నాంపల్లి కోర్టుకు హాజరైన రేవంత్‌ రెడ్డి | Revanth Reddy attend Nampally Court for Defamation Case | Sakshi

నాంపల్లి కోర్టుకు హాజరైన రేవంత్‌ రెడ్డి

Jan 10 2017 11:58 AM | Updated on Sep 5 2017 12:55 AM

తెలంగాణ టీడీపీ నేత రేవంత్‌ రెడ్డి మంగళవారం నాంపల్లి క్రిమనల్‌ కోర్టుకు హాజరయ్యారు.

హైదరాబాద్‌ : తెలంగాణ టీడీపీ నేత, కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి మంగళవారం నాంపల్లి క్రిమనల్‌ కోర్టుకు హాజరయ్యారు. మై హోం అధినేత జూపల్లి రామేశ్వరరావు  దాఖలు చేసిన పరువునష్టం కేసులో విచారణ నిమిత్తం ఆయన కోర్టుకు వచ్చారు. తదుపరి విచారణ వచ్చే నెల 3వ తేదీకి వాయిదా పడింది.
 
కాగా హైటెక్‌ సిటీ వద్ద భూముల కేటాయింపునకు సంబంధించి అవకతవకలు జరిగాయని, ఈ కేటాయింపుల్లో మై హోం సంస్థ భారీగా లబ్ది పొందిందని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసిన తెలిసిందే. దీనిపై తన పరువుకు భంగం కలిగేలా రేవంత్ రెడ్డి వ్యవహరించారని, పరువునష్టం కింద రూ. 90 కోట్లు చెల్లించాలని రామేశ్వరరావు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement