ఖైరతాబాద్ : హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఈ-కామర్స్ సంస్థ యాడ్రోబ్ డాట్ ఇన్ ఖైరతాబాద్ గణేషుడికి 108 లీటర్ల కృష్ణా పుష్కర జలాలను కానుకగా అందజేసింది. గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు ఈ జలాలను అందజేసిన అనంతరం యాడ్రోబ్ వ్యవస్థాపకుడు రాజిరెడ్డి కేశిరెడ్డి మాట్లాడుతూ.. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ పవిత్ర జలాలను స్వామివారి పూజా నిర్వహణలో ఉపయోగించాలని కోరినట్లు తెలిపారు.
మహబూబ్నగర్ జిల్లా బీచుపల్లి ఘాట్ నుంచి ఈ జలాలను తమ సంస్థ సమీకరించిందని, రివర్స్ ఆస్మోసిస్ టెక్నాలజీని ఉపయోగించి శుద్ధి చేసి ఈ నీరు పూజకు మాత్రమే కాకుండా తాగడానికి కూడా ఉపయోగించుకోవచ్చునన్నారు.
ఖైరతాబాద్ గణేషుడికి కృష్ణా జలాలు
Published Tue, Sep 6 2016 5:42 PM | Last Updated on Mon, Sep 4 2017 12:26 PM
Advertisement
Advertisement