రాజ్భవన్లో ఉత్సాహంగా హోలీ సంబరాలు
Published Sun, Mar 12 2017 12:23 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
హైదరాబాద్: రాజ్భవన్లో ఆదివారం ఉదయం హోలీ సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. గవర్నర్ నరసింహన్ దంపతులు ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుని సంబరాలు ప్రారంభించారు. గవర్నర్ ఉత్సాహంగా మీడియా ప్రతినిధులతోపాటు అందరికీ రంగులు జల్లుతూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ ఆనందోత్సాహాలతో హోలీ జరుపుకోవాలని గవర్నర్ దంపతులు కోరారు. ప్రజలందరూ సహజసిద్ధమైన రంగులతోనే హోలీ జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
Advertisement
Advertisement