉంటానని, ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. -
గవర్నర్తో సీఎం కేసీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు మంగళవారం రాత్రి రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ నరసింహన్తో సమావేశమయ్యారు. సుమారు గంటా 20 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో... ఇంటర్ పరీక్షలపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదం, దానికి కారణాలు, పరిష్కారాలపై ప్రధానంగా చర్చించినట్టుగా సమాచారం. విద్యాశా ఖ పరిధిలో భవిష్యత్లో తలెత్తబోయే సమస్యలు, అంశాలు, పరిష్కారాలపైనా చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు విడిగా సమ యం ప్రకటించడానికి కారణాలను కేసీఆర్ గవర్నర్కు వివరించారు. ఇక రాష్ట్ర విభజన నేపథ్యంలో వస్తున్న సమస్యలు, పరిష్కారాలపైనా మాట్లాడారు. వీటితో పాటు అసెంబ్లీ సమావేశాలు, ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్లు, దానికి దారితీసిన కారణాలు తదితర అంశాలపైనా గవర్నర్, సీఎం ఇష్టాగోష్టిగా మాట్లాడినట్టుగా తెలిసింది. -
చీపురు పట్టిన గవర్నర్ దంపతులు