రెవెన్యూ మంత్రిని తప్పించాలి: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: భూ కుంభకోణాల్లో సబ్ రిజిస్ట్రార్లపై చర్యలకే పరిమితం కాకుండా, రెవెన్యూ మంత్రి, ఆ శాఖ ఉన్న తాధికారులను బాధ్యతల నుంచి తప్పిం చాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఈ వ్యవహారంపై హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో సమగ్ర విచారణ జరిపించా లని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బుధవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. భూకబ్జాదారులపై ఉక్కుపాదం మోపి ప్రభుత్వ భూములను కాపాడాలన్నారు.
ఒకవైపు మియాపూర్ భూకుంభకోణంలో స్వయంగా ఓఎస్డీ ప్రత్యక్షపాత్రే ఉందని ప్రభుత్వమే చెబుతూ మరోవైపు సంబంధిత మంత్రికి ఏ సంబంధం లేదనడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతుంటే సర్కార్ చోద్యం చూస్తోందన్నారు.