Tammineni Veerabhadram
-
ఫార్మా విలేజ్ కాదు.. పారిశ్రామిక పార్క్: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: వికారాబాద్ జిల్లా లగచర్లలో ఏర్పాటు చేయబోయేది ఫార్మా విలేజ్ కాదని.. పారిశ్రామిక పార్క్ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. అక్కడ కాలుష్య రహిత పరిశ్రమలనే ఏర్పాటు చేస్తామని తెలిపారు. శనివారం సచివాలయంలో సీఎంను సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావుతోపాటు సీపీఐ(ఎంఎల్) ప్రతినిధులు కలిశారు. ఇటీవల లగచర్లలో పర్యటించిన వీరు.. అధికారులపై దాడి ఘటన తర్వాత అక్కడి పరిస్థితులపై రూపొందించిన నిజనిర్దారణ నివేదికను సీఎంకు అందజేశారు. పలు అంశాలతో కూడిన వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. ఈ సందర్భంగా లగచర్లలో ఏర్పాటుచేయబోయే పరిశ్రమల గురించి వారికి సీఎం రేవంత్రెడ్డి వివరించారు. లగచర్లలో కాలుష్య రహిత పరిశ్రమలనే ఏర్పాటు చేస్తామని తెలిపారు. భూసేకరణ పరిహారం పెంచే విషయాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. నా ప్రజలను నేను ఇబ్బంది పెడతానా? తన నియోజకవర్గంలోని యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించేందుకు పరిశ్రమలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేయడం తన బాధ్యత అని వామపక్ష పార్టీల నేతలతో సీఎం అన్నారు. ‘నా సొంత నియోజకవర్గ ప్రజలను నేనే ఎందుకు ఇబ్బంది పెడుతా?’అని ప్రశ్నించారు. అయితే, లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్, అధికారులపై దాడి చేసిన వారిని, అందుకు కుట్ర చేసినవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలేది లేదని స్పష్టంచేశారు. అమాయక రైతులపై కేసులు పెట్టిన అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యామ్నాయంపై సమాలోచన కాలుష్య కారక పరిశ్రమల కోసం రెండు పంటలు పండే భూములను తీసుకోవడం సరికాదని సీఎంకు సూచించినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. లగచర్లలో కాకుండా కొడంగల్లో మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డికి చెందిన 1,156 ఎకరాలకు పైగా ఉన్న సీలింగ్ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే మంచిదని తెలిపినట్లు ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. అయితే ఆ భూములు కోర్టు వివాదాల్లో ఉన్నందున ఆలస్యం జరుగుతోందని సీఎం అన్నారని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ భూములుంటే సూచించాలని సీఎం అడిగారని, దీనిపై రెండుమూడుసార్లు సమావేశాలు నిర్వహించిన తరువాత నిర్ణయం తీసుకుందామని చెప్పారని తమ్మినేని వెల్లడించారు. కాగా, లగచర్లలో వరి కోతలకు అధికారులు యంత్రాలను అనుమతించడం లేదని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని, పోలీసు క్యాంపులతో నిర్భందం కొనసాగుతున్నదని సీఎం దృష్టికి తీసుకెళ్లగానే.. ఆయన వెంటనే కలెక్టర్కు ఫోన్ చేసి వరికోత యంత్రాలను అనుమతించాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, పోలీసు క్యాంపులను వెంటనే తొలగించాలని ఆదేశించినట్లు వివరించారు. గిరిజనులపై కేసులు ఎత్తేయండి: కూనంనేని లగచర్ల ఘటనలో గిరిజనులపై పెట్టిన కేసులను ఎత్తేయాలని సీఎంను కోరినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. అందుకు సీఎం సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. పరిశ్రమలను ప్రభుత్వ భూముల్లో ఏర్పాటు చేయాలని, రైతుల భూములు సేకరించి జనావాసాల మధ్య ఫార్మా పరిశ్రమలను ఏర్పాటు చేస్తామంటే వామపక్షాలు అంగీకరించబోవని సీఎంకు స్పష్టంగా చెప్పినట్లు వెల్లడించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే.. అదికూడా రైతులను ఒప్పించి, పూర్తి నష్టపరిహారం అందించిన తరువాతే వారి భూములను సేకరించాలని సూచించినట్లు తెలిపారు. సీఎంను కలిసినవారిలో సీపీఐ రాష్ట కార్యదర్శివర్గ సభ్యులు పశ్య పద్మ, సీపీఐ (ఎం.ఎల్) మాస్లైన్ నాయకులు రమ, ఎస్.ఎల్. పద్మ, ఆర్ఎస్పీ నాయకడు జానకిరాములు, ఎంసీపీఐ నాయకుడు గాదగోని రవి తదితరు ఉన్నారు. -
ఎర్రజెండా పార్టీలన్నీ ఒకటి కాబోతున్నాయి
-
‘హైడ్రా’ పేరుతో హడావుడి: తమ్మినేని వీరభద్రం
సాక్షి,హన్మకొండజిల్లా:కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో హడావుడి చేస్తోందని సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.హన్మకొండలోని గిరిజన భవన్లో ఏర్పాటు చేసిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ ముగింపు సభకు తమ్మినేని మంగళవారం(సెప్టెంబర్17) హాజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ‘రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా అమలు చేయాలి.పేద,మధ్య తరగతి ప్రజలకు ప్రత్యామ్నాయం చూపాలి.కాంగ్రెస్ ఎన్నికల హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలి.పేదలకు భూములు పంచిన చరిత్ర కమ్యూనిస్ట్ లది.చట్టాలు చేసి మోసం చేసిన చరిత్ర ప్రభుత్వాలది. కేసీఆర్ పదేండ్లలో 16వేల ఎకరాలు మాత్రమే పంచారు. ప్రస్తుతం 16లక్షల మంది భూమి కోసం ఎదురు చూస్తున్నారు.ప్రజా సమస్యల పరిస్కారం కోసం పోరాటం చేసేది కమ్యూనిస్ట్ లే.చరిత్ర ను వక్రీకరించి తెలంగాణ సాయుధ పోరాటాన్ని ముస్లిం, హిందూ పోరాటంగా బీజేపీ చిత్రీకరిస్తోంది.తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను ఎవరు ఎన్ని కుట్రలు చేసినా చెరపలేరు’అని తమ్మినేని అన్నారు. ఇదీ చదవండి.. హైడ్రా ఆగేదే లేదు: సీఎం రేవంత్రెడ్డి -
అసెంబ్లీలో తీర్మానానికి సిద్ధమా..!
ఆదిలాబాద్: సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానించి ఢిల్లీలో ధర్నా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందా అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సవాల్ విసిరారు. సోమవారం సింగరేణి పరిరక్షణ కోసం సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్రను బెల్లంపల్లి లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంటా చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో వీరభద్రం మాట్లాడారు. సింగరేణి సంస్థలో 51శాతం వాటా కలిగిన రాష్ట్ర ప్రభుత్వం, 49శాతం వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు వ్యతిరేకమంటూనే చాపకింద నీరులాగా బొగ్గు సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి కుయుక్తులు పన్నుతున్నాయని విమర్శించారు.ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనకు అంత్యత సన్నిహితుడైన అదానికి దేశంలోని కోలిండియా, సింగరేణి సంస్థల్లోని బొగ్గు బ్లాక్లను అప్పగించడానికి పావులు కదుపుతున్నారని ఆరోపించారు. ప్రైవేటీకరణపై సీఎం రేవంత్రెడ్డి ద్వంద్వ విధానాలు అవలంబిస్తున్నారని అన్నా రు. శ్రావణ్పల్లి బొగ్గు బ్లాక్ను కేంద్రమంత్రి కిషన్రెడ్డి వేలం పాట నిర్వహిస్తే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క పాల్గొనడం వెనుక మర్మమేంటో స మాధానం చెప్పాలని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ప్ర భుత్వాల చీకటి ఒప్పందాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.రాష్ట్రంలో అన్ని రాజకీయ పక్షాలు, కార్మిక సంఘాలు, ఇతర వర్గాల శ్రేణులు పో రాటంలో కలిసి రావాలని కోరారు. అంతకుముందు బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి సీపీఎం నాయకులు పూలమాల వేసి జోహార్లు అర్పించారు. ఈ సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్.వీరయ్య, చుక్క రామయ్య, భూపాల్, రాష్ట్ర కమిటీ సభ్యులు సాయిబాబు, పైళ్ల ఆశయ్య, సీఐటీయూ సింగరేణి విభాగం డెప్యూటీ కార్యదర్శి నాగరాజ్గోపాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి, కార్యదర్శి వర్గ సభ్యుడు జి.ప్రకాష్, నాయకులు రాజన్న, శ్రీనివాస్, రమణ, అశోక్ తదితరులు పాల్గొన్నారు.ఐక్యంగా ఉద్యమించాలి..రామకృష్ణాపూర్: ప్రైవేటీకరణ బారి నుంచి సింగరే ణి సంస్థను కాపాడుకునేందుకు అన్ని రాజకీయ ప క్షాలు ఐక్యంగా ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వీరయ్య అన్నారు. బస్సుయాత్ర సోమవారం సాయంత్రం ఆర్కేపీకి చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థ పరిరక్షణకు చేపట్టిన బస్సుయాత్రకు అన్ని వర్గాల ప్రజలు మద్దతునివ్వాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు భూపాల్, ఆశన్న, శంకర్, రవి, వెంకట స్వామి, శ్రీనివాస్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.సింగరేణికే కేటాయించాలి..మందమర్రిరూరల్: రాష్ట్రంలోని నూతన బొగ్గు గనులను సింగరేణికి కేటాయించి సంస్థను కాపాడాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు పైళ్ల ఆశయ్య డిమాండ్ చేశారు. సోమవారం బస్సుయాత్ర మందమర్రికి చేరుకోగా.. ఏరియాలోని కేకే–5గనిపై ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన బొగ్గు గనులు వస్తేనే సింగరేణికి భవిష్యత్ ఉందని తెలిపారు. అనంతరం మార్కెట్, పలు వీధుల గుండా బస్సుయాత్ర సాగింది.ఇవి చదవండి: ఏపీకి కేంద్ర నిధులపై బీజేపీ నేత జీవీఎల్ క్లారిటీ -
ఎమ్మెల్సీ లేదా చైర్మన్ పోస్టులిస్తాం
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పారీ్టకి మద్దతిస్తే సీపీఎంకి ఎమ్మెల్సీ లేదా కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీనిచ్చారు. ఈ మేరకు భట్టి శుక్రవారం సీపీఎం రాష్ట్ర కార్యాలయానికి వచ్చి పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యు లు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్. వీరయ్య, జూలకంటి రంగారెడ్డితో భేటీ అయ్యారు. సుమారు 45 నిమిషాలకు పైగా పలు అంశాలపై చర్చించిన మీదట ఎట్టకేలకు పార్లమెంటు ఎన్నికల్లో కలిసి ప్రయాణించాలని ఆ రెండు పారీ్టలు అంగీకారానికి వచ్చాయి. ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు సంబంధించి పార్టీ ఆదేశాల మేరకు సీపీఎం కార్యాలయానికి వచ్చానని, ఎన్నికల్లో కలిసి ప్రయాణం చేద్దామని కోరానని చెప్పారు. ఇరు పారీ్టల పరంగా అభిప్రాయాలు పంచుకున్నామని చెప్పారు. ఇరు వురి అభిప్రాయాలపై సీఎం రేవంత్రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడి శనివారం ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సాధారణ ఎన్నికల్లో కలిసి ప్రయాణించాలని ఇరు పార్టీలు సుహృద్భావ వాతావరణంలో ఓ అంగీకారానికి వచ్చామని అన్నారు. భువనగిరి స్థానంలో మద్దతు ఇమ్మన్న సీపీఎం భువనగిరి స్థానానికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలని సీపీఎం నాయకులు భట్టిని కోరారు. మిగిలిన 16 స్థానాల్లో తాము మద్దతిస్తామని తెలిపారు. అయితే భువనగిరి స్థానంలో కూడా తమకే మద్దతు ఇవ్వాలని భట్టి కోరారు. అందుకు తాము ఎమ్మెల్సీ లేదా చైర్మన్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. భట్టి రావడం హ్యాపీ.. కానీ రేవంత్ అలా మాట్లాడకూడదు: తమ్మినేని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తమ పార్టీ కార్యాలయానికి రావడం, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి పనిచేయాలంటూ కోరడం సంతోషకరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. ఇది తమ ఆలోచనలకు అనుగుణంగానే ఉందన్నారు. సీట్లు, మద్దతు విషయంలో భట్టితో మాట్లాడామని చెప్పారు. భువనగిరి మినహా మిగతా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం కలిసి చర్చించినపుడు తుది నిర్ణయానికి వస్తామన్నారు. కేరళలో సీఎం రేవంత్ రెడ్డి అలా మాట్లాడి ఉండాల్సింది కాదని తమ్మినేని వ్యాఖ్యానించారు. -
కాంగ్రెస్తో పొత్తుకు అవకాశం
సాక్షి, హైదరాబాద్/సుందరయ్య విజ్ఞాన కేంద్రం: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి వెళ్లేందుకు అవకాశాలున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కూడా కమ్యూనిస్టులతో వెళ్లాలని భావిస్తోందన్నారు. ఒకవేళ పొత్తు ఉన్నా లేకున్నా రెండు ఎంపీ సీట్లలో సీపీఎం పోటీ చేయాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రెండు రోజులపాటు జరగనున్న సీపీఎం రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం ప్రారంభమైంది. ఆ పార్టీ సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. తమ్మినేని మాట్లాడుతూ.. పొత్తు ఉంటుందా? లేదా? అన్నది కాంగ్రెస్ పారీ్టనే తేల్చాలన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్రెడ్డి చెబుతున్నారని, కానీ ఒకసారి ఆరు నెలలు, మరోసారి సంవత్సరంలో భర్తీ చేస్తామని అంటున్నారని, ఈ రెండు మాటల్లో మర్మమేంటని ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల్లో రామమందిరం ప్రారంభోత్సవ ప్రభావం ఏ మేరకు ఉంటుందో చూడాలని తమ్మినేని వ్యాఖ్యానించారు. అక్షింతలు ఓట్లుగా మారతాయా? బీజేపీకి ఓట్లేస్తారా? అనేది చూడాలన్నారు. బీజేపీపై రేవంత్రెడ్డి పోరాడాలి: బీవీ రాఘవులు కర్ణాటక ప్రభుత్వ తరహాలో బీజేపీకి వ్యతిరేకంగా రేవంత్రెడ్డి ఇక్కడ పోరాడాలని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు కోరారు. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ సమన్లు వచ్చాయని, అవి సమన్లా లేక గాలమా అనేది కొద్దిరోజుల్లో తేలుతుందని వ్యాఖ్యానించారు. ’’కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓట్లేస్తే మూసీనదిలో వేసినట్టేనని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అంటున్నారు కానీ నిజానికి కిషన్రెడ్డీ నువ్వే మూసీలో పడిపోతావు జాగ్రత్త’’అని రాఘవులు ఎద్దేవాచేశారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య, చుక్క రాములు, జూలకంటి రంగారెడ్డి, డీజీ నరసింహారావు, జాన్వెస్లీ, పాలడుగు భాస్కర్, టి.సాగర్, మల్లు లక్ష్మి, పి.ప్రభాకర్ పాల్గొన్నారు. -
వీరయ్యకు పార్టీ పర్యవేక్షణ బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సీపీఎం పర్యవేక్ష ణ బాధ్యతలు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్యకు అప్పగించారు. రాష్ట్ర రాజధాని హై దరాబాద్లో ఉంటూ పార్టీని నడిపించాల్సిన బాధ్య తను ఆయనకు అప్పగిస్తూ సీపీఎం రాష్ట్ర కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 9, 10 తేదీల్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గం, రాష్ట్ర కమిటీ సమావే శాలు జరిగాయి. ఆ భేటీల్లో ఈ నిర్ణయం తీసుకు న్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఏఐజీలో ఆయన చికిత్స పొందారు. ఆయనకు మరింత విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారు. ఈ నేపథ్యంలో రెండ్రోజులు జరిగిన పార్టీ సమావే శాలకు కూడా తమ్మినేని కొద్దిసేపు మాత్రమే హాజర య్యారు. కాగా తమ్మినేని సలహాలు, సూచనలు, మార్గదర్శకత్వంలోనే వీరయ్య పనిచేయాలని స్ప ష్టం చేస్తూ రాష్ట్ర కమిటీ తీర్మానించింది. అవసరాన్ని బట్టి తమ్మినేని హైదరాబాద్లో, అలాగే ఖమ్మంలోనూ ఉంటారు. మూడు నెలల పాటు వీరయ్య ఈ బాధ్యతలు నిర్వర్తించాలని సీపీఎం నిర్ణయించింది. దీంతో వచ్చే లోక్సభ ఎన్నికల సమయంలో పార్టీని నడిపించాల్సిన బాధ్యత వీరయ్యపై పడింది. ఈయన గతంలో ఎస్ఎఫ్ఐ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడిగా, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా, నవ తెలంగాణ ఎడిటర్గా పనిచేశారు. రెండు ఎంపీ సీట్లలో పోటీ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో రెండు స్థానాల్లో పోటీ చేయాలని పార్టీ నిర్ణయించినట్లు తమ్మినేని ఒక ప్రకటనలో తెలిపారు. స్ధానిక జిల్లా కమిటీలతో చర్చించిన అనంతరం త్వరలో సీట్లను ఖరారు చేయాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. ఖమ్మం, మహబూబాబాద్, నల్లగొండ, భువనగిరి స్థానాల్లో ఏవో రెండింటిలో పోటీ చేయాలని సీపీఎం భావిస్తున్నట్టు తెలిసింది. నేతల గురి ప్రధానంగా మహబూబాబాద్, భువనగిరి స్థానాలపై ఉన్నట్లు సమాచారం. అయితే ఈసారి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ముందుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక స్థానమే ఇస్తాననడంతో పొత్తు కుదరలేదు. ఇక రెండ్రోజులు జరిగిన సమావేశాల్లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి, లోక్సభ ఎన్నికలు, తదితర అంశాలపై సీపీఎం చర్చించింది. కాంగ్రెస్తో అవగాహన చేసుకొని ఉంటే సానుకూల ఫలితాలు వచ్చేవన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం. ఒక స్థానంలో సీపీఐ పోటీ! సీపీఐ కనీసం ఒక లోక్సభ స్థానంలో పోటీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే లోక్సభ ఎన్నికలకు మద్దతు కోరి ఎమ్మెల్సీలు లేదా రాజ్యసభ సీటు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించవచ్చని అనుకుంటున్నారు. 16న సమ్మెకు మద్దతు కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 16న జరిగే దేశవ్యాప్త సమ్మె, గ్రామీణ బంద్కు పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని, ప్రజలంతా పాల్గొనాలని తమ్మినేని విజ్ఞప్తి చేశారు. -
కృష్ణా జలాలపై కేంద్రానికి పెత్తనం ఇవ్వొద్దు! : తమ్మినేని వీరభద్రం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కృష్ణా, గోదావరి జలాల విషయంలో శాస్త్రీయ పరిష్కారానికి ఆలోచన చేయాలే తప్ప కేంద్రానికి పెత్తనం అప్పగించొద్దని.. అదే జరిగితే రాష్ట్రానికి తీవ్ర నష్టమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏదో ఒక కొర్రీ సృష్టిస్తూ కేంద్రంలోని బీజేపీ రాష్ట్రాల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందని.. తద్వారా ప్రతిపక్షాలు లేకుండా చేయాలన్నదే బీజేపీ కుట్ర అని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని బలిచేసి ఏకపక్ష పరిపాలన కోసమే ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’పై కేంద్రం రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటుచేసిందన్నారు. కాగా, ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని చరిత్ర కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలదని తమ్మినేని తెలిపారు. రాష్ట్రాలు విడిపోయినా.. తెలుగు ప్రజలు అంతా ఒక్కటేనని ఆయన చెప్పారు. అయితే, రాష్ట్ర విభజన జరిగి ఏళ్లు గడుస్తుండగా.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, కాళేశ్వరానికి జాతీయ హోదా వంటి హామీలేవీ నెరవేరకున్నా బీఆర్ఎస్, కాంగ్రెస్ ఐక్యంగా పోరాడకుండా ఓట్ల కోసం తగువు పడితే తెలంగాణ ప్రజలకు నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలుతుందని బీఆర్ఎస్ శాపనార్థాలు పెట్టడం సరైందికాదన్నారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో అభివృద్ధి చేసినా ఉద్యమాలు, హక్కుల విషయాల్లో అణిచివేయడం, ఏకపక్ష నిర్ణయాలతో ప్రతిపక్షాలపై అహంకార పూరితంగా ప్రవర్తించిందని తమ్మినేని చెప్పారు. కాగా, కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ, కార్మిక విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 16న నిర్వహించే దేశ వ్యాప్త సమ్మెకు సీపీఎం మద్దతు తెలుపుతోందన్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటామని వీరభద్రం తెలిపారు. కాగా, పాలేరు పాత కాల్వ కింద 6వేల ఎకరాల్లో వరి, 1,227 ఎకరాల్లో చెరుకు సాగు చేసినందున నీరు విడుదల చేయించే బాధ్యత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుపై ఉందన్నారు. ఈ సమావేశంలో నాయకులు పోతినేని సుదర్శన్రావు, సాయిబాబా, ఎర్రా శ్రీకాంత్, బుగ్గవీటి సరళ, పొన్నం వెంకటేశ్వరరావు, కళ్యాణం వెంకటేశ్వరరావు, మాచర్ల భారతి, భూక్య వీరభద్రం, బండి రమేష్, వై.విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: చర్చకు తేవాల్సిన అంశాలెన్నో.. -
స్పీకర్ గడ్డం ప్రసాద్, తమ్మినేనిని పరామర్శించిన సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. స్పీకర్ గడ్డం ప్రసాద్, సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రాన్ని పరామర్శించారు. వారి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. వివరాల ప్రకారం.. నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్లో రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం, సీఎం రేవంత్.. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్కు వెళ్లారు. ఈ క్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ను కలిసి పరామర్శించారు. కాగా, ఇటీవలే స్పీకర్ ప్రసాద్ అనారోగ్యానికి గురయ్యారు. మరోవైపు.. తమ్మినేని వీరభద్రాన్ని కూడా సీఎం రేవంత్ పరామర్శించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన సీఎం రేవంత్.. తమ్మినేనిని పరామర్శించారు. కాగా, తమ్మినేనికి ఇటీవల స్ట్రోక్ రావడంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. దీంతో, ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
తమ్మినేని ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన ఏ ఐజీ హాస్పిటల్
-
నిలకడగా తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం
సాక్షి, హైదరాబాద్: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం నిలకడగా ఉందని.. నిన్నటితో పోలిస్తే బీపీ లెవెల్స్ నార్మల్కి చేరుకుంటున్నాయని ఏఐజీ ఆసుపత్రి ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తమ్మినేని వీరభరం గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని తెలిపిన వైద్యులు.. ఊపిరితిత్తుల్లోని నీటిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. లంగ్స్లో నీరునీ వైద్యులు తొలగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రసుత్తం ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్ సహాయంతో కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. మెడిసిన్కి తమ్మినేని రెస్పాండ్ అవుతున్నారని, ఆరోగ్యం కుదట పడితే వెంటిలేటర్ తొలగించే అవకాశం ఉంటుందని.. వచ్చే 24 నుంచి 48 గంటలు చాలా కీలకమని వైద్యులు పేర్కొన్నారు. స్వగ్రామమైన ఖమ్మం జిల్లాలోని తెల్దారుపల్లిలో ఉన్న తమ్మినేనికి సోమవారం సాయంత్రం ఒంట్లో నలతగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు పల్స్ తక్కువగా ఉండటాన్ని గుర్తించి వెంటనే చికిత్స అందించారు. అయితే గుండె కొట్టుకోవడంలో తేడాలున్నాయని వైద్యులు చెప్పారు. దీంతో కుటుంబసభ్యులు తమ్మినేనిని వెంటిలేటర్ సపోర్టుతో ఖమ్మం నుంచి హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. -
Tammineni: వెంటిలేటర్పైనే తమ్మినేని.. విషమంగా ఆరోగ్యం
సాక్షి, హైదరాబాద్: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం విషమంగా ఉందని ఏఐజీ ఆస్పత్రి ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. స్వగ్రామమైన ఖమ్మం జిల్లాలోని తెల్దారుపల్లిలో ఉన్న తమ్మినేనికి సోమవారం సాయంత్రం ఒంట్లో నలతగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు పల్స్ తక్కువగా ఉండటాన్ని గుర్తించి వెంటనే చికిత్స అందించారు. అయితే గుండె కొట్టుకోవడంలో తేడాలున్నాయని వైద్యులు చెప్పారు. దీంతో కుటుంబసభ్యులు తమ్మినేనిని వెంటిలేటర్ సపోర్టుతో ఖమ్మం నుంచి హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. గుండె పనిచేయకపోవడం, గుండె కొట్టుకోకపోవడంతో అసాధారణ పరిస్థితి నెలకొందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. దీంతోపాటు మూత్రపిండాలు పనిచేయకపోవడం, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వల్ల ఇన్వాసివ్ వెంటిలేషన్ అవసరమైంది. బీపీ మెరుగుపరిచేందుకు మందులు అందిస్తున్నారు. ఊపిరితిత్తుల నుంచి నీరు తొలగించి, గుండె సాధారణ స్థితికి వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. డాక్టర్ సోమరాజు, డాక్టర్ డీఎన్ కుమార్ మార్గదర్శకత్వంలో తమ్మినేనికి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి ఇంకా విషమంగా ఉందని, వెంటిలేటర్పై ఉన్నారని ఆ బులెటిన్లో ఏఐజీ వెల్లడించింది. ఆస్పత్రిలో తమ్మినేని ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో సంప్రదించి తగిన వైద్యం అందించడానికి పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య, డీజీ నరసింహారావు, పి.ప్రభాకర్ పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు తమ్మినేనిని మాజీ మంత్రి హరీశ్రావు పరామర్శించారు. తమ్మినేని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. 2004లోనూ తమ్మినేనికి గుండెనొప్పి రావడంతో వైద్యులు స్టంట్స్ వేశారు. -
సీపీఎం తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు
సాక్షి, హైదరాబాద్: సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గుండె పోటుకు గురయ్యారు. దీంతో, మెరుగైన వైద్యం కోసం తమ్మినేనిని వెంటనే హైదరాబాద్కు తరలించారు. ఇక, గతంలోనే తమ్మినేని స్ట్రోక్ రావడంతో స్టంట్ కూడా పడింది. వివరాల ప్రకారం.. సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం గుండె పోటు కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తన స్వగ్రామం తెల్దారపల్లిలో ఉన్న సమయంలోనే తమ్మినేని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆయనను వెంటనే ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో లంగ్స్ ఇన్ఫ్క్షన్తో పాటు మైల్డ్ హార్ట్ స్ట్రోక్ లక్షణాలను వైద్యులు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు రిఫర్ చేశారు. ఈ నేపథ్యంలో అంబులెన్స్లో తమ్మినేనిని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా.. గతంలో తమ్మినేనికి స్ట్రోక్ వచ్చిన నేపథ్యంలో అప్పుడు ఆయనకు వైద్యులు స్టంట్ వేశారు. తాజాగా మరోసారి మైల్డ్ స్ట్రోక్ రావడంతో పరిస్థితి కొంచెం విషమంగా మారింది. -
పార్టీ అభిమానులూ ఓటేయలేదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీపట్ల అభిమానం ఉన్నవారు కూడా ఓటేయలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలపై పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గం, రాష్ట్ర కమిటీ మూడు రోజులపాటు హైదరాబాద్లో సమావేశమైంది. ఈ భేటీకి కేంద్ర పరిశీలకులుగా సీపీఎం పొలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, ఎ.విజయ రాఘవన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం తనను కలిసిన విలేకర్లతో తమ్మినేని మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలు, పార్టీ అనుసరించిన ఎత్తుగడలు, ఫలితాలపై సమీక్షించామని చెప్పారు. సీపీఎం కుటుంబాలు మినహా పార్టీ అభిమానులు కూడా ఈసారి తమకు ఓటేయకపోవడంతో గతంతో పోలిస్తే సీపీఎం దారుణంగా దెబ్బతిన్నదన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేశామని... ప్రతి ఎన్నికల్లోనూ ఇదే అనుభవం ఎదురైందని చెప్పారు. పార్టీలో లోపాలు జరిగాయని, వాటిని సమీక్షించుకొని భవిష్యత్తులో పార్టీని పటిష్టం చేయడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకున్నామని తమ్మినేని చెప్పారు. పొత్తు సాధ్యం కాక... తాము పోటీ చేసిన 19 స్థానాల్లో గెలుస్తామని భావించకపోయినా ఓట్లు తక్కువ రావడం ప్రధాన లోపంగా పార్టీ గుర్తించిందని తమ్మినేని వివరించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్తో సీట్ల సర్దుబాటు విషయంలో కాలయాపన కావడం, చివరి నిమిషంలో పొత్తు సాధ్యం కాదని తేలాక ఒంటరిగా పోటీ చేయాల్సి రావడం దెబ్బతీసిందని చెప్పారు. ఎన్నికలకు సిద్ధం కావడానికి సమయం సరిపోని పరిస్థితి ఏర్పడిందని వివరించారు. మరోవైపు బీఆర్ఎస్ అహంభావ, అప్రజాస్వామిక ధోరణులను తీవ్రంగా వ్యతిరేకించిన ప్రజలు కాంగ్రెస్కు ఓటేశారని తమ్మినేని విశ్లేషించారు. రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర, రేవంత్రెడ్డి నాయకత్వం, కర్ణాటకలో కాంగ్రెస్ విజయం వంటి పరిణామాలన్నీ కాంగ్రెస్ గెలుపునకు తోడ్పడ్డాయని వివరించారు. గత ఎన్నికలతో పోల్చితే బీజేపీకి ఓట్లు, సీట్లు రెట్టింపయ్యాయనీ, ఇది ఓ ప్రమాదకర సంకేతమని చెప్పారు. -
సీపీఎంకు భంగపాటు.. తమ్మినేనికి ఎదురుదెబ్బ!
ఉమ్మడి ఖమ్మం జిల్లాను ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట అనేవారు. ఇప్పుడు కంచుకోట కనుమరుగైపోయింది. కాంగ్రెస్ మద్దతుతో సీపీఐ ఒక సీటు గెలుచుకుంది. ఒంటరిగా బరిలోకి దిగిన సీపీఎం కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శికి కూడా డిపాజిట్ దక్కలేదు. ఇంత పతనాన్ని సీపీఎం నాయకులు ఊహించలేదా? ఊహించినా నిర్లక్ష్యంగా వ్యవహరించారా? తాజా ఎన్నికలతో కమ్యూనిస్టుల ప్రస్తుత వాస్తవ బలం ఎంతో తెలిసిందా?.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు ప్రస్తుతం ఉన్న ప్రజా బలం ఎంతో తేలిపోయింది. సీపీఐ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం సీటు ఒక్కటి తీసుకుని కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది. సీపీఎం మాత్రం సీట్ల బేరం కుదరక ఒంటరిగా బరిలోకి దిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 19 స్థానాల్లో పోటీ చేయగా.. కనీసం ఒక్క చోట కూడా డిజాజిట్ దక్కలేదు. పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు సొంత ఊరులో కూడా అతి స్వల్పంగా ఓట్లు రావడం ఆ పార్టీ దయనీయ పరిస్థితిని కళ్లకు కడుతోంది. ఒకనాడు ఎర్ర జెండాల రెపరెపలతో కళకళలాడిన ఖమ్మం జిల్లాలో సీపీఎంకు ఇంతటి దారుణమైన ఫలితాలు వస్తాయని ఆ పార్టీ నేతలు కూడా ఊహించి ఉండరనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తమ బలాన్ని అతిగా అంచనా వేసుకుని తమకు సీట్లు ఇవ్వని కాంగ్రెస్ను దెబ్బ కొడదామనుకున్నారా? లేక వాస్తవాలు తెలిసినా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన సమయంలో 2014లో జరిగిన ఎన్నికల్లో సీపీఎం, సీపీఐలకు చెరో సీటు దక్కింది. గత సభలో రెండు పార్టీలు ఒక్కో స్థానం కూడా పొందలేకపోయాయి. తాజా ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీ చేస్తామని చెప్పినా.. ఆచరణలో అలా జరగలేదు. కాంగ్రెస్తో సీపీఐ పొత్తు పెట్టుకోగా.. సీపీఎం ఒంటరిగా పోటీ చేసింది. పాలేరు నుంచి పోటీ చేసిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు కూడా సీపీఎం ఓటర్లు ఝలక్ ఇచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా సీపీఎంకు 18 వేల నుంచి 20 వేల ఓట్లు ఉన్నట్లు చెబుతున్నా.. తమ్మినేని కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. రాష్ట్రంలో సీపీఎం పరిస్థితిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. తమ్మినేని వీరభద్రంకు కేవలం 5వేల 308 ఓట్లు మాత్రమే వచ్చాయి. సొంతూరు తెల్దారపల్లిలో సైతం అతి తక్కువ ఓట్లు రావడంతో తమ్మినేని జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీపీఎంకు అన్ని నియోజకవర్గాల్లో కొంత ఓటు బ్యాంకు ఉంది. పాలేరు, మధిర, వైరా, భద్రాచలం నియోజకవర్గాల్లో సీపీఎంకు ఓట్ బ్యాంక్ ఉంది. ఈ నాలుగు స్థానాల్లోనూ గత ఎన్నికల్లో కంటే ఈసారి చాలా తక్కువ ఓట్లు సీపీఎంకు దక్కాయి. ఈసారి మధిర నియోజకవర్గంలో పోటీ చేసిన సీపీఎం అభ్యర్థికి అత్యధికంగా 6,575 ఓట్లు వచ్చాయి. ఈ ఓట్లు గత ఎన్నికల్లో నాలుగో వంతు మాత్రమే. ఇక అత్యల్పంగా హైదరాబాద్లోని ముషీరాబాద్ అభ్యర్థికి 835 మాత్రమే పోలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసిన 19 సీపీఎం అభ్యర్థులకు కలిపినా మొత్తం 50 వేల ఓట్లు కూడా పోలవ్వలేదు. పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్ ప్రతిపాదించినట్లు మిర్యాలగూడెం అసెంబ్లీ సీటుతో పాటు రెండు ఎమ్మెల్సీలకు అంగీకరించి ఉంటే గౌరవంగా ఉండేదన్న అభిప్రాయాలు ఇప్పుడు సీపీఎం నాయకత్వంలో వ్యక్తమవుతున్నట్లు టాక్ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోగా.. కనీసం ఆశించిన స్థాయిలో కూడా ఓట్లు రాకపోవడంతో మండలాల వారీగా సమావేశం ఏర్పాటు చేసి జరిగిన పొరపాట్లను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. లోపం ఎక్కడ జరిగిందో తెలుసుకుని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసుకుని మళ్లీ జిల్లాలో పార్టీని బలోపేతం చేసుకోవాలని సీపీఎం నాయకత్వం భావిస్తోంది. -
సీపీఎంకు ఎక్కడా డిపాజిట్లు దక్కలే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎంకు ఘోర పరాభవం మిగిలింది. ఒంటరిగా పోటీచేసిన 19 స్థానాల్లోనూ దాదాపు అన్నిచోట్లా డిపాజిట్లు కోల్పోయింది. ఖమ్మం జిల్లా పాలేరులో పోటీచేసిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా గౌరవప్రదమైన ఓట్లు పొందలేకపోయారు. ఆయనకు 16వ రౌండ్ వచ్చేసరికి కేవలం 4,354 ఓట్లు వచ్చాయి. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డికి 3,234 ఓట్లు మాత్రమే వచ్చాయి. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థురాలిగా బరిలోకి దిగిన శిరీష (బర్రెలక్క)కు 5,598 ఓట్లు వచ్చాయి. ఆ స్థాయి ఓట్లు కూడా సీపీఎం అభ్యర్థులకు రాకపోవడం గమనార్హం. కాంగ్రెస్తో పొత్తు విషయంలో ప్రతిష్టకు పోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందన్న చర్చ ఆ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. సీపీఎం తాను పోటీచేసిన మొత్తం 16 స్థానాల్లోనూ కలిపి 49,604 ఓట్లు మాత్రమే సాధించింది. కాంగ్రెస్కే పడ్డ సీపీఎం ఓట్లు! పార్టీ కార్యకర్తలు అనేకచోట్ల కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లు వేశారన్న చర్చ జరుగుతోంది. తాము పోటీచేయని చోట కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేయాలని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొనగా, రాష్ట్ర పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాత్రం ప్రజాతంత్ర లౌకిక శక్తులకు ఓటు వేయాలని మాత్రమే చెప్పారు. ఈ విషయంలో కేంద్ర కమిటీకి, రాష్ట్ర కమిటీకి మధ్య వైరుధ్యం నెలకొందన్న విమర్శలు వచ్చాయి. కాగా, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు 26,568 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండు ఎమ్మెల్సీలు కూడా ఆ పార్టీకి దక్కనున్నాయి. సీపీఎం మాత్రం పరాజయం పాలవడమే కాకుండా, తన ఓటు బ్యాంకును కూడా నిలబెట్టుకోలేకపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. -
కాంగ్రెస్కు మద్దతుపై ఏచూరి వర్సెస్ తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్కు మద్దతు విషయంలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నట్టు తెలుస్తోంది. ‘తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఎన్నికల బరిలోకి దిగాం. కాబట్టి మేం పోటీ చేయని నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు ఓటేయ్యాలి’అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చాలా స్పష్టంగా చెప్పారు. కానీ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అలాంటి స్పష్టత ఎక్కడా ఇవ్వడంలేదు. ‘మా పార్టీ పోటీ చేసే 19 నియోజకవర్గాలు మినహా బీజేపీ బలంగా ఉన్నచోట్ల దానిని ఓడించగల పార్టీకి ఓటు వేయాలని కోరుతున్నాం. కొత్తగూడెంలో సీపీఐ, పినపాకలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ, శేర్లింగంపల్లిలో ఎంసీపీఐ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నాము. మిగిలిన స్థానాలలో ఎవరిని బలపరచాలో పార్టీ జిల్లా కమిటీలు తగు నిర్ణయం తీసుకొని ప్రజాతంత్ర, లౌకిక, సామాజిక, పోరాట శక్తులకు మద్దతు ఇస్తాయ’ని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. చదవండి: రెండున్నర లక్షల ఓట్లు.. ఆర్టీసీ ఉద్యోగులు ఎటు వైపో? ఇక్కడ ఏచూరి ప్రకటనకు, తమ్మినేని ప్రకటనకు మధ్య వైరుధ్యం ఉందని ఆ పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ‘ఇండియా’కూటమిలో ఉన్నందున తాము కాంగ్రెస్కు మద్దతు ఇస్తామని ఏచూరి స్పష్టం చేయగా, తమ్మినేని మాత్రం అలాంటి స్పష్టత ఇవ్వలేదు. రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉన్న స్థానాల్లో ఆ పార్టీని ఓడించగలిగే పార్టీలకు ఓటు వేయాలని కోరుతున్న తమ్మినేని, మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్కు ఓటు వేయమని ఎందుకు పిలుపునివ్వడంలేదని రాజకీయ విశ్లేషకులు ప్రశి్నస్తున్నారు. ఏచూరికి సమాచారం ఇవ్వలేదా? రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 19 స్థానాల్లో సీపీఎం ఒంటరిగా పోటీ చేస్తుంది. మిగిలిన స్థానాల్లో బీజేపీ బలంగా ఉన్నచోట దాన్ని ఓడించే పార్టీలకు ఓటేయ్యాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. బీజేపీ బలంగా లేనిచోట ఏ పార్టీకి ఓటు వేయాలన్న దానిపైనే కేంద్ర కమిటీకి, రాష్ట్ర కమిటీకి మధ్య భిన్నాభిప్రాయం నెలకొంది.. సీతారాం ఏచూరికి రాష్ట్ర పార్టీ నిర్ణయాన్ని తెలియజేయలేదని తెలిసింది. కాగా, తాము పోటీ చేస్తున్న 19 స్థానాలలో సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో కోరారు. చదవండి: డిసెంబర్ 4న జాబ్ కేలండర్ ఇస్తాం: కేటీఆర్ -
అందుకే మమ్మల్ని కాంగ్రెస్ వదిలేసింది
బొల్లోజు రవి కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదరకపోవడంతో సీపీఎం ఒంటరిగా బరిలోకి దిగింది. 19 స్థానాల్లో పోటీ చేస్తోంది. పొత్తు కోసం ఇన్నాళ్లు ఎదురుచూసినా ఫలితం లేకుండా పోయింది. కాంగ్రెస్ మిర్యాలగూడ స్థానం సహా రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని చెప్పింది. మిర్యాలగూడ, వైరా స్థానాలు ఇస్తేనే మద్దతు ఉంటుందని, లేకుంటే ఉండదని సీపీఎం తేల్చిచెప్పింది. దీంతో పొత్తు కుదరకపోవడంతో సీపీఎం సొంతంగా బరిలోకి దిగింది. కాంగ్రెస్తో పొత్తు విచ్ఛిన్నం, కాంగ్రెస్తో సీపీఐ వెళ్లిపోవడం, ఒంటరిపోరు నేపథ్యంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రాన్ని ‘సాక్షి’ ఇంటర్వ్యూ చేసింది. కాంగ్రెస్తో పొత్తు విఫలమయినట్లేనా? ఇంకా ఏమైనా ఆశలున్నాయా? కాంగ్రెస్తో పొత్తు కథ ముగిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక పొత్తు ఉండదు. ఎలాంటి ఆశలు కూడా పెట్టుకోలేదు. మేం ప్రకటించిన 19 స్థానాల్లో అభ్యర్థులు ప్రజల వద్దకు వెళ్లి ఓట్లడుగుతారు. మిర్యాలగూడను ఒకవేళ వాళ్లు మాకిచి్చనా కాంగ్రెస్ పార్టీ తన అభ్యరి్థని ఏదో రకంగా రంగంలోకి దింపేది. అయినా ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు లేకుండా పొత్తు ఎలా ఉంటుంది. కాంగ్రెస్, వామపక్షాలు విడిగా పోటీ చేయడం వల్ల కాంగ్రెస్కు నష్టమే కదా... అలాంటిది మీతో పొత్తు విషయంలో ఎందుకు ఇలా చేస్తుందని భావిస్తున్నారు? మాతో ప్రయోజనం లేదని కాంగ్రెస్ మమ్మల్ని వదిలేసింది. పొత్తు పెట్టుకుంటేనే కాంగ్రెస్కు నష్టమట. మాకు సీట్లు ఇస్తే ఓడిపోతామని, అదే ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తే గెలుస్తారని వారి నమ్మకం. మేము పోటీ చేయడం వల్లే వారికి లాభమట. మాతో చర్చల సందర్భంగా కూడా కాంగ్రెస్ నాయకులు ఈ విధంగానే మాట్లాడారు. అందుకే పొత్తు విషయంలో ముందుకు రావడంలేదు. సీపీఐకి కొత్తగూడెం స్థానంలో మద్దతు ఇస్తారా? అలాగే మీరు పోటీ చేసే 19 స్థానాల్లో మద్దతు కోరతారా? కొత్తగూడెంలో సీపీఐ తరపున పోటీ చేస్తున్న కూనంనేని సాంబశివరావుకు మద్దతు ఇస్తున్నాము. అయితే మేం పోటీ చేసే 19 చోట్ల సీపీఐ మద్దతు ఇస్తుందని నేననుకోను. ఎందుకంటే సీపీఐ, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరింది. రాష్ట్రవ్యాప్తంగా పొత్తులో భాగంగానే కొత్తగూడెం స్థానం కేటాయించారు. కాబట్టి సీపీఐ మాకు మద్దతు ఇవ్వదు. ఒకవేళ వారి ఓటర్లు ఎక్కడైనా మాకు మద్దతు ఇస్తే అది వారిష్టం. బీఆర్ఎస్ది అవకాశవాదమని మీరు భావిస్తున్నారా..? బీఆర్ఎస్గానీ, ఇతర ప్రాంతీయ పార్టీలుగానీ అవకాశవాదంతోనే వ్యవహరిస్తాయి. ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ను గద్దెదించడమే తమ లక్ష్యమని బీజేపీ ప్రకటించింది. అందుకు అనుగుణంగానే హుజూరాబాద్, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రభావం చూపింది. ఆ ఊపులో అసెంబ్లీ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్న వాతావరణాన్ని సృష్టించాలని భావించింది. ఆ సమయంలో కేసీఆర్కు మరో మార్గం లేదు. అందుకే బీజేపీని వ్యతిరేకించారు. ఆ తర్వాత కర్నాటక ఫలితాలు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో బీజేపీ మూడో స్థానంలోకి వెళ్లిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంది. కేసీఆర్ మూడ్ మారిపోయింది. బీజేపీతో ప్రమాదం లేదని అర్ధమైంది. ఈ ఎన్నికల తర్వాత సీట్లు తక్కువైతే బీజేపీ, ఎంఐఎం మద్దతు తీసుకునే పరిస్థితి ఉంది. అందుకే కమ్యూనిస్టుల అవసరం కేసీఆర్కు లేదు. అవకాశవాదంతో రాజకీయాలను మార్చారు. ఈ ఎన్నికల్లో ఒక్క సీటయినా సాధిస్తారా..? గెలుస్తామన్న నమ్మకంతోనే 19 స్థానాల్లోనూ పోటీ చేస్తున్నాం. అన్ని చోట్లా గెలవాలన్నదే మా లక్ష్యం. -
బీజేపీకి భయపడుతున్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘కమ్యూనిస్టులను కేసీఆర్ దూరం పెట్టడానికి ప్రధాన కారణం బీజేపీకి భయపడటమే. ఒకవేళ పొత్తు కుదిరితే కమ్యూనిస్టులు ఒకే వేదికపై బీజేపీని విమర్శిస్తారు. ఇది కేసీఆర్కు ఇబ్బందికరమైన అంశం. అలా చేస్తే కేసీఆర్ను బీజేపీ సహించదు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మళ్లీ బీజేపీనే వస్తే ఏమవుతుందోనని కేసీఆర్కు భయం పట్టుకుంది’అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం టీయూడబ్ల్యూజే నిర్వహించిన మీట్ ది ప్రెస్లో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీజేపీ పట్ల బీఆర్ఎస్ వైఖరి మారడం వల్లే ఆ పార్టీ తో పొత్తు కుదరలేదన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ తమను సంప్రదించిందని చెప్పారు. తమకు భయపడే కాంగ్రెస్ పొత్తుల విషయంలో కిరికిరి చేసిందన్నారు. కొన్ని జిల్లాల్లో తమ పార్టీ ఉనికినే దెబ్బతీయాలనేది వాళ్ల కుట్ర అని ఆరోపించారు. సీపీఐ, సీపీఎంతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్కు నష్టమని కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై తమ్మినేని మండిపడ్డారు. రెండు ఎమ్మెల్సీలు ఇస్తామని, అధికారం వస్తే సోనియాతో మాట్లాడి చెరో మంత్రి పదవి ఇప్పిస్తామనడంపై ధ్వజమెత్తారు. 1996లో జ్యోతిబసును ప్రధానిని చేస్తామంటేనే తిరస్కరించిన విషయాన్ని గుర్తుచేశారు. అధికార పార్టీపై ఎదురుగాలి... బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఈ తొమ్మిదేళ్లలో ప్రజా వ్యతిరేకత ఏర్పడిందని తమ్మినేని అన్నారు. ఈ ప్రభుత్వంపై ప్రస్తుతానికి ఎదురుగాలి వీస్తోందని, అయితే, అధికారం కోల్పోయేంత ఎదురుగాలి వీస్తుందో లేదో చూడాలన్నారు. ఒకవేళ మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలిచినట్లయితే ఇప్పుడు పరిస్థితి మరోలా ఉండేదని చెప్పారు. కాంగ్రెస్లో ఇప్పుడు చేరిన అనేక మంది నాయకులు అప్పుడు బీజేపీతో మంతనాలు జరిపిన వారేనన్నారు. బీఆర్ఎస్ను ఎవరు ఓడించగలరో ఆలోచిస్తున్నామని, మునుగోడు ఉప ఎన్నిక తర్వాత నిర్ణయం తీసుకుంటామని పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వంటి వారు చెప్పారన్నారు. మునుగోడులో బీజేపీ గెలిచినట్లయితే ఇప్పుడు కాంగ్రెస్ ఇలా ఉండేది కాదన్నారు. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్లా మారిందన్నారు. బీజేపీ ఐదారు సీట్లలో గెలిచే అవకాశముందనీ, అక్కడ ఆ పార్టీని ఓడించే సత్తా ఉన్న బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ లేదా ఇతర లౌకిక ప్రజాతంత్ర అభ్యర్థులకు ఓటేస్తామన్నారు. మగదేవుళ్ల ఆధిపత్యం సామాజిక, ఆర్థిక పరిస్థితులు మారడం వల్ల కమ్యూనిస్టులు కొంత వెనుకబడుతున్నారని తమ్మినేని చెప్పారు. కమ్యూనిస్టులు ఇప్పటివరకు ఆర్థిక అంశాలపైనే దృష్టిపెట్టారన్నారు. కడుపు నిండే డిమాండ్లపైనే దృష్టిపెట్టామని, మైండ్ను వదిలేశామన్నారు. పార్టీ ఆలోచనా విధానంలో మార్పు రావాలని, సామాజిక అంశాలపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. క్యాపిటలిజంలో సజీవ దేవుళ్లు అంటే బాబాలు ఉంటారన్నారు. వెంకటేశ్వరస్వామి, శ్రీకృష్ణుడు వంటి దేవుళ్లంతా ఫ్యూడల్ సమాజంలో భాగమేనన్నారు. ఇంకా వెంకటేశ్వరస్వామి ఆధిపత్యమే ఉందన్నారు. సమాజంలో మగదేవుళ్ల ఆధిపత్యమే ఉందని చెప్పారు. మగ ఆధిపత్యం ఎక్కడున్నా అది ఫ్యూడల్ సమాజమే అవుతుందన్నారు. వచ్చేసారి పార్టీ రాష్ట్ర కార్యదర్శి మారుతాడేమో... పార్టీ లో ఇంకా కమ్మ, రెడ్డోళ్ల ఆధిపత్యమేనా? జెండాలు మోసేది మాత్రం అణగారిన వర్గాలా అన్న ప్రశ్నపై తమ్మినేని స్పందిస్తూ... ‘కమ్యూనిస్టు ఉద్యమం అనేది రెవెల్యూషనరీ మూవ్మెంట్. నాలెడ్జ్ లేకుండా ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లలేం. కొన్ని వేల సంవత్సరాల వరకు కొన్ని కులాలకు చదువు, జ్ఞానం నిషేధం. నాలెడ్జ్ సంపాదించకుండా అభ్యుదయ ఉద్యమాలకు రావడం అసాధ్యమైన విషయం. ఆస్తి, చదువు సమకూరినప్పుడు అక్కడ విజ్ఞానానికి అవకాశం ఉంటుంది. ఈ చారిత్రక అసమతుల్యతను సరిదిద్దేందుకు కమ్యూనిస్టులు కృషిచేస్తున్నారు. తెలంగాణలో 33 జిల్లాల్లో ఐదారు జిల్లాలు తప్ప ఓసీలు ఎక్కడా సీపీఎం జిల్లా కార్యదర్శులుగా లేరు. ఎస్సీల జనాభా ఎంతుందో అంతమంది జిల్లా కార్యదర్శులున్నారు. బీసీ జనాభా ఎంతుందో అంతకంటే ఎక్కువగా పార్టీ కార్యదర్శులున్నారు. రాష్ట్ర కార్యదర్శి (తమ్మినేని) ఒకడున్నాడు. బహుశా వచ్చేసారి అది కూడా ఆలోచిద్దాం. ఒక్క లీడర్ను బట్టి కమ్మ అనడం సరికాదు. పార్టీలో చాలా మార్పులు తెచ్చామని’తమ్మినేని చెప్పారు. సీపీఐ, సీపీఎం ఐక్యమయ్యే అవకాశముందని, అయితే, దానికి సమయం పడుతుందన్నారు. -
కాంగ్రెస్ పై సీపీఎం నేత తమ్మినేని కామెంట్స్
-
జిల్లాలో.. ఒక్క సీటు కూడా ఇవ్వకుండా పొత్తు ఎలా? : తమ్మినేని వీరభద్రం
సాక్షి, ఖమ్మం: చట్టసభల్లో ప్రజాసమస్యలపై గళం వినిపించేది కమ్యూనిస్టులేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. ఖమ్మంలోని సుందరయ్య భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిలో కమ్యూనిస్టులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. జిల్లాలో సాగునీటి సమస్య పరిష్కారం కోసం దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకాన్ని సాధించేలా తాను సీపీఎం జిల్లా కార్యదర్శిగా పాదయాత్ర చేశానని గుర్తుచేశారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఖమ్మం నుండి తాను గెలవగా.. ముఖ్యమంత్రి వైఎస్సార్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని తెలిపారు. ఆ తర్వాత ప్రాజెక్టు పేర్లు, డిజైన్ మారినా... ప్రాజెక్టుకు మూలం మాత్రం సీపీఎం అని స్పష్టం చేశారు. జిల్లాకు పరిశ్రమల సాధన, కోల్బెల్ట్ సమస్యలు, భద్రాచలం అభివృద్ధితో పాటు అన్ని వర్గాల ప్రజల సమస్యలపై కమ్యూనిస్టు శాసనసభ్యులు క్రియాశీలకంగా పోరాడి చట్టసభల్లో గళమెత్తారని వెల్లడించారు. కాగా, జిల్లాలో సీపీఎంకు ఒక్క సీటు కూడా ఇవ్వని పార్టీలతో పొత్తు ఎలా పెట్టుకోవాలని తమ్మినేని ప్రశ్నించారు. ఈ విషయాలన్నింటినీ ప్రజలు గమనించి వామపక్షాలు, సామాజిక శక్తులు, బీఎస్పీ అభ్యర్థులకు గెలిపించాలని కోరారు. సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథాతో చర్చలు జరుగుతున్నందున ఒకటి, రెండో రోజుల్లో వివరాలు వెల్లడిస్తామని తమ్మినేని తెలిపారు. ఇవి చదవండి: వీరి ఓట్లే.. అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయిస్తాయి! -
పాలేరు నుంచి తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం పోటీ చేసే అభ్యర్థుల స్థానాలను ఆ పార్టీ రాష్ట్ర కార్య దర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్ వెస్లీ, మల్లు లక్ష్మి, టి. సాగర్, ఎండీ అబ్బాస్తో కలిసి ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా మూడు నినాదాలతో సీపీఎం ఈ ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్తుందని వెల్లడించారు. ’’మొదటిగా.. సమాజంలో అన్ని వర్గాల హక్కుల కోసం చట్ట సభల్లో పోరాడేందుకు సీపీఎంకు అసెంబ్లీలో ప్రాతి నిధ్యం ఇవ్వాలని అడుగుతాం. రెండో అంశంగా వామపక్ష అభ్యర్థులను బలపర్చాలని విజ్ఞప్తి చేస్తాం. మూడో అంశంగా.. దేశాన్ని చిన్నాభిన్నం చేస్తున్న బీజేపీకి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు గానీ.. గెలవగలిగే రెండు మూడు స్థానాల్లో కూడా అడ్డుకోవాలని కోరతాం.’’అని ఆయన వివరించారు. పొత్తుపై కాంగ్రెస్కు స్పష్టత లేదు వామపక్షాలతో పొత్తుల విషయంలో కాంగ్రెస్కు స్పష్టత లేదని, ఆ పార్టీ తీరు సరిగా లేదని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క సీటు ఇస్తామనీ, ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పినట్టు సీపీఐ ద్వారా తెలిసిందన్నారు. వామపక్ష ఐక్యతను దృష్టిలో ఉంచుకుని సీపీఐకి కాంగ్రెస్తో పొత్తు ఉన్న ప్పటికీ ఆ పార్టీ పోటీ చేస్తున్న స్థానాల్లో సీపీఎం తమ అభ్యర్థులను పోటీ పెట్టబోదన్నారు. తమ్మినేనికి భట్టి, జానారెడ్డి ఫోన్ కాగా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డిలు తమ్మినేని వీరభద్రానికి ఫోన్ చేసి పొత్తుల విషయంలో కాంగ్రెస్ అధిష్టానం చర్చిస్తుందని చెప్పారు. పొత్తు ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. మరోవైపు పొత్తుల విషయంపై సీపీఐ.. కాంగ్రెస్ నుంచి అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తోంది. ఎవరెవరు ఎక్కడెక్కడంటే సీపీఎం తరపున భద్రాచలం నియోజకవర్గంలో కారం పుల్లయ్య, అశ్వారావుపేటలో పిట్టల అర్జున్, పాలేరులో తమ్మినేని వీరభద్రం, మధిరలో పాలడుగు భాస్కర్, వైరాలో భూక్యా వీరభద్రం, ఖమ్మంలో ఎర్ర శ్రీకాంత్, సత్తుపల్లిలో మాచర్ల భారతి, మిర్యాలగూడలో జూలకంటి రంగారెడ్డి, నకిరేకల్లో బజ్జ చిన్న వెంకులు, భువనగిరిలో కొండమడుగు నర్సింహ్మ, జనగాంలో మోకు కనకారెడ్డి, ఇబ్రహీంపట్నంలో పగడాల యాదయ్య, పటాన్చెరులో జె.మల్లికార్జున్, ముషీరాబాద్లో ఎం.దశరథ్ పోటీ చేస్తారని తమ్మినేని ప్రకటించారు. మరో మూడు స్థానాలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. అనంతరం ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేశారు. -
తమ్మినేని వీరభద్రంకు కాంగ్రెస్ నేత జానారెడ్డి ఫోన్
సాక్షి, హైదరాబాద్: అభ్యర్థుల ప్రకటన వాయిదా వేసుకోవాలంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి కాంగ్రెస్ నేత జానారెడ్డి ఫోన్ చేశారు. ఇప్పటికే 14 స్థానాల్లో పేర్లు ప్రకటించామని, మరో మూడు స్థానాలు చర్చల్లో ఉన్నాయన్న తమ్మినేని.. కుదరదని తేల్చి చెప్పారు. మిగతా స్థానాలను రెండురోజుల్లో ప్రకటిస్తామని చెప్పిన తమ్మినేని.. కాంగ్రెస్తో మాట్లాడటం తప్ప ఎలాంటి నిర్ణయం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా, కాంగ్రెస్ పార్టీతో వామపక్ష పార్టీల పొత్తుల వ్యవహారం ఇప్పటికీ గందరగోళంగానే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఐక్యంగా పోటీ చేయాలనే ఆలోచనతో కమ్యూనిస్టులు కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీతో మంతనాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇవ్వనికారణంగా ఒంటరి పోరుకు సీపీఎం సిద్ధం కాగా, పొత్తు పెట్టుకుని పోరులో నిలవాలని సీపీఐ సంప్రదింపుల ప్రక్రియను కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలో సీపీఐకి ఒక చోట పోటీతో పాటు ఒక ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ తాజాగా అంగీకరించినట్లు తెలిసింది. ఈ అంశంపై సీపీఐ సైతం సుముఖత వ్యక్తం చేసి పొత్తుతో ముందుకు సాగనున్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీపీఐ అభ్యర్థిని బరిలోకి దింపేందుకు దాదాపు నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం పొత్తు అంశం, సీటు కేటాయింపు పట్ల ఇప్పటికీ అధికారికంగా ప్రకటన చేయలేదు. చదవండి: ఎన్నికల పోరుకు రెడీ.. అభ్యర్థులను ప్రకటించిన సీపీఎం -
ఎన్నికల పోరుకు రెడీ.. అభ్యర్థులను ప్రకటించిన సీపీఎం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్తో పొత్తుకు చెక్ పెడుతూ సీపీఎం అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. తాజాగా 14 మంది అభ్యర్థులతో సీపీఎం జాబితాను తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సీపీఎం షాకిచ్చింది. పొత్తుల విషయంలో హస్తం పార్టీతో తెగదెంపులు చేసుకుని తమ పార్టీ తరఫున అభ్యర్థులను ప్రకటించింది. ఈ క్రమంలో 14 మంది అభ్యర్థులతో సీపీఎం జాబితాను విడుదల చేసింది. మరో స్థానాల్లో కూడా అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరుగుతున్నాయి. వారి పేర్లను రెండు రోజుల్లో ప్రకటిస్తామని తమ్మినేని తెలిపారు. మరోవైపు.. తమ్మినేని వీరభద్రంకు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్బంగా అభ్యర్థుల ప్రకటనను వాయిదా వేయాలని జానారెడ్డి కోరినట్టు సమాచారం. ఈ క్రమంలో అభ్యర్థుల ప్రకటన వాయిదా కుదరదని తమ్మినేని గట్టిగానే చెప్పినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్తో మాట్లాడం తప్ప ఎలాంటి నిర్ణయం ఉండటంలేదని ఘాటు వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. అభ్యర్థులు వీరే.. భద్రాచలం- కారం పుల్లయ్య అశ్వారావుపేట- పి. అర్జున్ పాలేరు- తమ్మినేని వీరభద్రం వైరా- భూక్య వీరభద్రం మధిర- పాలడుగు భాస్కర్ ఖమ్మం- శ్రీకాంత్ మిర్యాలగూడ- జూలకంటి రంగారెడ్డి సత్తుపల్లి- భారతి నకిరేకల్- చిన్న వెంకులు పటాన్చెరు- మల్లికార్జున్ ముషీరాబాద్- దశరథ్ జనగామ- కనకారెడ్డి భువనగిరి- నర్సింహ ఇబ్రహీంపట్నం- యాదయ్య. ఇది కూడా చదవండి: రూట్ మార్చిన కేటీఆర్.. గంగవ్వతో నాటుకోడి కూర వండి.. -
ఒంటరిగానే పోటీ చేస్తాం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. ప్రస్తుతం 17 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో బీజేపీ ఒక్క స్థానంలోనూ గెలవకూడదనే లక్ష్యంతో ఈ ఎన్నికల్లో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. గురువారం ఎంబీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తుకు ప్రయత్నించామని, రెండు స్థానాల్లో పోటీ చేయాలనుకున్నప్పటికీ ఆ రెండు స్థానాలేమిటో కాంగ్రెస్ చెప్పలేదన్నారు. కేవలం బీజేపీని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్తో పొత్తు ప్రయత్నాలు చేసినట్లు ఆయన చెప్పారు. ఆ పార్టీ వైఖరి వల్లే పొత్తు నుంచి తప్పుకొని ఒంటరిగా పోటీకి నిర్ణయం తీసుకున్నామని తమ్మినేని తెలిపారు. తొలుత 17 స్థానాల్లో పోటీకి నిర్ణయం తీసుకున్నప్పటికీ... ఈ సంఖ్య పెరుగుతుందని, పార్టీ కార్యకర్తలు, బలం ఉన్న చోట పోటీకి సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. ఐక్య పోటీపై సీపీఐ వైఖరి చెప్పలేదు.. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఐక్యంగా పోటీ చేయాలని నిర్ణయించినప్పటికీ సీపీఐ వైఖరి చెప్పలేదని తమ్మినేని పేర్కొన్నారు. అయినప్పటికీ సీపీఐకి మద్దతిస్తామని, ఒకవేళ కాంగ్రెస్తో పొత్తు కొనసాగించి సీపీఐ పోటీ చేసినా ఆ పార్టీకి మద్దతిస్తూ అక్కడ పోటీ చేయబోమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో సీపీఎం పోటీ చేసే స్థానాల్లో కాకుండా మిగతా చోట్ల బీజేపీని ఓడించే ప్రధాన పార్టీకి మద్దతివ్వాలని తమ కార్యకర్తలకు సూచిస్తామన్నారు. బీజేపీ అభ్యర్థులు బలంగా ఉన్న చోట్ల ఆ తర్వాత స్థానంలో ఉన్న బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ లేదా ఇతరులెవరున్నా సీపీఎం మద్దతుగా నిలుస్తుందని తమ్మినేని స్పష్టం చేశారు. 17 స్థానాలు ఇవే... ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా భద్రాచలం (ఎస్టీ), అశ్వారావుపేట (ఎస్టీ), పాలేరు, మధిర (ఎస్సీ), వైరా (ఎస్టీ), ఖమ్మం, సత్తుపల్లి (ఎస్సీ), మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్ (ఎస్సీ), భువనగిరి, హుజూర్నగర్, కోదాడ, జనగామ, ఇబ్రహీంపట్నం, పటాన్చెరు, ముషీరాబాద్ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తమ్మినేని వెల్లడించారు. ఒకట్రెండు రోజుల్లో పార్టీ జిల్లా కార్యదర్శులు, సీనియర్లతో చర్చించిన తర్వాత ఈ సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. కాగా, ఈ జాబితాలో ముషీరాబాద్ అభ్యర్థిగా సీపీఎం హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యుడు మద్దెల దశరథ్ పేరు ఖరారైనట్లు తెలిసింది. -
తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తాం: తమ్మినేని
-
అయితే వెయిటింగ్!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీతో మంగళవారం కటీఫ్ ప్రకటించిన సీపీఎం బుధవారం ఒక అడుగు వెనక్కు వేసింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడు భట్టి విక్రమార్క ఫోన్ చేసి విన్నవించడంతో గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు విధించింది. ఆ సమయంలోగా పొత్తులపై కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇవ్వకుంటే, వెంటనే మీడియా సమావేశం నిర్వహించి తమ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తేల్చిచెప్పింది. సోనియా అనారోగ్యంతో చర్చలు జరగలేదట తమ్మినేని వీరభద్రం గత ఆదివారం కాంగ్రెస్కు రెండ్రోజుల గడువు విధించారు. గడువు ముగిసినా కాంగ్రెస్ నుంచి స్పందన రాకపోవడంతో ఒంటరి పోరుకే వెళ్లాలని ఆ పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఇది మీడియాలో ప్రచారం కావడంతో భట్టి విక్రమార్క తమ్మినేని వీరభద్రానికి ఫోన్ చేసి వేచి చూడమన్నారు. తమ పార్టీ అధిష్టానం పొత్తు విషయంపై చర్చిస్తుందని చెప్పారు. దీంతో తాము మరోసారి గడువు విధించినట్లు సీపీఎం తెలిపింది. బుధవారం జరిగిన ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. అనంతరం తమ్మినేని వీరభద్రం మీడియాతో మాట్లాడారు. సోనియాగాంధీ అనారోగ్యం రీత్యా వారితో సమావేశం జరగలేదని భట్టి చెప్పారని గురువారం ఉదయానికి కబురు చెప్తామని అన్నారని వెల్లడించారు. అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నట్టు భట్టి తెలిపారన్నారు. సీపీఐ, సీపీఎంలు కలిసే ఉంటాయి సీపీఐతో తాము గురువారం ఉదయం మాట్లాడతామని తమ్మినేని తెలిపారు. వైరా, మిర్యాలగూడ కేటాయించకపోతే తాము ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అంచనాలు, సీపీఐ నిర్ణయాలపై తాము వ్యాఖ్యానించబోమన్నారు. అఖిల భారత స్థాయిలో తీసుకుంటున్న నిర్ణయాల మేరకే పొత్తులుంటాయే కానీ, ఎవరి పంచనో చేరడానికి కాదని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్తో పొత్తు ఉన్నా లేకపోయినా సీపీఐ, సీపీఎంలు కలిసే ఉంటాయని, ఒకవేళ సీపీఐతో కాంగ్రెస్ కలిసి వెళ్తే సీపీఎం ఒంటరిపోరు చేస్తుందని తమ్మినేని ప్రకటించారు. అయితే సీపీఐ అభ్యర్థులున్న స్థానాల్లో మాత్రం తాము పోటీ చేయబోమని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ ప్రకటించే వరకు సీపీఐ ఎదురుచూపు... మరోవైపు సీపీఐ కూడా బుధవారం రాష్ట్ర సమితి సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి ఆ పార్టీ జాతీయ కార్యదర్శి డి.రాజా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, తమతో భట్టి విక్రమార్క ఫోన్లో మాట్లాడారని తెలిపారు. పొత్తుల విషయంపై సానుకూల నిర్ణ యం ఉంటుందని చెప్పారని వివరించారు. కాంగ్రెస్ తుది జాబితా ప్రకటించే వరకు వేచి చూసిన తర్వాతే తమ పార్టీ నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పొత్తు ధర్మం పాటించకపోయినా తాము పాటిస్తామన్నారు. సీపీఎం వైఖరిపై తామేమీ నిర్ణయం తీసుకోలేదన్నారు. కాంగ్రెస్తో అవగాహనలో భాగంగా సీపీఐకి రెండు స్థానాలు ఇస్తామని పేర్కొందనీ, అందులో మార్పులు చేర్పులు ఉంటే తరువాత ఆలోచన చేస్తామన్నారు. పొత్తు కుదిరినా ఆ స్థానాలు ఇస్తారా? కాగా, సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు స్థానాలు, సీపీఎంకు మిర్యాలగూడ, వైరా స్థానాలు ఇస్తామని గతంలో కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సీపీఐ, సీపీఎంకు కేటాయిస్తామన్న ఈ నాలుగు స్థానాల్లో దాదాపు అన్నింటినీ ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చే పరిస్థితి లేదన్న చర్చ జరుగుతోంది. ఒకవేళ పొత్తు కుదిరినా ఈ స్థానాలు ఇస్తారన్న నమ్మకం కూడా లేదు. దీంతో కామ్రేడ్లలో తర్జనభర్జన జరుగుతోంది. నేతల తీరుపై రెండు పార్టీల్లో గరంగరం... ఇదిలావుండగా, రెండు పార్టీల రాష్ట్ర సమావేశాల్లో నాయకుల తీరుపై కొందరు పార్టీ సభ్యులు తీవ్రంగా మండిపడినట్లు తెలిసింది. పొత్తులపై ఇదేం పాకులాట అంటూ ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలిసింది. అప్పుడు బీఆర్ఎస్తో కలిసి పనిచేసి, ఇప్పుడు కాంగ్రెస్తో పొత్తుకు పాకులాడడంపై ప్రజల్లో పలుచన అయిపోతున్నామని, ఇది పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందని కొందరు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు నిలదీసినట్లు తెలిసింది. 2 స్థానాల్లో పోటీ అనడంతో వాటిపైనే దృష్టిపెట్టామని, ఇప్పుడు పొత్తు లేదని, 15 స్థానాల్లో పోటీ చేయాలంటే ఎలా సన్న ద్ధం కాగలమని సీపీఎం శ్రేణులు ప్రశ్నించినట్లు సమాచారం. సీపీఎం పోటీ చేయాలనుకుంటున్న స్థానాలివే కాంగ్రెస్తో పొత్తు కుదరకపోతే సీపీఎం సింగిల్గానే బరిలోకి దిగాలని నిర్ణయించింది. ఇందుకోసం ఏయే స్థానాల్లో పోటీ చేయాలి, ఏ నియోజకవర్గంలో బలం ఉందనే వివరాలను బుధవారం నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశంలో సేకరించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15 నుంచి 20 స్థానాల్లో పోటీచేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. వీటిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం, పాలేరు, వైరా, సత్తుపల్లి, మధిర, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వారావుపేటతోపాటు ఇల్లందులో బరిలోకి దిగాలని భావిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ, నకిరేకల్, మిర్యాలగూడ, సూర్యాపేటతో పాటు మరో స్థానంలో పోటీ చేయాలని నిర్ణయించింది. ఇక రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నంతోపాటు మరోస్థానం, హైదరాబాద్లో ముషీరాబాద్, కార్వాన్ స్థానాలతోపాటు సంగారెడ్డి, పటాన్ చెరు బరిలో ఉండాలని సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలో కొల్లాపూర్ సహా మరో రెండు స్థానాల్లో పోటీకి దిగాలని నిర్ణయించినట్టు సమాచారం. -
కాంగ్రెస్–సీపీఎం పొత్తు చిత్తు!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్తో సీపీఎం పొత్తు బెడిసికొట్టింది. మిర్యాలగూడ, వైరా స్థానాలు తమకు కేటాయించేందుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విధించిన రెండు రోజుల గడువు ముగిసినా కాంగ్రెస్ నుంచి స్పందన రాకపోవడంతో ఒంటరి పోరుకే వెళ్లాలని ఆ పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. మంగళవారం నిర్వహించిన పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో 10 స్థానాల్లో పోటీకి సిద్ధపడాలన్న కీలక నిర్ణయానికి వచ్చింది. ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో కలిపి 9 స్థానాల్లో పోటీ చేయాలని, ఇబ్రహీంపట్నంలోనూ బరిలో ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం. బుధవారం జరిగే రాష్ట్ర కమిటీ సమావేశంలో మరో ఐదు స్థానాలను గుర్తించి మొత్తం 15 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు చర్చలు బెడిసికొట్టగా తెలంగాణలోనూ తమతో పొత్తుకు కాంగ్రెస్ సిద్ధంగా లేనట్లు ఢిల్లీ నుంచి సంకేతాలు అందిన నేపథ్యంలోనే ఈ దిశగా కసరత్తు చేస్తున్నట్లు సీపీఎం వర్గాలు చెబుతున్నాయి. ఐదు నుంచి రెండు సీట్లకు తగ్గినా... మునుగోడు ఉపఎన్నికలో తమతో పొత్తు పెట్టుకున్న బీఆర్ఎస్... ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధపడటంతో కాంగ్రెస్తో జత కట్టాలని సీపీఐ, సీపీఎం నిర్ణయించుకున్నాయి. అందుకు కాంగ్రెస్ కూడా సముఖత వ్యక్తం చేసింది. మొదట్లో సీపీఐ, సీపీఎం చెరో ఐదు స్థానాలు కాంగ్రెస్ను కోరగా ఆ తర్వాత జరిగిన చర్చల్లో మూడు చొప్పున సీట్లు ఇవ్వాలని అడిగాయి. చివరకు ఆ సంఖ్య రెండేసి స్థానాల వద్దకు చేరుకుంది. సీపీఐ కొత్తగూడెం, మునుగోడు అడగ్గా సీపీఎం మిర్యాలగూడతోపాటు భద్రాచలం లేదా పాలేరు స్థానాలను కోరింది. కానీ కాంగ్రెస్ మాత్రం వారు కోరిన స్థానాల్లో మార్పులు చేసింది. సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు, సీపీఎంకు మిర్యాలగూడ, వైరా ఇస్తామని ప్రతిపాదించినట్లు లెఫ్ట్ వర్గాలు తెలిపాయి. చివరకు సీపీఎంకు వైరా స్థానం కేటాయించే విషయంలో కాంగ్రెస్ పేచీ పెట్టింది. ఆ స్థానం ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది. దీంతో మిర్యాలగూడ, వైరా స్థానాలు ఇస్తేనే పొత్తు ఉంటుందని సీపీఎం తేల్చిచెప్పింది. సీపీఐ దారెటు? సీపీఐతో పొత్తు విషయంలో కాంగ్రెస్ ఇప్పటివరకు ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. ఆ పార్టీకి కొత్తగూడెం, చెన్నూరు స్థానాలు ఇవ్వనున్నట్లు ప్రచారం జరిగినా ఇప్పటివరకు కాంగ్రెస్ అధికారిక ప్రకటన చేయకపోవడంపై సీపీఐ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఒంటరి పోరుకు వెళ్లాలని సీపీఎం నిర్ణయించగా సీపీఐ మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతుంది. కాంగ్రెస్తో ఎలాగైనా కలిసి ముందుకు సాగాల్సిందేనని, అసెంబ్లీలో అడుగు పెట్టాల్సిందేనని సీపీఐకి చెందిన ఒక కీలక నేత పట్టుబడుతున్నట్లు సమాచారం. ‘లెఫ్ట్’ఉమ్మడి పోరు యోచన... ఒకవేళ సీపీఐతోనూ కాంగ్రెస్ పొత్తు కుదరకుంటే లెఫ్ట్ పార్టీలు ఉమ్మడిగా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ మేరకు లెఫ్ట్ పార్టీల ఉమ్మడి సమావేశం నేడు లేదా రేపు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. సీపీఐ రా్ర‹Ù్టర సమితి సైతం బుధవారం సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోనుందని చెబుతున్నారు. ఒకవేళ లెఫ్ట్ పార్టీలు ఉమ్మడి పోరుకు దిగితే దాదాపు 30 సీట్లలో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు ఆయా పార్టీల వర్గాలు చెబుతున్నాయి. -
మిర్యాలగూడ, వైరా ఇస్తేనే పొత్తు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘మిర్యాలగూడతో పాటు వైరా సీటు ఇస్తే ఓకే.. ఈ రెండు స్థానాలు ఇవ్వకపోతే పొత్తు కుదరదు. రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తేల్చకపోతే మేము విడిగా వెళ్తాం’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం హైదరాబా ద్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశం, ఆ తర్వాత రాష్ట్ర కమిటీ సమావేశం ఉంటాయని, పార్టీ పొలిట్బ్యూరో సభ్యులు హాజరవుతారని తెలిపా రు. ఈ సమావేశాల్లోపు కాంగ్రెస్ పార్టీ నుంచి స్పష్టమైన ప్రకటన రాకుంటే తాము విడిగా పోటీ చేయడం తప్ప మరో మార్గం లేదని అన్నారు. బాల్ కాంగ్రెస్ కోర్టులోనే ఉందని వ్యాఖ్యానించారు. చిత్తశుద్ధి లేకనే ఇలా చేస్తున్నారు.. కాంగ్రెస్తో పొత్తు కోసం జాతీయ, రాష్ట్ర స్థాయిలో పలుమార్లు చర్చలు జరిగాయని, తొలు త భద్రాచలం, పాలేరు, మిర్యాలగూ డెం, ఇబ్రహీంపట్నం, వైరా స్థానాలను అడిగామని తమ్మినేని తెలిపారు. భద్రా చలం సిట్టింగ్ స్థానం ఇవ్వడం కుదరద ని చెప్పారని, ఒక దశలో పాలేరు ఇస్తా మని చెప్పి.. తర్వాత వారి అభ్యర్థిని ప్రకటించారని అన్నారు. ఒక్కో మెట్టు దిగి భద్రాచలం, పాలేరు వదులుకున్నామని, చివ రకువారు ప్రతిపాదించిన వైరా, మిర్యాలగూడ సీట్ల కు అంగీకరించామని వివరించారు. మళ్లీ ఇప్పుడు వైరా స్థానం ఇస్తామని చెప్పలేదంటూ ఆ పార్టీకి చెందిన ఒక నేత మాట్లాడారని విమర్శించారు. ప్రస్తుతం మిర్యాలగూడతో పాటు హైదరాబాద్ నగరంలో ఒక సీటు ఇస్తామని ఆపార్టీ నేతలు చెబుతున్నా రని తమ్మినేని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి సీపీఎంతో పొత్తుపై చిత్తశుద్ధి లేకనే అలా మాట్లాడుతున్నా రని, ఇది సరైంది కాదని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ, అది మద్దతిచ్చే పార్టీ గెలవొద్దనే విషయంలో తమ వైఖరి చాలా స్పష్టంగా ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ముందుకొస్తే సంతోషమని వ్యా ఖ్యానించారు. తాజా పరిణామాలను సీపీఐ నేతల కు కూడా తెలియజేశామని చెప్పారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. -
ఢిల్లీలో ‘పాలేరు’ సీటు పంచాయితీ
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్, వామపక్షాల పొత్తు వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఆయా పార్టీల మధ్య రాజకీయ అవగాహన కుదిరినా, సీట్లపై ఇంకా అస్పష్టత కొనసాగుతూనే ఉంది. వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వాలు ఇప్పటికీ సీట్లపై కసరత్తు చేస్తూనే ఉన్నాయి. పాలేరు సీటు కోసం కాంగ్రెస్, సీపీఎం మధ్య పోటీ నెలకొంది. కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీపీఎం నుంచి తమ్మినేని వీరభద్రం మధ్య పాలేరు సీటు పంచాయితీ సాగుతోంది. పాలేరు సీటు తమకే కావాలని సీపీఎం నేతలు డిమాండ్ చేస్తుండగా, పాలేరుకు బదులు వైరా స్థానం ఇస్తామని కాంగ్రెస్ నచ్చచెబుతోంది. పాలేరు సీటు కోసం సీపీఎం పట్టుబడుతుంది. సీటు వ్యవహారంపై పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని ఢిల్లీకి పిలిపించి చర్చిస్తున్నట్లు సమాచారం. పొంగులేటి, తుమ్మల ఇప్పుడు కాంగ్రెస్లో రాష్ట్రస్థాయిలో ప్రముఖులుగా ఉన్నారు. దీంతో పొంగులేటికి పాలేరు, తుమ్మలకు ఖమ్మం స్థానాలు ఇచ్చే యోచనలో కాంగ్రెస్ ఉంది. ఈ నేపథ్యంలో పాలేరు స్థానాన్ని సీపీఎంకు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ స్థానంలో సీపీఎం తరపున ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అభ్యర్థిగా ఉండాలని భావిస్తున్నారు. ఆ స్థానం ఇవ్వకుంటే పొత్తుకు సీపీఎం అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు. విచిత్రమేంటంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీపీఎం కోరే సీట్లన్నీ కీలకమైనవే. గతంలో మధిర స్థానాన్ని కూడా సీపీఎం ప్రతిపాదించింది. ఆ స్థానంలో భట్టి విక్రమార్క అనేకసార్లు విజయం సాధించారు. ఇలా కాంగ్రెస్కు పట్టున్న స్థానాలను సీపీఎం కోరుతుండటంతో కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడింది. ఏదిఏమైనా ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం కోర్టులో లెఫ్ట్ సీట్ల వ్యవహారం ఉంది. పొత్తు అంశం త్వరగా కొలిక్కి రావాలని కామ్రేడ్లు వేచి చూస్తున్నారు. చదవండి: తెలంగాణలో మరో సర్వే.. ఆ పార్టీకే ఆధిక్యం -
‘పొత్తుల కోసం వెంపర్లాడం.. కేసీఆర్ ఎప్పుడు పిలిస్తే అప్పుడే వెళ్తాం’
సాక్షి, హైదరాబాద్: సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ భేటీ ముగిసింది. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులపై చర్చించామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. బీఆర్ఎస్తో కమ్యూనిస్టులు దూరంగా ఉన్నారని, కాంగ్రెస్తో జత కడుతారనే తప్పుడు వార్తలు వస్తున్నాయని అన్నారు. ఇలాంటి నిరాధారమైన వార్తలను ఖండిస్తున్నామని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా లౌకి శక్తులను ఏకం చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. బీఆర్ఎస్తో మైత్రి కొనసాగుతుందని తమ్మినేని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్తో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. సీపీఎం, సీపీఐ కలిసి వెళ్ళినప్పుడే లబ్ధి పొందామని, విడివిడిగా పోయినప్పుడు నష్టపోయామని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ కలిసే ఉంటాయని స్పష్టం చేశారు. మునుగోడు ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించామని కూనంనేని చెప్పారు. పొత్తు ఉంటుందని కేసీఆరే చెప్పారు ‘బీఆర్ఎస్ తనకు తానుగా చొరవ చూసి మునుగోడులో కలిసి పని చేద్దామని కోరింది. మునుగోడే కాదు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కమ్యునిస్టులతో పొత్తు ఉంటుందని కేసీఆరే చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సీట్ల అంశంపై మైండ్ గేమ్ ఆడుతున్నారు. కేసీఆర్ సీట్ల అంశంపై మాతో చర్చించలేదు, వ్యతిరేకంగా మాట్లాడలేదు. కమ్యూనిస్టులు ఎన్నికలకు సమాయత్తం అవ్వడం లేదని అనుకుంటున్నారు. మాకు బలంగా ఉన్న చోట ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాం’ అని తమ్మినేని పేర్కొన్నారు. చదవండి: టికెట్ ప్లీజ్..! ఎమ్మెల్యే అయ్యేందుకు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తహతహ.. కమ్యూనిస్టులు ఉంటేనే కుంభకోణాలు బయటకు.. మునుగోడులో వచ్చిన విపత్తును సీపీఎం, సీపీఐ అడ్డుకున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్మి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. మునుగోడులో బీజేపీ గెలిస్తే ప్రభుత్వాన్ని అస్థిర పరిచేదని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీఎల్ సంతోష్ ప్రయత్నం చేశారని ఆరోపించారు. కమ్యూనిస్టులు లేని అసెంబ్లీ, పార్లమెంట్లను ప్రజలు ఊహించుకోవడం లేదని.. కమ్యూనిస్టులు ఉంటేనే అనేక కుంభకోణాలు బయటకు తీసుకు వస్తారని చెప్పారు. ఓట్లు సీట్ల కోసం దిగజారం ‘కమ్యూనిస్టుల పద్దతుల్లో మా పోరాటం చేస్తున్నాం. బీజేపీకి ప్రజల సమస్యలు పట్టవు. వ్యక్తిగత దూషణలకే పరిమితం. ఓట్లు సీట్ల కోసం మేము దిగజారం. రోజుకో పార్టీ మారే వాళ్లు మమ్మల్ని విమర్శిస్తున్నారు. పొత్తులపైన వెంపర్లాడడం లేదు. కేసీఆర్ ఎప్పుడూ పిలిస్తే అప్పుడే వెళ్తాం. కేసీఆర్ బీజేపీని తక్కువ అంచనా వేయవద్దని విజ్ఞప్తి. రాష్ట్రాల స్థాయిలో, జాతీయ స్థాయిలో పొందిక ఉంటుంది. జాతీయ స్థాయిలో లౌకిక శక్తులతో కేసీఆర్ కలిసి పని చేయాలని కోరుకుంటున్నాం’ అని కూనంనేని తెలిపారు. -
తమ్మినేని సార్ .. పాలేరు నుంచి పోటీ చేయండి..
ఖమ్మం: వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను పలువురు యువకులు కోరారు. ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లిలోని తమ్మినేని నివాసంలో శుక్రవారం గువ్వలగూడెంకు యువకులు ఆయనను కలిసి సీపీఎంలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమ్యూనిస్టులు చట్టసభల్లో లేకపోవటంతో ప్రజల సమస్యలపై ప్రస్తావన రావడం లేదని తెలిపారు. ఈమేరకు వచ్చే ఎన్నికల్లో ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీచేయాలని ఆయనను కోరారు. నాయకులు మారుతి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
బుల్లెట్ ట్రైన్లో చంద్రబాబు తిరుగుతున్నారా?.. సీపీఎం నేతలు ఫైర్
సాక్షి, ఢిల్లీ: చంద్రబాబుపై సీపీఎం నేతలు తమ్మినేని వీరభద్రం, శ్రీనివాసరావు మండిపడ్డారు. చంద్రబాబు పచ్చి అవకాశవాది అంటూ నిప్పులు చెరిగారు. బీజేపీ దేశాభివృద్ధి కోసం పనిచేయడం లేదని గతంలో చంద్రబాబు అన్నారు. ఇప్పుడు మోదీ చేస్తున్న దేశాభివృద్ధి ఏంటో చంద్రబాబు ప్రజలకి చెప్పాలని నిలదీశారు. పేదలందరికీ ఇళ్లు ఇస్తామన్న మోదీ హామీ నిలబెట్టుకున్నారా.. బాబు చెప్పాలంటూ తమ్మినేని వీరభద్రం దుయ్యబట్టారు. ‘‘బీజేపీ దేశాభివృద్ధి కోసం పనిచేయడం లేదని గతంలో చంద్రబాబు అన్నారు. ఇప్పుడు మోదీ చేస్తున్న దేశాభివృద్ధి ఏంటో చంద్రబాబు ప్రజలకు చెప్పాలి. పేదలందరికీ ఇళ్లు ఇస్తామన్న మోదీ హామీ నిలబెట్టుకున్నారా.. బాబు చెప్పాలి. రైతుల ఆదాయం డబుల్ చేస్తానన్న మోదీ హామీ నిలబెట్టుకున్నారా? బాబు చెప్పాలి. 2022 కల్లా దేశంలో బుల్లెట్ ట్రైన్ మోదీ నడుపుతామన్నారు.. బుల్లెట్ ట్రైన్లో చంద్రబాబు తిరుగుతున్నారా?’’ అని ఎద్దేవా చేశారు. చదవండి: ‘ఎన్టీఆర్ మాట్లాడిన వీడియోలు విడుదల చేసే దమ్ముందా?’ ‘‘18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన మోదీ అవి ఇచ్చారా.. చంద్రబాబు చెప్పాలి. చంద్రబాబు మోదీలో చూస్తున్నది అభివృద్ధి కాదు, పచ్చి అవకాశవాదం. గడ్డిపరకనైనా పట్టుకుని ఏపీలో అధికారంలోకి రావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు చెబుతున్న మోదీ విజన్లో పేదలకు, ప్రజలకు స్థానం ఎక్కడ?, పెట్టుబడిదారుల విజన్ మతోన్మాదుల విజన్ అసలు విజన్ కాదు. మోదీ, చంద్రబాబుది విజన్ కాదు.. అదొక డివిజన్’’ అంటూ తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. చంద్రబాబు ఏ విజన్తో మోదీకి సపోర్ట్ చేస్తున్నారు:శ్రీనివాసరావు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణను టీడీపీ వ్యతిరేకిస్తామని చెబుతోంది. మరి మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తోంది. మరి చంద్రబాబు ఏ విజన్తో మోదీకి సపోర్ట్ చేస్తున్నారు’’ అంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రశ్నించారు. సంక్షేమ పథకాలను ఎత్తివేయాలని మోదీ అంటున్నారు. చంద్రబాబు మరి కంటిన్యూ చేస్తా అంటున్నారు.. ఇందులో ఉన్న విజన్ ఏమిటి?. చంద్రబాబుది రాజకీయ అవకాశవాదం తప్ప మరొకటి లేదు. ఈ వైఖరితో చంద్రబాబు ఎన్నడూ ప్రజల విశ్వాసాన్ని పొందలేరు’’ అని శ్రీనివాసరావు దుయ్యబట్టారు. చదవండి: ఒక ముఖ్యమంత్రికి ఇంతటి స్పందన రావడం జగన్ విషయంలోనే.. -
బీజేపీని ఓడించగలిగితే కాంగ్రెస్తో సర్దుబాటు
సాక్షి, హైదరాబాద్: కొన్ని రాష్ట్రాల్లో ఉన్నట్టుగా బీజేపీని ఓడించే స్థాయికి కాంగ్రెస్ చేరితే ఇక్కడ కూడా ఆ పార్టీతో సర్దుబాటు చేసుకుంటామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. కానీ రాష్ట్రంలో పరిస్థితి ఆవిధంగా లేదని, అందుకే బీఆర్ఎస్ వైపే ఉంటామని చెప్పారు. అయితే సీట్ల గురించి బీఆర్ఎస్తో ఇంకా చర్చ జరగలేదని, సమయం వచ్చిన ప్పుడు తమ బలానికి తగ్గట్టుగా సీట్లు కోరతామని అన్నారు. తాము కోరుకున్నట్టుగా బీఆర్ఎస్ సీట్లు ఇవ్వకపోతే విడిగానే పోటీ చేస్తామని తెలిపారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాల సందర్భంగా బుధవారం ఎంబీ భవన్లో పొలిట్బ్యూరో సభ్యులు ఎ.విజయరాఘవన్, బీవీ రాఘవులు, నాయకులు చెరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డిలతో కలిసి తమ్మినేని విలేకరులతో మాట్లాడారు. స్నేహంగా ఉంటాం..సమస్యలపై పోరాడతాం బీజేపీని వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్తో రాజకీయంగా స్నేహంగా ఉంటామని తమ్మినేని వీరభద్రం చెప్పారు. అదే సమయంలో ఇచ్చిన హామీల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామన్నారు. బీఆర్ఎస్ తప్పులను విమర్శిస్తామని, ఒప్పును సమర్థిస్తామని చెప్పారు. బీజేపీని ఎదుర్కోవడం అంత సులువు కాదని, అందుకే కేసీఆర్ను సమర్థిస్తున్నామని వివరించారు. బీజేపీ వ్యతిరేక పోరాటాన్ని బలపర్చేందుకే బీఆర్ఎస్తో సానుకూలంగా ఉన్నామని, బీజేపీని ఎదుర్కోవడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అఖిలపక్షం పేరుతో కొన్ని రాజకీయ పార్టీలు చేసే ఆందోళనల్లో తాము పాల్గొనబోమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని తాము కోరుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలన్నింటినీ క్రోడీకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, వారంలో సీఎం కేసీఆర్తో భేటీ అవుతామని తమ్మినేని చెప్పారు. జూన్లో సంతకాల సేకరణ, ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి, నిరసనలు చేపడతామన్నారు. ప్రజాసంఘాల పోరాట కమిటీ ఉద్యమ కార్యాచరణకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని, తాము కూడా అందులో పాల్గొంటామని తెలిపారు. బీజేపీ ఎజెండా ప్రమాదకరం: విజయరాఘవన్, బీవీ రాఘవులు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్పొరేట్, మతతత్వ ఎజెండా దేశానికే ప్రమాదకరమని విజయరాఘవన్, రాఘవులు విమర్శించారు. అదానీ అక్రమాలపై హిండెన్బర్గ్ నివేదిక ఇచ్చినా దానిపై పార్లమెంటులో చర్చ జరగలేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజాస్వామిక హక్కులు కాలరాస్తున్నారని, పోలీసు రాజ్యం నడుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా సామాన్యులను సమీకరించి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. -
కొడవళ్ళకు గులాబీ చిక్కడం లేదా? లెఫ్ట్ పార్టీల వన్ సైడ్ లవ్ ఇంకెన్నాళ్లు?
కొడవళ్ళకు గులాబీ చిక్కడం లేదా? గులాబీ పార్టీ మీద ఎర్రన్నల ప్రేమ వన్ సైడేనా? మునుగోడు విజయంతో ఎర్ర పార్టీలను పొగిడిన గులాబీ దళపతి... ఇప్పుడు పట్టించుకోవడంలేదా? మిత్రపక్షాలుగా మారిన ఎర్ర గులాబీలు ఇప్పుడు కత్తులు దూసుకుంటున్నాయి ఎందుకు? లెఫ్ట్ పార్టీల వన్ సైడ్ లవ్ ఇంకా ఎన్నాళ్ళు సాగుతుంది? తెలంగాణ ఏర్పడినప్పటినుంచీ గులాబీ పార్టీ విషయంలో చెరో దారిలో ప్రయాణించిన ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఏకతాటిపైకి వచ్చాయి. బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్కు బేషరతు మద్దతు ప్రకటించాయి. ప్రచారంలో కలిసి ముందుకు సాగాయి. మునుగోడులో గులాబీ పార్టీ విజయంలో లెఫ్ట్ పార్టీల సహకారం గురించి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. దీంతో సాధారణ ఎన్నికల్లో కూడా కమ్యూనిస్టు పార్టీలతో బీఆర్ఎస్ పొత్తు కొనసాగుతుందనే ప్రచారం జరిగింది. ఉనికి కోసం ఆరాటపడుతున్న ఉభయ కమ్యూనిస్టులకు మునుగోడు ఉప ఎన్నిక ఎంతో కలిసొచ్చింది. గులాబీ పార్టీతో పొత్తు కుదిరితే ఎన్నో కొన్ని సీట్లు తీసుకుని.. అసెంబ్లీలో ప్రవేశించవచ్చని భావిస్తున్నాయి. ముఖ్యంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఖమ్మం జిల్లాలో తమ నియోజకవర్గాల్లో ఖర్చీఫ్లు కూడా వేసుకుని గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. బీఆర్ఎస్తో కుదిరిన స్నేహం కారణంగా కేసీఆర్ ప్రభుత్వం మీద విమర్శల్లో తీవ్రత తగ్గించారు కమ్యూనిస్టు పార్టీల నాయకులు. బీఆర్ఎస్ పై లెఫ్ట్ పార్టీలు ఎంత ప్రేమ చూపిస్తున్నా... పైకి ప్రేమగా మాట్లాడుతున్నా లోపల కత్తులు దూస్తున్నారట జిల్లాల్లోని గులాబీ పార్టీ నేతలు. ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా ఉన్నప్పటికీ జిల్లాల్లో స్థానిక నేతలు కమ్యూనిస్టులను కలుపుకుపోవడం లేదనే చర్చ సాగుతోంది. ఖమ్మం జిల్లాలోని పాలేరులో పోటీ చేస్తానని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించగా.. సిటింగ్ ఎమ్మెల్యేను తానుండగా ఇంకెవరు పోటీ చేస్తారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కందాల ఉపెందర్ రెడ్డి రచ్చకు దిగారు. ఆ తర్వాత తమ్మినేని వీరభద్రం కొంత వెనక్కి తగ్గి సీపీఎం పోటీ చేస్తే బీఆర్ఎస్ సహాకరిస్తుంది.. బీఆర్ఎస్ పోటీ చేస్తే సీపీఎం సహకరిస్తుందని ప్రకటించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డికి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే భాస్కరరావుకు మధ్య అసలు పొసగడం లేదట. అన్ని రకాలుగా ప్రభుత్వానికి సహాకరిస్తున్న తమను పట్టించుకోకపోగా ఇబ్బంది పెడుతున్నారని జూలకంటి రంగారెడ్డి వాపోతున్నారట. మరోవైపు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుకు కూడా తన సొంత నియోజకవర్గం కొత్తగూడెంలో పలు సార్లు పరాభవం ఎదురైందట. కేసీఆర్ తనకు సన్నిహితంగా ఉన్నా.. స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనను పట్టించుకోకపోవడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు కూనంనేని. రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఉన్న తనకే ఈ పరిస్థితి ఉంటే జిల్లాలో తమ పార్టీ నేతల పరిస్థితి ఏంటనే ఆలోచనలో పడ్డారట కూనంనేని. రాష్ట్ర స్థాయిలో పార్టీ అగ్రనాయకుల మధ్య అవగాహన ఉన్నా.. స్థానిక నాయకత్వం మధ్య స్నేహం లేకపోవడంతో సీపీఐ, సీపీఎం పార్టీలతో బీఆర్ఎస్కు అవగాహన కుదరడం లేదట. తాము వన్ సైడ్ లవ్తో ప్రభుత్వానికి సహకరిస్తున్నా స్పందించకపోవడంతో అసంతృప్తికి లోనవుతున్నారట కమ్యూనిస్టు పార్టీల నేతలు. చూడాలి మరి ఎర్ర పార్టీలకు, గులాబీ పార్టీతో పొత్తు కుదురుతుందా లేక గతంలో మాదిరిగా ఎవరి దారి వారు చూసుకుంటారా అనేది తెలియాలంటే కొద్దికాలం ఆగాల్సిందే. ప్రస్తుతం అయితే తమ సీటు పోతుందనుకుంటున్న గులాబీ పార్టీ సిటింగ్ ఎమ్మెల్యేలు మాత్రం లెఫ్ట్ నాయకులంటే కస్సుమంటున్నారనే టాక్ నడుస్తోంది. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ చదవండి: రేవంత్ ఒక్కడే ఎందుకిలా?.. ఆ జిల్లాకు వెళ్లాలంటే భయమా? -
తమ్మినేని వర్సెస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల మధ్య రాజకీయ దుమారం చెలరేగింది. బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగ సమస్యపై కలసి పనిచేసే అంశంపై చర్చించేందుకు మంగళవారం సీపీఎం రాష్ట్ర కార్యాలయానికి వెళ్లిన షర్మిల... కాసేపు తమ్మినేని వీరభద్రంతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై పోరు కోసం టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వంలో తెలంగాణ స్టూడెంట్స్ యాక్షన్ ఫర్ వేకెన్సీస్ అండ్ ఎంప్లాయిమెంట్ (టీ–సేవ్) అనే ఫోరం ఏర్పాటుకు ప్రతిపాదించారు. అనంతరం షర్మిల, తమ్మినేని విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారి మధ్య వాదనలు తలెత్తాయి. ఇద్దరి మధ్య విమర్శలు.. ప్రతివిమర్శలు ‘సీపీఎం చేసిన ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలకు వైఎస్సార్టీపీ మద్దతివ్వలేదని తమ్మినేని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అన్నా.. (తమ్మినేనిని ఉద్దేశించి) ఎప్పుడైనా విపక్ష పా ర్టీ లకు కలసికట్టుగా పోరాడదామని పిలుపునిచ్చారా? ఈ అంశంపై నాకు ఎప్పుడైనా ఫోన్ చేశారా? నేను బీజేపీకి బీ టీం అయినట్లు, నేను నాటకాలు ఆడుతున్నట్లు తమ్మినేని ఆరోపిస్తున్నారు. నాటకాలు మేము ఆడలేదు. మునుగోడు ఉపఎన్నికలో కేసీఆర్కు బీ టీంగా పనిచేసింది కమ్యూనిస్టులే. వైస్సాఆర్టీపీ ఇంతవరకు ఏ పార్టీకి బీ టీంగా పనిచేయలేదు’అని షర్మిల తమ్మినేని ముందే నిలదీశారు. దీంతో పక్కనే ఉన్న తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ‘వైఎస్సార్ కూతురిగా, వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలిగా సీపీఎం కార్యాలయానికి వచ్చి మాతో మాట్లాడతామంటే ఆహ్వానించాం. కానీ సోదరి ఆ మర్యాద నిలుపుకోవట్లేదు. పా ర్టీ లకు రాజకీయ వైఖరులు ఉంటాయి. మునుగోడులో మేము ఏమీ చాటుగా చేయలేదు. బాహాటంగానే బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నాం. దానికిగల రాజకీయ వైఖరి ఏమిటో చెప్పాం. పైకొకటి లోనకటి చేసే రాజకీయ పార్టీ కాదు సీపీఎం. ఇదొక జాతీయ పార్టీ. వారికి బీ టీం.. వీరికి బీ టీం అని మా ఆఫీసుకు వచ్చి మాట్లాడే సాహసం చేయడం మంచిది కాదు. ఆమె మాట్లాడినట్లుగా నేను మాట్లాడలేను. ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా’అని పేర్కొన్నారు. అయితే షర్మిల వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. కాగా, నిరుద్యోగ సమస్యపై విపక్షాల ఐక్య పోరాటానికి షర్మిల చేసిన ప్రతిపాదనపై తమ పార్టీ కమిటీలో చర్చించి నిర్ణయం చెబుతామన్నారు. అయితే దేశంలో మతోన్మాదానికి ఆజ్యంపోయడంతోపాటు కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్న బీజేపీతో కలసి రాష్ట్రంలో పోరాడే ప్రసక్తేలేదని ఆయన తేలి్చచెప్పారు. కూనంనేనికి వినతిపత్రం... తమ్మినేనితో భేటీ అనంతరం షర్మిల సీపీఐ కార్యాలయానికి వెళ్లారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో భేటీ అయ్యారు. నిరుద్యోగుల సమస్యలపై కలసి పోరాడదామని విజ్ఞప్తి చేస్తూ ఆయనకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలపై అన్ని పా ర్టీ లు కలిసొచ్చి ‘టీ–సేవ్’ఏర్పాటు చేద్దామని తాను ప్రతిపాదించినట్లు తెలిపారు. ఎవరు ప్రతిపాదించారనేది ముఖ్యంకాదని, ఎవరో ఒకరు ప్రతిపాదించకపోతే ముందుకు వెళ్లదన్నారు. కూనంనేని తమ ఆహా్వనాన్ని స్వాగతించారన్నారు. బీజేపీయేతర కూటమి అయితే కలసి రావడానికి సిద్ధమని చెప్పారన్నారు. కూనంనేని మాట్లాడుతూ షర్మిల ప్రతిపాదనపై తమ పార్టీ కమిటీలో మాట్లాడతామని చెప్పారు. -
సీట్ల సర్దుబాటుతోనే రాజకీయ ఐక్యత
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాలని సీపీఎం, సీపీఐ భావిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఇదే లక్ష్యంతో ముందుకు సాగుతామని, తమ బలాన్ని పెంచుకుంటామని చెప్పా రు. బీజేపీ తప్పుడు పద్ధతుల్లో రాష్ట్రంలో ఎదిగేందుకు, అధికారం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. వామపక్ష భావజాలం బలంగా ఉన్న, సాయుధ పోరాటం జరిగిన తెలంగాణలో బీజేపీ అడుగుపెట్టాలనుకోవడం దుస్సాహసమేనని పేర్కొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ ఐకమత్యంతో వ్యవహరించాలని, రాబో యే ఎన్నికల్లో వీలైతే బీఆర్ఎస్తో సీట్ల సర్దుబాటు పొత్తు కుదుర్చుకుంటామని చెప్పారు. 2024 ఎన్నికల్లో పొరపాటున బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశం విచ్చి న్నంకాక తప్పదన్నారు. బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే క్రమంలోనే తెలంగాణలో తాము ఏకమయ్యామని తెలిపారు. మంగళవారం హైదరాబాద్లోని సీపీఐ కార్యాలయంలో తమ్మినేని, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఆ రెండు పార్టీ ల నేతలు చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, పశ్య పద్మ, చెరుపల్లి సీతారాములు, జాన్వెస్లీ సమావేశమయ్యారు. అనంతరం తమ్మినేని, కూనంనేని మీడియాతో మాట్లాడారు. షర్మిల తీరు హాస్యాస్పదం: కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో భాగస్వామి అయితే ఆమెను విచారించడాన్ని, శిక్ష విధించడాన్ని తమ పార్టీ లు సమర్థిస్తాయని తమ్మినేని అన్నారు. అయితే కవితపై పెడుతున్న కేసులు ప్రతిపక్షాలను లొంగ తీసుకునేందుకు ఆడుతున్న నాటకాలు తప్ప వాటిల్లో వాస్తవం లేదన్నారు. అదానీ దోపిడీకి వ్యతిరేకంగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, పోరాటాలు చేయాలని షర్మిలకు ఎందుకు గుర్తు రాలేదని తమ్మినేని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలకతీతంగా విపక్షాలు కలిసి మాట్లాడుకోవాలనడం హాస్యాస్పదమని విమర్శించారు. మంచైనా, చెడైనా కలిసే ముందుకు.. తాము అన్నదమ్ముల్లా ఉన్నామని, మంచైనా, చెడైనా ఇక కలిసే ముందుకు నడుస్తామని కూనంనేని స్పష్టం చేశారు. తమ రెండు పార్టీలు కలిస్తే 40 నుంచి 50 నియోజకవర్గాల్లో అభ్యర్థి ని గెలిపించే, ఓడించే శక్తి ఉంటుందని అన్నారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీల మధ్య మరింత ఐక్యత దిశగా ఈ నెల 9న హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో సీపీఐ, సీపీఎంల ఉమ్మడి సభ జరుగుతుందని తెలిపారు. -
ఇక చాలు.. తప్పుకుంటా: బీవీ రాఘవులు
సాక్షి, హైదరాబాద్: సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తన పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారా..? ఆయన ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఏపీకి చెందిన పార్టీ నేతలు పార్టీ కేంద్ర నాయకత్వానికి రాసిన లేఖ, దానిపై నాయకత్వం ప్రత్యేక కమిటీతో విచారణ జరిపించిన నేపథ్యంలో రాఘవులు తన పదవి నుంచి తప్పుకోనున్నట్లు లేఖ ద్వారా స్పష్టం చేసినట్టు సమాచారం. ఏపీలో పార్టీ పదవులకు సంబంధించి తలెత్తిన అభిప్రాయభేదాలు, కొందరిపట్ల రాఘవులు వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తున్నారంటూ పంపిన ఫిర్యాదు లేఖపై కేంద్ర నాయకత్వం విచారణ జరిపించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాఘవులు తన పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. విచారణ నివేదిక, రాఘవులు తప్పుకుంటానన్న లేఖపై ఆదివారం ఢిల్లీలో జరిగే పార్టీ పొలిట్బ్యూరోలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. విచారణ కమిటీ రాఘవులు చర్యలను తప్పుపట్టిందా? లేక విచారణ జరిపించడంపైనే ఆయన మనస్తాపం చెంది పార్టీ పదవి నుంచి తప్పుకుంటానని లేఖ ఇచ్చారా? అన్న దానిపై స్పష్టత లేదు. ఉమ్మడి ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న సమయంలో పార్టీ పటిష్టత కోసం రాఘవులు ఆధ్వర్యంలో పోరాటాలు చేసిన సంగతి తెలిసిందే. తమ్మినేని, శ్రీనివాసరావుల్లో ఒకరికి చాన్స్ పొలిట్బ్యూరో సభ్యునిగానే రాఘవులు రెండు తెలుగు రాష్ట్రాల పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. అయితే ఆయన్ను తప్పించే అవకాశం లేదని పార్టీ లోని ఓ వర్గం భావిస్తోంది. ఒకవేళ ఆయన తప్పుకుంటేఈ రెండు రాష్ట్రాల నుంచి ఒకరిని పొలిట్బ్యూరోలోకి తీసుకుంటారని చెబుతున్నారు. తెలంగాణ నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం లేదా ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న వి.శ్రీనివాసరావుల్లో ఒకరికి ఆ చోటు దక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పొలిట్బ్యూరో నుంచి తప్పిస్తే రాఘవులు ఇక సేవా కార్యక్రమాలకు పరిమితం కావాలని భావిస్తున్నట్టు తెలిసింది. -
మోదీని గద్దె దించితేనే ప్రజాస్వామ్య పరిరక్షణ
సాక్షిప్రతినిధి, వరంగల్: ‘దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగహక్కులపై దాడులు జరుగుతున్నాయి.. మతోన్మాద రాజకీయాలు, కార్పొరేట్ల దోపిడీతో ప్రజలు అల్లాడుతున్నారు.. నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపితేనే ప్రజాస్వామ్యం పరిరక్షణ జరుగుతుంది. ప్రగతిశీల శక్తులను కూడగట్టి ప్రజా ఉద్యమాలతోనే హక్కులను సాధించుకుందాం’అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. దాడులను తిప్పికొట్టేందుకు ప్రజలు, ప్రజాస్వామికవాదులు సంఘటితం కావాలని కోరారు. శుక్రవారం వరంగల్, హనుమకొండలలో జరిగిన పలు కార్యక్రమాల్లో సీతారాం ఏచూరి పాల్గొన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో ఈ నెల 29 వరకు సాగే రాష్ట్రవ్యాప్త జన చైతన్యయాత్రలను ప్రారంభించారు. కాకతీయ యూనివర్సిటీలో పీవీ నరసింహారావు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ‘‘చేంజింగ్ సినారియో ఆఫ్ ఇండియన్ ఫెడరలిజం’’అనే అంశంపై నిర్వహించిన సింపోజియంలో మాట్లాడారు. వరంగల్లోని అజంజాహి మిల్ (ఓ సిటీ) మైదానంలో జరిగిన బహిరంగసభలో సీతారాం ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ కేంద్రం హిందుత్వ ఎజెండాను తెరపైకి తీసుకొస్తుందని, అత్యంత బలమైన కేంద్రంగా రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ ఫెడరలిజంను దెబ్బతీస్తుందని ఆరోపించారు. కేంద్రం గవర్నర్ల వ్యవస్థ ద్వారా రాష్ట్రాలపై అధికారం చెలాయిస్తూ, ప్రభుత్వాలను కూలదోసిన ఘటలను ఆయన ఉదహరించారు. మోదీ ప్రభుత్వంలో మతోన్మాద రాజకీయాలు, కార్పొరేట్ సంస్థల దోపిడీ కవల పిల్లలుగా తయారయ్యాయని విమర్శించారు. ప్రశ్నించిన వారిపై దేశద్రోహులనే ముద్రవేసి సీబీఐ, ఈడీలతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లను ఉపయోగించుకుంటూ ప్రభుత్వాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని నిందించారు. సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత మద్యం పాలసీలో తప్పు చేసినట్లు రుజువైతే జైలు శిక్షలు వేసినా తమ పార్టీలు తప్పు పట్టవని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. వరంగల్ నుంచి ప్రజాచైతన్యయాత్ర ప్రారంభం.. రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్రజాచైతన్య యాత్రలు ప్రారంభంకానుండగా తొలుత వరంగల్లో సీతారాం ఏచూరి శుక్రవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా మొదట కాజీపేటనుంచి బైక్ర్యాలీ, హనుమకొండ ‘కుడా’మైదానం, వరంగల్ జిల్లా ఆజంజాహి మిల్లు మైదానం కేంద్రాల్లో బహిరంగ సభలు నిర్వహించారు. కాగా ఈ యాత్రకు సంఘీభావం తెలుపుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు బహిరంగసభలో ప్రసంగించారు. కార్యక్రమంలో సీపీఎం కేంద్ర కమిటీ నాయకులు జి.నాగయ్య, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి, రాష్ట్ర కమిటీ సభ్యులు జగదీష్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
కలసి నడుద్దాం
సాక్షి, హైదరాబాద్: కామ్రేడ్లు ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో కీలకమైన అయిదారు వేలమంది క్రియాశీలక కార్యకర్తలతో వచ్చే నెల 9వ తేదీన హైదరాబాద్లో ఉమ్మడి సమావేశం నిర్వహించాలని సీపీఐ, సీపీఎంలు నిర్ణయించాయి. ఈ సందర్భంగా ఉభయ పార్టీల నేతలు ఆదివారం సాయంత్రం హైదరాబాద్లో ఎంబీ భవన్లో సమావేశమయ్యారు. సీపీఐ తరపున కూనంనేని సాంబశివరావు, చాడ వెంకటరెడ్డి, సీపీఎం తరపున తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికలకు అన్ని రకాలుగా సిద్ధం కావాలని నిర్ణయించారు. వచ్చే నెల జరిగే ముఖ్య కార్యకర్తల సమావేశంలో క్యాడర్కు మార్గనిర్దేశం చేసేందుకు ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలకు చెందిన జాతీయ నేతలను ఆహ్వానిస్తారు. ఎన్నికల నాటి పరిస్థితులను బట్టి బీజేపీయేతర పార్టీలతో పొత్తులుంటాయి. పొత్తులతో సంబంధం లేకుండా 10 వేలకు పైగా ఓట్లున్న.. దాదాపు 20 అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టి సారించాలని నిర్ణయించారు. పొత్తులో భాగంగా ఆ స్థానాలను కోరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు రెండు పార్టీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరిపై ఒకరు పోటీ చేసుకోకూడదనేది ప్రాథమికంగా నిర్ణయించారు. పొత్తులపై ఇప్పటికీ గందరగోళమే.. రాష్ట్రంలో బీఆర్ఎస్తో సీపీఐ, సీపీఎంల పొత్తు వ్యవహారం ఇప్పటికీ గందరగోళంగానే ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలకు పొత్తులో భాగంగా సీట్లు కేటాయించేది లేదని, కేవలం ఎమ్మెల్సీ స్థానాలు ఇచ్చి సరిపెడతామని బీఆర్ఎస్ అంటున్న ట్టు జరుగుతున్న ప్రచారంపై కామ్రేడ్లు ఇంకా గరంగరంగానే ఉన్నారు. అవసరమైతే కాంగ్రెస్తోనైనా పొత్తుకు వెనుకాడబోమని వామపక్షాలు భావిస్తు న్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. -
ప్రతి విద్యాసంస్థలో ర్యాగింగ్ నిరోధక కమిటీలు
సాక్షి, హైదరాబాద్: ప్రతి విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నిరోధక కమిటీలు వేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభ ద్రం డిమాండ్ చేశారు. ర్యాగింగ్ను నిరోధించేందుకు యూజీసీ, ర్యాగింగ్ మార్గదర్శకాలు పాటించడంతో పాటుగా యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్స్ను ఏర్పాటు చేసి ఆయా నంబర్లను విస్తృతంగా ప్రచారం చేయాలని సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రతి విద్యాసంస్థలో ఫిర్యాదు బాక్స్ ఏర్పాటు చేయాలని, కమిటీల్లో తల్లిదండ్రులు, సైక్రియాటిస్ట్, సైకాలజిస్ట్లను భాగస్వాములను చేసి విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు. -
బీఆర్ఎస్తో పొత్తుపై ఇప్పుడే చెప్పలేం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలప్పుడే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. కానీ బీఆర్ఎస్ నాయకులు సీపీఐ, సీపీఎం పార్టీలు తమతోనే ఉంటాయనీ, ఎమ్మెల్యే సీట్లు కాకుండా, ఒకటి లేదా రెండు ఎమ్మెల్సీలు కేటాయిస్తామంటూ ప్రకటిస్తున్నారని గుర్తు చేశారు. ఇది బీఆర్ఎస్ అధిష్టానానికి తెలిసే జరుగుతుందని తాము అనుకోవడం లేదన్నారు. గతంలో పొత్తులు ఖరారైనపుడు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వని దాఖలాలు ఎప్పుడూ లేవని వివరించారు. త్వరలోనే సీపీఐతో పొత్తులపై చర్చిస్తామన్నారు. హైదరాబాద్లో రెండ్రోజులపాటు జరిగే సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎ.విజయరాఘవన్, బీవీ రాఘవులుసహా తమ్మినేని వీరభద్రం విలేకరులతో మాట్లాడారు. తమ్మినేని మాట్లాడుతూ, బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తామని చెప్పారు. మార్చిలో రాష్ట్రస్థాయిలో ప్రతి మండలంలో ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణను ప్రకటిస్తామని వివరించారు. బట్టబయలు కావాల్సిందే: రాఘవులు అదానీ పెట్టుబడులు, షేర్ల పతనానికి సంబంధించిన అక్రమాల గురించి ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయనీ, చర్చ చేపట్టాల్సిందేనంటూ రెండురోజులుగా పార్లమెంటును స్తంభింపజేశాయని బీవీ రాఘవులు చెప్పారు. కానీ కేంద్రం మొండిగా వ్యవహరిస్తుందని విమర్శించారు. అదానీ వ్యవహారంపై ప్రతిపక్షాలు పట్టుబడుతున్నట్టుగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాల్సిందేనని కోరారు. -
విజయం సాధించే వరకు పోరాడతాం
సాక్షి, హైదరాబాద్: ‘మా దేశం పాలు, పాలపొడి సహా ఇతర వస్తువులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా అమెరికా ఆంక్షలు విధించింది. క్యూబాను ఆర్థికంగా దిగ్బంధిస్తోంది. అన్ని రంగాల్లోనూ అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటునే ఉన్నాం. కానీ ఈ ఆర్థిక దిగ్బంధం మమ్మల్ని ఎప్పటికీ ఓడించలేదు. చేగువేరా స్ఫూర్తితో, ఫిడేల్ క్యాస్ట్రో చూపిన మార్గంలో విజయం సాధించి తీరుతాం. గెలిచే వరకు పోరాడాలన్న చేగువేరా పిలుపు మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది’ అని చేగువేరా తనయ డాక్టర్ అలైదా గువేరా అన్నారు. నేషనల్ కమిటీ ఫర్ సాలిడారిటీ విత్ క్యూబా, ఐప్సో సంస్థలు ఆదివారం రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన క్యూబా సంఘీభావ సభలో ఆమె ప్రసంగించారు. క్యూబా సార్వభౌమ, స్వతంత్ర దేశమని... ప్రపంచ దేశాల అండ, సంఘీభావంతో తప్పకుండా అమెరికా దుర్నీతిపై విజయం సాధించి తీరుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. నేను క్యూబన్ మహిళను... ‘వేలాదిగా తరలివచ్చి ఇలా మీ సంఘీభావాన్ని తెలియజేయడంతో ఎంతో సంతోషంగా ఉంది. రంగు, రూపం వల్ల కాకుండా మనుషులను మనుషులుగా గౌరవించే సమాజం కోసం అందరం సంఘటితం కావాల్సి ఉంది. చేగువేరా కూతురుగా నన్ను ప్రత్యేకంగా చూడొద్దు. నేను క్యూబన్ మహిళగా ఈ సభల్లో పాల్గొంటున్నాను. చేగువేరా ఒక పరిపూర్ణమైన కమ్యూనిస్టు. సామాజిక సేవను ఆయన నుంచే నేర్చుకున్నాం. ప్రతి మనిషిలో సామాజిక దృక్పథాన్ని పెంచేందుకు స్వచ్ఛంద సేవ దోహదంచేస్తుంది. చేసే పని మనిషి గౌరవాన్ని పెంచుతుంది. క్యూబా సామ్యవాద దేశంగా అభివృద్ధి చెందుతోంది. మా వనరులకు, సంపదకు మేమే యజమానులం. మా సామ్యవాద విధానాల వల్లే అమెరికా భయపడుతోంది. రకరకాల ఆంక్షలు విధిస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ క్యూబా ప్రపంచ దేశాలకు ఆదర్శంకాకూడదనేదే దాని ఉద్దేశం. కానీ కచ్చితంగా క్యూబా గెలుస్తుంది’ అని అలైదా అన్నారు. ఈ సందర్భంగా క్యూబాకు మద్దతుగా చేసిన తీర్మానాన్ని వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. అమెరికా సామ్రాజ్యవాదాన్ని నిరసిస్తూ గోరటి వెంకన్న పాడిన పాటతో సభ హోరెత్తింది. చేగువేరాపై సుద్దాల ఆంగ్లంలో పాడిన పాట ఆకట్టుకుంది. ఈ సభలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్కుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, పీసీసీ ఉపాధ్యక్షుడు వినోద్రెడ్డి, ఐప్సో ప్రతినిధి యాదవరెడ్డి, సీనియర్ సంపాదకులు కె.శ్రీనివాస్, శ్రీనివాస్రెడ్డి, ఆప్ నేత సుధాకర్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ప్రజాగాయకుడు గద్దర్, ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్తేజ, అరుణోదయ విమల, పీఓడబ్ల్యూ సంధ్య తదితరులు పాల్గొని క్యూబాకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. -
కాంగ్రెస్, బీజేపీల్లో చేరొద్దు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తాత్కాలిక ప్రయోజనాలు ఆశించి ఖమ్మం జిల్లా సంస్కృతి, విలువ లను కలుషితం చేసే నిర్ణయాలు తీసుకోవద్దని, విద్వేష భావాలు పెంచే రాజకీయాల వైపు వెళ్లవద్దని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పార్టీ నేతలకు సూచించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హడావుడి చేసిన వారందరూ తనకు మిత్రులేనని, వారంతా బీజేపీ, కాంగ్రెస్లోకి వెళ్తున్నట్లు మీడియాలో వార్తలు రావడం దురదృష్టకరమన్నారు. ముస్లింలు ఎక్కువ ఉన్న తెలంగాణలో బీజేపీ ఎదిగితే సమాజంలో మతఘర్షణలు ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. శాటిలైట్ ఆధారంగా చేస్తున్న పోడు భూముల సర్వే చట్టవిరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, భూక్యా వీరభద్రం, బొంతు రాంబాబు పాల్గొన్నారు. -
కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్న బీజేపీ
ఖమ్మం మయూరి సెంటర్ : సీఎం కేసీఆర్తో పాటు ఆయన కుటుంబాన్ని పథకం ప్రకారమే బీజేపీ ఇబ్బంది పెడుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ఆయన గురువారం ఖమ్మంలో విలేకరులతో మాట్లాడుతూ ఈడీ, సీబీఐతో ప్రతిపక్షాలపై దాడి చేయించడం దుర్మార్గమన్నారు. దీనిని రాష్ట్ర ప్రజలు తిప్పి కొట్టాలని కోరారు. రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం జరుగుతుండగా, వాటికి జాతీయహోదా ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని హామీలపై ఇటీవల సీఎం కేసీఆర్కు వివరిస్తే.. కార్యాచరణకు స్పష్టమైన హామీ ఇచ్చారని తెలిపారు. జనవరి నుంచి ప్రజా సమస్యలు, కేంద్ర ప్రభుత్వ హామీలపై పోరాటాలు చేయనున్నట్లు వీరభద్రం వెల్లడించారు. -
ప్రభుత్వంపై బీజేపీ కక్షసాధింపు
జనగామ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ, ఐటీ దాడులతో తెలంగాణ ప్రభుత్వంపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని లొంగదీసుకునేందుకు కేంద్ర సర్కారు అడ్డదారులు తొక్కుతోందని మండిపడ్డారు. టీఆర్ఎస్ పై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్న సమయంలో.. బీజేపీ దాడులతో సానుభూతి పెరిగేలా చేస్తోందని వ్యాఖ్యానించారు. మునుగోడు ఎన్నికల్లో విజ యం సాధించి.. తెలంగాణలో రెండో శక్తిగా ఎదగాలనే బీజేపీ ఆశలపై అక్కడి ఓటర్లు నీళ్లు చల్లారని అన్నా రు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో తమకు సంబంధం లేదని చెబుతున్న బీజేపీ.. హైకోర్టు, సుప్రీం కోర్టు మెట్లు ఎందుకు ఎక్కుతుందో ప్రజలకు సమాధానం చెప్పాలని తమ్మినేని డిమ ండ్ చేశారు. ఈడీ, ఐటీ దాడులను వెంటనే ఆపకుంటే జనం తిరగబడడం ఖాయమన్నారు. టీఆర్ఎస్తో పొత్తుపై ఇప్పుడే మాట్లాడం టీఆర్ఎస్తో పొత్తుపై ఇప్పుడే మాట్లాడేది లేదని, ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాతనే దీనిపై స్పష్టత ఇస్తామని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలతో పాటు బీజేపీ ద్వంద్వ విధానాలపై పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. పోడు భూముల సమస్యను పరిష్కరించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించాలని, అటవీ శాఖ అధికారిని హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అటవీ శాఖ అధికారులకు ఆయుధాలు ఇవ్వాలనేది ప్రభుత్వ నిర్ణయం మేరకే ఉంటుందని తమ్మినేని అభిప్రాయపడ్డారు. -
పొలిటికల్ కారిడార్: పాలేరు నాదే అంటున్న ఎర్రన్న..
-
నిమ్స్ కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: నిమ్స్ ఆస్పత్రిలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల జీతాలు పెంచి, సీనియారిటీ ప్రకారం వారిని రెగ్యులరైజ్ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. ఈ మేరకు శనివారం సీఎం కేసీఆర్కు ఆయన లేఖ రాశారు. నిమ్స్ హాస్పిటల్లో 1,350 మంది కార్మికులు కాంట్రాక్టు పద్ధతిలో 25 ఏళ్లుగా పని చేస్తున్నా.. కనీస వేతనం నెలకు రూ.14,700 మాత్రమే వస్తోందని తెలిపారు. లేబర్ కమిషన్ ముసాయిదా ప్రకారం వీరికి రూ.20 వేల వరకు జీతం పెరిగే అవకాశమున్నా, రాష్ట్ర ప్రభుత్వం నేటికీ గెజిట్ జారీ చేయలేదని తమ్మినేని వెల్లడించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత నిమ్స్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. సీనియారిటీ ప్రకారం జూనియర్లకు రు.20 వేలకు తగ్గకుండా, సీనియర్లకి వారి సీనియారిటీని బట్టి జీతం పెంచేలా చూడాలని ఆ లేఖలో కోరారు. -
భవిష్యత్లోనూ కలిసే పనిచేస్తాం
సాక్షి, హైదరాబాద్: బీజేపీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీలతో భవిష్యత్లోనూ కలిసే పనిచేస్తామని విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి అన్నారు. ముసుగోడులో టీఆర్ఎస్ను గెలిపించిన వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పారు. మంగళవారం జగదీశ్ రెడ్డితోపాటు మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్, ఎమ్మెల్సీ రవీందర్లు సీపీఎం రాష్ట్ర పార్టీ కార్యాలయం ఎంబీ భవన్కు వచ్చారు. వారికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, జి.నాగయ్య, బి.వెంకట్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, డీజీ నరసింహారావు, మల్లు లక్ష్మి, ఎండీ అబ్బాస్, టి.సాగర్ స్వాగతం పలికారు. అనంతరం జగదీశ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలకు శాలువా కప్పి సన్మానించారు. ఆ తర్వాత వారు పలు అంశాలపై చర్చించారు. అంతకుముందు జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడులో టీఆర్ఎస్కు మద్దతిచ్చిన సీపీఎం నేతలకు కృతజ్ఞతలు చెప్పడం కోసమే వచ్చానని చెప్పారు. ఈ ఐక్యత ఇక ముందు కూడా కొనసాగాలని ఆకాంక్షించారు. మునుగోడు ఫలితం బీజేపీకి చెంపపెట్టులాంటిదన్నారు. ఇక్కడి నుంచే ఆ పార్టీ పతనం ప్రారంభమవుతుందని చెప్పా రు. వామపక్ష పార్టీలు, నాయకులు చారిత్రక బాధ్యతను నెరవేర్చారన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వపరంగా చేయాల్సినవి చేస్తామని పేర్కొన్నారు. వాటిని ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీల నాయకులు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారని గుర్తుచేశారు. బీజేపీ నుంచి దేశానికి విముక్తి కల్పించాలని కోరారు. తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ, ‘కమ్యూనిస్టుల బలం ప్రస్తుతం తక్కువగా ఉండొచ్చు.. కానీ మా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్లోనూ బీజేపీ ఎదుగుదలను అడ్డుకుంటాం. గవర్నర్ వ్యవస్థ సక్రమంగా పనిచేయడం లేదు. తెలంగాణ గవర్నర్ వద్ద అనేక బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. గవర్నర్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాలి’అని చెప్పారు. ఏడాది కింద ప్రారంభమైన రామగుండం ఎరువుల పరిశ్రమను ప్రధాని మోదీ మళ్లీ ప్రారంభించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈనెల 12న ప్రధాని మోదీ రామగుండంకు వస్తున్న సందర్భంగా నిరసనలు వ్యక్తం చేస్తామన్నారు. సీపీఎం నేతలతో భేటీ మంత్రి జగదీశ్ రెడ్డి, కూసుకుంట్ల, గ్యాదరి కిశోర్, తక్కలపల్లి రవీందర్లు హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాల యం మఖ్దూంభవన్లో సీపీఐ నేతలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు సయ్యద్ అజీజ్ పాషా, కూనంనేని సాంబశివరావు, చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి, ఈ.టి.నర్సింహా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి, కూసుకుంట్లకు సీపీఐ నేతలు మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. మునుగోడు ఎన్నిక ద్వారా బీజేపీకి ముగింపు కార్డు వేశామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. -
కామ్రేడ్.. అసెంబ్లీకి ఎప్పుడు వెళ్దాం? కమ్యూనిస్టు నేతల్లో కొత్త ఉత్సాహం
మునుగోడు ఉప ఎన్నిక ఖమ్మం జిల్లా గులాబీ నేతల చావుకొచ్చింది. మునుగోడులో టీఆర్ఎస్కు వామపక్షాల మద్దతు ఇస్తున్నాయి. ఈ మద్దతు వచ్చే ఎన్నికల్లో కూడా పొత్తు కొనసాగబోతోందని మూడు పార్టీల నుంచి సంకేతాలు వచ్చాయి. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు చాలా ఉత్సాహంగా ఉన్నాయి. ముఖ్యంగా రెండు పార్టీల రాష్ట్ర కార్యదర్శులు ఖమ్మం జిల్లాకే చెందినవారు కావడంతో ఆ ఇద్దరూ కూడా అత్యంత ఉత్సాహంగా కనిపిస్తున్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావులు వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పొత్తుతో ఈ జిల్లా నుంచి పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఉవ్విళ్ళూరుతున్నారని ప్రచారం సాగుతోంది. మునుగోడుతో ముహూర్తం టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి కమ్యూనిస్టు పార్టీలతో సంబంధాలు ఒక్కోసారి ఒక్కోలా ఉంటున్నాయి. అయితే మునుగోడులో గులాబీకి ఎర్రపార్టీలు మద్దతు ప్రకటించాయి. మూడు పార్టీల నేతలు కలిసి ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర కార్యదర్శులు ఖమ్మం జిల్లాలో తమకు బలమున్న సీట్లపై ఖర్చీఫ్ వేసేశారట. ఘన చరిత్ర.. పేలవ వర్తమానం పాతికేళ్ళ నాడు ఒకసారి ఎంపీగా గెలిచిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం 2004లో ఖమ్మం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు 2009లో ఒకసారి కొత్తగూడెం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ప్రస్తుతం రెండు పార్టీలకు అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేదు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల రీత్యా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కచ్చితంగా వామపక్షాలతో కలిసి పోటీ చేస్తుందనేది రాజకీయ వర్గాల్లో గట్టిగా ఉన్న అభిప్రాయం. అందుకు మూడు పార్టీలు కూడా సిద్ధంగానే ఉన్నాయి. మునుగోడు ఉప ఎన్నికే అందుకు ఉదాహరణ అంటున్నారు. ఈ సారి తగ్గేదేలే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో జనరల్ సీట్లు ఖమ్మం, కొత్తగూడెం, పాలేరు మాత్రమే. మిగిలినవన్నీ రిజర్వుడు సీట్లే. అగ్రకులాలకు చెందిన నేతలు ఎంతమంది ఉన్నా అక్కడ ఉన్నది మూడు సీట్లు మాత్రమే. ఇప్పటికే ఆ జిల్లాలో టీఆర్ఎస్ నుంచి నలుగురు సీనియర్ నేతలు పని చేస్తున్నారు. ఇప్పుడు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావులు పాలేరు, కొత్తగూడెం సీట్లపై ఖర్ఛీఫ్ వేసుకున్నారట. వామపక్షాల అగ్రనేతలు తమ స్థానాల్లో సెటిలైతే తమ పరిస్థితేం కావాలంటూ గులాబీ పార్టీ ఆశావహుల్లో గుబులు మొదలైందట. మునుగోడు ఉప ఎన్నిక తమ సీట్లకు ఎసరు తెచ్చిందని గాబరా పడుతున్నారట ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీనియర్ గులాబీ నేతలు. గెలిచిందే ఒక్కరు, ఆ తర్వాత కారు ఎక్కేశారు ఒకప్పుడు ఖమ్మం జిల్లా కమ్యూనిస్టులకు కంచుకోట. ఇప్పటికీ కమ్యూనిస్టు పార్టీలంటే అభిమానించేవారు ఉన్నప్పటికీ...రెండు పార్టీల నేతల తీరుతో కాలక్రమంలో అసలు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కొక్క సీటు మాత్రమే సాధించుకోగలిగింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అక్కడ బలంగానే ఉంది. అయితే కాంగ్రెస్ నుంచి గెలిచిన పాలేరు, కొత్తగూడెం ఎమ్మెల్యేలు కారెక్కడంతో జనరల్ సీట్లు మూడు ఇప్పుడు గులాబీ పార్టీ ఖాతాలోనే ఉన్నాయి. మరోవైపు జిల్లా రాజకీయాల్లో పట్టున్న ఇద్దరు కామ్రేడ్లు కొత్తగూడెం, పాలేరు సీట్లపై ఖర్చీఫ్ వేసుకోవడం ఇప్పుడు చర్చకు దారి తీసింది. కర్చీఫ్ మిషన్ 2023 టీఆర్ఎస్కు వామపక్షాలతో పొత్తు కుదిరితే గనుక మిగిలిన సీట్ల సంగతెలా ఉన్నా తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావులు తమకు కావాల్సిన సీట్లపై గట్టిగా ఒత్తిడి తెస్తారని జిల్లాలో టాక్. అదే నిజమైతే గులాబీ శ్రేణులు ఎంతవరకు సహకరిస్తాయో చూడాలి. ఇటీవల ఖమ్మం జిల్లాలో సంభవించిన రాజకీయ పరిణామాలు అటు టీఆర్ఎస్కు, ఇటు సీపీఎంకు కూడా కొంత ఇబ్బందికరంగానే ఉన్నాయి. ఈ వ్యతిరేకతను సానుకూలంగా మార్చుకోగలిగితే పొత్తుల వల్ల ఫలితం ఉంటుందని, కమ్యూనిస్టు పార్టీల నాయకులిద్దరికీ ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు. చదవండి: పదవి అంటే పరారే.! కాంగ్రెస్కు ఎందుకీ పరిస్థితి? -
టీఆర్ఎస్ వ్యాఖ్యలపై సీపీఎం అసహనం
సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధికి రూ.18 వందల కోట్లు ఇస్తే ఉపఎన్నికల బరి నుంచి తప్పుకుంటామన్ని టీఆర్ఎస్ ప్రకటనపై మిత్రపక్షమైన సీపీఎం అసహనం వ్యక్తం చేసింది. బీజేపీ పట్ల రాజకీయంగా మెతక వైఖరి సరైంది కాదని స్పష్టం చేసింది. మంత్రులు జగదీశ్రెడ్డి, కేటీఆర్ వ్యాఖ్యలు బీజేపీపట్ల మెతక వైఖరిని సూచిస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. టీఆర్ఎస్ డబ్బుల కోసమే అక్కడ పోటీ చేస్తోందా, నిజంగా డబ్బులు ఇస్తే ఎన్నికల నుంచి విత్డ్రా చేసుకుంటారా అని తమ్మినేని ప్రశ్నించారు. ‘బీజేపీ, మతోన్మాద వ్యతిరేక త అనేది నియోజకవర్గ డబ్బుల కోసమా? మోదీ దేశం మొత్తాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. మరి ఈ ప్రకటనతో బీజేపీతో తమకు పంచాయతీ లేదని చెప్తారా? భవిష్యత్తులో రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఒకవేళ సత్సంబంధాలు వస్తే బీజేపీని సమర్ధిస్తారు కదా? ఇది సరైన వైఖరి కాద’ని ఆయన టీఆర్ఎస్ నేతలకు హితవు పలికారు. కాగా, తమ్మినేని చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో సంచలనం రేపాయి. టీఆర్ఎస్కు చెందిన కీలక నేతలు కూడా సందిగ్ధంలో పడినట్లు సమాచారం. ఇక నుంచి అటువంటి వ్యాఖ్యలు చేయబోమని వారన్నట్లు తెలిసింది. -
శ్రీలంక తరహా సంక్షోభం దేశంలోనూ రావొచ్చు: సీపీఐ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘దేశంలోనూ శ్రీలంక తరహా ఆర్థిక, రాజకీయ సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంది. ఆ సమయంలో పుట్టుకొచ్చే ప్రజా ఆందోళనలకు నాయకత్వం వహించేందుకు వామపక్ష పార్టీలన్నీ సిద్ధంగా ఉండాలి. ఇందుకు సైద్ధాంతికంగా ఎర్ర జెండాలన్నీ ఏకం కావాలి..’ అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పిలుపునిచ్చారు. మతో న్మాద బీజేపీని ఎదుర్కొవాలంటే సీపీఐ, సీపీఎంల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి పని చేయాలని అన్నారు. ఇందుకు 2 పార్టీల జాతీయ నాయకత్వం చొరవ చూపాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో సీపీఐ తెలంగాణ రాష్ట్ర మూడో మహాసభల్లో భాగంగా సోమవారం ఆయన ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. మతోన్మాద బీజేపీని ఐక్యంగా ఎదుర్కోవాలి ‘నయా ఉదారవాద ఆర్థిక విధానాల వల్ల దేశవ్యాప్తంగా అనేక మార్పులు చోటు చేసు కున్నాయి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దాసోహమైంది. ధరలు అమాంతం పెరిగిపోయాయి. ప్రజల మధ్య అంతరాలూ పెరిగాయి. ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యమై, ఆశించిన స్థాయిలో ఉపాధి అవకాశాలు లేక యువత తీవ్రమైన అసహ నం, ఆగ్రహంతో రోడ్డెక్కుతోంది. మరోవైపు మోదీ ఆర్ఎస్ఎస్ చేతుల్లో కీలుబొమ్మగా మారారు. బహుళ మతాలు, కులాలు, ప్రాంతాలు ఉన్న ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రపన్నారు. హిందూమత రాజ్యస్థాపనే లక్ష్యంగా చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్నారు. మతోన్మాద బీజేపీని, దాని వెనుక ఉన్న ఆర్ఎస్ఎస్ను ఎదుర్కొనేందుకు ఎర్రజెండా పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది..’ అని రాజా పేర్కొన్నారు. రాజ్యాంగ సంస్థల దుర్వినియోగం ‘మోదీ ప్రభుత్వం అత్యంత నియంతృత్వ పాలన కొనసాగిస్తోంది. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థలను దుర్వినియోగం చేస్తోంది. రాష్ట్రాల హక్కులను హరిస్తోంది. ప్రతిపక్ష పార్టీలు, నేతలపై సీబీఐ, ఐటీ దాడులు చేయించి వారిని లొంగదీసుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రజాస్వామ్య బద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలను కూల్చేందుకు లెప్టినెంట్ గవర్నర్, గవర్నర్ వ్యవస్థలను ఉపయోగించుకుంటోంది. 2024లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకుండా ఉండాలంటే బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఇప్పటినుంచే ఏకమై పని చేయాలి..’ అని రాజా స్పష్టం చేశారు. ఐక్యత చాటుతాం: రామకృష్ణ కమ్యూనిస్టులు ఏకం కావాల్సిన ఆవశ్యకతపై వామపక్ష మేధావులంతా చర్చించాలని ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ సూచించారు. అక్టోబర్లో విజయవాడ కేంద్రంగా నిర్వహించే జాతీయ మహా సభల సందర్భంగా వామపక్ష పార్టీలన్నీ భుజం భుజం కలిపి భారీ ర్యాలీ నిర్వహించడం ద్వారా ఐక్యతను చాటి చెబుతాయని చెప్పారు. సీపీఐ ప్రతిపాదనను సమర్థిస్తున్నా: తమ్మినేని సైద్ధాంతిక ప్రాతిపదికన కమ్యూని స్టులంతా ఏకం కావాలనే సీపీఐ ప్రతిపా దనను సమర్థిస్తున్నట్లు సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలి పారు. మతోన్మాద బీజేపీకి ప్రత్యా మ్నా య శక్తిగా నిలబడే సత్తా కమ్యూనిస్టులకే ఉందన్నారు. మోదీ ప్రభుత్వం ఉన్మాదంతో, ఉద్వేగంతో ప్రజలను రెచ్చగొడు తోందని, ప్రజాస్వామ్యానికి పెద్ద ప్రమా దకారిగా మారిందని విమర్శించారు. సాయుధ పోరాటంతో బీజేపీకి సంబంధమే లేదు: సురవరం తెలంగాణ సాయుధ పోరాటానికి, బీజేపీకి సంబంధమే లేదని సీపీఐ సీనియర్ నేత సురవరం సుధాకర్రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీతో పాటు ఎంఐఎం, టీఆర్ఎస్లు కూడా తామే పోరాటం చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నాయని విమర్శించారు. వాస్తవానికి ఈ పోరాటానికి పూర్తిగా కమ్యూనిస్టులే నాయకత్వం వహించారని తెలిపారు. ఇదీ చదవండి: 2024: ఢిల్లీ ‘పవర్’ మనదే.. దేశమంతా ఫ్రీ పవరే! -
బీజేపీని ఓడించేందుకే టీఆర్ఎస్కు మద్దతు
కూసుమంచి: మతతత్వ పార్టీ అయిన బీజేపీకి తాము వ్యతిరేకమని, ఆ పార్టీని తెలంగాణలో నిలువరించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తామని, ఈ క్రమంలోనే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆదివారం ఆయన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మల్లేపల్లిలో విలేకరులతో మాట్లాడారు. మునుగోడులో టీఆర్ఎస్– బీజేపీ మధ్యే గట్టి పోటీ ఉందని భావించి, తమతోపాటు సీపీఐ కూడా టీఆర్ఎస్కు సహకరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. గతంలో అక్కడ సీపీఐ ఐదుసార్లు గెలిచినా, ఇప్పుడు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసినా ప్రధాన పార్టీలను ఎదుర్కొనేశక్తి లేదని, అందుకే ఓట్లు చీలకుండా టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాల్సి వచ్చిందని వివరించారు. కాంగ్రెస్ కూడా తమ మద్దతును కోరినప్పటికీ బీజేపీని అడ్డుకునే శక్తి టీఆర్ఎస్కే ఉందని భావించామన్నారు. టీఆర్ఎస్కు తమ సహకారం ఈ ఎన్నిక వరకే పరిమితమని స్పష్టం చేశారు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కానందునే తాను రాజీనామా చేశానని తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చెప్పడం సరైంది కాదన్నారు. తెల్దారుపల్లిలో వ్యక్తిగత కారణాలతోనే తమ్మినేని కృష్ణయ్య హత్యకు గురయ్యారని, ఈ ఘటనకు, సీపీఎంకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. కృష్ణయ్య హత్య నేపథ్యంలోనే తాము టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నామనడం అవాస్తవమని కొట్టిపారేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో, దేశంలో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు పరిస్థితులను బట్టి ఇతర పార్టీలతో కలిసి ముందుకు సాగుతామని చెప్పారు. -
వైఖరి మారకుంటే సార్వత్రిక ఎన్నికల్లోనూ మద్దతు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఓటమే లక్ష్యంగా మునుగోడు శాస నసభ ఉప ఎన్నిక వరకే టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర పార్టీ స్పష్టం చేసింది. సార్వత్రిక ఎన్నికల్లోనూ మద్దతు ఇవ్వాలనే ప్రతిపాదనపై స్పందిస్తూ ప్రస్తుతం బీజేపీ పట్ల టీఆర్ఎస్ అనుసరిస్తున్న వైఖరి అప్పుడు కూడా కొనసాగితే తప్పకుండా మద్దతిస్తామని చెప్పింది. శనివారం సీఎం కేసీఆర్తో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారా ములు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి భేటీ అయ్యారు. ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న బీజేపీని ఓడించేందుకు విపక్షాలన్నీ ఏకం కావాలని సీఎం కోరగా... ఆ మేరకు కట్టుబడి పని చేద్దామని సీపీఎం నేతలు పేర్కొనట్లు తెలిసింది. భవిష్యత్తులో పరి స్థితులకు అనుగుణంగా ముందుకెళ్తామన్నట్లు సమాచారం. అలాగే, రాష్ట్రంలోని వివిధ వర్గాల సమస్యల పైనా సీపీఎం నేతలు ముఖ్య మంత్రితో చర్చించారు. కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం వారికి హామీ ఇచ్చారు. సీపీఎం లేవనెత్తిన ప్రధాన అంశాలు ► 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు రైతులకు పట్టాల పంపిణీ చేయాలి. కౌలు రైతులకు రుణ అర్హత కార్డులివ్వాలి. ► వ్యవసాయ కార్మికులకు కనీస వేతన జీవో సవరణ చేయాలి. రోజు కూలీ రూ.600 ఇవ్వాలి. ► అర్హులైన పేదలందరికీ 120 గజాల ఇంటి స్థలం, ఇంటి నిర్మాణా నికి రూ.5లక్షల సాయం చేయాలి. ఆర్టీసీలో యూనియన్లను అనుమతి ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలి. ధరణి పోర్టల్లో సవరణలు చేసి పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి. రూ.లక్ష లోపు రైతుల రుణాలన్నీ ఏకకాలంలో మాఫీ చే యాలి. గిరిజన జనాభా ► నిష్పత్తి ప్రకారం 10శాతానికి రిజర్వేష న్లను పెంచాలి. అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి సమర్పించాలి. తెలంగాణలో మత విద్వేషాలకు తావు లేదు : సీఎం కేసీఆర్ తెలంగాణలో మత విద్వేషాలకు తావులే దని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజల్లో విద్వేషాలను పెంచేందుకు ప్రయత్నించే దుష్టశక్తులను ఐక్యంగా తిప్పికొడదామ న్నారు. మతం పేరుతో ప్రజల నడుమ విభజన తేవాలని చూసే స్వార్థ రాజకీయాలను తిప్పికొట్టేందుకు తమతో కలిసి రావాలని మేధావులను కేసీఆర్ ఆహ్వానించారు. స్వార్థ రాజ కీయాల కోసం విచ్ఛిన్నకర శక్తులు పచ్చని తెలంగాణలో మతం పేరుతో చిచ్చు పెట్టేందుకు కుట్రలు చేస్తున్నాయని చెప్పారు. ఆ కుట్రలను తిప్పికొట్టేందుకు ప్రజాస్వామికవా దులు, మేధావులు, రాజకీయవేత్తలు కదిలి రావాలని తాని చ్చిన పిలుపునకు స్పందించి మద్దతు ప్రకటించేందుకు వచ్చిన సీపీఎం పార్టీకి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. మత విద్వేష శక్తులను ఎదుర్కునేందుకు సీఎం చేస్తున్న పోరాటానికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని సీపీఎం నేతలు స్పష్టం చేశారు. చదవండి: ‘సిట్టింగులందరికీ సీట్లు’ -
మా నాన్న హత్యకు అతడే సూత్రధారి: తమ్మినేని కృష్ణయ్య కూతురు కామెంట్స్
Tammineni Krishnaiah.. సాక్షి, ఖమ్మం: తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్య సంచలనంగా మారింది. ఈ హత్య కేసులో ఏ1గా ఉన్న కోటేశ్వరరావు పరారీలో ఉన్న విషయం తెలిసిందే. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన తండ్రి తమ్మినేని కృష్ణయ్య హత్యపై ఆయన కూతురు రజిత షాకింగ్ కామెంట్స్ చేశారు. తమ్మినేని కూతురు రజిత ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మా నాన్నను హత్య చేయించడంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రమే సూత్రదారి. వీరభద్రం ఆదేశాల మేరకు హత్య జరిగింది. హత్య కేసులో సీపీఎం కార్యకర్తలు ఎవరు లేరని వీరభద్రం తప్పుడు మాటలు చెబుతున్నారు. హత్యలో ఉన్న వాళ్లంత సీపీఏం పార్టీకి చెందిన వారే. మా ఇంట్లో వ్యక్తి చనిపోతే.. మాకు కాకుండా తమ్మినేని వీరభద్రానికి సెక్యూరిటీ ఇవ్వడమేంటి?. మా నాన్న హత్య కేసులో ప్రధాన నిందితులైన కోటేశ్వరరావు, లింగయ్యను దాచిపెట్టింది పోలీసులే. మా గ్రామానికి సెక్యూరిటీ కల్పించి ప్రశాంతమైన వాతావరణం తీసుకురండి. మాకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. మంత్రి కేటీఆర్ స్పందించి మాకు న్యాయం చేయాలి’’ అని కోరారు. ఇది కూడా చదవండి: సంచలనంగా మారిన తమ్మినేని మర్డర్ కేసు: ఆరుగురు అరెస్ట్ -
తమ్మినేని కృష్ణయ్య హత్య.. ‘నా భర్త చావుకు వాళ్లే కారణం’
సాక్షి, ఖమ్మం: ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లి గ్రామ సమీపంలో టీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. తమ్మినేని కృష్ణయ్య హత్యతో తెల్దారుపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే తన భర్త హత్య వెనక సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఆ పార్టీ నాయకులు తమ్మినేని కోటేశ్వరరావు హస్తం ఉందని తమ్మినేని కృష్ణయ్య భార్య ఎంపీటీసీ మంగతాయారు, కూతురు రజిత ఆరోపించారు. వెంటనే వారిని అరెస్ట్ చేసి.. కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గతంలోనే తన భర్తను హత్య చేస్తానని కోటేశ్వరరావు పలుమార్లు బెదిరిస్తూ వచ్చారన్నారు. గ్రామంలో తన భర్తకు రాజకీయంగా మంచి పేరు ఉండటంతో కోటేశ్వరరావు చంపాలని ప్లాన్ వేశారన్నారు. తమ్మినేని వీరభద్రంతో పాటు కోటేశ్వరరావును హత్యతో సంబంధం ఉన్న సీపీఎం నాయకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తమ కుటుంబానికి వచ్చిన పరిస్థితి భవిష్యత్తులో ఏ కుంటుంబానికి రావద్దని కన్నీటి పర్యంతమయ్యారు. చదవండి: తమ్మినేని కృష్ణయ్య హత్యతో ఉద్రిక్త పరిస్థితులు.. రెండు చేతుల్ని.. -
ఖమ్మం: టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య దారుణహత్య
-
తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడి దారుణ హత్య!
సాక్షి, ఖమ్మం: జిల్లా రాజకీయాల్లో ఓ దారుణ హత్య కలకలం రేపుతోంది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడి తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యాడు. కత్తులతో కొడవళ్లతో దారుణంగా హతమార్చారు దుండగులు. ఖమ్మం జిల్లా తెల్దారుపల్లిలో తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యాడు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి వరుసకు సోదరుడు అవుతాడు కృష్ణయ్య. అయితే.. సీపీఎంతో విభేదించి.. టీఆర్ఎస్లో చేరాడు కృష్ణయ్య. ఆపై తుమ్మలకు ప్రధాన అనుచరుడిగా వ్యవహరించడం మొదలుపెట్టాడు. ఈ హత్యోదంతానికి సంబంధించిన మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. ఇదీ చదవండి: దారుణాతీ దారుణం .. దళిత చిన్నారిని కొట్టి చంపిన టీచర్ -
పోడు భూములకు హక్కుపత్రాలివ్వాలి
సాక్షిప్రతినిధి, వరంగల్: రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చేసిన ప్రకటన మేరకు పోడు భూముల దరఖాస్తులను పరిశీలించి హక్కు పత్రాలను ఇవ్వాలని గిరిజన, ఆదివాసీలపై ప్రభుత్వ నిర్బంధాన్ని ఆపాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశం డిమాండ్ చేసింది. హనుమకొండ జిల్లా కాజీపేట ఫాతిమానగర్లోని బాలవికాసలో మూడు రోజులుగా జరుగుతున్న సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు బుధవారంతో ముగిశాయి. కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశాల్లో తమ్మినేని వీరభద్రం పలు తీర్మానాలను ప్రతిపాదించగా, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలతో దెబ్బతిన్న పంటలు, నష్టాలపై అంచనా వేసి వెంటనే పరిహారం చెల్లించాలంటూ చేసిన మొత్తం ఏడు తీర్మానాలను రాష్ట్ర కమిటీ ఆమోదించింది. చలో హైదరాబాద్కు మద్దతు ఆగస్టు 3న కార్మికులు తలపెట్టిన చలో హైదరాబాద్కు సీపీఎం మద్దతిస్తున్నట్లు పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తెలిపారు. ప్రజా సమస్యల మీద నిరంతరం సమరశీల పోరాటాలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతా రాం ఏచూరి, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పొలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవు లు, చెరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డి తదితరులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. -
పెంచిన ఆర్టీసీ చార్జీలను ఉపసంహరించుకోవాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పల్లె వెలు గు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, మెట్రో డీలక్స్ ఆర్టీసీ బస్సుల్లో టికెట్ చార్జీలు పెంచి పేద, మధ్యతరగతి ప్రజలపై భారాన్ని వేయడాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పెంచిన చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పెంచిన చార్జీలను వ్యతిరేకిస్తూ ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు చేయాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ నష్టాల బాట నుంచి గట్టెక్కించడానికి బడ్జెట్లో సరిపోయినన్ని నిధులు కేటాయించి సంస్థను నిలబెట్టుకోవాల్సిన ప్రభుత్వం, నేడు ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ వారికి కట్టబెట్టి, ప్రయాణ టికెట్ రేట్లు పెంచి పూడ్చుకోవాలని చూస్తోందని విమర్శించారు. చినజీయర్ స్వామి ప్రజల నమ్మకాలు, ఆహారాలు, కులాలు, వృత్తులపైన బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేస్తూ అవమానపర్చడాన్ని తమ్మినేని తీవ్రంగా ఖండించారు. వెంటనే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. -
భారతీయుల తరలింపులో విఫలం
యాదగిరిగుట్ట: ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడంలో మోదీ సర్కారు విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ యుద్ధం జరగనుందని ముందే గ్రహించిన అమెరికా, యూరప్ దేశాలు తమ పౌరులకు ప్రమాదం వాటిల్లకుండా వెనక్కి రావాలని 10 రోజుల ముందే సూచించాయని, కానీ, మోదీ మాత్రం అలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదన్నారు. మోదీ మనసంతా ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికల్లో ఉందే తప్పా, ఉక్రెయిన్లోని 18 వేల మంది భారతీయ విద్యార్థుల బాధ, భవిష్యత్తుపై లేదని ఎద్దేవా చేశారు. -
రైతు ఉద్యమంలా వీఆర్ఏలు పోరాడాలి
కవాడిగూడ: వీఆర్ఏలు రాష్ట్ర ప్రభుత్వంతో యుద్ధం చేసి ఉద్యోగాలు సాధించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. ఇందుకు ఢిల్లీ రైతుల ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా వీఆర్ఏలకు పే స్కేల్ జీవో, ఇతర డిమాండ్లను నెరవేర్చాలంటూ తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ‘చలో హైదరాబాద్’నిర్వహించారు. ఇందిపార్కు ధర్నా చౌక్ వద్ద మహాధర్నా చేశారు. తమ్మినేని వీరభద్రం, మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క, మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, బీజేపీ నాయకులు తీన్మార్ మల్లన్న తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. వీరభద్రం మాట్లాడుతూ.. ‘వీఆర్ఏలు చేస్తున్న పోరాటం రాజ్యాంగబద్ధమైనది. వాళ్లకు ఇప్పటివరకు పే స్కేల్ ఇవ్వలేదు. సర్వీసును పర్మినెంట్ చేయలేదు’అన్నారు. వీఆర్ఏల న్యాయమైన పోరాటానికి సీపీఎం అండగా ఉంటుందని చెప్పారు. అసెంబ్లీలో మాట్లాడతా: సీతక్క సీఎం కేసీఆర్ హయాంలో రెవెన్యూ శాఖ వెలవెలబోతోందని ఈటల అన్నారు. ప్రజలతో దగ్గరి సంబంధం ఉండే రెవెన్యూ శాఖకు మంత్రి లేకపోవడం సిగ్గు చేటని విమర్శించారు. ఎంఆర్వోలపై పెట్రోల్ పోసి తగలబెట్టిన చరిత్ర దేశంలో తెలంగాణకే దక్కిందన్నారు. వీఆర్ఏలను తొలగించి రెండేళ్లయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వీఆర్ఏల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడతానని సీతక్క హామీ ఇచ్చారు. ఫీల్డ్ అసిస్టెంట్లను అన్యాయంగా తొలగించారన్నారు. -
సమతా స్ఫూర్తికి బీజేపీతో విఘాతం: తమ్మినేని
ఖమ్మం మయూరిసెంటర్: రామానుజాచార్యులు సమతా స్ఫూర్తికి విఘాతం కలిగించేలా కేంద్ర ప్రభుత్వ పాలన ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. రామానుజుల వారు అసమానతల నిర్మూలన కోసం పాటుపడితే బీజేపీ ప్రభుత్వం ఆ అసమానతలను పెంపొందిస్తోందన్నారు. ప్రధాని మోదీ శ్రీరాముడి తరహాలో పరిపాలిస్తున్నారని పోల్చడం సరికాదని వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన ఖమ్మంలోని సుందరయ్య భవనంలో విలేకరులతో మాట్లాడుతూ స్త్రీ స్వేచ్ఛను హరిస్తున్నందుకా? మనువాదం, మతోన్మాదాలను ప్రోత్సహిస్తున్నందుకా? కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వరంగ సంస్థలను కట్టబెడుతున్నందుకా? ముస్లింలను దేశం నుంచి వెళ్లగొట్టాలని ప్రయత్నిస్తున్నందుకా? ఏ విషయంలో శ్రీరామరాజ్యంతో పోల్చారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ హక్కులను హరిస్తున్నారని, గోడకు చెప్పినా, మోదీకి చెప్పినా ఒక్కటేనని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్లో ఏమాత్రం తప్పులేదని సమర్థించారు. రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ తెచ్చిన వాదన సరికాదన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల, టేకులపల్లి మండలాల్లో పోడు రైతులను ఇబ్బంది పెట్టిన ప్రభుత్వ చర్యలను ఖండించారు. ఈ నెల 9, 10 తేదీల్లో ఆ మండలాల్లో బాధితులను కలుస్తామన్నారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
తెలంగాణాకు ద్రోహం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం సమర్పించిన రూ.39 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ స్థూలంగా ప్రజా సంక్షేమాన్ని పణంగా పెట్టడమేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కేంద్రం తాజా బడ్జెట్లో అవసరమైన చర్యలు చేపట్టలేదన్నారు. హైదరాబాద్ కేంద్రంగా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ నిర్మాణానికి ఇటీవల భారత ప్రధాన న్యాయమూర్తితో శంకుస్థాపన చేయించి.. గుజరాత్లో గిఫ్ట్ సిటీ కేంద్రంగా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ పని చేస్తుందని బడ్జెట్లో ప్రకటించటం తెలంగాణ ప్రజలను మోసగించటమేనన్నారు. తెలంగాణ ఆదివాసీ విశ్వవిద్యాలయాన్ని మాటమాత్రంగా పేర్కొని, రెండు రాష్ట్రాలకూ కలిపి కేవలం రూ.43 కోట్లు కేటాయించారన్నారు. బయ్యారం ఉక్కు కర్మాగారానికి, దీర్ఘకాలంగా పెండింగ్లోఉన్న రైల్వేలైన్ల పూర్తికి, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి ప్రస్తావన కూడా కరువైందన్నారు. -
బీజేపీ, టీఆర్ఎస్లతో అమీతుమీ
సాక్షి, రంగారెడ్డి జిల్లా/హైదరాబాద్: ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో తలపడి.. పార్టీపరంగా ప్రజల్లో బలపడేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సీపీఎం తెలంగాణ రాష్ట్ర మూడో మహాసభ తీర్మానించింది. టీఆర్ఎస్ అప్రజాస్వామిక పాలనను అడ్డుకోవాలని, బీజేపీని నిలువరించాలని పిలుపునిచ్చింది. కమ్యూనిస్టుల మనుగడ కొనసాగాలంటే ప్రభుత్వాల నిరంకుశ పోకడలకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటాలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. వామపక్షాలు చేపట్టే పోరాటాలకు ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ కేంద్రంగా జరుగుతున్న సీపీఎం తెలంగాణ రాష్ట్ర మూడో మహాసభల్లో 54 అంశాలపై సోమవారం తీర్మానాలు చేసింది. పోటీ, పొత్తు అంశాన్ని పక్కన పెట్టి.. ప్రస్తుతానికి ఎన్నికల్లో పోటీ, పొత్తులు అనే అంశాన్ని పక్కనపెట్టి పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యాచరణపైనే మహాసభల్లో ఎక్కువ చర్చ జరిగినట్లు స్పష్టం చేసింది. యువతను, మహిళలను, అణగారిన వర్గాలను పెద్దఎత్తున సమీకరించి పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని గుర్తించింది. ఈ ప్రజా పోరాటంలో కలిసి వచ్చే వామపక్ష, లౌకిక శక్తులను కలుపుకొనిపోవాలని నిర్ణయించింది. మహాసభల ప్రాంగణంలో పార్టీ కేంద్రకమిటీ సభ్యులు ఎస్.వీరయ్య, నాగయ్య, సుదర్శన్ సహా జిల్లా కమిటీ కార్యదర్శి భాస్కర్లు ఈమేరకు మీడియాకు వెల్లడించారు. టీఆర్ఎస్ డాంబికాలు ‘తెలంగాణ ధనిక రాష్ట్రమని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని డాంబికాలు పలికినా ఎప్పుడూ లేనంత వేగంగా గత ఏడేళ్లలో అప్పులు పెరిగాయి. తాజా లెక్కల ప్రకారం అవి రూ.2,86,000 కోట్లకు చేరాయి. అదీగాక, 20 శాతానికి మించి పంట రుణాలు అందటం లేదు. అసైన్డ్ భూములు, పోడు భూములు గుంజుకుంటున్నారు. కోవిడ్ కేసులు, మరణాలు తక్కువ చేసి చూపుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తమ రాజకీయ ప్రయోజనాలకిస్తున్న ప్రాధాన్యత ప్రజా సమస్యల పరిష్కారానికి ఇవ్వడంలేదు’అని సీపీఎం పేర్కొంది. బలపడాలని చూస్తున్న బీజేపీ రాష్ట్రంలో ఉన్న ప్రజల అసంతృప్తిని ఆసరా చేసుకొని బీజేపీ బలపడాలని చూస్తోందని సీపీఎం ధ్వజమెత్తింది. ‘ప్రజల అసంతృప్తిని భావోద్వేగాలవైపు మరల్చే ప్రయత్నంలో బీజేపీ ఉంది. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరలించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పాదయాత్ర చేశారు. మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి మతం రంగు పులిమి ప్రచారం చేస్తున్నారు’అని మండిపడింది. బీజేపీ మతోన్మాద విధానాలను వ్యతిరేకించటంలోనూ, లౌకిక విధానాల కోసం నిలబడటంలోనూ టీఆర్ఎస్ అవకాశవాదం ప్రదర్శిస్తోందని దుయ్యబట్టింది. కాంగ్రెస్ వైఖరి కూడా బీజేపీ బలపడటానికే ఉపయోగపడుతోందని వ్యాఖ్యానించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాటానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదని ఆరోపించింది. -
బలపడి.. తలపడదాం..!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘ఫాసిస్టు హిందూ రాష్ట్ర స్థాపనే ధ్యేయంగా మతోన్మాద, విభజన రాజకీయాలకు పాల్పడుతున్న బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో ఒక విశాల ఐక్య సంఘటన ఏర్పడాల్సిన అవసరం ఉంది..’అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. ప్రజా ఉద్యమాలను బలపరచడం ద్వారానే ఇది సాధ్యమని పేర్కొన్నారు. ముందుగా వామ పక్షాలు మరింత బలపడి, ప్రజాస్వామిక, లౌకికశక్తులను కలుపుకోవాలని సూచించారు. ఆదివారం ఆయన ఢిల్లీ నుంచి ఆన్లైన్లో.. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ కేంద్రంగా ప్రారంభమైన సీపీఎం రాష్ట్ర మూడో మహాసభలకు హాజరైన ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో ఆర్ఎస్ఎస్ ఫాసిస్ట్ అజెండాను అమలు చేయడమే బీజేపీ లక్ష్యమంటూ తమ పార్టీ ఏనాడో హెచ్చరించిందని ఆయన గుర్తుచేశారు. అదే ఈ రోజు నిజమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా త్వరలోనే ‘దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడమే మా లక్ష్యం’అంటూ బీజేపీ ప్రకటించే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం దేశంలో రాజకీయ అవినీతి ‘చట్టబద్ధమైన రాజకీయ అవినీతి’గా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. పౌర, ప్రజాస్వామిక హక్కులపై పెద్దయెత్తున దాడి జరుగుతోందని చెప్పారు. అయితే ఇదే సమయంలో బీజేపీ విధానాలకు, చర్యలకు వ్యతిరేకంగా దేశంలో ఉద్యమాలు బలపడుతున్నాయని చెప్పారు. రైతాంగ ఉద్యమాన్ని ఆయన ఉదహరించారు. లౌకిక, ప్రజాస్వామిక విలువల పరిరక్షణ కోసం బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉందని సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్న టీఆర్ఎస్: తమ్మినేని కేంద్రంలోని బీజేపీ మత విద్వేషాలను రెచ్చ గొట్టి రాజకీయంగా లబ్ధి పొందుతుంటే, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రాంతీయ విద్వేషా లు రెచ్చగొడుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు తోడ్పడే వాగ్దానాలను విస్మరించి, ఎన్నికల్లో తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకునే పథకాలు ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలంటే వామపక్ష శక్తులు ప్రధానంగా ప్రజాస్వామిక, సామాజిక శక్తుల ఐక్య ప్రత్యామ్నాయమే మార్గమని ఆయన స్పష్టం చేశారు. టీఆర్ఎస్తో పొత్తు వార్తలను ఆయన ఖండించారు. పునరేకీకరణకు కృషి జరగాలి: చాడ సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ..ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేప ట్టే పోరాటాల్లో సీపీఐ, సీపీఎంల మధ్య సారూప్యత ఉందని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం వామపక్షాలు తమ ఐక్యతకే కాకుండా పునరేకీకరణకు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పారు. ఈ మహాసభల్లో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాశ్కారత్, ఆ పార్టీ ఏపీ కార్యదర్శి శ్రీనివాసరావు, పొలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, పలు వురు కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
సీపీఎం పగ్గాలు మళ్లీ తమ్మినేనికే?
సాక్షి, హైదరాబాద్: భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కార్యదర్శిగా ఆ పార్టీ సీనియర్ నేత తమ్మినేని వీరభద్రం వరుసగా మూడోసారి ఎన్నిక కానున్నారని సమాచారం. పార్టీ నిబంధనల ప్రకారం మూడుసార్లు రాష్ట్ర కార్యదర్శిగా ఒక నేతను ఎన్నుకొనే అవకాశం ఉన్నందున ఈసారి కూడా ఖమ్మం కామ్రేడ్కే పగ్గాలు అప్పజెప్పాలని పార్టీ నాయకత్వం యోచిస్తోందనే చర్చ జరుగుతోంది. ఇందుకు పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గం కూడా సుముఖంగానే ఉందని, వచ్చే మహాసభల్లో గా రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమ్మినేనినే మరోమారు కార్యదర్శిగా కొనసాగించాలనే ప్రతిపాదన పెట్టి ఆమోదించనుందని తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్లో ఆదివారం ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర పార్టీ 3వ మహాసభలు మంగళవారంతో ముగియనున్నాయి. పార్టీ రాష్ట్ర కమిటీ, కార్యదర్శివర్గంతోపాటు కార్యదర్శిని కూడా చివరిరోజు ఎన్నుకోనున్నారు. ఒకవేళ తమ్మినేని కాకపోతే నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీఐటీయూ నేత ఎస్. వీరయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు బి. వెంకట్లలో ఒకరిని ఎన్నుకొనే అవకాశం ఉందని ఎంబీ భవన్ వర్గాలంటున్నాయి. రాష్ట్ర కార్యదర్శివర్గంలో మార్పులు! రాష్ట్ర కార్యదర్శివర్గంలో కూడా రెండు, మూ డు మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నా యి. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా చెరుపల్లి సీతారాములు, నంద్యాల న ర్సింహారెడ్డి, సి.రాములు, సాయిబాబా, పోతి నేని సుదర్శన్, జాన్వెస్లీ, జ్యోతి, డి.జి.నర్సింహారావు, జి.రాములు, డాక్టర్. మిడియం బా బూరావులు కొనసాగుతున్నారు. వీరిలో జి. రాములు, మాజీ ఎంపీ మిడియం బాబూరావులు రిటైర్ అవుతారని అంటున్నారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబా ఢిల్లీ సెంటర్కు వెళ్తారని, ఆయన స్థానంలో మరో ట్రేడ్ యూనియన్ నేత పాలడుగు భాస్కర్ను కార్యదర్శివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. జి.రాములు, బాబూరావుల స్థానం లో మరో ఇద్దరు నేతలకు అవకాశం వ స్తుందని, అందులో మరో మహిళానేతకు అ వకాశం ఇస్తారనే చర్చ జరుగుతోంది. సీఐటీయూ నాయకురాలు రమ, ఐద్వానేత మల్లు లక్ష్మిలో ఒకరిని కార్యదర్శివర్గంలోకి తీసుకొనే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలంటున్నాయి. వామపక్ష ఐక్య కూటమి ఎటువైపు..? సీపీఎం రాష్ట్ర కమిటీ ఎన్నిక ఒక ఎత్తయితే పార్టీ మహాసభల్లో ఆమోదించే రాజకీయ తీర్మానంపై అన్ని రాజకీయ పక్షాలు ఆసక్తితో ఉన్నాయి. తమకు ప్రధాన శత్రువైన బీజేపీని తెలంగాణలో బలపడకుండా చూడటమే తక్షణ రాజకీయ కర్తవ్యమని శనివారం జరిగిన ఆన్లైన్ బహిరంగ సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. అలా అని ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న టీఆర్ఎస్తో కలిసివెళ్లేది లేదని కూడా వెల్లడించారు. గత ఎన్నికల్లో లాల్, నీల్ ఎజెండాతో ఏర్పాటు చేసిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) వైఫల్యాలను కూడా ఆయన ప్రస్తావించారు. భవిష్యత్తులో వామపక్ష ఐక్య కూటమి లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో సీపీఎం రాష్ట్ర మహాసభల్లో ఎలాంటి రాజకీయ తీర్మానం చేస్తారన్నది రాష్ట్ర రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్పై ప్రజాసమస్యల గురించి పోరాటాలు చేస్తూనే బీజేపీని ఎదుర్కొనేందుకు ఆ సమయానికి కలిసి వెళ్తారా? కాంగ్రెస్ను కలుపుకుంటారా? లేక వామపక్ష ఐక్య కూటమితో ముందుకెళ్తారా? అన్నది వేచిచూడాల్సిందే! -
సీపీఎం రాష్ట్ర మహాసభలు..హాజరుకానున్న ఏచూరి, ప్రకాశ్ కారత్, బీవీ రాఘవులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ వేదికగా జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్ట్) మూడో రాష్ట్రమహాసభలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మూడు రోజులపాటు జరగనున్న ఈ మహాసభలు శనివారం ప్రారంభంకానున్నాయి. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిసహా పొలిట్బ్యూరో సభ్యులు ప్రకాశ్ కారత్, బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్రకమిటీ సభ్యుడు చెరుకుపల్లి సీతారాములు అతిథులుగా హాజరుకానున్నారు. సభలు జరిగే ప్రదేశంసహా తుర్కయాంజాల్ మున్సిపాలిటీలోని ప్రధాన వీధులన్నింటినీ ఎర్రతోరణాలతో అలంకరించారు. బొంగుళూరు గేటు, విజయవాడ హైవే, మహేశ్వరం ప్రధాన రహదారుల వెంట భారీ స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. సభలకు జిల్లాల నుంచి 640 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. అతిథులకు భోజనాలు, వసతిని ఎస్ఎస్ఆర్ కన్వెన్షన్తోపాటు సమీపంలోని పలు అతిథిగృహాల్లో కల్పించనున్నారు. చర్చకు వచ్చే ప్రధాన అంశాలివే... ప్రభుత్వ మిగులు భూముల పంపిణీ, జిల్లాలో పరిశ్రమల స్థాపన పేరుతో బలవంతపు భూసేకరణ, కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్న తీరు, ఆ తర్వాత ఉపాధి అవకాశాలు కల్పించకపోవడంతో పెరుగుతున్న నిరుద్యోగం, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లు, కేంద్రం తీసుకొస్తున్న సాగు వ్యతిరేక చట్టాలు, భవిష్యత్తులో వాటి పర్యవసానాలు వంటి కీలక అంశాలపై ఈ మహాసభల్లో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. -
జీవో 317ను సవరించాలి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులను గత నెలరోజులుగా మనోవేదనకు గురిచేస్తున్న జీవో 317ను సవరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, స్థానికత కోల్పోయి ఇతర జోన్లు, జిల్లాలకు శాశ్వతంగా బదిలీ అయిన ఉద్యోగులను అవసరమైతే సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించి వారి సొంత జిల్లాలకు బదిలీ చేయాలని కోరారు. సీనియారిటీపై అప్పీల్స్, సామాజిక తరగతులకు జరిగిన అన్యాయం, కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమం ప్రకటనలకే పరిమితం కాకూడదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం పేద వర్గాలకు ఉపయోగకరమే అయినప్పటికీ తెలుగు మీడియాన్ని పూర్తిగా ఎత్తివేస్తే ఆయా వర్గాలకే నష్టం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం తప్పనిసరిగా ఉండాలన్నారు. 22న ఆన్లైన్ బహిరంగ సభ.. ఈ నెల 22 నుంచి 25 వరకు పార్టీ రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు తమ్మినేని తెలిపారు. 22వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఆన్లైన్ బహిరంగసభ ఉంటుందని చెప్పారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రం నుంచి నాయకులు ప్రసంగిస్తారన్నారు. -
‘చెయ్యి’ కలిపేదే లేదు!
సాక్షి, హైదరాబాద్: ‘‘బీజేపీని ఓడించాల్సిందే.. కానీ అందుకోసం కాంగ్రెస్తో ఎక్కడా పొత్తు పెట్టుకోకూడదు. అలాగే బలమైన బూర్జువా ప్రాంతీయ పార్టీలతోనూ ఇదే వైఖరి అనుసరించాలి. విధానపరమైన పోరాటాలు చేయాలి. అయితే బీజేపీ గెలిచే అవకాశమున్న సీట్లల్లో ప్రత్యామ్నాయ లౌకిక పార్టీలతో అంతర్గత అవగాహన కలిగి ఉండాలి. పార్టీ కేడర్కు సూచించి సదరు లౌకిక పార్టీకి ఓటు వేయించాలి. తెలంగాణలో హుజూరాబాద్, హుజూర్నగర్ ఉప ఎన్నికల సందర్భంగా పార్టీ అనుసరించిన వ్యూహాన్నే కొనసాగించాలి..’’వామపక్షాల్లో కీలకమైన సీపీఎం తాజా రాజకీయ వ్యూహం ఇదేనని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దేశంలో బీజేపీ మతతత్వ పాలనను అడ్డుకోవడం, అదే సమయంలో పార్టీని బలోపేతం చేయడమనేవి సీపీఎం ప్రధాన లక్ష్యాలని వెల్లడిస్తున్నాయి. హైదరాబాద్లో సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. రాబోయే పార్టీ జాతీయ మహాసభలకు సంబంధించిన రాజకీయ తీర్మానాన్ని ఈ సమావేశాల్లోనే ఖరారు చేయనున్నారు. వచ్చే సాధారణ ఎన్నికలకూ అదే వర్తించనుంది. ఈ క్రమంలోనే పార్టీ సీనియర్లు సీతారాం ఏచూరి, పినరై విజయన్, మాణిక్ సర్కార్, బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రంతోపాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నేతలు రాజకీయ తీర్మానంపై తలమునకలై ఉన్నారు. ఊగిసలాట పోయి.. సీపీఎం గత సాధారణ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్తోపాటు మరికొన్ని చోట్ల కాంగ్రెస్తో కలిసి పోటీ చేసింది. అయితే ఈసారి అలాంటి పొత్తులు పెట్టుకోకూడదని నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. ముఖ్యంగా బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్తో బహిరంగంగా పొత్తు పెట్టుకోవడం సరికాదని ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. కాంగ్రెస్ లౌకిక పార్టీయే అయినా.. ఆర్థిక విధానాల విషయంలో బీజేపీకి, దానికి తేడా లేదన్న భావన వ్యక్తమైనట్టు తెలిసింది. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాలా వద్దా అన్న విషయంలో ఇప్పటిదాకా పార్టీలో భిన్నాభిప్రాయం ఉండేదని.. అది ఇప్పుడు మారిందని ఓ సీపీఎం నేత చెప్పారు. ప్రధాన కర్తవ్యాలు రెండు ప్రస్తుతం సీపీఎం ముందు రెండు కర్తవ్యాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఒకటి దేశంలో బీజేపీ మతతత్వ వ్యవహారాన్ని అడ్డుకోవడం, తద్వారా వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అధికారంలోకి రాకుండా ప్రయత్నించడం కాగా.. మరొకటి పార్టీని మరింత బలోపేతం చేయడమని అంటున్నాయి. ఈ రెండింటిలో ఇప్పటివరకు పార్టీ అనుసరించిన వ్యూహం పెద్దగా విజయవంతం కాలేదన్న భావన ఉందని చెప్తున్నాయి. బీజేపీని నిలువరించేందుకు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్లినా కొన్ని పార్టీలు మధ్యలో పొత్తులను వదిలేసి బీజేపీతో వెళ్లిన సందర్భాలు ఉన్నాయని, ప్రాంతీయ పార్టీలతో ఈ సమస్య ఉందని సీపీఎం నేతలు అంటున్నారు. ఉదాహరణకు ఏపీలో ఒకప్పుడు సీపీఎం టీడీపీతో కలిసి నడిచిందని.. కానీ టీడీపీ పలుమార్లు సీపీఎంను విమర్శించడమే కాకుండా బీజేపీతో జతకట్టిందని గుర్తు చేస్తున్నారు. కొంతకాలం కింద జనసేనతో కలిసి ముందుకు నడవాలనుకున్నా ఆ పార్టీ కూడా నేరుగా బీజేపీతో జతకట్టిందని, విధానాల్లేని అలాంటి పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం వల్ల సీపీఎం ప్రతిష్ట కూడా మసకబారిందని స్పష్టం చేస్తున్నారు. ప్రజల్లోనూ పార్టీ పట్ల గందరగోళం నెలకొందని.. కాబట్టి బూర్జువా పార్టీలతో పొత్తుల జోలికి వెళ్లొద్దని పార్టీ భావిస్తోందని వెల్లడిస్తున్నారు. -
మిర్చి రైతులకు పరిహారం ఇవ్వండి: తమ్మినేని
కొణిజర్ల: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అంతుబట్టని వైరస్తో మిరప తోటలు నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం లక్ష్మీపురంలో ఆదివారం ఆయన భద్రాచలం మాజీ ఎంపీ మిడియం బాబూరావు, స్థానిక సీపీఎం, రైతు సంఘం నాయకులతో కలిసి వైరస్తో దెబ్బతిన్న మిరప తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ మిర్చి పంట గులాబీ, తామర పురుగులతో దెబ్బతిన్నదని, 80 వేల ఎకరాల్లో పంట నష్టపోయి రైతులు అప్పుల్లో కూరుకుపోయారని తెలిపారు. మిర్చి రైతులకు సలహాలు, సూచనలు అందించడంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. వ్యవసాయ, కీటక శాస్త్రవేత్తలు కూడా పరిశీలించి ఏమీ తేల్చకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. పంటలు పూర్తిగా నష్టపోవడంతో కౌలురైతుల పరిస్థితి దయనీయంగా మారిందని వాపోయారు. రైతులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని, పరిహారం ఇప్పించే వరకు పోరాటం చేస్తామని తమ్మినేని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు సుదర్శన్, జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. స్థానికతకు ప్రాధాన్యమిచ్చేలా సవరణలుండాలి సాక్షి, హైదరాబాద్: అసంబద్ధ, లోపభూయిష్టమైన 317 జీవోను సమీక్షించి ఉద్యోగుల స్థానికతకు ప్రాధాన్యమిచ్చేలా సవరణలు చేయాలని సీఎం కేసీఆర్కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం లేఖ రాశారు. ఆ లేఖను ఆయన మీడియాకు విడుదల చేశారు. రాష్ట్రంలో నూతన జోనల్ వ్యవస్థ అమల్లో భాగంగా ఉద్యోగుల సర్దుబాటు కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317 లోపభూయిష్టంగా ఉందన్నారు. ఒక పెద్ద మార్పు జరిగే సందర్భంలో ఆ మార్పు వల్ల ప్రభావితమయ్యే వర్గాల ప్రతినిధులతో మాట్లాడి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే సానుకూలంగా పరిశీలించి, జోక్యం చేసుకుని పరిష్కరించాలని తమ్మినేని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన అసంబద్ధ ఉత్తర్వుల కారణంగా ఉద్యోగులు ప్రధానంగా ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో ఉన్న ఊరును, సొంత జిల్లాను వదిలి పెట్టి మరొక జిల్లాకు శాశ్వతంగా వెళ్లాల్సిన దుస్థితి కల్పించారని విమర్శించారు. స్థానికత ఆధారంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి నాయకత్వం వహించిన మీరే స్థానికత పునాదులను ధ్వంసం చేయబూనుకోవటం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. ఇతర జిల్లాలకు బలవంతంగా బదిలీ అయిన ఉపాధ్యాయులు 10 వేల మంది ఉంటారని, అవసరమైతే సూపర్ న్యూమరరీ పోస్టులను కేటాయించి వారి సొంత జిల్లాలకు తీసుకురావాలని కోరారు. -
హైదరాబాద్లో కాదు, ఢిల్లీలో ధర్నా చేయాలి.. కేసీఆర్కు తమ్మినేని హితవు
నల్లగొండ టౌన్: కేసీఆర్ హైదరాబాద్లో ధర్నా చేయడం కాదని, చిత్తశుద్ధి ఉంటే అన్ని పార్టీలను కలు పుకొని ఢిల్లీలో ధర్నా చేసి కేంద్రం మెడలు వంచి ధాన్యం కొనుగోలు చేయించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మి నేని వీరభద్రం సూచించారు. రాష్ట్రంలో బీజేపీ ఆగడాలను అడ్డుకోవడం కోసం అవసరమైతే ఏ పార్టీతోనైనా కలసి పోరాడటానికి సిద్ధమని స్పష్టం చేశారు. బుధవారం నల్లగొండలో సీపీఎం జిల్లా మహాసభలను ప్రారంభించారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షల మేరకు కేసీఆర్ పాలన సాగట్లేదని ఆరోపించారు. కాంట్రాక్టర్లు, తెలంగాణ వ్యతిరేకులకు మాత్రమే అనుకూల పాలన సాగుతోందని దుయ్యబట్టారు. తెలంగాణ వస్తే అందరికీ ఉద్యోగాలిస్తామని, ప్రతి ఎకరాకు సాగునీరిస్తామని చెప్పిన మాటలు ఎక్కడికి పోయాయని సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టును చూపించి రాష్ట్రమంతా పచ్చగా ఉందని చెబుతున్నారని విమర్శించారు. ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ దొంగ నాటకాలు ఆడుతున్నాయని, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వీధి రౌడీల్లా కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. కాగా, కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పౌరసత్వ చట్టం పేరుతో దేశంలోని హిందువుల మధ్య చిచ్చు పెట్టడంతో పాటు దేశం నుంచి ముస్లింలను వెళ్లగొట్టడానికి బీజేపీ ప్రభుత్వం కుట్రచేస్తోం దని తమ్మినేని విమర్శించారు. -
అర్హులందరికీ ‘పోడు హక్కు’ పత్రాలివ్వాలి
సాక్షి, హైదరాబాద్: పోడు దరఖాస్తుల స్వీకరణకు జిల్లాల స్థాయిలో కాకుండా రాష్ట్రం మొత్తానికి వర్తించేలా ఒకే నోటిఫికేషన్ జారీ చేయాలని, అర్హులైన పోడుదారులందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారంఆయన సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. పోడు సాగుదారుల హక్కులను గుర్తించేందుకు నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని ప్రకటించడాన్ని హర్షిస్తున్నట్లు తెలిపారు. అయితే ఇందుకోసం రాష్ట్రం మొత్తం వర్తించేలా నోటిఫికేషన్ ఇస్తేనే పోడుదారులకు న్యాయం జరుగుతుందన్నారు. అలా కాకుండా కేవలం కొన్ని జిల్లాలకే ఇవ్వాలనుకోవడం సరికాదన్నారు. ఈ విషయంలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనుసరించిన విధానాన్నే అమలు చేయాలని కోరారు. అడవి మధ్యలో పోడు చేస్తున్నవారికి సైతం అక్కడే హక్కులు కల్పించాలని, అటవీ హక్కుల గుర్తింపు చట్టంలో ఈ అంశం స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇంకా 7 లక్షలకు పైగా ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాల్సి ఉందని గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారని గుర్తు చేశారు. కానీ ఇటీవల జరిగిన అధికారుల సమావేశంలో 3.3 లక్షల ఎకరాలకు మాత్రమే హక్కులు కల్పించనున్నట్లు చెప్పారని, ఇది పోడు సాగుదారులను మోసం చేయడమేనని తమ్మినేని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అటవీ రక్షణ పేరుతో గిరిజనులు, పేదలకు దక్కాల్సిన హక్కులను నిరాకరించడం సరైంది కాదన్నారు. -
బీజేపీని ఓడించాలి: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ ని ఓడించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. శనివా రం ఎంబీ భవన్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అత్యంత ప్రమాదకరంగా మారిందని, సామాన్యులు మొదలు రైతులు, కార్మికులు అన్ని వర్గాలకు వ్యతిరేకంగా ఆ పార్టీ పనిచేస్తోందన్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంతో లాలూచిగా వ్యవహరిస్తోందని, వివిధ సందర్భాల్లో కేంద్రంపై చేసిన ఉద్యమా ల్లో టీఆర్ఎస్ పార్టీ స్పందనతో ఈ విషయం అర్థమవుతోందన్నారు. పోడు రైతులందరికీ పట్టాలు జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పోడు అంశంపై ప్రభుత్వానికి పక్షం రోజులు గడువిస్తున్నామని, స్పందించకుంటే భారీ ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. హుజూరాబాద్ ఎన్నికను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ 80 వేల ఉద్యోగాల ప్రకటనను తెరపైకి తెచ్చారని విమర్శించారు. -
హోరెత్తిన ‘పోడు’ పోరు
సాక్షి నెట్వర్క్: పోడుభూముల పోరు తీవ్రతరమైంది. వెంటనే పట్టాలివ్వాలని మంగళవారం గిరిజన రైతులు రోడ్డెక్కారు. అటవీ అధికారుల దాడులు ఆపాలని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాల్లోనూ సడక్బంద్ నిర్వహించారు. కదంతొక్కారు. వెంటనే ప్రభుత్వం స్పందించి తమ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాగా, పోడుభూముల కోసం పోరాడే గిరిజనులను జైళ్లలో పెట్టడం ఏమిటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోడుసాగుదారులకు పట్టాలివ్వాలనే డిమాండ్తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో చేపట్టిన రాస్తారోకోలో సీపీఐ రాష్ట్రకార్యదర్శి చాడ వెంకట్రెడ్డితో కలసి ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బోయిన నర్సింహులు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు, టేకులపల్లి, గుండాల, లక్ష్మీదేవిపల్లి, చంద్రుగొండ, ములకలపల్లి, పాల్వంచల్లో కూడా రాస్తారోకో చేశారు. ఖమ్మం జిల్లాలోని ఏన్కూరు, కారేపల్లి, కొణిజర్ల, సత్తుపల్లి, పెనుబల్లిల్లోనూ వివిధ పార్టీల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పేద గిరిజన రైతులకు వెంటనే పట్టాలివ్వాలి పోడు భూములు గిరిజనుల హక్కు అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ పేర్కొన్నారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం పరిధిలోని హైదరాబాద్–శ్రీశైలం హైవేపైనున్న హాజీపూర్ చౌరస్తాలో నల్లమల సడక్బంద్ నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు చిన్నారెడ్డి, మల్లు రవి, వంశీకృష్ణ, సీపీఎం రాష్ట్ర నేతలు నంద్యాల నర్సింహారెడ్డి, జాన్వెస్లీ హాజరయ్యారు. అంతకుముందు నారాయణ హైదరాబాద్ నుంచి హజీపూర్ వెళ్తూ డిండిలో మీడియాతో మాట్లాడా రు. కేసీఆర్ గిరిజనుల వైపు ఉంటారా, బీజేపీ వైపు ఉంటారా అని ప్రజలకు స్పష్టం చేయాలన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేయాలి ఉమ్మడి వరంగల్లో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యాన మంగళవారం చేపట్టిన ‘సడక్ బంద్’విజయవంతమైంది. కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, తెలంగాణ ఆదివాసీ గిరిజన, ఎమ్మార్పీఎస్ తదితర సంఘాలు రాస్తారోకోలు నిర్వహించారు. పోడు భూములపై హక్కులు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. పోడు భూములపై ఆందోళన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జునసాగర్, నల్లగొండ నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాల్లో సడక్ బంద్ నిర్వహించారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిని మిర్యాలగూడలో గృహ నిర్బంధం చేశారు. దీంతో ఆయన ఇంట్లోనే ఒక్కరోజు నిరసన దీక్ష చేపట్టారు. సూర్యాపేటలో పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు రాంరెడ్డి దామోదర్రెడ్డి, ఇతర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిలోమీటర్ మేర నిలిచిన వాహనాలు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఐ(ఎంఎల్), న్యూ డెమోక్రసీ, ఏఐకేఎంఎస్ నాయకులు నిజామాబాద్ జిల్లా గన్నారం వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై గంటపాటు బైఠాయించారు. దీంతో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. కార్యక్రమంలో మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి, కిసాన్ ఖేత్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టేక్రియాల్ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై, బాన్సువాడ, గాంధారిలో రాస్తారోకో నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఎక్స్రోడ్డు, నిర్మల్ జిల్లా ఖానాపూర్, సత్తెనపల్లి, కడెంలోని పాండ్వపూర్, దస్తురాబాద్, కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్, రెబ్బెన, కౌటాల, దహెగాం, సిర్పూర్(టి) మండల కేంద్రాల్లో సడక్ బంద్ నిర్వహించారు. మంచిర్యాల జిల్లా జన్నారం, బెల్లంపల్లి, నెన్నెల, లక్సెట్టిపేట, కోటపల్లి, చెన్నూర్లో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అం దజేశారు. ఉట్నూర్ ఎక్స్రోడ్డు వద్ద సడక్బంద్లో టీజేఎస్ అధినేత కోదండరాం పాల్గొన్నారు. -
ఎల్లుండి భారత్ బంద్ అందరూ పాటించాలి: ప్రజలకు ప్రతిపక్షాల పిలుపు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలని రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 27న జరగబోయే భారత్ బంద్కు ప్రతిపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. బంద్ను జయప్రదం చేయాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయా పార్టీల నేతలు, రైతు సంఘాల నాయకులు శుక్రవారం ఎంబీ భవన్లో మీడియాతో మాట్లాడారు. చదవండి: తల్లికి మధురమైన గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ, కోవిడ్ సమస్యలను పరిష్కరించడంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం విఫలమయిందని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని ఆరోపించారు. దేశంలో ప్రజాస్వామ్య ముసుగులో నియంతృత్వం సాగుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. చదవండి: మృతదేహాన్ని అడ్డగింత.. చితి పైకెక్కి ఆందోళన అనంతరం కాంగ్రెస్ నేత మల్లు రవి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్రెడ్డి, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వేములపల్లి వెంకట్రామయ్య, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకుడు అచ్యుత రామారావు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు డీజీ నర్సింహారావు, బెల్లయ్యనాయక్, బాలమల్లేశ్, కె.రమ, బక్క నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ కుట్రలను తిప్పి కొడదాం: తమ్మినేని వీరభద్రం
సాక్షి, సూర్యాపేట(నల్లగొండ): వీర తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో తెలంగాణ గడ్డ మీద హిందూమతం పేరుతో బీజేపీ చేస్తున్న కుట్రలను తిప్పి కొడదామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో సీసీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని హాజరై తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వారిని సన్మానించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి, నాగార్జునరెడ్డి, ఎం.రాములు, కె.యాదగిరిరావు, ధీరావత్ రవినాయక్, బి.శ్రీరాములు, కోట గోపి, గోవిందు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: సెప్టెంబరు 17: సాయుధ చరిత్రకు సాక్ష్యాలు -
మోదీ ప్రభుత్వాన్ని గద్దెదింపుదాం!
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో దేశంలో సామాన్యుడు జీవించే పరిస్థితి లేకుండా పోయిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆందోళన వ్యక్తం చేశారు. ధరాభారంతో సగటు పౌరుడు విలవిలలాడుతున్నాడని, సామాన్యులను దోచుకుని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే విధంగా పాలన సాగుతోందని ఆయన విమర్శించారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని, అందుకు అన్ని ప్రతిపక్ష పార్టీలు ఐక్య ఉద్యమాన్ని చేపట్టాలన్నారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వివిధ ప్రతిపక్ష పార్టీల నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 22న ఉదయం 11గంటలకు ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తమ్మినేని వెల్లడించారు. అదేవిధంగా 27న సంయుక్త కిసాన్ మోర్చా తలపెట్టిన భారత్బంద్ను విజయవంతం చేయాలని కోరారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి మాట్లాడుతూ 18న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రకటించనున్నట్లు చెప్పారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదం డరాం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. -
సాగు చట్టాలను రద్దు చేయాల్సిందే..
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం ఆగదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ శుక్రవారం భారత్బంద్లో భాగంగా ఆల్ ట్రేడ్ యూనియన్స్, రైతు సంఘాలు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి నారాయణగూడ మీదుగా వైఎంసీఏ వరకు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ ఏకపక్ష నిర్ణయాలకు కాలం చెల్లిందని, ఈ చట్టాలను వెనక్కు తీసుకోవాలని అన్నారు. రైతులపై నిర్బంధాన్ని ఆపటంతోపాటు డాక్టర్ స్వామినాథన్ సిఫారసులను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతుచట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ రైతే రాజు అని అంటున్న సీఎం కేసిఆర్ వారు పండించిన పంటలను ఎందుకు కొనడంలేదని ప్రశ్నించారు. చర్చల పేరుతో రైతు సంఘాల నాయకులను కేంద్రం పిలిచి నాటకాలు ఆడుతోందని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల కార్యకర్తలు, నాయకులు ప్లకార్డులను ప్రదర్శించి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో సీపీఐ నేత నారాయణ, రైతు సంఘాల నాయకులు టి.సాగర్, పశ్య పద్మ, కెచ్చల రంగయ్య, అచ్చుత రామారావు, ఉపేందర్రెడ్డి, జక్కుల వెంకటయ్య, కన్నెగంటి రవి, బి.ప్రసాద్, ఆర్.వెంకట్రాములు, న్యూడెమోక్రసీ నాయకులు వేములపల్లి వెంకట్రామయ్య, సాదినేని వెంకటేశ్వర్రావు, గాదగోని రవి, ఎస్.ఎల్.పద్మ, జి.అనురాధ తదితరులు పాల్గొన్నారు. -
రైతు చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోవాలి
సాక్షి, హైదరాబాద్: రైతు చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకోవాలని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకట్ రెడ్డి, తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. రైతులకు మద్దతుగా మంగళవారం వారు చేపట్టిన ర్యాలీ సందర్భంగా మాట్లాడుతూ.. రైతు నిరసనలు కేవలం పంజాబ్ పరిసర ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాలేదని, దేశవ్యాప్తంగా రైతు సంఘాలకు మద్దతు లభిస్తుందని పేర్కొన్నారు. ఆహార భద్రతకు చిల్లు పెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాలను తీసుకొచ్చిందని వారు ఆరోపించారు. నూతన వ్యవసాయ చట్టాలను రాజ్యాంగ వ్యతిరేక చట్టాలుగా అభివర్ణించారు. దేశంలో ప్రశ్నించే గొంతుకలను మోదీ సర్కారు జైల్లో పెడుతుందని, అలా చేసిన వరవరరావు సహా పదహారు మందిని జైల్లో పెట్టడం దుర్మార్గ చర్య వారు విమర్శించారు. రైతులకు మద్దతుగా నిలవకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు సైతం నిరసన సెగలు తప్పవని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. తొలుత వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించిన కేసీఆర్.. మూడు రోజుల్లోనే మాట మార్చారని, రైతుల పట్ల ముఖ్యమంత్రికి చిత్తశుద్ధే లేదని వారు ఆరోపించారు. ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ కేంద్ర పెద్దలకు వంగివంగి దండాలు పెట్టి వచ్చారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అప్రజాస్వామికంగా కుటుంబ పాలన సాగిస్తున్న కేసీఆర్.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విపలమయ్యారని ఆరోపించారు. దేశప్రజలంతా ఏకమై తగిన శాస్తి చెబుతారు: ప్రొ. కోదండరామ్ వ్యవసాయం అంటే కంపెనీలు కాదు, వ్యవసాయం అంటే రైతులు మాత్రమే.. అలాంటిది రైతు ప్రయోజనాలు పక్కన పెట్టి, కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూర్చాలని మోదీ సర్కారు భావిస్తే, దేశప్రజలంతా ఏకమై తగిన శాస్తి చెబుతారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ హెచ్చరించారు. చట్టాలను సామాన్య ప్రజల లబ్ధి కోసం రూపొందించాలి కానీ, కార్పొరేట్ శక్తుల కడుపు నింపడం కోసం కాదని ఆయన విమర్శించారు. సమాజంలో ఆత్మగౌరవంతో బతికేలా చూడాలని మాత్రమే రైతులు కోరుతున్నారని, అంతకు మించి వారు ఏదీ ఆశించడం లేదన్నారు. రైతు పోరాటం ఢిల్లీలోనే కాదు గల్లీలోనూ కొనసాగుతుందని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించాడు. -
సీఎం ఉద్యమాలకు సిద్ధం కావాలి : తమ్మినేని
కరీంనగర్ : రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చే విషయంలో సీఎం కేసీఆర్ ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సూచించారు. అందుకు తాము బాసటగా నిలుస్తామని తెలిపారు. కరీంనగర్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జీఎస్టీ వల్ల రాష్ట్రం వేల కోట్ల రూపాయలు నష్టపోయిందని పేర్కొన్నారు. రాష్ట్రాలకు ఇచ్చే నిధులు ఇవ్వకుండా కేంద్రం అప్పులు తీసుకోవాలని సూచించడం దారుణమన్నారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసే బీజేపీ కుట్రలను ఎండగట్టేందుకు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు బాగున్నాయని కొనియాడారు. కొత్త రెవెన్యూ చట్టంలో ఉన్న కొన్ని లొసుగులను సవరించాలని, ఎల్ఆర్ఎస్ నుంచి సామాన్యులను మినహాయించాలని డిమాండ్ చేశారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక ఉద్యమ సమయంలో ఢిల్లీలో చెలరేగిన ఘర్షణలకు సంబంధించి సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, ఇతర నేతలను నిందితులంటూ పోలీసులు కేసులు నమోదు చేయడం వెనుక బీజేపీ కుట్రలు ఉన్నాయని ఆరోపించారు. తక్షణమే ఆ అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. -
సీఎం ఉద్యమాలకు సిద్ధం కావాలి: తమ్మినేని
కరీంనగర్: రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చే విషయంలో సీఎం కేసీఆర్ ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సూచించారు. అందుకు తాము బాసటగా నిలుస్తామని తెలిపారు. కరీంనగర్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జీఎస్టీ వల్ల రాష్ట్రం వేల కోట్ల రూపాయలు నష్టపోయిందని పేర్కొన్నారు. రాష్ట్రాలకు ఇచ్చే నిధులు ఇవ్వకుండా కేంద్రం అప్పులు తీసుకోవాలని సూచించడం దారుణమన్నారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసే బీజేపీ కుట్రలను ఎండగట్టేందుకు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు బాగున్నాయని కొనియాడారు. కొత్త రెవెన్యూ చట్టంలో ఉన్న కొన్ని లొసుగులను సవరించాలని, ఎల్ఆర్ఎస్ నుంచి సామాన్యులను మినహాయించాలని డిమాండ్ చేశారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక ఉద్యమ సమయంలో ఢిల్లీలో చెలరేగిన ఘర్షణలకు సంబంధించి సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, ఇతర నేతలను నిందితులంటూ పోలీసులు కేసులు నమోదు చేయడం వెనుక బీజేపీ కుట్రలు ఉన్నాయని ఆరోపించారు. తక్షణమే ఆ అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. -
ఆ భవనాలు ఉపయోగించుకోండి
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు సీపీఎం ప్రకటించింది. రాష్ట్రస్థాయి మొదలు గ్రామస్థాయి వరకు తమ కార్యకర్తలను ప్రభుత్వ సహాయక చర్యల్లో భాగస్వాముల ను చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్తో సహా రాష్ట్రంలో ఉన్న తమ విజ్ఞాన కేంద్రాలు, పార్టీ ఆఫీసులను ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల అవసరాలకు పూర్తిగా ఉపయోగించుకోవచ్చునని సీఎం కేసీఆర్కు రాసిన లేఖలో సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. బాగ్ లింగంపల్లి, గచ్చిబౌలిలో సుందరయ్య విజ్ఞాన కేంద్రాలు, ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని పార్టీ కార్యాలయాలు, సిటీ ఆఫీసు కార్యాలయం, జిల్లాల్లోని పార్టీ, ప్రజాసంఘాల ఆఫీసులను ప్రభుత్వం అవసరం మేరకు ఉపయోగించుకోవాలని కోరారు. బాగ్ లింగంపల్లిలోని విజ్ఞాన కేంద్రంలోని మెడికల్ క్లినిక్, హైదరాబాద్తో సహా అన్ని జిల్లా ల్లో జనరిక్ మెడికల్ షాపులున్నాయని వాటిని కూడా ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనా విస్తరించకుండా ప్రభుత్వం చేపట్టిన చర్యలు సానుకూల ఫలితాలు ఇస్తున్నాయని, ఈ వైరస్ నివారణకు గ్రామస్థాయి వరకు ప్రజా ప్రతినిధులు అందుబాటులో ఉండాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు సీపీఎం మద్దతిస్తున్నదని తమ్మినేని తెలియజేశారు. -
‘ఎన్ఆర్సీ చట్టాన్ని సీఎం కేసీఆర్ వ్యతికించాలి’
సాక్షి, నిజామాబాద్: దేశ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకవచ్చిన ఎన్ఆర్సీ చట్టంపై సీఎం కేసీఆర్ నోరు విప్పి దీన్ని వ్యతిరేకించాలని సీపీఎం పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి తమ్మినేని వీర భద్రం తెలిపారు. సోమవారం నిజామాబాద్ జిల్లాలో జరిగిన సీపీఎం జిల్లా పార్టీ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. ఎన్ఆర్సీ(పౌరుల జాతీయ జాబితా)చట్టం తేవడం వల్ల ప్రతి ఒక్క వ్యక్తి తనకు సంబంధించిన నాలుగు తరాల రికార్డులు చూపించాలి, లేకుంటే దేశం నుంచి బహిష్కరిస్తారన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన సిక్కు, జైన్, బౌద్దం, హిందు వారికి ఎలాంటి ప్రమాదం లేదని, కేవలం ముస్లీంలను పంపిస్తామని అనడం సరికాదన్నారు. అప్పుల రాష్ట్రంగా మార్చారు.. కేసీఆర్ తీసుకుంటున్న నియంత నిర్ణయాల వల్ల మిగులు తెలంగాణ కాస్త అప్పుల తెలంగాణగా మారిందన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు కేవలం రూ. 50వేల కోట్లు అప్పులు ఉంటే, ఇప్పుడు రూ. 3లక్షల కోట్లకు అప్పులు పెరిగిపోయాయన్నారు. ముస్లింలపై పరోక్షంగా ప్రేమ చూపిస్తున్న కేసీఆర్ ఇప్పుడు ఎందు కు స్పందించడం లేదని మండిపడ్డారు. ఎన్ఆ ర్సీ చట్టాన్ని కేసీఆర్ వ్యతిరేకించాలని కోరారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన మోదీ.. 2018–19లో 1.36 కోట్ల ఉద్యోగాలు తీసేశారన్నారు. 35 లక్షల పరిశ్రమలు మూతపడ్డాయని తెలిపారు. మోదీ తొలిసారి ప్రధాని కాగానే ఉత్పత్తి 7 శాతానికి పెరిగిందని, కానీ ఇ ప్పుడు ఐదు శాతానికి పడిపోయిందన్నారు. కారల్మార్క్స్ చెప్పినట్లు త్వరలోనే కమ్యూనిస్టులకు మంచి రోజులు వస్తాయని ధీమా వ్య క్తం చేశారు. గూగుల్ సంస్థ తాజా లెక్కలు చూ డడంతో అందరు సోషలిజం వైపు ఆకర్షితులు అవుతున్నట్లు తెలిపారు. దీన్ని బట్టి అర్థం చేసు కోవాలని ఖచ్చితంగా కమ్యూనిస్టు పార్టీలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. నిజామాబాద్జిల్లాలో ప్రతి కమ్యూనిస్టు కార్యకర్త బాగా కష్టపడాలన్నారు. సమావేశంలో రాష్ట్ర నాయకు లు జయలక్ష్మీ, జిల్లా కార్యదర్శి రమేష్బాబు, పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్, సబ్బనిలత జిల్లా నాయకులు మల్యల గోవర్థన్, అభిలాష్, సంజీవ్, సుజాత, కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘బీజేపీది పౌరులను విభజించే కుట్ర’
సాక్షి, ఖమ్మం: బీజేపీ ప్రభుత్వం దేశంలోని పౌరుల మధ్య చిచ్చు పెట్టి వారిని విభజించే కుట్ర చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. మతం ప్రాతిపదికన పౌరులను విభజించి తద్వారా రాజకీయంగా స్థిరపడాలని, హిందూ మత ఆధిపత్యాన్ని నెలకొల్పాలని, హిందూ ధర్మ రాజ్యాన్ని స్థాపించాలనే రహస్య ఎజెండాను బీజేపీ అమలు చేస్తోందని ధ్వజమెత్తారు. గురువారం స్థానిక మంచికంటి భవన్లో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ ప్లీనంలో ఆయన మాట్లాడారు. మోదీ రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత రిజర్వ్ బ్యాంకు నుంచి రూ.1.75 లక్షల కోట్ల నిధులను మళ్లించారని ఆరోపించారు. మోదీ 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు రూ.లక్ష కోట్ల ఆస్తులున్న ముఖేష్ అంబానీ ఆస్తులు నేడు రూ.19 లక్షల కోట్లకు చేరుకున్నాయని పేర్కొన్నారు. కొన్ని దశాబ్దాల కాలంలో లేనటువంటి విధంగా ప్రజలు కొనుగోలు శక్తిని కోల్పోయారని, దీన్ని మెరుగుపర్చకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమై కుప్పకూలిపోతుందని ఆర్థిక శాస్త్రం నోబుల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ హెచ్చరించిన విషయాన్ని గుర్తుచేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని అన్నారు. మహిళలపై, చిన్నారులపై, అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యమయ్యాయన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ సీపీఎం కార్యకర్తలు ఆత్మవిశ్వాసంతో ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మన్నెపల్లి సుబ్బారావు, పొన్నం వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కళ్యాణం వెంకటేశ్వరరావు, బత్తుల లెనిన్, భూక్యా వీరభద్రం, మాచర్ల భారతి, బండి రమేష్ అఫ్రోజ్ సమీనా తదితరులు పాల్గొన్నారు. -
‘బొటనవేలు దెబ్బకు ప్రతికారం తీర్చుకుంటాం’
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులు నిరసన తెలిపే క్రమంలో తమపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని, అరెస్టు సందర్భంగా దాడిని ఖండిస్తున్నామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాజకీయ జేఏసీ సమావేశం నిర్వహించారు. అఖిల పక్ష నాయకులుంతా పాల్గొన్న ఈ కార్యక్రమంలో కోదండరాం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి దుర్మార్గానికి నిన్నటి ప్రెస్మీట్ పరాకాష్ట అని దుయ్యబట్టారు. ప్రశ్నలు అడిగే వారిపై ముఖ్యమంత్రి దబాయించారు కానీ సమాధానం చెప్పలేదని మండిపడ్డారు. నిన్నటి సమావేశంలో అన్ని అసత్యాలు, అర్ధ సత్యాలే మాట్లాడారని, వీధి నాయకుడి తరహాలో కేసీఆర్ మాట్లాడారని ఆరోపించారు. ఆర్టీసీకి చట్ట ప్రకారం ఇచ్చే దాని కంటే చాలా తక్కువ ఇచ్చారని, సంస్థ నష్టాలకు కారణం కార్మికులే కారణం అనడం దురదృష్టకరమన్నారు. పేదవారి రవాణాకు ఆర్టీసీ తప్ప వేరే మార్గం లేదని, ప్రజల పట్ల ప్రభుత్వ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. ప్రజా సంక్షేమం వదిలి కేసీఆర్ ప్రైవేటు సంస్థ యజమానిలా మాట్లాడారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలతో అందరినీ ఏకం చేసేలా మాట్లాడారని, అన్ని పక్షాలు ఏకతాటిపైకి రావాలని కోదండరాం పిలుపునిచ్చారు. కేసీఆర్కు అండగా ఉన్నది పోటు రంగారావే ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బోటన వేలు గురుదక్షిణ తీసుకున్నట్టు..కుట్రపూరితంగా దొర కేసీఆర్... దక్షిణగా రంగారావు వేలు తీసుకున్నాడని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. సీపీఐ ఎంఎల్(న్యూ డెమోక్రసీ) కేసీఆర్తో కలిసి పోరాటం చేసిన పార్టీ అని, ఉద్యమ సమయంలో ఖమ్మం ఆస్పత్రిలో కేసీఆర్కు అండగా ఉన్నది పోటు రంగారావేనని గుర్తు చేశారు. బొటనవేలు దెబ్బకు ప్రతీకారం తీర్చుకుంటామని, సమ్మెను ముందుకు తీసుకెళ్తామన్న కార్మికులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యాచరణ సిద్దం చేస్తామన్నారు. అలాగే ‘ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యంగా, కోర్టు మాటలు పట్టించుకునే అవసరం లేనట్టు మాట్లాడారు. యూనియన్లను సహించం..దరఖాస్తులు చేసుకుంటే ఉద్యోగులను చేర్చుకోవడంపై ఆలోచిస్తా అని అంటున్నారు. మోటారు వాహన చట్టం అమలు చేస్తామనడం విజ్ఞత గల ముఖ్యమంత్రికి తగదు. హుజూర్నగర్ ఉప ఎన్నిక విజయంతోనే ఇలా గర్వంతో మాట్లాడుతున్నారు. ఆర్టీసీనే కాదు టీఎన్జీవో, టీజీవోలు భ్రమలో ఉన్నారు. యూనియన్లు నన్నేమీ చేయడం లేదన్నట్టుగా మాట్లాడారు’ అని కేసీఆర్ మాట్లాడిన తీరుపై తమ్మినేని మండిపడ్డారు. పోలీసులు చర్యను చరిత్ర క్షమించదు పోటు రంగారావు వేలు పోయేలా చేసిన కేసీఆర్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధమై ఆర్టీసీ పోరాటంలోకి దిగామని, కార్మికుల పట్ల పోలీసుల చర్యలను చరిత్ర క్షమించబోదని పేర్కొన్నారు. ఉద్యమకారుల పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇది కాదని, రేపటి నుంచి నిరవదిక దిక్ష చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఉడుత బెదిరింపులకు కార్మికులు భయపడరు తెలంగాణ వచ్చాక హిట్లర్, నిజాం వాదంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగిస్తున్నారని సీపీఐ ఎంఎల్ సహాయ కార్యదర్శి పోటు రంగారావు విమర్శించారు. హుజూర్నగర్ గెలుపు ధీమాతో మాట్లాడిన మాటలు రాజ్యాంగ వ్యతిరేకమని కొట్టిపారేశారు. కార్మికుల ఉధ్యమాన్ని చెడగొట్టేందుకే ఈ వ్యాఖ్యలు చేసారని, ధన.. అధికార బలంతో హుజూర్నగర్ ఎన్నికలు జరిగాయని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఎమర్జెన్సీ వచ్చే ప్రమాదం ఉందని, ప్రజలను బానిసలుగా మర్చే ప్రమాదం ఉందని ఆరోపించారు. ప్రశ్నించే సమాజాన్ని కేసీఆర్ భరించలేక పోతున్నారని, ఆదే ఆయన పరిపాలించేందుకు అర్హుడు కాదన్నది తేలిందన్నారు. ఉడుత బెదిరింపులకు కార్మికులు భయపడరని ఎద్దేవా చేశారు. పశువులను తీసుకెళ్లే వ్యాన్లో ఉధ్యమకారులను తరలిస్తున్నారని మండిపడ్డారు. నరహంతక విధానాలను ఎదిరించి పోరాటం కొనసాగిస్తామని, యూనియన్ లకు వ్యతిరేకంగా మాడుతున్న కేసీఆర్ తీరును ప్రతిగటించాలని ఆయన పిలుపునిచ్చారు. -
‘48 వేల కుటుంబాలను బజారుపాలు చేశారు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బంద్లో పాల్గొన్న సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నేత పోటు రంగారావు గాయానికి కారణమైనవారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు చెప్పినా చర్చలకు పిలవకుండా 48 వేల ఆర్టీసీ కుటుంబాలను బజారుపాలు చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్పై మండిపడ్డారు. ఆర్టీసీ జేఏసీ తీసుకున్న కార్యాచరణకు మా మద్దతు ఎప్పటికీ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. జేఏసీ నిర్ణయించిన అన్ని అంశాలను లెఫ్ట్ పార్టీలు ఆమోదిస్తున్నాయన్నారు. రాష్ట్ర చరిత్రలోనే తెలంగాణ బంద్ 100 శాతం విజయవంతంగా జరిగిందన్నారు. ఇది ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని ఘాటుగా విమర్శించారు. కార్మికులతో చర్చలు జరపాలని కోర్టు ఆదేశించినప్పటికీ ఇంతవరకూ సీఎం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ మొండి వైఖరి వీడి కార్మికులతో తక్షణమే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. వామపక్ష పార్టీల కార్యాచరణ.. 21న ఆర్టీసీ కార్మికుల కుటుంబాలతోపాటు వామపక్ష పార్టీల కుటుంబాల డిపోల ముందు నిరసన 22న తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్లను విధుల్లోకి రావద్దని విజ్ఞప్తి 23న ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి సమ్మెకు మద్దతు కోసం విజ్ఞప్తి 24న మహిళా కండక్టర్ల దీక్షలు. వారితో పాటు సాధారణ మహిళల్ని కూడా నిరననల్లో భాగం చేస్తాం 25న మిలిటెంట్ కార్యక్రమం ద్వారా జాతీయ రహదారుల దిగ్భంధం 26న ఆర్టీసీ కార్మికుల పిల్లలతో దీక్ష. వారితోపాటు వామపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తల పిల్లలు కూడా దీక్షల్లో భాగం చేస్తాం 27న వామపక్ష పార్టీ నాయకుల ఇళ్లకు ఆర్టీసీ కార్మికులకు ఆహ్వానం -
చట్టబద్దంగా సమ్మెకు దిగితే బెదిరింపులా?
సాక్షి, సిద్దిపేట: గతంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. చివరి నిమిషంలో ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలిచి.. ఆ చర్చలను కూడా అసంపూర్తిగా ముగించారని ఆయన తప్పుబట్టారు. సిద్దిపేటలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన కోర్కెలను ఆమోదించకుండా ప్రభుత్వం బెదిరింపులకు దిగుతోందని, కార్మికులపై ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తామని, వారిని అరెస్ట్ చేస్తామని, పోటీ కార్మికులను దించుతామని భయభ్రాంతులకు గురిచేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని సహించడం లేదని దుయ్యబట్టారు. చట్టబద్ధంగా, న్యాయంగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను బెదిరించాలని చూడడం సబబు కాదని అన్నారు. ప్రభుత్వం వెంటనే సామరస్యంగా చర్చలు జరిపి సమ్మె విరమింపజేయాలని కోరారు. ఆర్టీసీ సమ్మెతో పండగ సందర్భంగా ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురికావడం చాలా దురదృష్టకరమని, ఈ ఎన్నికలో సీపీఎం భావాలకు దగ్గరగా ఉన్న అభ్యర్థులకు తాము మద్దతిస్తామని, దీనిపై ఆదివారం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా విష జ్వరాలతో ప్రజలు బాధలు పడుతున్నారని, దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. -
‘కాంగ్రెస్కు మద్దతిచ్చే ప్రసక్తే లేదు’
సూర్యాపేట : హుజూర్నగర్ ఉప ఎన్నికలో తమ పార్టీ తరఫున అభ్యర్థిని నిలుపుతామని సీసీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. హుజూర్నగర్లో శుక్రవారం సీపీఎం విస్తృత స్థాయి కార్యకర్తలు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తమ్మినేనితో పాటు, జాతీయ కమిటీ సభ్యులు సీతారాములు, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. హుజూర్నగర్ ఉప ఎన్నికలో తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. తమకు మద్దతిచ్చే అంశంపై సీపీఐ, తెలంగాణ జనసమితి, టీడీపీలతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. కలిసివచ్చే పార్టీలతో కలిసి ఉమ్మడి అభ్యర్థిని ప్రకటిస్తామని వెల్లడించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన విధానాలకు వ్యతిరేకంగా తమ ఎన్నికల ప్రచారం సాగిస్తామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మతోన్మాదాన్ని పోషిస్తున్నారని ఆరోపించారు. ఆర్థిక మాంద్యానికి మోదీ పాలనే కారణమని విమర్శించారు. అసెంబ్లీలో వామపక్షాలు లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందని.. ప్రశ్నించే గొంతుక లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ కూడా జనసమితి, టీడీపీ, సీపీఐ మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తోంది. -
హుజూర్నగర్లో ఉమ్మడి అభ్యర్థే
సాక్షి, హైదరాబాద్: హుజూర్నగర్ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం, టీటీడీపీ, టీజేఎస్, కలిసొచ్చే ఇతర లౌకిక శక్తులను కలుపుకుని ఉమ్మడి అభ్యర్థిని నిలుపుతామని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్కు మద్దతునిచ్చే పరిస్థితి లేదన్నారు. సోమవారం ఎంబీ భవన్లో పార్టీ నాయకులు బీవీరాఘవులు, చెరుపల్లి సీతారాములుతో కలిసి ఆయన విలేకరుల తో మాట్లాడారు. అసెంబ్లీలో వామపక్షాల గొంతు లేకపోవడంతో ప్రజల సమస్యలు ప్రస్తావించే పరిస్థితి లేకపోవడం వల్ల రాష్ట్రం నష్టపోతోందన్నారు. యురేనియం తవ్వకాలపై రాష్ట్ర బీజేపీ తన వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాగా, ఆర్థికమాంద్యం తీవ్రమైన నేపథ్యంలో ఆర్బీఐ నుంచి రూ.1.65 లక్ష కోట్లు తీసుకున్న కేంద్రం.. రూ.1.40 లక్ష కోట్లను కార్పొరేట్ సంస్థలకు పన్నుల తగ్గింపు, ఇతర రాయితీలు కల్పించడం తిరోగమన చర్య అని బీవీ రాఘవులు అన్నారు. -
బ్యాంకుల విలీనంతో ఆర్థిక సంక్షోభం
సాక్షి, సుజాతనగర్: కేంద్ర ప్రభుత్వం బ్యాంకులను విలీనం చేయడం వల్ల దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆర్థిక వృద్ధి రేటు 7 శాతం అని కేంద్రం అంటున్నా అది 5 శాతానికి మించలేదన్నారు. ప్రైవేటీకరణలో భాగంగానే బ్యాంకులను కుదించారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారని, రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని విమర్శించారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను ప్రస్తుతం పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల తర్వాత ప్రవేశపెట్టిన బడ్డెట్, ఇతర అంశాలను పరిశీలిస్తే రాష్ట్ర ప్రజలకు మొండి చెయ్యే మిగిలిందని ఎద్దేవా చేశారు. కాంట్రాక్టర్లకు బిల్లులు రావడం లేదని, ప్రభుత్వ విధానాలతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆశ కార్యకర్తలు, అసంఘటిత రంగ కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. నిరుద్యోగభృతి అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు దాని గురించి మాట్లాడటం లేదన్నారు. పెట్టుబడి సాయం కోసం 9 లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. టీఆర్ఎస్లో తిరుగుబాటు మొదలైందని, ఇటీవల మంత్రి ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శమని చెప్పారు. రాష్ట్రంలోని పలు సమస్యల పరిష్కారం కోసం సీపీఎం ఆధ్వర్యంలో ఇతర వామపక్ష పార్టీలను కలుపుకుని ఉద్యమాలు చేస్తామని చెప్పారు. ఆయన వెంట రాష్ట నాయకులు కాసాని ఐలయ్య, మండల కార్యదర్శి వీర్ల రమేష్ ఉన్నారు. -
‘కమ్యూనిస్టు కుటుంబాల్లో పుట్టాలనుకుంటున్నారు’
సాక్షి, హైదరాబాద్: ఆదర్శ వివాహాలు సమాజంలో గొప్ప మార్పును తీసుకువస్తాయని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు అన్నారు. కులాంతర వివాహాలే కుల నిర్మూలనకు దోహదం చేస్తాయన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో తెలంగాణ మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ ఏకైక కుమర్తె శిరీష, టీ 10 సీఈఓ ఎం.శ్రీనివాస్ల ఆదర్శ వివాహం జరిగింది. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. యువతలో వస్తున్న మార్పును స్వాగతిస్తున్నామని, మన దేశంలో కట్నాలు పెరిగిపోయాయని, కొంత మంది తమ బ్లాక్ మనీని పెళ్లిల్లో ఖర్చు చేస్తున్నారన్నారు. అయితే, కట్నం లేకుండా వివాహాలు చేసుకొని ఆదర్శంగా నిలవాలని సూచించారు. భార్యాభర్తలు సమానంగా ఉన్నప్పుడే అది ఆదర్శ వివాహం అవుతుందన్నారు. నేడు ఆడపిల్లలు కమ్యూనిస్టు కుటుంబాల్లో పుట్టాలని కోరుకుంటున్నారని, ఇక్కడే కూతురు, కొడుకులను సమానంగా చూస్తారన్నారు. మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అధ్యక్షతన జరిగిన ఈ వివాహ వేడుకలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఆదిరెడ్డి, కార్పొరేటర్ ముఠా పద్మ నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో టీడీపీ దుకాణం బంద్
సాక్షి, హన్మకొండ అర్బన్: రాష్ట్రంలో టీడీపీ దుకాణం బంద్ అయిందని, రానున్న రోజులు దేశంలో, రాష్ట్రంలో కమ్యూనిష్టులవే అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం హన్మకొండ వడ్డేపల్లి రోడ్డులోని విద్యుత్ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీపీఎం ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి యువజన సమ్మేళనానికి వీరభద్రం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ధన బలంతో అధికారంలోకి వచ్చిందన్నారు. టీఆర్ఎస్ ఎన్నికల హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. సచివాలయం కూల్చివేతను అన్ని వర్గాలవారు వ్యతిరేకించాలని కోరారు. ముఖ్యంగా యువత మేల్కొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రాములు, జిల్లా కార్యదర్శి సారంపెల్లి వాసుదేవరెడ్డి, నాయకులు జగదీష్, విజయ్, కోట రమేష్, బీరెడ్డి సాంబశివ, టి.ఉప్పలయ్య, తిరుపతి, రాగుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యామ్నాయం చూపాలి.. ప్రత్యమ్నాయం చూపకుండా దళితుల భూముల్ని లాక్కోవడం అన్యాయమని తమ్మినేని అన్నారు. హన్మకొండ న్యూశాయంపేటలోని దళితుల భూములను టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు పడుక గదుల ఇళ్ల నిర్మాణానికి తీసుకోవడాన్ని నిరసిస్తూ, తమ భూమి తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హన్మకొండ బాలసముద్రంలోని జయశంకర్ స్మృతి వనం వద్ద దళితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం నాలుగో రోజుకు చేరుకుంది. ఈ దీక్షలకు వీరభద్రం సంఘీభావం తెలిపారు. అప్పటి ప్రభుత్వం పేదల క్షేమం కోరి వారి అభ్యున్నతికి భూములు ఇస్తే ఆ భూమిని ఎలాంటి చర్చలు జరుపకుండా వారికి ప్రత్యమ్నాయ మార్గం చూపకుండా రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలకు కేటాయించడంత ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాజీపేట మండల కార్యదర్శి యు.నాగేశ్వర్రావు, గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం జిల్లా కార్యదర్శి కాడబోయిన లింగయ్య, ప్రజా సంఘాల నాయకులు ఎండీ ఖాసీం, రమేశ్, సారంగపాణి, రవికుమార్ సంఘీభావం తెలిపారు. బాధితులు ఎం.కుమార్, కె.భిక్షపతి, వి.మల్లేశం, కె.శివ, బి.దయాకర్, సి.హచ్.శివశంకర్, జి.పద్మ, వి.మేరి, కళావతి, కె.సరిత, ఎం.రాజమణి, ఎం.వనమాల పాల్గొన్నారు. -
కాంగ్రెస్ వైఫల్యమే ఎక్కువ: తమ్మినేని
సాక్షి,,హైదరాబాద్: జాతీయస్థాయిలో బీజేపీకి ఎక్కువ సీట్లు రావడానికి ఆ పార్టీ గొప్పదనం కన్నా కాంగ్రెస్ పార్టీ వైఫల్యమే అధికమని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. రాష్ట్రంలో సారూ–కారూ–పదహారు–ఢిల్లీలో సర్కారూ అన్న టీఆర్ఎస్ నినాదం పనిచేయకపోగా, నిజామాబాద్, భువనగిరి, మల్కాజ్గిరి సిట్టింగ్ స్థానాలు కోల్పోయి 9 సీట్లకే పరిమితమైందని వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల్లో సీపీఎంకు దేశవ్యాప్తంగా మూడు సీట్లే వచ్చాయని, రాష్ట్రంలో ఒక్కసీటు రాకపోవడంతో పార్టీ కేడర్, అభ్యుదయ శక్తులు, వామపక్ష శ్రేయోభిలాషులు నిరాశ, నిస్పృహలకు గురయ్యారని ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల గెలుపులో ఎక్కడ లోపం జరిగిందో విశ్లేషించుకుని ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడతామని తమ్మినేని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వామపక్షాల అభ్యర్థులకు ఓటేసిన ప్రజలు, కార్యకర్తలు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ విధానాలు, మతోన్మాద పోకడలు, సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా వామపక్షాలు ప్రజల పక్షాన నిలబడి, ప్రజా సమస్యలపై పోరాడాలని, అందుకు సీపీఎం తన కృషిని కొనసాగిస్తుందని చెప్పారు. -
అసెంబ్లీ లోక్సభకు వ్యత్యాసం కనిపిస్తోంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో తాము పోటీచేసిన స్థానాలు, ఇతర అంశాలపై సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ‘సాక్షి’తో మాట్లాడారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఓటర్ల స్పందన, ఇతర అంశాల్లో వ్యత్యాసం కనిపిస్తోందని చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. రెండు ఎన్నికలు ఒకేసారి రాకుండా సీఎం కేసీఆర్ చాకచక్యంగా వ్యవహరించి ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడం ద్వారా గెలవగలిగారన్నారు. లోక్సభతో పాటు శాసనసభ ఎన్నికలు జరిగి ఉంటే భిన్నమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉండేదని గురువారం ‘సాక్షి’తో మాట్లాడుతూ చాడ చెప్పారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలపుడు ఉన్నంత వాడి, వేడి అటు రాజకీయపార్టీల కార్యకర్తలతో పాటు ప్రజల్లోనూ కనిపించలేదన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు కదిలించే ప్రయత్నం కూడా జరగలేదని, యువత కూడా అంత చురుకుగా పాల్గొన్న దాఖలాలు కనిపించలేదన్నారు. సీపీఐ, సీపీఎం పోటీచేసిన 4 సీట్లలో ఇరుపార్టీల మధ్య సమన్వయం, సహకారం బాగా ఉందని చెప్పారు. తాము పోటీ చేసిన స్థానాల్లోనే కాకుండా ఇతర చోట్ల కూడా బీజేపీ, టీఆర్ఎస్ వ్యతిరేక ప్రచారాన్ని నిర్వహించామన్నారు. పార్టీ విధానాలపై ప్రచారం: తమ్మినేని సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగామని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సాక్షికి తెలిపారు. ప్రధానంగా జాతీయ స్థాయిలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే దేశ ప్రజలకు ఎదురయ్యే విపత్కర పరిస్థితులను గురించి వివరించామన్నారు. ఈ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో పోటీచేసిన వామపక్ష పార్టీల అభ్యర్థులకు ఓటు వేసిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రంలో వామపక్షాల ఐక్యతను సాధించే దిశలో ఈ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంల మధ్య పరస్పర సహకారం, సమన్వయం కనిపించిందన్నారు. ఎక్కడా రెండుపార్టీల మధ్య ఫిర్యాదులు చేసుకునేంత పరిస్థితి ఏర్పడలేదన్నారు. వామపక్షాలుగా పోటీ చేసిన నాలుగు స్థానాల్లో అధికార పార్టీలకు వ్యతిరేకంగా ప్రచారాన్ని నిర్వహించినట్టు తమ్మినేని చెప్పారు. -
ఉగ్రదాడితో రాజకీయ లబ్ధికి బీజేపీ వ్యూహం
సాక్షి, హైదరాబాద్: ఇటీవల పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని రాజకీయం చేసి లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ చూస్తోందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ధ్వజమెత్తారు. అన్నిరంగాల్లో విఫలమైన బీజేపీ ప్రభుత్వం, ఉగ్రదాడిని రాజకీయంగా ఉపయోగించుకుని రానున్న ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తోందన్నారు. జాతీయ భద్రత దృష్ట్యా ఇది విద్రోహ చర్యేనని, యావద్దేశం ఈ దాడి విషయంలో ఐక్యంగా నిలిస్తే బీజేపీ మాత్రం రాజకీయం చేస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలోనే ఎక్కువ సంఖ్యలో సైనికులు చనిపోయారని అయినా తమది కాంగ్రెస్ ప్రభుత్వం కాదంటూ ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్షా గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. బుధవారం ఎంబీభవన్లో పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి ఏచూరి విలేకరులతో మాట్లాడారు. నాలుగేళ్ల పాటు అధికారంలో ఉండి బీజేపీ ప్రభుత్వం ఏమి సాధించిందని, ఈ దాడి కూడా ఆ ప్రభుత్వ హయాంలోనే జరిగింది కదా అని ఆయన నిలదీశారు. పౌరసత్వ చట్టానికి సవరణలు తీసుకువచ్చే ప్రయత్నం అత్యంత ప్రమాదకరమని, అందుకే దానిని వ్యతిరేకించామన్నారు. మోదీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు చేస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వహయాంలోనే అతిపెద్ద కుంభకోణం ‘రాఫెల్’రక్షణ ఒప్పందం రూపంలో బయటపడిందన్నారు. బీజేపీ ఓటమే లక్ష్యం... వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ప్రధాన లక్ష్యంగా తమ పార్టీ వ్యవహరిస్తుందని ఏచూరి చెప్పారు. ప్రధాని మోదీని ఓడించి దేశాన్ని కాపాడాలని, పశ్చిమబెంగాల్లో అక్కడి సీఎం మమతాబెనర్జీని ఓడించి బెంగాల్ను పరిరక్షించాలనే నినాదంతో ఎన్నికలకు వెళతామన్నారు. వచ్చే ఎన్నికల్లో కలసి పోటీచేయడంపై సీపీఐతో చర్చలు సాగిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్పార్టీతో నేరుగా పొత్తు ఉండదన్నారు. అయితే తమిళనాడులో డీఎంకేతో తమకు పొత్తు ఉండగా, ఆ పార్టీతో కాంగ్రెస్ కూడా కలసి పనిచేస్తోందన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాతే జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పడే అవకాశాలున్నాయన్నారు. ఎన్నికలకు ముందు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్లు చూస్తుంటామన్నారు. అప్పట్లో హడావుడి చేసిన కేసీఆర్ ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బీఎల్ఎఫ్ కొనసాగింపు: తమ్మినేని లోక్సభ ఎన్నికల్లోనూ బీఎల్ఎఫ్ ప్రయోగం కొనసాగించనున్నట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు.ఈ ఎన్నికల్లో కలసి పోటీచేసే విషయంలో సీపీఐ కార్యదర్శిచాడ వెంకట్ రెడ్డి సానుకూలంగా స్పందించారని చెప్పారు. రాష్ట్రంలో టీజేఎస్, జనసేనతో పొత్తులపై చర్చలు జరుగుతున్నాయన్నారు. సీపీఎం పక్షంగా తాము ఎలాంటి వ్యాపారాలు చేయలేదని తమ్మినేని ఓ ప్రశ్నకు బదులిచ్చా రు. టెన్ టీవీని విరాళాలు తీసుకుని ఏర్పాటు చేశామని, నష్టాలు రావడంతో విరాళాలు వెనక్కు ఇస్తున్నామన్నారు. పొలిట్బ్యూరో అనుమతి తీసుకున్నాకే నష్టాల్లో ఉన్న సంస్థను విక్రయించినట్టు తెలిపారు. -
చట్టం తన పని తాను చేసుకుపోతుందా?
హైదరాబాద్: చట్టం తనపని తాను చేసుకుపోతుందని అంటారు కానీ అది ఎప్పటికీ జరగడం లేదని కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్, బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్వీకే ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘రాజ్యాంగబద్ధ సంస్థలు– చట్టబద్ధ పాలన’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ.. అవినీతి నేరాలను పరిశోధించటం కోసం ఏర్పాటుచేసిన సంస్థపైనే ఆరోపణలు వస్తే ఇక అవినీతిని నిరోధించడం ఎలా అని ప్రశ్నించారు. సమాచార చట్టం కింద సీబీఐని ఎందుకు ఉంచలేదని ప్రశ్నించారు. సీబీఐలో ఉన్న 11 మందిని తీసేశారని, వారిని ఎక్కడికి బదిలీ చేశారో ఇంతవరకు తెలియదన్నారు. సీబీఐ డైరెక్టర్ను ఒక్కసారిగా తీసివేస్తే ఉన్న కేసు విషయాలు ఎవరు విచారణ చేపట్టాలని ప్రశ్నించారు. సీబీఐ డైరెక్టర్ను నియమించే సెలక్షన్ కమిటీలో ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉండటం ఏమిటని ప్రశ్నించారు. ఇక సీబీఐ కన్నా గొప్ప సంస్థ ఆర్బీఐ అని, సీబీఐలో దొంగలు కనపడతారు కానీ ఆర్బీఐలో కనబడరని ఎద్దేవా చేశారు. ఏ రాజకీయ పార్టీ కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి వచ్చి పారదర్శకత కోసం మా సమాచారం ఇస్తామని ముందుకు రాదని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, ఎస్వీకే ట్రస్ట్ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చాక చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని పాలిస్తుందని విమర్శించారు. రాజ్యాంగాన్ని రద్దు చేయటం లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీకే ట్రస్ట్ మేనేజింగ్ కమిటీ సభ్యుడు ఎస్.వినయ్కుమార్, సీపీఎం రాష్ట్ర నాయకుడు నంద్యాల నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పంట నష్టపోయిన రైతుకు పరిహారమివ్వాలి
సాక్షి, హైదరాబాద్: పంటలకు అవసరమైన నీటిని ప్రణాళికాబద్ధంగా అందించాలని, నీరు లేక ఏ రైతు పంట నష్టపోయినా ప్రభుత్వం పరిహారం చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. వర్షాభావంతో ఖరీఫ్ పంటలు దెబ్బతిన్నాయని, రబీపై ఆశలు పెట్టుకున్నా.. నాగార్జునసాగర్ ఎడమకాలువ, శ్రీరాంసాగర్, జూరాల కింది రైతులకు తైబందీ చేసి నీరివ్వడం లేదన్నారు. నాగార్జునసాగర్ కింద నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో వేసిన పంటలకు ఇవ్వాల్సిన నీటిని మిషన్ భగీరథకు తరలించడానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్లే వేసిన పంటలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రస్తుతం సాగర్లో డెడ్స్టోరేజీ పోగా 60 టీఎంసీల నీరు ఉన్నందున.. సాగర్ బోర్డును సంప్రదించి రాష్ట్రంలోని మొదటి, రెండో జోన్లకు కావాల్సిన నీటిని సాధించాలన్నారు. శ్రీశైలంలో డెడ్స్టోరేజీ పోగా 30 టీఎంసీల నీటి లభ్యత ఉన్నందున, ఇందులో రాష్ట్రానికి రావాల్సిన కోటా రాబట్టాలని కోరారు. ఇప్పటికైనా నీటిపారుదల, వ్యవసాయశాఖలు నీటి లభ్యతను బట్టి ఆయకట్టు ప్రాంతాన్ని నిర్ధారించి కచ్చితంగా అమలుచేయాలని తమ్మినేని సూచించార -
ఒక్క సీటూ రాలేదు.. ఉన్న ఓట్లూ దక్కలేదు!
సాక్షి, హైదరాబాద్ : తాజా అసెంబ్లీ ఎన్నికలు సీపీఎంను అంతర్మథనంలోకి నెట్టేసింది. తమ పార్టీకి సంప్రదాయకంగా పడే ఓట్లూ రాకపోగా, ఉన్న కాస్త ఓట్లు కూడా చెదిరిపోవడంతో ఇప్పుడా పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీగా గత ఎన్నికల్లో ఓటర్లు వ్యతిరేకించినప్పటి స్థితి కంటే ఈ ఎన్నికల్లో తాము దిగజారిపోవడంతో ఆ పార్టీ నేతలు కలవర పడుతున్నారు. రాష్ట్ర రాజకీయ వాతావరణంలో వచ్చిన మార్పు,చేర్పుల వల్ల ఈ పరిస్థితి తలెత్తిందా ? లేక కిందిస్థాయిలో సంస్థాగతంగా పార్టీ బలహీనపడిందా అన్న సందేహాలు వారిలో వ్యక్తమవున్నాయి. ఈ ఎన్నికల్లో పార్టీకి గట్టి పట్టున్న నియోజకవర్గాల్లోనూ ఓటింగ్ చెదిరిపోవడం, ఆశించిన మేర సీట్లు రాకపోయినా ఓటింగ్ పెంచుకుంటామన్న అంచనా కుదేలవ్వడంతో పార్టీ నాయకుల్లో నిరాశా, నిస్పృహలు అలుముకున్నాయి. ఒక్క సీటయినా గెలవకపోగా, అధికశాతం నియోజకవర్గాల్లో సీపీఎం–బీఎల్ఎఫ్ అభ్యర్థులకు నామమాత్రం ఓట్లు పోలు కావడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. కిందివాళ్లు రాలేదు..పై వాళ్లు దూరమయ్యారు...! రాష్ట్రంలో 90 శాతానికి పైగా ఉన్న బహుజనులకు (ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీలు, మహిళలు) ప్రాధాన్యం పెంచేందుకు, సామాజిక న్యాయం చేకూర్చేందుకు ఎజెండాను ముందుకు తీసుకెళ్లినా ఈ వర్గాల నుంచే తగిన సహకారం అందలేదని సీపీఎం– బీఎల్ఎఫ్ నేతలు వాపోతున్నారు. రాష్ట్రంలో తాము చేసిన కొత్త ప్రయోగానికి కిందిస్థాయిలోని ఆయా వర్గాలు కలిసి రాకపోగా, ఈ ఎజెండా కారణంగా ఇప్పటివరకు మద్దతుగా ఉన్న పై కులాలు, వర్గాలు కూడా పార్టీకి దూరమయ్యాయని అంచనా వేస్తున్నారు. అధికార టీఆర్ఎస్– విపక్ష కాంగ్రెస్ కూటమి మధ్యలోనే ప్రధాన పోటీ ఉండడంతో ఓటర్లు తమను పట్టించుకోలేదని సీపీఎం నాయకులు విశ్లేషిస్తున్నారు. అసలు ఈ ఎజెండాను ఎవరి కోసం చేపట్టామో దానిని కిందిస్థాయి వరకు తీసుకెళ్లి ప్రజలకు బలంగా వివరించడంలో తమ వైఫల్యం ఉందని వారు అంగీకరిస్తున్నారు. కలసి రాని తమ్మినేని పాదయాత్ర వాస్తవానికి 2019 ఎన్నికలపై ఎలాంటి ముందస్తు అంచనాలు లేకుండా 2016–2017 మధ్యలో దాదాపు ఆరునెలల పాటు పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రవ్యాప్త పాదయాత్ర కూడా ఇప్పుడు సీపీఎంకు ఆశించిన ఫలితాలు చేకూర్చక పోవడం వారిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ పాదయాత్ర అనంతరం ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలు–సామాజికన్యాయం సాధనకు ‘లాల్–నీల్’ (కమ్యూనిస్టులు, బహుజనులు) పేరిట చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలివ్వడంతో ఎన్నికలకు ముందు ‘ సీపీఎం– బహుజన లెఫ్ట్ ఫ్రంట్’ (బీఎల్ఎఫ్) ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా వివిధ వామపక్షాలు, కుల, సామాజిక సంఘాలు, సంస్థలను బీఎల్ఎఫ్లోకి తెచ్చే ప్రయత్నాలు విఫలమయ్యాయి.దీంతో పార్టీ లక్ష్యాలకు అనుగుణంగా విస్తృత వేదిక ఏర్పాటు సాధ్యం కాలేదు. మరో వైపు బీఎల్ఎఫ్పై సీపీఎం ముద్ర బలంగా ఉన్న కారణంగానే సీపీఐ, ఇతర కమ్యూనిస్టుపార్టీలు, సామాజికసంస్థలు కలసి రాలేదనే అభిప్రాయాన్ని పరిశీలకులు వ్యక్తంచేస్తున్నారు.ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 26 సీట్లలో పోటీచేసిన సీపీఎంకు మొత్తం 88,733 ఓట్లు (0.4 శాతం), 81 స్థానాల్లో బరిలో నిలచిన బీఎల్ఎఫ్కు 1,41,119 ఓట్లు (0.7శాతం) మాత్రమే వచ్చాయి. -
రెండు ఏనుగుల మధ్య నలిగిపోయాం: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్–కాంగ్రెస్ కూటమి అనే రెండు ఏనుగుల మధ్య నలిగిపోయామని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. ప్రత్యామ్నాయ విధానాలు–సామాజికన్యాయం నినాదంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మార్పు తీసుకొచ్చేందుకు సీపీఎం–బీఎల్ఎఫ్ ప్రయత్నం చేసినా ఫలించలేదన్నారు. సామాజిక న్యాయ సాధనకు ప్రత్యామ్నాయ విధానాలు కావాలంటూ సిద్ధాంతాలు మాట్లాడిన సీపీఐ, టీజేఎస్, ప్రజాగాయకుడు గద్దర్, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య, ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణమాదిగ చివరకు కాంగ్రెస్ చంకలో చేరడంతో అనుకున్న ఫలితాలు సాధించలేకపోయామని చెప్పారు. టీఆర్ఎస్ సర్కార్ అమలు చేసిన సంక్షేమ పథకాలు ఆ పార్టీకి సానుకూల ఫలితాలకు కారణమయ్యాయని తెలిపారు. -
చంద్రబాబు జోక్యం ప్రతికూలమే...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఏపీ సీఎం చంద్రబాబు జోక్యం చేసుకున్న తీరు.. ప్రజా కూటమిపై ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు చూపబోతోందని సీపీఎం అంచనా వేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసమే కాంగ్రెస్తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని పేర్కొంది. మొదట్లో కాంగ్రెస్ కూటమికి అనుకూలంగా ఉండొచ్చునని భావించినా తెలంగాణ అనుకూల సెంటిమెంట్ పెరగడంతో ఆ తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చిందని అభిప్రాయపడింది. శనివారం మఖ్దూమ్ భవన్లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో తెలంగాణ ఎన్నికలు, రాజకీయ పరిణామాలు, బీఎల్ఎఫ్కున్న అవకాశాలను గురించి సమీక్షించారు. పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, 17 లోక్సభ నియోజకవర్గాల ఇన్చార్జీలు హాజరయ్యారు. వివిధ వర్గాల ప్రజలకిచ్చే పింఛను డబ్బును పెంచడం, రైతుబంధు పథకం, సమాజంలోని వివిధ రంగాలకు చెందిన వారి కోసం సంక్షేమ పథకాల అమలు, ఏదో ఒకరూపంలో లబ్ధి చేకూర్చేందుకు చేసిన ప్రయత్నాలు టీఆర్ఎస్కు ఎన్నికల్లో రాజకీయంగా ప్రయోజనం చేకూర్చాయని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తేనే ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ప్రజలు భావించినందువల్లే.. ఆ పార్టీకే మళ్లీ పట్టంగడుతున్నారని విశ్లేషించారు. మైనారిటీల ఓట్లు పెద్ద సంఖ్యలో పడటం కూడా టీఆర్ఎస్కు కలిసొచ్చే అంశమన్నారు. తెలంగాణ సెంటిమెంట్ మళ్లీ తెరపైకి... తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టేలా చంద్రబాబు చేసిన ప్రసంగాలు, ఆయన వ్యవహారశైలిపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైందని సీపీఎం విశ్లేషించింది. తెలంగాణలో మరోసారి చంద్రబాబు వేలుపెడితే ఇక్కడి రాజకీయాలు, పరిస్థితుల్లో కూడా ప్రతికూల మార్పులొస్తాయనే ప్రజలు భావించారని అభిప్రాయపడింది. కూటమిని మొత్తం తన చుట్టే తిప్పుకోవడం, ప్రచార వ్యూహాన్ని ఖరారు చేయడం మొదలుకుని, తానే ముందుండి నడిపించడం కూడా ఇక్కడి ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి కారణమైందని అంచనా వేసింది. ఎన్నికలకు ముందు చివరి 4,5 రోజుల పాటు చంద్రబాబు నిర్వహించిన విస్తృత ప్రచారం, ప్రస్తావించిన అంశాలు కూటమిపై ప్రతికూల ప్రభావం చూపాయని అభిప్రాయపడింది. సీపీఎంగా పోటీచేసిన భద్రాచలం, మిర్యాలగూడలలో, బీఎల్ఎఫ్ అభ్యర్థులున్న నారాయణ్పేట్, మధిరలలో కనీసం ఒక్కోస్థానంలోనైనా గెలిచే అవకాశాలున్నాయని భావిస్తోంది. -
మోదీని, కేసీఆర్ను గద్దె దించాల్సిందే: సీతారాం ఏచూరి
సాక్షి, ఇబ్రహీంపట్నం: ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్లను గద్దె దించాల్సిందేనని, వారు మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఇబ్రహీంపట్నంలో బీఎల్ఎఫ్ బలపరిచిన సీపీఎం అభ్యర్థి పగడాల యాదయ్యకు మద్దతుగా మంగళవారం నిర్వహించిన సభలో ఏచూరి మాట్లాడారు. యేడాదికి రెండు కోట్ల ఉద్యోగాల ఇస్తామని చెప్పిన హామీని ప్రధాని మోదీ మరిచిపోయాడన్నారు. ఉన్న ఉద్యోగాలనే తగ్గిస్తున్నారని ఆరోపించారు. 12 లక్షల కోట్ల రూపాయలను బ్యాంకుల నుంచి దేశాన్ని వదిలి విదేశాలకు పారిపోయిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా వారిని మోదీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. సైన్యానికి కావాల్సిన విమానాల కొనుగోలులో 60 వేల రాఫెల్ కుంభకోణం జరిగినా.. విచారణ జరిపేందుకు మోదీ ఒప్పుకోవడంలేదని మండిపడ్డారు. ఆర్థికంగా దేశాన్ని మోదీ దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో 93 శాతం మైనార్టీలు, దళితులు, గిరిజనులు, బీసీలున్నారని, సామాజిక న్యాయం జరగాలంటే వారు ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. మతతత్వ శక్తులతో కుమ్మక్కై లౌకికతత్వ రాజ్యాగాన్ని మార్చేందుకు మోదీ ప్రభుత్వం కుట్ర పన్నుతుందన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఇష్టారాజ్యంగా పరిపాలన కొనసాగిస్తున్నాడని, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నాడని విమర్శించారు. మోదీతో కేసీఆర్ రహస్య ఒప్పందం చేసుకొని ముందస్తు ఎన్నికలకు వెళ్లాడని ఆరోపించారు. బీఎల్ఎఫ్ బలపరిచిన సీపీఎం అభ్యర్థి యాదయ్యను గెలిపిస్తేనే పేదలకు, బడుగులకు న్యాయం జరుగుతుందన్నారు. పేదల బతుకుల్లో మార్పులేదు... సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే పేదల బతుకులు మారిపోతాయనుకుంటే.. అందుకు విరుద్ధంగా రాష్ట్రంలో కేసీఆర్ పాలన కొనసాగుతుందన్నారు. రాష్ట్రమొచ్చి ఐదేళ్లు కావస్తున్నా పేదల బతుకుల్లో మార్పులేదన్నారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి తమ బతుకులు బాగుపడాలంటే ఎలాంటి వారిని ఎన్నుకోవాలో నిర్ణయించుకోవాలన్నారు. బలహీన వర్గాల అభ్యర్థి పగడాల యాదయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నిజమైన దేశభక్తులు కమ్యూనిస్టులే... ఇబ్రహీంపట్నంరూరల్: దేశంలో నిజమైన దేశభక్తులెవరైనా ఉన్నారంటే అది కమ్యూనిస్టులు మాత్రమేనని బహుజన లెఫ్ట్ప్రంట్ రాష్ట్ర చైర్మన్ నల్లా సూర్యప్రకాష్ అన్నారు. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ తోడెళ్లలాగా తయారై ప్రజలను పీక్కుతింటున్నాయని చెప్పారు. ఈ తోడెళ్ల నుంచి కాపాడి ప్రజలకు రక్షణ ఉండటానికి బీఎల్ఎఫ్ ఆవిర్భవించిందన్నారు. బహుజన రాజ్యం రావాలంటే యాదన్నను గెలిపించాలని కోరారు. యాదన్న లాంటి వాళ్లు ఎమ్మెల్యేలు అయితే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని హామీ ఇచ్చారు. బీఎల్ఎఫ్లో మహిళకు ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజారాజ్యం, బహుజన రాజ్యం రావాల్సిన అవసరం ఉందన్నారు. దాని కోసం బీఎల్ఎఫ్ పనిచేస్తుందన్నారు. సామాజిక న్యాయం కోసం గతంలో గద్దర్, ఆర్.కృష్ణయ్య లాంటి నేతలు మాట్లాడరని, వారి ఆత్మగౌరవాన్ని సోనియా, చంద్రబాబు కాళ్లముందు పెట్టరన్నారు. వామపక్ష ఐక్యత కోసం సీపీఎం కృషి చేస్తే సీపీఐ మాత్రం ముష్టి మూడు సీట్ల కోసం కాంగ్రెస్ నాయకులకు వద్ద పార్టీ గౌరవాన్ని తాకట్టు పెట్టారని అక్కడక్కడ సీపీఐ కార్యకర్తలే అంటున్నారని చెప్పారు. ఈ సభ సీపీఎం రాష్ట్ర నాయకులు జంగారెడ్డి, లెల్లెల బాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే మస్కు నర్సింహ, సామేలు, జంగయ్య, మధుసూదన్రెడ్డి, జగదీష్, జగన్, మాజీ జడ్పీటీసీ కవిత, శ్రీనివాస్రెడ్డి, జంగయ్య , రాంచందర్ తదితరులు పాల్గొన్నారు. -
‘ట్రాన్స్ జెండర్ పోటీ చేయడం సహించలేకే ఇలా..’
సాక్షి, హైదరాబాద్ : బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రముఖి ఆచూకీ ఇంకా లభించలేదని బీఎల్ఎఫ్ ఛైర్మన్ నల్లా సూర్యప్రకాశ్ అన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకొవడం లేదని తెలిపారు. ఇది పోలీసుల చేతకాని తనమేనని మండిపడ్డారు. ఒక ట్రాన్స్ జెండర్ పోటీ చేయడం సహించలేకే ఇలా చేశారన్నారు. గోశామహల్లో పోటీ చేయబోయే కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు నేర చరిత్ర ఉందన్నారు. దేశంలో మొదటిసారి ఒక హిజ్రా ఎన్నికల్లో పోటీ చేయబోతోందని, ఆమెను కిడ్నాప్ చేయడం దురదృష్టకరమని టీమాస్ ఫోరం చైర్మన్ ప్రొఫెసర్ కంచె ఐలయ్య అన్నారు. పోలీసుల వైఫల్యం వల్లే చంద్రముఖి ఆచూకీ లభించడం లేదన్నారు. ఈ ఘటనపై ఏ రాజకీయ పార్టీ నుండి కనీసం స్పందన లేదని మండిపడ్డారు. చంద్రముఖి సమస్యపై ఎన్నికల సంఘం స్పందించాలని డిమాండ్ చేశారు. చంద్రముఖి విషయంలో టీఆర్ఎస్ బాధ్యత వహించాలన్నారు. కోర్టులో హెబియస్ కార్పస్ రిట్ వేశామని, చాలా ప్రజా సంఘాలు ఈ కేసులో ఇంప్లిడ్ అవుతామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య అభివృద్ధికి చంద్రముఖి ప్రతీక అని కొనియాడారు. ఒక ట్రాన్స్ జెండర్ కిడ్నాప్ జరిగితే ఎవరు స్పందించకపోవడం బాధాకరమని ట్రాన్స్ జెండర్ ప్రతినిధి లైలా అన్నారు. చంద్రముఖి చాలా ప్రోగ్రెసివ్ వ్యక్తి అని కొనియాడారు. దేశ వ్యాప్తంగా ఉద్యమాలకు పిలుపునిస్తామన్నారు. చంద్రముఖి పిరికి వ్యక్తి కాదని, ఖచ్చితంగా కిడ్నాప్ కి గురైందని తెలిపారు. చంద్రముఖి దొరికే వరకు గోశామహల్లో ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఓటమి భయంతోనే ప్రత్యర్థులు కిడ్నాప్ చేశారని నిప్పులు చెరిగారు. మంగళవారం ఉదయం నుండి చంద్రముఖి కనపడడం లేదని, పౌర హక్కుల కోసం పోరాడే చంద్రముఖి కిడ్నాప్ కావడం దారుణమని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ నేత తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈ కిడ్నాప్కు ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. చంద్రముఖికి వస్తున్న ఆదరణ తట్టుకోలేకే ప్రత్యర్థులు కిడ్నాప్ చేశారన్నారు. చంద్రముఖి బయపడి పారిపోయే వ్యక్తి కాదు, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలి, లేదంటే దేశవ్యాప్త ఉద్యమాలకు పిలుపునిస్తామని హెచ్చరించారు. -
చంద్రబాబుది అవకాశవాద ఫ్రంట్
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు జాతీయస్థాయిలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తు న్న కూటమి పూర్తిగా అవకాశవాద కూటమేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ నేత తమ్మినేని వీరభద్రం విమర్శించారు. చంద్రబాబుకు పరిస్థితులు కలిసొస్తే తిరిగి బీజేపీలోనే చేరతారన్నా రు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్), హెచ్యూజే ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ లభించే పరిస్థితులు లేవన్నారు. ఈ నేపథ్యంలో తాము గెలిచే సీట్లే కీలకంగా మారనున్నాయన్నారు. టీఆర్ఎస్కు మేలు చేసేందుకే బీఎల్ఎఫ్ పోటీ చేస్తున్నట్టు వస్తున్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు. టీఆర్ఎస్, కేసీఆర్ దుష్టపాలనను ఓడించాల్సిందేనని పిలుపునిచ్చారు. వామపక్షాల ఐక్య త, విలీనం అంటూ మాట్లాడిన సీపీఐ నయవంచక కాంగ్రెస్ ధృతరాష్ట్ర కౌగిలికి చేరడం శోచనీయమన్నారు. విద్య, వైద్యం, భూమి, ఇళ్లు, వ్యవసాయం, జీతం, సామాజిక న్యాయం వంటి ప్రత్యామ్నాయ విధానాలతో బీఎల్ఎఫ్ ఈ ఎన్నికల్లో పోటీచేస్తోందని చెప్పా రు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని 14 వేల పంచాయతీల్లో రూ.5కే ‘బహుజన బువ్వ క్యాంటీ న్లు’, గుడిసెల్లో నివసించే వారికి 200 యూనిట్ల ఉచి త విద్యుత్, కూలీబంధు, రక్షణ పథకాలు అమలు చేస్తామన్నారు. 119 సీట్లలో బీసీలకు 50.4% సీట్లు, ఎస్సీలకు 23.5%, ఎస్టీలకు 12.6%, మైనారిటీలకు 8.5%, ఓసీలకు 5.5 శాతం సీట్లు కేటాయించినట్టు తమ్మినేని వెల్లడించారు. కోదండరాంను శిఖండిలా ఉపయోగించుకుంటోంది: నల్లా టీజేఎస్ అధినేత కోదండరాంను కాంగ్రెస్ పార్టీ శిఖండిలా ఉపయోగించుకుంటోందని బీఎల్ఎఫ్ చైర్మన్ నల్లా సూర్యప్రకాశ్ ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సైంథవుడిగా మారిపోయారని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో 119 సీట్లలో పోటీ చేయడమే బీఎల్ఎఫ్ సాధించిన నైతిక విజయమని వ్యాఖ్యానిం చారు. టీఆర్ఎస్కు ఇవే చివరి ఎన్నికలని, 2023లో బీఎల్ఎఫ్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. -
గౌరవాన్ని తాకట్టు పెడతారా?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సీపీఐ, టీజేఎస్ నేతలు కూటమిలో అవమానాలు భరిస్తూ సీట్ల కోసం తమ గౌరవాన్ని తాకట్టు పెట్టొ ద్దని బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని వీరభద్రం హితవు పలికారు. కూటమి నుంచి బయటకు వచ్చి బీఎల్ఎఫ్తో కలిస్తే అడిగినన్ని సీట్లు ఇస్తామని చెప్పా రు. ఖమ్మంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెండు, మూడు సీట్ల కోసం పాకులాడి చులకన కావద్దని సీపీఐకి హితవు పలికారు. టీఆర్ఎస్కు కాంగ్రెస్ ప్రత్యామ్నాయం అంటూ సీపీఐ చెప్పడం ఆత్మహత్యాసదృశమేనని చెప్పారు. ఈ పరిస్థితి నుంచి సీపీఐతో పాటు టీజేఎస్ బయటపడి ప్రజల కోసం విధానపరంగా పోరాడుతున్న సీపీఎం–బీఎల్ఎఫ్ కూటమికి చేరువ కావాలని కోరారు. స్వచ్ఛమైన రాజకీయాల కోసం ప్రత్యామ్నాయ రాజకీయమే లక్ష్యంగా బీఎల్ఎఫ్ పోటీ చేస్తోందని చెప్పారు. 72 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ దేశాన్ని అధోగతి పాలు చేసిందని, టీఆర్ఎస్ కుటుంబ పాలనతో ఆపార్టీ నేతలు జనం కలలను కల్లలు చేశారన్నారు. ఇప్పటికైనా సీపీఐ, టీజేఎస్లు పునరాలోచించుకోవాలని కోరారు. -
కుక్కలు చింపిన విస్తరి మహాకూటమి: తమ్మినేని
వలిగొండ: మహాకూటమి పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా ఉందని, కనీసం సీట్లు పంచుకునే స్థితిలో లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలకేంద్రంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, టీఆర్ఎస్ కొంగరకలాన్లో నిర్వహించిన సభకు జనం నుంచి స్పందన లేకపోవడంతో నిరుత్సాహంలో పడిందన్నారు. -
ఏ ముఖం పెట్టుకొని ఓట్లడుగుతారు
వనపర్తి అర్బన్: కేసీఆర్ సారథ్యంలోని మాయకూటమి, కాంగ్రెస్ మహాకూటమి, బీజేపీ మతోన్మాద కూటములకు చెక్ పెట్టేందుకే ప్రజా కూటమైన బీఎల్ఎఫ్ ఆవిర్భవించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని వీరభద్రం అన్నారు. వనపర్తిలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజల జీవన విధానం మార్చే విధంగా ఎజెండా ఉండే వాటికి ప్రజల మద్దతు ఉండాలని.. ఆ విధంగా బీఎల్ఎఫ్ విధానాలు రూపుదిద్దుకున్నాయని చెప్పారు. తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ అవుతదని చెప్పిన కేసీఆర్ నాలుగున్నరేళ్ల సమయం సరిపోలేదా..? అని ప్రశ్నించారు. ఏ ఒక్క హామీ నెరవేర్చని కేసీఆర్ ఓ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడని ప్రశ్నించారు. జిల్లాలోని ఏదుల రిజర్వాయర్ కోసం రైతుల కోసం భూములు లాక్కున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లతో రూ.వందల కోట్లు కమీషన్లు తిని 2013 చట్టం ప్రకారం రైతులకు పరిహారం ఇవ్వకుండ వారి నోట్లో మట్టి కొట్టారని ఆరోపించారు. ఇల్లు ఇవ్వని కేసీఆర్, మాట తప్పిన కేసీఆర్ ఓట్లు ఎందుకు అడుగుతున్నావని నిలదీశారు. ఆయన పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలన్నారు. ఇంటికో ఉద్యోగం ఏమైంది తెలంగాణ వస్తే.. ఇక్కడున్న ఆంధ్రోళ్లు పోతే ఏర్పడే 2.5 లక్షల ఖాళీలలో తెలంగాణ బిడ్డలకు ఇంటికో ఉద్యోగం ఇస్తానని నమ్మబలికి చివరికి ఊరికొకటి ఐనా ఇచ్చావా అని వీరభద్రం ప్రశ్నించారు. ఆ పోస్టులను భర్తీ చేసేందుకు ఎవరు అడ్డుపడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఉద్యోగాలు ఇచ్చేవాడు కాదు.. ఊ డగొట్టే వాడని, ఇప్పటికి ఇచ్చిన 23 వేల ఉద్యోగాలలో ప్రజలకు అవసరమైన వైద్య పోస్టులు గాని, ఉపాధ్యాయ పోస్టులు గాని, వ్యవసాయాధికారి పోస్టులు గానీ భర్తీ చేయలేదని విమర్శించారు. కేసీఆర్ పీడ విరిగితేనే తెలంగాణవాదుల బతుకులు బాగుపడవన్నారు. అలాగే కాంగ్రెస్, టీడీపీలు అత్యధిక కాలం పాలించినా ప్రయోజనం లేకపోయిందన్నారు. మహాకూటమిలోని సీపీఐ ఎర్రజెండాను తాకట్టు పెట్టేకంటే ప్రజా కూటమికి మద్దతు తెలపాలని సూచించారు. అమరుల ఆకాంక్ష కోసమే పనిచేస్తామం టున్న కోదండరాం వారితో ఎలా కలిశారని ఎద్దేవా చేశారు. ప్రజలు ఆమోదిస్తే.. ప్రజలు ఆమోదించి అవకాశం కల్పించి బీఎల్ఎఫ్కు అధికారం కట్టబెడితే బీసీని ముఖ్యమంత్రి, మహిళను ఉప ముఖ్యమంత్రి చేస్తామని అందుకు బీఎల్ఎఫ్కు పట్టం కట్టాలని కోరారు. బీఎల్ఎఫ్ రాష్ట్ర చైర్మన్ నల్లా సూర్యప్రకాష్, వనపర్తి ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణయ్య, బీఎల్ఎఫ్ రాష్ట్ర కోకన్వీనర్ జాన్వెస్లీ, రాష్ట్ర కార్యదర్శి నాగరాజు మాట్లాడారు. కార్యక్ర మంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బా ర్, నాయకులు ఆంజనేయులు, ఎం.ఆంజనేయులు, రాజు, గోపాలకృష్ణ పాల్గొన్నారు. -
మహాకూటమికి ప్రజల గోడు పట్టదా?
సాక్షి, హైదరాబాద్: మహాకూటమిలోని పార్టీలు సీట్ల కోసం సిగ పట్లు పట్టుకోవడం తప్ప ప్రజల గురించి పట్టించుకోవడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. బీఎల్ఎఫ్ చైర్మన్ నల్లా సూర్యప్రకాశ్రావుతో కలసి హైదరాబాద్లో ఫ్రంట్ అభ్యర్థుల మూడోజాబితాను గురువారం విడుదల చేశా రు. తమ్మినేని మాట్లాడుతూ.. మేనిఫెస్టో, ప్రజల హామీల గురిం చి మాట్లాడకుండా మహాకూటమి సీట్ల కోసం పాకులాడుతున్నా యని ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు 70 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించినట్టుగా వెల్లడించారు. మిగిలిన 49 నియోజకవర్గాలకు అభ్యర్థులను మరో వారంలో ప్రకటిస్తామన్నారు. ఈ వారంలోగా మహాకూటమిలోని పార్టీలు వస్తాయనే అంచనాతోనే ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించలేదని.. వారు వస్తే, ఆ పార్టీలకు ఆ సీట్లు కేటాయిస్తామన్నారు. బీఎల్ఎఫ్ తాజాగా 14 మందితో మూడో జాబితా విడుదల చేసింది. గతంలోనే ప్రకటించిన మంథని నియోజకవర్గ అభ్యర్థిని మార్చి, పొలం రాజేందర్కు సీటిచ్చారు. మూడో జాబితాలో అభ్యర్థులుగా నిర్మల్–అలివేలు మంగ, నిజామాబాద్ అర్భన్–ఇస్మాయిల్, సిరిసిల్ల–కూరపాటి రమేశ్, జగిత్యాల–కాయితి శంకర్, హుజూరాబాద్–కె.లింగారెడ్డి, ఎల్లారెడ్డి–సత్యం సిద్ధార్థ్, నారాయణఖేడ్–బసవరాజ్ పాటిల్, ఉప్పల్–దొమ్మాటి వెంకటేశ్వర్లు, వరంగల్ వెస్ట్–డి.శ్రీకాంత్యాదవ్, కార్వాన్–విఠల్ను ప్రకటించారు. సీపీఎం అభ్యర్థులుగా నాంపల్లి–ఎస్కేఎం.లక్ష్మీకుమార్, పఠాన్చెరు–ఆర్.శ్రీనివాస్, దుబ్బాక–జి.భాస్కర్, జహీరాబాద్–రామచందర్ను ప్రకటించారు. -
కాంగ్రెస్ ఓ పనికిమాలిన పార్టీ!
సాక్షి, హైదరాబాద్: పాలక పార్టీలతో పొత్తులు, అవగాహన వంటివాటితోనే రాష్ట్రంలో.. వామపక్షపార్టీల విస్తరణకు విఘాతం కలిగిందని భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఒక రాష్ట్రంలో పాలక పార్టీని ఓడించేందుకు.. మరో రాష్ట్రంలోని పాలక పార్టీతో పొత్తులు కుదుర్చుకోవడం కారణంగానే.. కమ్యూనిస్టులకు ఓట్లేసినా అంతే.. అనే నిర్లిప్తత ప్రజల్లో వచ్చిందన్నారు. ‘టీఆర్ఎస్ దుష్టపాలనను అంతం చేయడానికి, కాంగ్రెస్ అనే పనికిమాలిన పార్టీతో కలవాలా?’అని ఆయన ప్రశ్నించారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) ద్వారా ఎందరో సమర్థులు, కొత్త నేతలు పోటీలోకి వస్తున్నారని చెప్పారు. గతంలో ఏనాడూ నామినేషన్ కూడా వేయని అట్టడుగు కులాలు, సామాజికవర్గాలు ఇప్పుడు బీఎల్ఎఫ్ ద్వారా ఎన్నికల్లోకి వస్తున్నారన్నారు. తాను ఎక్కడా పోటీ చేయడం లేదని.. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నవారు పోటీకి దూరంగా ఉండాలనే పార్టీ విధాన నిర్ణయాన్ని శిరసావహిస్తానని.. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. సాక్షి: రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? తమ్మినేని: ఇంత త్వరగా రావాల్సిన ఎన్నికలు కావివి. 9 నెలల ముందుగానే అసెంబ్లీని రద్దుచేయడం అప్రజాస్వామికం. అసెంబ్లీ రద్దుకు సీఎం కేసీఆర్ చెబుతున్న కారణాలు సహేతుకంగా లేవు. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నందుకే అసెంబ్లీని రద్దు చేశామనడం పిచ్చోళ్ల మాటల్లా ఉన్నాయి. పైకి కేసీఆర్ ఏ కారణం చెప్పినా, అసలు కారణం వేరు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను విడదీయడం వెనుక రాజకీయ కారణముంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ఎజెండా, ఒక పొత్తుతో ఎన్నికలకు వెళ్లడం.. లోక్సభ ఎన్నికల్లో మరో ఎజెండా, మరో పొత్తుతో వెళ్లాలనేది కేసీఆర్ ఎత్తుగడ. ఈ ఎన్నికల్లో ప్రధానంగా నాలుగు కూటమిల మధ్య పోటీ ఉంటుంది. అవి టీఆర్ఎస్, కాంగ్రెస్ కూటమి, బీజేపీ కూటమి అయితే నాలుగోది బహుజన లెఫ్ట్ ఫ్రంట్. ఆ మూడూ కూటములూ ఒక్కటే. ఆ పార్టీల ఎజెండా, ఆర్థిక విధానాలన్నీ ఒక్కటే. బీఎల్ఎఫ్ ఎజెండా ఏమిటి? బీఎల్ఎఫ్ ప్రధానంగా 7 అంశాల్లో ప్రత్యామ్నాయాలను ప్రతిపాదిస్తోంది. అన్నివర్గాలకు ఉచితంగా విద్యను అందించడం. వైద్యాన్ని కార్పొరేట్ రంగం చేతుల్లో లేకుండా చేసి, ప్రభుత్వమే పూర్తిగా ఉచిత వైద్యం అందించడం. దున్నే వారికే భూమి, ఉండటానికి ఇళ్లు ఇవ్వడం. నైపుణ్య స్థాయిని బట్టి ఉద్యోగం లేదా ఉపాధిని కల్పించడం. ఉద్యోగులకు జీతంపై భద్రత కల్పించడం. అన్ని రంగాల్లోనూ సామాజికన్యాయం అమలుచేయడం. ఈ ఏడు ముఖ్యమైన అంశాలు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఈ పాలకపార్టీల వైఖరితో బహుళజాతి కంపెనీలు, భూస్వాములు, ధనికుల చేతుల్లో ఇవన్నీ ఉన్నాయి, వీటిని ప్రజలకు అందుబాటులో ఉంచుతామని బీఎల్ఎఫ్ చెబుతోంది. ప్రత్యామ్నాయంగా మీరు చూపిస్తున్న మార్గాలేవీ? విద్య, వైద్యం వంటివాటిలో ప్రైవేటు పెట్టుబడులను క్రమంగా తగ్గించడం. ఆ తర్వాత కాలంలో పూర్తిగా ప్రైవేటు పెట్టుబడులు లేకుండా చేస్తాం. వీటిని ప్రజలకు ఉచితంగా అందిస్తాం. పారిశ్రామికరంగంలోనూ ప్రభుత్వ పెట్టుబడులను పెంచుతాం. స్థానికంగా లభ్యమయ్యే వనరులను బట్టి పరిశ్రమలను స్థాపిస్తాం. పత్తి పండుతున్న ప్రాంతంలో జిన్నింగ్ మిల్లు, గ్రానైట్, పసుపు, మిర్చి, వెదురు బొంగులు వంటి పరిశ్రమలకు అవకాశం ఉంటుంది. వ్యవసాయంలో రైతుల ఆత్మహత్యలను నివారించడానికి.. దోపిడీ చేస్తున్న దళారులపై ఉక్కుపాదం మోపే ౖధైర్యం, సాహసం ఆ పార్టీలకుందా? గిట్టుబాటు ధరలు ఇస్తామనేది బీఎల్ఎఫ్ ప్రతిపాదన. దళితులకు చట్టబద్ధ హక్కులు, అట్టడుగు వర్గాలకు, కులాలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఇవ్వాలని బీఎల్ఎఫ్ కోరుతోంది. అన్ని పార్టీలు సామాజికన్యాయం అంటున్నాయి కదా.... కులాలను ఆదుకోవడాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం సంకుచితంగా నిర్వచిస్తోంది. గొర్రెలు, బర్రెలు, చేప లు, పందిపిల్లలను ఇచ్చి కులాలకు ఏదో చేసినట్టుగా గొప్పలు చెప్పుకుంటున్నది. వృత్తులను కాపాడాల్సిందే. కానీ.. ఒక కులంలో పుట్టినవారంతా ఆ కుల వృత్తిలోనే తరాలు అన్నీ మగ్గిపోవాల్సిందేనా? అట్ట డుగు వర్గాల్లో పుట్టినవారు డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రజా ప్రతినిధులు, పెద్దపెద్ద పారిశ్రామికవేత్తలు కావాలి. అంతిమంగా కుల నిర్మూలన జరగాలి. ఇది సామాజిక న్యాయానికి అసలైన అర్థం. మా పార్టీ రిజర్వుడు స్థానాల్లోనే కాకుండా జనరల్ స్థానాల్లోనూ సంచార కులాలు, బీసీలు, ఎంబీసీలు, మైనారిటీలు, మహిళా అభ్యర్థులను ప్రకటించింది. టీఆర్ఎస్ ఇప్పటిదాకా కేవలం 20–25 సీట్లను ఇస్తే, కాంగ్రెస్ ఇంకా ప్రకటించలేదు. బీసీనే బీఎల్ఎఫ్ ద్వారా సీఎం అవుతారు. మహిళకు ఉప ముఖ్యమంత్రిగా అవకాశం వస్తుంది. బీఎల్ఎఫ్ ఏర్పాటు టీఆర్ఎస్కు లాభం చేయడానికేనన్న విమర్శలపై.. ఓట్ల చీలిక అనేది గతంలోనే జరిగిన చర్చ. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవద్దనే గతంలో కొన్ని పార్టీలతో కలిసి పనిచేసినం. పాలకపార్టీని ఓడించడానికి స్వంతంగా బలం సరిపోదని, మరో పాలకపార్టీతో కలిసి పనిచేసినం. టీఆర్ఎస్ దుష్టపాలనను అంతం చేయడానికి, కాంగ్రెస్ అనే పనికిమాలిన పార్టీతో కలవాలా? అందుకే ప్రత్యామ్నాయ విధానాలు, సామాజికన్యాయం, బహుజనవాదంతో ప్రజల ముందుకు వస్తున్నం. ప్రజలు అంగీకరిస్తారా..? అంగీకరించరా..? అనేది ప్రజల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. బీఎల్ఎఫ్లో సీపీఎంతోపాటు ఆర్ఎస్పీ, ఎంసీపీఐ వంటిపార్టీలు ఉన్నాయి, ఉమ్మడి గుర్తుకోసం బహుజన లెఫ్ట్ పార్టీ (బీఎల్పీ) పేరుతో రాజకీయపార్టీని రిజిష్టర్ చేశాము. నాగలి పట్టిన రైతు గుర్తు వచ్చింది. సీపీఎం అభ్యర్థులు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై పోటీచేస్తారు. బీఎల్ఎఫ్ అభ్యర్థులంతా నాగలి పట్టిన రైతు గుర్తుపై పోటీచేస్తారు. ప్రభుత్వంలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది? టీఆర్ఎస్తో ఉపయోగం లేదని ప్రజలు గుర్తించారు. ప్రత్యామ్నాయంగా కనిపించిన మహాకూటమి ఆ బలాన్ని సంతరించుకోలేదు. బీజేపీ చాలా దూరంలో ఉంది. ఈ పరిస్థితుల్లో బీఎల్ఎఫ్ సాధించే సీట్లు కీలకం అవుతాయి. కచ్చితంగా రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ తప్పదు. ఈ హంగ్లో బీఎల్ఎఫ్ సాధించే సీట్లతో ప్రభుత్వంలో భాగం అవుతాం. బీఎల్ఎఫ్ ఎజెండాను అమలు చేసుకుంటాం. ఇప్పటికిప్పుడే పూర్తిగా బలాన్ని సాధిస్తామని చెప్పలేం. ఏ రోజుకైనా మా ప్రత్యామ్నాయ ఆర్థికవిధానాలు, ఎజెండాను ప్రజలు గుర్తిస్తారు. మీ బలం సరిపోతుందా.? స్వంత ఎజెండాతో ప్రజల ముందుకు వస్తున్నాం. తాత్కాలిక అవసరాలకోసం దీర్ఘకాల ప్రయోజనాలను తాకట్టు పెట్టవద్దనే నిర్ణయానికి వచ్చినం. కొన్ని ఓట్లు, కొన్ని సీట్లకు ఎందుకు పరిమితం కావాలి? పాలకపార్టీలతో జత కట్టడం వల్ల కమ్యూనిస్టులపై నమ్మకం సన్నగిల్లుతోంది. కమ్యూనిస్టులకు ఓట్లేసి గెలిపించినా ఏదో ఒక పార్టీ అనే రైలు ఇంజనుకు బోగీని తగిలిస్తారనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది. 2014లో సీపీఎం బలం చాలా తక్కువ. అన్ని వర్గాల్లో చేసిన పోరాటంతో సీపీఎం బలం చాలా పెరిగింది. కేసీఆర్కు వ్యతిరేకంగా కాంగ్రెస్పార్టీ నేతలు కూడా మాట్లాడటానికి భయపడిన రోజుల్లోనే సీపీఎం ధైర్యంగా పోరాటాలు చేసింది. టీఆర్ఎస్ పాలన తీరు ఎలా ఉంది? టీఆర్ఎస్ అన్ని రంగాల్లో విఫలమైంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. నీళ్లు, నిధులు, నియామకాలైన ఉద్యమ నినాదాలేమీ సాధించలేదు. ఆ నినాదాలు వట్టి నినాదాలుగానే మిగిలిపోయాయి, బంగారు తెలంగాణ పేరు చెప్పి కేసీఆర్ కుటుంబాన్ని బంగారు కుటుంబాన్ని చేసుకున్నారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలు, రైతులు అలాగే ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ విధానాలతో టీఆర్ఎస్లో అంతర్గత కలహాలు సహజం. ఆ పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేలే కాకుండా కుటుంబంలోనూ అంతర్గత కలహాలున్నాయనే వార్తలు చూస్తున్నాం. హోంమంత్రే తన అసంతృప్తిని బహిరంగంగా వెల్లడించే పరిస్థితి వచ్చింది. సీపీఐని కలుపుకోలేకపోవడంపై.. వామపక్షాలుగా ఐక్యంగా ఉండటం కంటే కాంగ్రెస్పార్టీతో కలవడానికే సీపీఐ ప్రాధాన్యతను ఇచ్చింది. గతంలో కాంగ్రెస్ పాలనను చూశాం. కుంభకోణాలు, ముఠా తగాదాలు, అవినీతి, ప్రజా వ్యతిరేక ఆర్థికవిధానాలు అమలు వంటివన్నీ అనుభవంలోనే ఉన్నాయి. కాంగ్రెస్ను ఓడించేందుకు టీడీపీతో.. ఆ తర్వాత టీడీపీని ఓడించేందుకు కాంగ్రెస్తో కలిసి పనిచేశాం. టీఆర్ఎస్ను ఓడించేందుకు ఇప్పుడు కాంగ్రెస్తో.. మరో నాలుగేళ్ల తర్వా త కాంగ్రెస్ను ఓడించడానికి టీఆర్ఎస్తో జతకట్టాలా? ఇలాం టి ప్రయోగాలు సరైనవి కావు. ఒకరిని ఓడించడానికో, మరొకరిని గెలిపించడానికో కమ్యూనిస్టులు పరిమితం కావాలా? పొత్తులు ఇంకా పూర్తికాకున్నా ఇప్పటికే సీపీఐకి కొంత అర్థమైనట్టుంది. కాంగ్రెస్తో తెగతెంపులు చేసుకుంటే బీఎల్ఎఫ్లోకి సీపీఐ, టీజేఎస్లను ఆహ్వానిస్తాం. -
మొదటి నుంచి కేసీఆర్ వ్యతిరేకిని: తమ్మినేని
సాక్షి, యాదాద్రి: టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం కేసీఆర్ను, ఆయన అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ వస్తున్నానని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కొంగరకలాన్లో జరిగిన ప్రగతి నివేదన సభ అనంతరం టీఆర్ఎస్ పార్టీ ప్రచారం ఊపు తగ్గిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించేంత వరకే జోష్ కనిపిస్తుందని, ఆ తర్వాత వారి ప్రచారం ఊపు కూడా తగ్గిపోతుందన్నారు. బీఎల్ఎఫ్ ప్రమేయం లేకుండా ప్రభుత్వం ఉండదని, సీపీఐ మాతో కలిసి రాకపోవడం దురదృష్టకరమన్నారు. మహాకూటమి భ్రమలో సీపీఐ, జేఏసీ ఎందుకు ఉన్నారో వారికే తెలియడం లేదన్నారు. బహుజనులకు రాజ్యాధికారాన్ని సాధించిపెట్టే లక్ష్యంతో రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో బీసీలకు 65 సీట్లను ప్రకటించిన ఏకైక కూటమి బీఎల్ఎఫ్, సీపీఎం కూటమినేనని పేర్కొన్నారు. -
27 మందితో బీఎల్ఎఫ్ తొలి జాబితా
సాక్షి, హైదరాబాద్: బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) అభ్యర్థుల తొలి జాబితాను 27 మందితో విడుద ల చేసింది. బీఎల్ఎఫ్ కన్వీనర్ తమ్మినేని వీరభద్రం, చైర్మన్ నల్లా సూర్యప్రకాశ్ ఈ జాబితాను గురువారం విడుదల చేశారు. బీఎల్ఎఫ్ ప్రకటించిన 27 మంది లో ఎస్సీ స్థానాలు 7, ఎస్టీ స్థానాలు 3, జనరల్ స్థానా లు 17 ఉన్నాయి. ఇందులో 9 మంది సీపీఎం అభ్యర్థులు, 14 మంది బహుజన లెఫ్ట్ పార్టీ అభ్యర్థులు, మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండి యా (ఎంసీపీఐ) అభ్యర్థులు ముగ్గురు, తెలంగాణ బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) నుంచి శ్రీనివాస్ బహద్దూర్ను నాగర్కర్నూల్ అభ్యర్థిగా ప్రకటించారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు.. సీపీఎం అభ్యర్థులు.. తొడసం భీమ్రావు (ఖానాపూర్), మర్రి వెంకటస్వామి (మానకొండూరు), ఎ.మల్లేశ్ (నర్సాపూర్), జూలకంటి రంగారెడ్డి (మిర్యాలగూడ), శేఖర్రావు (హూజూర్నగర్), బుర్రి శ్రీరాములు (కోదాడ), డాక్టర్ మిడియం బాబూరావు (భద్రాచలం), భూక్యా వీరభద్రం (వైరా), మాచర్ల భారతి (సత్తుపల్లి) బహుజన లెఫ్ట్ పార్టీ అభ్యర్థులు.. కోట వెంకన్న (సిర్పూరు), కనకం వంశీ (చొప్పదండి), ఫసీమొద్దీన్ (కరీంనగర్), పి.జయలక్ష్మి (ఆంధోల్), గుజ్జ రమేశ్ (మేడ్చల్), రాఘవేంద్రస్వామి గౌడ్ (రాజేంద్రనగర్), జయరాములు (దేవరకద్ర), వెంకటేశ్వర్లు (కొడంగల్), జింకల కృష్ణయ్య (వనపర్తి), రంజిత్కుమార్ (గద్వాల), రాపర్తి శ్రీనివాస్గౌడ్ (సూర్యాపేట), సిద్దం రాము (వరంగల్ తూర్పు), వసపాక నర్సింహ (వర్ధన్నపేట), కోట రాంబాబు (మధిర) ఎంసీపీఐ అభ్యర్థులు.. సబ్బని కృష్ణ (బెల్లంపల్లి), తాండ్ర కుమార్ (శేరిలింగంపల్లి), మద్దికాయల అశోక్ (నర్సంపేట) -
వామపక్షాలపై నమ్మకం పోయింది: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: ప్రధాన పార్టీలతో పొత్తులు పెట్టుకోవడంతో కమ్యూనిస్టు ఉద్యమం బలహీనపడిందని దీంతో వామపక్షాలపై ప్రజలకు నమ్మకం పోయిం దని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్, కాంగ్రెస్ విధానాలు ఒకటేనని అందుకే బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్)గా ప్రజల ముందుకు సీపీఎం వచ్చిందన్నారు. రానున్న ఎన్నికల్లో సీపీఎం 20 నుంచి 25 స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు. మిగతా స్థానాల్లో బీఎల్ఎఫ్ అభ్య ర్థులు పోటీలో ఉంటారన్నారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో 14 కులదురహంకార హత్యలు జరిగాయని, ఈ హత్యలను టీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఈ కులదురహం కార హత్యలపై ఆపద్ధర్మ సీఎం కేసీఆర్తోపాటు మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, నాయిని ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. ఈ హత్యలకు నిరసనగా ఈ నెల 24న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. ప్రణయ్ హత్య లో ఆరోపణలెదుర్కొంటున్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఇతర రాజకీయనేతల పాత్రపై విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 24న 20నుంచి 25 మందితో బీఎల్ఎఫ్ మొదటి జాబితాను ప్రకటిస్తామన్నారు. -
అమృతను చట్టసభలకు పంపాలి
మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్ భార్య అమృతను ఏకగ్రీవంగా చట్టసభలకు పంపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీ.మాస్ చైర్మన్ కంచె ఐలయ్య ప్రతిపాదించారు. మంగళవారం మిర్యాలగూడలో ప్రణయ్ నివాసంలో చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రణయ్ భార్య అమృత, తల్లిదండ్రులను పరామర్శించారు. కుల దురహంకారానికి ప్రణయ్ బలయ్యాడని, ఈ హత్యకు బాధ్యులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. అమృతను చట్టసభలకు పంపాలన్నారు. సీపీఎం, బీఎల్ఎఫ్ తరఫున మిర్యాలగూడ శాసనసభ నుంచి ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. దీనికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఇంత పెద్ద సంఘటన జరిగితే సీఎం కనీసం ప్రకటన కూడా చేయలేదని, హోంమంత్రి నాయిని, కేటీఆర్, జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి పరామర్శించడానికి రాలేదని ఆరోపించారు. ఈ హత్యలో ఆరోపణలెదుర్కొంటున్న కాంగ్రెస్ నేతలను పార్టీని సస్పెండ్ చేస్తున్నట్లు జానారెడ్డి ప్రకటించారని, కానీ నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశంను ఎందుకు సస్పెండ్ చేయలేదన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారి రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. వారి వెంట మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఇతరపార్టీ నేతలు మజీదుల్లాఖాన్, జాన్వెస్లీ, తదితరులు ఉన్నారు. మారుతీరావును ఎన్కౌంటర్ చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ ఢిల్లీలో డిమాండ్ చేశారు. -
ఎర్రజెండాకు ఒక్క అవకాశం ఇవ్వండి
-
60 మంది బీసీలకు టికెట్లు: తమ్మినేని
సాక్షి, కామారెడ్డి: ముందస్తు ఎన్నికలకు సీపీఎం సిద్ధంగా ఉందని, ఇప్పటికే 25 మంది అభ్యర్థుల పేర్లను పరిశీలించి అందులో 10 మంది పేర్లు ఖరారు చేశామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. కామారెడ్డిలో ఆదివారం ప్రారం భమైన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు సోమవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కేంద్ర కమిటీ ఆమోదం తరువాత అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. సీపీఎం ఆధ్వర్యంలో బీఎల్ఎఫ్ రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు. సీపీఎం 20 నుంచి 25 స్థానాల్లో పోటీ చేస్తుందని, మిగతా స్థానాల్లో బీఎల్ఎఫ్ భాగస్వామ్య పక్షాల అభ్యర్థులు పోటీ చేస్తారన్నారు. 60 మంది బీసీలను బరిలో నిలుపుతామని తెలిపారు. రాష్ట్రంలో కలసి పనిచేయడానికి జనసేన అధినేత పవన్కల్యాణ్తో చర్చించామన్నారు. బీసీల తరఫున పోరాడుతున్న ఆర్.కృష్ణయ్యతోనూ చర్చిస్తామన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీతోనూ చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్తో కలవబోం.. కాంగ్రెస్ కూటమిలో సీపీఎం చేరబోదని తమ్మినేని స్పష్టం చేశారు. దేశాన్ని భ్రష్టుపట్టించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్రజాస్వామిక పాలన సాగించిందని, అందుకే తాము ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో, అణచివేత విధానాలతో పాలన సాగిస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా రాకుండా చూస్తామని పేర్కొన్నారు. ఎర్రజెండాకు ఒక్క అవకాశం ఇవ్వండి కామారెడ్డి టౌన్: కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ల పాలనతో ఏ మార్పూ రాలేదని, ఒక్కసారి ఎర్రజెండా పార్టీ (బీఎల్ఎఫ్)కి రాజ్యాధికారం ఇవ్వాలని తమ్మి నేని కోరారు. తమకు అధికారం అప్పగిస్తే సమగ్రాభి వృద్ధి సాధిస్తామన్నారు. కామారెడ్డిలో పార్టీ రాష్ట్ర వర్గ సమావేశాలు ముగింపు సందర్భంగా సోమవారం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. -
కేసీఆర్ను ఇంటికి పంపాలి: తమ్మినేని
హైదరాబాద్: ఓటమి భయంతోనే కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు బయలుదేరారని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని వీరభద్రం ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ను ఇంటికి పంపించి తెలంగాణలో బహుజనులం రాజ్యాధికారాన్ని దక్కించుకుందామని పిలుపునిచ్చారు. ఆదివారం భోలక్పూర్ డివిజన్లో ‘బహుజనులకు రాజ్యాధికారం’అనే అంశంపై బీఎల్ఎఫ్ ముషీరాబాద్ నియోజకవర్గ కన్వీనర్ దశరథ్ అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. తమ్మినేని మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే బతుకులు మారుతాయన్నారని.. కానీ కేసీఆర్ కుటుంబ బతుకులు మాత్రమే మారాయని ఎద్దేవా చేశారు. అటు బీజేపీతో, ఇటు ఎంఐఎంతో కేసీఆర్ దోస్తీ కడుతున్నారని, ఇలాంటి ద్వంద్వ రాజకీయాలను ఎండగట్టాలని కోరారు. ఎన్నికల్లో అన్ని స్థానాలకు బీఎల్ఎఫ్ పోటీ చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో దళిత సేన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు రాజు, బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ ఉల్లా ఖాన్, నల్లా సూర్యనారాయణ, నర్సింహారావు, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
119 స్థానాల్లో పోటీ
కరీంనగర్: బహుజన లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్ఎఫ్) రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కన్వీ నర్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. కరీంనగర్లో గురువారం ఆయన మాట్లాడారు. కేసీఆర్పై బీఎల్ఎఫ్ నుంచి ప్రజాగాయకుడు గద్దర్ను బరిలో దింపు తామన్నారు. శాసనసభను రద్దు చేస్తూ.. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం సరికాదన్నారు. ఈ ఎన్నికల్లో 60 అసెంబ్లీ స్థానాలు బీసీలకు అప్పగిస్తామని వెల్లడించారు. కాంగ్రెస్తో జట్టు కడతామనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంతో చర్చలు ఉంటాయని, వారం రోజుల్లో స్పష్టత రానుందని ఆయన వివరించారు. -
ఎస్సీ,ఎస్టీలకు కేసీఆర్ చేసిందేం లేదు
-
ముందస్తుపై నమ్మకంలేదు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల పేరిట హడావుడి, ఆర్భాటం తప్ప ముందస్తుగా ఎన్నికలు జరుగుతాయనే విశ్వాసం తమకు లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయమైన మఖ్దూంభవన్లో ఇరుపార్టీల నేతలు గురువారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల హడావుడి, టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు వ్యూహాలు, ఇరుపార్టీల మధ్య పొత్తులు, వామపక్ష ప్రజాతంత్ర కూటమి వంటివాటిపై చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలు దగ్గరపడిన ఈ సమయంలో టీఆర్ఎస్ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే సీఎం కేసీఆర్ ఆర్భాటం చేస్తున్నారని, ఇది ప్రజల దృష్టిని మళ్లించే కుట్ర అని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ మధ్య పొత్తుల గురించి చర్చించినట్టు వారు వెల్లడించారు. పొత్తుల్లో సీట్లు నిర్ణయించుకోవడానికి మరికొంత సమయం పట్టొచ్చునని చెప్పారు. టీఆర్ఎస్ను ఎదుర్కోవాలంటే వామపక్ష ప్రజాతంత్ర శక్తులు ఏకం కావాలన్నారు. సెప్టెంబర్ 2న జనసేనతో సీపీఎం చర్చలు భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యలపై చర్చించేందుకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ, సీపీఎం ప్రతినిధి వర్గం సెప్టెంబర్ 2న జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశమవుతాయని గురువారం సీపీఎం ఒక ప్రకటనలో తెలిపింది. -
అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి
సాక్షి, జనగామ: రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయ శక్తిగా బహుజన లెప్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్)ను నిర్మించనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర కన్వీనర్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బీఎల్ఎఫ్ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించారు. జనగామ జిల్లా కేంద్రం, రఘునాథపల్లిలో పలువురు తమ్మినేని సమక్షంలో మంగళవారం బీఎల్ఎఫ్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో 65 మంది బీసీలకు టికెట్లు ఇస్తామని ప్రకటించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీలు ఒకేతాను ముక్క లని చెప్పారు. పాలకులు మారుతు న్నారే తప్ప విధానాలు మారడం లేదన్నారు. నేటికీ ప్రజల బతుకుల్లో మార్పు రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం.. సమగ్రాభివృద్ధి పేరుతో లాల్, నీల్ జెండాలను ఏకం చేస్తున్నామని పేర్కొన్నారు. బీఎల్ఎఫ్ అధికారంలోకి వస్తే విద్య, వైద్యాన్ని ప్రభుత్వమే అందించే బాధ్యతను తీసుకుంటుందని చెప్పారు. మార్కెట్లలో ఉన్న దళారీ దోపిడీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి రైతులకు మద్ధతు ధరను చెల్లిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ. ఐదుకే భోజనం పథకాన్ని అమలు చేస్తామని, ఆడపిల్లల కోసం ‘చదువుల సావిత్రి’ పథకాన్ని ప్రారంభిస్తామని వివరించారు. పొత్తు కోసం టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, జనసేన అధినేత పవన్ కల్యాణ్, సీపీఐతో సంప్రదింపులు జరుపుతున్నామని తమ్మినేని పేర్కొన్నారు. -
ముందస్తు ఎన్నికలకు పోవాల్సిన అవసరమేముంది?
-
‘ముందస్తు అవసరమేముంది?’
సాక్షి, కామారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వార్త జోరందుకుంది. ఇప్పటికే వివిధ పార్టీలు ముందస్తు ఎన్నికలకు సమయాత్తమవుతుండగా.. మరికొన్ని పార్టీలు విభేదిస్తున్నాయి. తాజాగా ముందస్తు ఎన్నికలపై సీపీఎం పార్టీ స్పందించింది. ముందస్తు ఎన్నికలకు పోవాల్సిన అవసరమేముందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో బీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికలకు పోవడమంటే ప్రజాధనం దుర్వినియోగం చేయడమేనని అభిప్రాయపడ్డారు. దీనిపై ప్రజలకు సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. ముందస్తు ఎన్నికలు జరిగితే లోక్సభ, శాసనసభ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలన పిచ్చోడి చేతిలో రాయి లాంటిదని విమర్శించారు. తెలంగాణలో సామాజిక న్యాయమంటే గొర్రెలు, బర్రెలు పంపిణీ చేయడమేనా? వారికి అధికారం వద్దా? అని తమ్మినేని ప్రశ్నించారు. -
‘మెడికల్ అడ్మిషన్లలో సామాజికన్యాయమేదీ’
సాక్షి, హైదరాబాద్: మెడికల్, ఇంజనీరింగ్ తదితర వృత్తివిద్యా కోర్సుల్లో చట్టబద్ధమైన రిజర్వేషన్లు అమలుచేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. సామాజికవర్గాల వారీగా రిజర్వేషన్లను అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం కేసీఆర్కు గురువారం ఆయన లేఖ రాశారు. వృత్తి విద్యాకోర్సుల్లో రిజర్వేషన్లను అమలుచేయడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన జీవో 550 అమలుపై హైకోర్టు స్టే ఇచ్చిందని తెలిపారు. దీనివల్ల మెరిట్ ఆధారంగా ఓపెన్ కోటాలో సీట్లు పొందగలిగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఆ అవకాశాన్ని కోల్పోతున్నారన్నారు. ఓపెన్ కేటగిరిలో పోటీపడే సామర్థ్యమున్న విద్యార్థులకూ రిజర్వేషన్ కోటాలోనే సీట్లు ఇస్తున్నారని, ఈ అన్యాయాన్ని సరిదిద్దడంలో ప్రభుత్వం తగిన శ్రద్ధను చూపడంలేదని ఆరోపించారు. ఇప్పటికైనా సామాజికన్యాయాన్ని పరిరక్షించే విధంగా సుప్రీంకోర్టులో వాదనలు చేయాలని తమ్మినేని కోరారు. -
పంచాయతీ కార్మికులకు బెదిరింపులా?: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: న్యాయమైన డిమాండ్లకోసం సమ్మె చేస్తున్న గ్రామ పంచాయతీ ఉద్యోగుల జేఏసీతో చర్చలు జరపకుండా భయభ్రాంతులకు గురిచేయడం ప్రభుత్వానికి మంచిదికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించకుండా ఉద్యోగాల నుంచి తొలగిస్తామని నోటీసులు జారీచేయడాన్ని ఖండించారు. ఇలాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు పూనుకోకుండా, వారి న్యాయమైన కోరికలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి మూడేళ్ల క్రితమే హామీ ఇచ్చిన ప్రభుత్వం, వాటి అమలుకు చర్యలు తీసుకోకుండా సమ్మెను అణిచివేయాలని ప్రయత్నించడం అప్రజాస్వామికమని విమర్శించారు. -
వ్యభిచార దందాలపై చర్యలు తీసుకోండి: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాల్లో జరుగుతున్న వ్యభిచార దందా, అకృత్యాలపై సమగ్ర విచారణ జరపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. వీటికి కారణమైన దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం కేసీఆర్కు బుధవారం ఆయన లేఖ రాశారు. యాదాద్రిలో వెలుగుచూస్తున్న విషయాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయని.. చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి, చిత్రహింసలు పెట్టి, వ్యభిచార కేంద్రాలకు అమ్మడం, వారికి పశువులకు వాడే ఇంజెక్షన్లు ఇవ్వడం చాలా దారుణమని పేర్కొన్నారు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే పోలీసులు, ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. యాదగిరిగుట్టలో సుమారు 100కు పైగా కుటుంబాలు వ్యభిచార వృత్తిలో ఉన్నాయని వెల్లడించారు. వ్యభిచార గృహాల నిర్వాహకులకు రాజకీయ నేతల అండదండలుండటం, పోలీసులకు ప్రతీ నెలా మామూళ్లు అందుతుండటంతోనే ఈ అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయని తమ్మినేని ఆరోపించారు. -
గెలిస్తే బీసీ అభ్యర్థిని సీఎం చేస్తాం: తమ్మినేని
మహేశ్వరం: రాష్ట్రంలో బీఎల్ఎఫ్ (బహుజన లెఫ్ట్ ప్రంట్) అధికారంలోకి వస్తే బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని వీరభద్రం అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి అగ్రకులాల్లోని ధనవంతులే దేశాన్ని పాలించారని, 93 శాతం ఉన్న బహుజన వర్గం నుంచి ముఖ్యమంత్రిని చేసి చూపుతామన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని తుక్కుగూడలో బీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో తెలంగాణలో బహుజన ప్రభుత్వం వివిధ పార్టీల వైఖరి పాత్ర అనే అంశంపై ఆదివారం సదస్సు జరిగిం ది. సదస్సులో తమ్మినేని మాట్లాడుతూ.. బీఎల్ఎఫ్ ప్రభుత్వం అన్ని గ్రామాల్లో బహుజన భోజనశాల పెట్టి రూ.5కే పేదలకు భోజనం పెడుతుందని తెలిపారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైం దన్నారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కులా లు, మతాల పేరుతో విభజించి నియంత పాలన సాగిస్తున్నాయని మండిపడ్డారు. కార్యక్రమంలో టీమాస్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు జేబి రాజు, రాష్ట్ర నాయకుడు భూపాల్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ కమిటీ సభ్యుడు అలువాల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆగస్టు 9న బంద్కు సీపీఎం మద్దతు: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగార్చే చర్యలకు వ్యతిరేకంగా భారత్ అంబేడ్కర్ మహాసభ పిలుపిచ్చిన ఆగస్టు 9న బంద్కు సీపీఎం మద్దతు ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఓ ప్రకటనలో తెలిపారు. 70 ఏళ్ల స్వాతంత్య్రానంతరం కూడా కుల వివక్ష, అంటరానితనం యథేచ్ఛగా కొనసాగటం సభ్య సమాజానికి మాయని మచ్చగా ఉందన్నారు. దేశవ్యాప్త నిరసనల తర్వాత కేంద్రం ఆలస్యంగా ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగార్చడంపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసిందన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో గోరక్షక దళాల ముసుగులో అరాచక శక్తుల దాడులు, దళితులపై దౌర్జన్యాలు పెరిగిపోయాయన్నారు. దళిత సమస్యలపై జరుగుతున్న బంద్కు సీపీఎం సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. -
సామాజిక ఐక్యతను దెబ్బతీసే కుట్ర
హైదరాబాద్: తెలంగాణలో బహుజన ప్రభుత్వం వస్తుందని, ఇప్పుడు ఏర్పడకుంటే అది నినాదంగానే మిగులుతుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. దేశంలో మతోన్మాదాన్ని పెంచి సామాజిక ఐక్యతను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. దేశభక్తి పేరుతో దళితులు, మైనార్టీ లు, రాజ్యాంగ సంస్థల మీద దాడులు చేసి ఆ సంస్థల్లో ఆర్ఎస్ఎస్ వాళ్లను నింపి దేశచరిత్ర, ప్రజాస్వామ్య పునాదులను పెకిలించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) ఆధ్వర్యంలో ఎన్నికల సంస్కరణల ఆవశ్యకత– బహుజన ప్రభుత్వం ఓటర్ పాత్ర అనే అంశంపై ఆదివారం జరిగిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపీని గద్దె దించకపోతే దేశ భవిష్యత్ దెబ్బతింటుందన్నారు. ప్రజాస్వామ్య హక్కులను బీజేపీ కాలరాస్తోందన్నారు. బహుజనులకు రాజ్యాధికారం వచ్చినప్పుడే వెనుకబాటుతనం పోతుందన్నారు. బీజేపీకి అనుకూలంగా ఓటుపడేలా ఈవీఎంల తయారీలో కుంభకోణం జరిగిందని ఆరోపించారు. వేలాది ఎకరాలు ఆక్రమణ: తమ్మినేని ఎర్ర జెండాల ఐక్యతకు బీఎల్ఎఫ్ కట్టుబడి ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నా రు. హైదరాబాద్లో వేలాది ఎకరాల భూములు ఆక్ర మణకు గురయ్యాయని విమర్శించారు. బీఎల్ఎఫ్ రాష్ట్ర చైర్మన్ నల్ల సూర్యప్రకాశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కంచ ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. -
’మోదీకి కేసీఆర్ తలొగ్గారు’
సాక్షి, సూర్యాపేట: ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయంగా తలొగ్గారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. బయ్యారం ప్రాజెక్టును కేంద్రమే నిర్మించాలి.. ఇదే విభజన చట్టంలో స్పష్టంగా ఉందన్నారు. పంచాయితీ ఎన్నికలు తక్షణమే నిర్వహించాలని తెలిపారు. కేంద్రం రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ సిద్దమేనని స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్లకు సమాన దూరంలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఉందన్నారు. రాష్ట్రంలో సామాజిక శక్తులు వామపక్ష పార్టీలుతో పొత్తుకు సిద్ధమని.. ఆ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని వీరభద్రం తెలిపారు. -
‘కోదండరాం పార్టీతో పొత్తుకు చర్చలు’
సాక్షి, కరీంనగర్ : తెలంగాణ జేఏసీ మాజీ చైర్మన్ కోదండరాం ఆధ్యర్యంలో ఏర్పడిన తెలంగాణ సమితి పార్టీతో పొత్తుపై చర్చలు జరుగుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. సోమవారం ముకుంద లాల్ భవన్లో జరిగిన పార్లమెంటు స్థాయి సమావేశానికి తమ్మినేని, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబు హాజరైయ్యారు. ఈ సమావేశంలో కరీంనగర్ సమస్యలతో పాటు బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థి ఎంపికపై కూడా చర్చ జరిపారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ 119 స్థానాల్లో పోటిచేయనున్నట్టు తెలిపారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామిలలో ఏ ఒక్కటి అమలు కాలేదన్నారు. ఇక బంగారు తెలంగాణ చేసే అవకాశం లేదని ఎద్దేవా చేశారు. 2019లో టీఆర్ఎస్ను ఓడించడమే తమ లక్ష్యం అని స్పష్టం చేశారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజల బతుకులు మార్చడానికి ఏ మాత్రం కృషి చేయలేదని, కాంగ్రెస్తో కూడా పొత్తు పెట్టుకోమని తెలిపారు. ప్రజలను పరిపాలించే పద్దతులను మార్చే పార్టీలను ఎన్నుకోవాలని ప్రజలను కోరారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పరం చేయాలని నీతి ఆయోగ్ నిర్ణయించిందని ఆరోపించారు. రైతు బంధు పథకంపై స్పందిస్తూ.. కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వకుండా ద్రోహం చేశారని మండిపడ్డారు. వ్యవసాయం చేసేవారికే పెట్టుబడి సాయం అందించాలన్నారు. రైతు బంధు పథకాన్ని భూస్వాముల పథకంగా అభివర్ణించారు. పథకాన్ని సవరించి కౌలు, పోడు రైతులకు సాయం అందించాలని కోరారు. వనరుల ఆధారంగా పరిశ్రమలను ఏర్పాటు చేయాలని, తద్వార నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రం కాదని కేవలం ప్రభుత్వమే ధనికమని అన్నారు. -
టీఆర్ఎస్తో పొత్తుండదు
సాక్షి, హైదరాబాద్: రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోబోమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్ఎస్తో కలసి పనిచేసే ప్రసక్తే లేదన్నారు. అలాగని టీఆర్ఎస్ను గద్దె దింపేందుకు కాంగ్రెస్తో జతకట్టేందుకు కూడా తాము సిద్ధంగా లేమని ఆయన చెప్పారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) పేరుతోనే రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలు, 17 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. సీపీఎం 22వ జాతీయ మహాసభల సందర్భంగా ఆదివారం సరూర్నగర్ స్టేడియంలో జరిగిన బహిరంగసభలో తమ్మినేని ప్రసంగించారు. తెలంగాణ ఏర్పాటైతే తమ బతుకులు మారుతాయని ఆశపడ్డ ప్రజలకు నిరాశే మిగిలిందన్నారు. ‘కూలీల బతుకులు మారలేదు. రైతుల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి. అలాంటప్పు డు తెలంగాణ వచ్చి ఏం లాభం?’అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల బతుకులు మారకపోగా కనీస ప్రజాస్వామ్యం కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాచౌక్ ఎత్తివేసి ప్రజల గొంతు నొక్కుతున్నారని.. రాష్ట్రంలో పోలీసు రాజ్యం, కుటుంబ పాలన సాగుతోందని విమర్శించారు. దళిత, గిరిజనులకు మూడెకరాల ఇస్తామని చెప్పి ఇవ్వకపోగా.. గిరిజనుల పోడు భూములను సైతం లాగేసుకుంటున్నారని ఆరోపించారు. అందుకే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని తాము నిర్ణయించుకున్నట్టు తమ్మినేని చెప్పారు. టీఆర్ఎస్ను గద్దె దింపి కాంగ్రెస్ను కూర్చోబెట్టాలని తాము కోరుకోవడం లేదన్నారు. ‘ఒక దెయ్యాన్ని దింపి ఇంకో దెయ్యాన్ని నెత్తిన కూర్చోబెట్టుకోవాలని మేం భావించడం లేదు. అన్ని దెయ్యాలను పాతిపెట్టాలని కోరుకుంటున్నాం. బీఎల్ఎఫ్ పక్షాన ఈసారి అధికారం మాకివ్వాలని ప్రజలను అడగాలని నిర్ణయించుకున్నాం. ఇదే విధానంతో ముందుకెళ్తాం’అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ప్రజారాజ్యం కచ్చితంగా సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఏదో సాధించాలని బీజేపీ, కొన్ని మతోన్మాద శక్తులు భావిస్తున్నాయని.. ఎర్రజెండా ఉన్నంతవరకు ఈ రాష్ట్రంలో కాషాయాన్ని ఎదగనిచ్చేది లేదన్నారు. భవిష్యత్లో జరిగే ప్రజా ఉద్యమాల్లో తెలంగాణ ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొని మద్దతివ్వాలని తమ్మినేని పిలుపునిచ్చారు. -
నేటి నుంచి సీపీఎం జాతీయ మహాసభలు
-
నేటి నుంచే ‘ఎర్ర పండుగ’
సాక్షి, హైదరాబాద్ : భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) 22వ జాతీయ మహాసభలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ ఆర్టీసీ కల్యాణ మండలం వేదికగా జరిగే ఈ ఐదు రోజుల సభల్లో పార్టీ పటిష్టత, రాజకీయ విధానాలపై చర్చించి భావి కార్యాచరణ రూపొందించనున్నారు. సీపీఎం రాజకీయ పంథాపైనా నిర్ణయం తీసుకుంటారు. పశ్చిమబెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో తాము అధికారం కోల్పోవడం, ప్రాంతీయ పార్టీలతో సంబంధాలు, ఫెడరల్ ఫ్రంట్ తదితరాలపైనా చర్చ జరగనుంది. పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, అగ్రనేతలు ప్రకాశ్కారత్, మాణిక్ సర్కార్, కేరళ సీఎం పినరయి విజయన్, రాష్ట్రం నుంచి 35 మందితో సహా 846 మంది ప్రతినిధులు సభల్లో పాల్గొంటారు. షెడ్యూల్ ఇదే.... వరుసగా రెండోసారి తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న సీపీఎం జాతీయ మహాసభలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బుధవారం ఉదయం పదింటికి ఆర్టీసీ కల్యాణమండపంలో ‘మహ్మద్ అమీన్ నగర్’ప్రాంగణంలో పార్టీ పతాకావిష్కరణతో సభలు ప్రారంభమవుతాయి. తర్వాత ఏచూరి సందేశం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్,) ఫార్వర్డ్బ్లాక్, ఆర్ఎస్పీ, ఎస్యూసీఐ (సీ) నేతల సౌహార్ద సందేశాలు, కార్యదర్శి నివేదిక ఉంటాయి. 19, 20, 21 తేదీల్లో ప్రతినిధుల సభలో పార్టీ రాజకీయ విధానంతో పాటు తీర్మానాలపై చర్చిస్తారు. 22న కొత్త కమిటీని ఎన్నుకుంటారు. అదే రోజు మలక్పేట టీవీ టవర్ నుంచి సభ జరిగే సరూర్నగర్ స్టేడియం దాకా 20 వేల మంది రెడ్షర్ట్ వలంటీర్లతో కవాతు జరుగుతుంది. సభకు జాతీయ నేతలు హాజరవుతారు. సభలు జరిగే ఆర్టీసీ కల్యాణమండపం పరిసరాలు ఎర్రజెండాలు, తోరణాలు, పోస్టర్లతో ఇప్పటికే ఎరుపెక్కాయి. తెలంగాణ సంస్కృతి, సాయుధ పోరాటం తదితరాలు ప్రతిబింబించే కళారూపాలనూ ఏర్పాటు చేశారు. మహాసభల్లో 25 అంశాలపై తీర్మానాలుంటాయని పార్టీ వర్గాలంటున్నాయి. మంగళవారం పార్టీ పొలిట్బ్యూరో, కేంద్ర కమిటీ సమావేశమై మహాసభల ఎజెండాను ఆమోదించాయి. రాజకీయ, నిర్మాణ నివేదికలపై చర్చిస్తాం ‘‘పార్టీ జాతీయ మహాసభల్లో రాజకీయ తీర్మానం, రాజకీయ, నిర్మాణ నివేదికలపై చర్చ జరుగుతాయి. బీజేపీని ఓడించడమే మా ప్రధాన లక్ష్యం. కాంగ్రెస్తో పొత్తు, అవగాహన ఉండవు. తెలంగాణలో బీఎల్ఎఫ్ బలోపేతంపై చర్చిస్తాం. మహాసభలకు సర్వం సిద్ధం చేశాం.’ – సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం -
‘మాటల్లో కాదు.. చేతల్లో ఉండాలి’
సాక్షి, వరంగల్ : సామాజిక న్యాయం అంటే గొర్రెలు, బర్రెలు, చేపలు, పందులు పంపణీ చేయడమేనా అని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం ప్రశ్నించారు. వరంగల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ సామాజిక న్యాయం గురించి మాట్లాడటం సంతోషంగా ఉందని, అయితే మాటల్లో కాకుండా చేతల్లో సామాజిక న్యాయం చేయాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో కులాల జనాభా నిష్పత్తి ఆధారంగా అన్ని పార్టీలు సీట్లు కేటాయించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ 119 స్ధానాల్లో పోటీ చేస్తుందని ఆయన ప్రకటించారు. కొత్తగా వచ్చిన కోదండరామ్ పార్టీ కూడా సామాజిక న్యాయం అంటుందని దానిపై స్పష్టత ఇవ్వాలన్నారు. ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే సీపీఎం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఆయన కోరారు. కోదండరామ్, పవన్ కల్యాణ్లతో పొత్తు ఉంటుందా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ... చర్చలు నడుస్తున్నాయని, ఇంకా స్పష్టత రాలేదన్నారు. -
బీజేపీని గద్దెదించడమే ప్రధాన ఎజెండా
సాక్షి, యాదాద్రి: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దెదించడమే ప్రధాన ఎజెండాగా సీపీఎం పని చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సోమవారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ, బీజేపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందన్నారు. ప్రధాని మోదీ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతోందన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగార్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. హామీల అమలులో కేసీఆర్ విఫలమయ్యారన్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఏర్పడ్డ బీఎల్ఎఫ్ ద్వారా ప్రజల్లోకి వెళ్తామని తెలిపారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ సీట్లలో 60 సీట్లను బీఎల్ఎఫ్ ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తామన్నారు. సీపీఎం మహాసభలకు సహకరిస్తామని సీఎం హామీ ఇచ్చారని చెప్పారు. ఇందుకు కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో పార్టీ నేత చెరుపల్లి సీతారాములు తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరు చంద్రులు డ్రామాలాడుతున్నారు
చుంచుపల్లి (కొత్తగూడెం): మొన్నటి వరకు కేంద్ర ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా నిలిచిన తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు ఇప్పుడు తమ స్వార్థం కోసం, ప్రజల ఆలోచనలను మరల్చడానికి బీజేపీని తిడుతున్నట్లు నటిస్తూ కొత్త డ్రామాకు తెర లేపారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఎన్నికల వాగ్దానాలను విస్మరించిన వీరికి ప్రజా క్షేత్రంలో భంగపాటు తప్పదని హెచ్చరించారు. ఏప్రిల్ 18 నుంచి 22 వరకు హైదరాబాద్లో జరగనున్న సీపీఎం అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని చేపట్టిన బస్సు యాత్ర గురువారం కొత్తగూడెంకు చేరింది. ఈ సందర్భంగా జరిగిన సభలో తమ్మినేని మాట్లాడారు. ప్రధాని మోదీ హత్యా రాజకీయాలను పురిగొల్పుతూ దేశంలోని మేధావులను హతమార్చే సంస్కారాన్ని తీసుకొచ్చారని విమర్శించారు. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రా న్ని మార్చేందుకు హైదరాబాద్ మహాసభల నుంచే నాంది పలుకుతామన్నారు. సభలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు జాన్వెస్లీ, కాసాని అయిలయ్య, సాంబశివ తదితరులు పాల్గొన్నారు. -
బహుజన రాజ్యాధికారం కావాలి
సాక్షి, యాదాద్రి/ భువనగిరిటౌన్ : తెలంగాణ రాష్ట్రంలో బహుజనులకు రాజ్యాధికారమే ధ్యేయంగా సీపీఎం పార్టీ ఉద్యమిస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఎం 22వ జాతీయ మహాసభల జయప్రదానికి శనివారం రాష్ట్ర బస్సు జాతాను భువనగిరిలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనకబాటుకు గురైన బహుజనులకు రాజకీయాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు సీపీఎం పని చేస్తుందన్నారు. జన్ధన్యోజన పేరుతో ప్రజలకు మోసగించిన మోదీ.. దేశాన్ని కాషాయికరణ చేసేందుకు బీజేపీ ప్రైవేట్ సైన్యాలను దేశంలో దళితులు, గిరిజనులు, మైనార్టీలపైకి ఉసిగొల్పి దాడులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. బంగారు తెలంగాణ పేరుతో ప్రజలను మోసగించిన కేసీఆర్ తమ కుటుంబం తప్ప ఎవరూ సంతోషంగా లేని పరిస్థితి ఉందన్నారు. అంతకుముందు స్థానిక బైపాస్రోడ్డు వద్ద తమ్మినేనిని స్థానిక పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి బాబు జగ్జీవర్రాం చౌరస్తా వద్ద బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పొలినేని సుదర్శన్రావు, జాతా కన్వీనర్ జాన్వేస్లీ, సభ్యులు సాంబశివరావు, కొండమడుగు నర్సింహా, మంగ నర్సింహులు, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేషం, వేముల మహేందర్, బట్టుపల్లి అనురాధ, దాసరి పాండు, మాయ కృష్ణ, చింతల కిష్టయ్య, దయ్యాల నర్సింహ, సిర్పంగి స్వామి, వెంకటేశం, పెంటయ్యలు పాల్గొన్నారు. -
పార్టీలు జనాభా దామాషాలో టికెట్లివ్వాలి
సాక్షి, హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో జనాభా దామా షాలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్ని పార్టీలు టికెట్లు ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్)కు ఆదరణ పెరుగుతోందన్నారు. బీఎల్ఎఫ్ పక్షాన రానున్న ఎన్నికల్లో 119 స్థానాలకు పోటీ చేస్తామని.. ఈ సారి ఎక్కువ మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సీట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సీఎం కేసీఆర్తో పొత్తు ప్రసక్తే లేదన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు అవినీతిపై ప్రశ్నిస్తున్న పవన్ కలసి పనిచేద్దామని తమతో చర్చలు జరిపినట్లు వెల్లడించారు. -
సీపీఎం తర్జన.. భర్జన
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : సీపీఎం.. ఎన్నికల కసరత్తు మొదలు పెట్టింది. బహుజన తెలంగాణ, సామాజిక న్యాయం ఎజెండాతో ఆ పార్టీ పురుడు పోసిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) తరఫున ఈ సారి ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని 12 అసెంబ్లీ, 2 లోక్సభా నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. మొత్తంగా అన్ని నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితులు, ఆయా పార్టీల బలం బలహీనతలపై చర్చించి, దానికనుగుణంగా వ్యూహం ఖరారు చేసుకునేందుకు ఆ పార్టీ నాయకత్వం శుక్రవారం భేటీ అయ్యింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల కార్యదర్శివర్గాలతో సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణలో సీపీఎంకు పట్టున్న జిల్లాల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఒకటి. ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఎల్ఎఫ్ ద్వారానే అన్ని నియోజకవర్గాల్లో ఉనికి చాటుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర సీపీఎం మహాసభలను నల్లగొండలోనే నిర్విహించింది. గతంలో ఆ పార్టీ తుంగతుర్తి, నకిరేకల్, నల్లగొండ, మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గాలు, మిర్యాలగూడలోక్సభా స్థానం నుంచి పలు దఫాలు ప్రాతినిధ్యం వహించింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని పార్టీని మరింతగా విస్తరించేందుకు, సామాజిక న్యాయం ఎజెండాతో సబ్బండ వర్గాల ఓట్లను కొల్లగొట్టేందుకు పావులు కదుపుతోంది. రాజకీయ పక్షాలపై అంచనా ! ఈసారి ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్తో పాటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి ఎలా ఉంది? ఆయా నియోజకవర్గాల్లో ఆయా పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఎవరు? వారి పరిస్థితి ఎలా ఉంది? సీపీఎం తరఫున, లేదంటే బీఎల్ఎఫ్ తరఫున వారిని ఢీకొనే స్థాయిలో ఉన్న నాయకులు ఎవరూ అన్న విషయాలనూ కూలంకశంగా చర్చించారని సమాచారం. అదీ కాకుండా, సామాజిక అంశాలను ముందు పెట్టి ఏ పార్టీని ఎలా ఇరుకున పెట్టాలి? అసలు ఆయా పార్టీల ఎజెండా ఏమిటో ప్రజలకు వివరించేలా ఒత్తిడి పెంచే వ్యూహంపై కూడా కసరత్తు చేశారని చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో తమ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అధికార టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ పేరును తెరపైకి తెచ్చారని, అన్ని సమస్యల పెండింగ్కు, హామీలు నెరవేర్చక పోవడానికి బీజేపీ ప్రభుత్వమే కారణమని సాకులు చెప్పేందుకు చేస్తున్న ప్రయత్నాలని, వీటిని ప్రజల్లోకి తీసుకువెళ్లి చర్చకు పెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. అభ్యర్థుల అన్వేషణ బీఎల్ఎఫ్ ఆవిర్భావ సమయంలో సార్వత్రిక ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయగల సత్తా ఉన్న అభ్యర్థులను అన్వేషించే అంశంపైనా చర్చ జరిగిందంటున్నారు. మొత్తం పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీపీఎం తరఫున ఎన్ని స్థానాల్లో, ఏయే స్థానాల్లో నిలబెట్టాలి? బీఎల్ఎఫ్లోని ఇతర భాగస్వామ్య పక్షాల నుంచి ఎవరికి ఎక్కడ బలం ఉంది? ఎవరికి ఏ నియోజకవర్గం అయితే ప్రభావవంతంగా ఉంటుం దన్న అంశంపైనా చర్చించారని చెబుతున్నారు. దీనిలో భాగంగానే కేవలం జిల్లాలో ఉంటున్న వారే కాకుండా, జిల్లాకు చెందిన ఎన్ఆర్ఐలు, బయటి ప్రాంతాల్లో ఉంటున్న వారెవరినైనా ఆహ్వానించాలని, వారి స్థాయి ని అధ్యయనం చేయాలని కూడా నిర్ణయించారు. నల్లగొండ లోక్సభా స్థానం నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తారని, పన్నెండు అసెంబ్లీ స్థానాలను గెలచుకుంటామని టీఆర్ఎస్ నాయకత్వం ప్రచారం చేస్తున్న క్రమంలో.. కేసీఆర్ నల్లగొండ నుంచి పోటీ చేస్తే ఆయనపై పోటీ దింపడానికి దీటైన అభ్యర్ధి ఎవరు? బలమైన నేతలు ఎవరు? అన్న అంశాలపై అంచనాకు రావాలని, ఆ తర్వాత ప్రత్యేక వ్యూహం రచించుకో వాలని సీపీఎం నిర్ణయించినట్లు తెలిసింది. బీఎల్ఎఫ్ లో చేరని సీపీఐ తదితర పార్టీలను తమ వైపు తిప్పుకోవడం ద్వారా మరింత బలపడొచ్చన్నది సీపీఎం వ్యూహంగా కనిపిస్తోంది. సీపీఐ గతంలో దేవరకొండ, మునుగోడు, రామన్నపేట (రద్దు కాకమునుపు) నియోజకవర్గాల్లో, సీపీఎం పొత్తుతో నల్లగొండ లోక్సభా స్థానంలో గెలిచింది. సీపీఎం, సీపీఐ కలిసి ఎన్నికలకు వెళితే ఉమ్మడి జిల్లాలో కలిసొచ్చే అంశాలపైనా చర్చించినట్లు సమాచారం. -
థర్డ్ఫ్రంట్కు సీపీఎం దూరం: తమ్మినేని
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: థర్డ్ఫ్రంట్లో చేరే ఆలోచన తమకు లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. శుక్రవారం ఆ పార్టీ నేతలు జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, సుధాకర్ రెడ్డిలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోందని, ముఖ్యమంత్రి కేసీఆర్ థర్డ్ఫ్రంట్ ప్రకటన దానిలో భాగమని పేర్కొన్నారు. అయితే.. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేక కూటమి ఏర్పాటు మంచి పరిణామమని పేర్కొన్నారు. కేసీఆర్ థర్డ్ఫ్రంట్ తక్షణ రాజకీయ అవసరాల కోసమా అన్నది తేలాల్సి ఉందన్నారు. నిజాయితీగా నిలబడతారా లేదా అనే విషయం స్పష్టంగా ప్రకటించాలని తమ్మినేని డిమాండ్ చేశారు. కేంద్ర కేబినెట్ నుంచి టీడీపీ వైదొలిగినా, ఈ నాలుగేళ్లపాటు చంద్రబాబు నోరెందుకు మెదపలేదని తమ్మినేని ప్రశ్నించారు. అటు చంద్రబాబు, ఇటు కేసీఆర్ బీజేపీని మోశారని విమర్శించారు. నికరమైన నిర్ణయం తీసుకునే ధైర్యం కేసీఆర్కు లేదని, జీఎస్టీ, నోట్ల రద్దు, కుంభకోణాలపై చంద్రబాబు, కేసీఆర్లు తప్పుబట్టలేక పోయారని తెలిపారు. రిజర్వేషన్ల వ్యవహారం న్యాయమైన డిమాండ్ అని చెప్పారు. -
టీఆర్ఎస్ను గద్దెదింపుతాం
మహబూబ్నగర్ రూరల్: ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పాలన కొనసాగిస్తున్న టీఆర్ఎస్ను అధికారం నుంచి గద్దెదింపుతామని, అలాగే 60 ఏళ్లపాటు అధికారంలో ఉండి ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి రానివ్వబోమని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ను అధికారంలోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. ఆదివారం మహబూబ్నగర్ జిల్లా జెడ్పీ మైదానంలో జరిగిన బీఎల్ఎఫ్ భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని నిరుపేదలందరికీ ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఆ హామీని తుంగలో తొక్కి తమ కుటుంబంలోని నలుగురికి మాత్రం ఉద్యోగ సదుపాయాలు కల్పించుకున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ అమలు చేయలేదని, అందువల్లే ఆ పార్టీని గద్దె దింపుతామని అన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్న రాష్ట్ర ప్రజలు తమకే అధికారం కట్టబెడతారని కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తున్నారని, వారు అధికారంలో ఉన్నంతకాలం చేసిన మోసాన్ని రాష్ట్ర ప్రజలు ఇంకా మరచిపోలేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానివ్వబోమని స్పష్టంచేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీఎల్ఎఫ్ను బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే విద్య, వైద్యం, వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చి అందరికి అందుబాటులో ఉండే విధంగా చూస్తామని అన్నారు. సభలో బీఎల్ఎఫ్ వైస్ చైర్మన్ జలజం సత్యనారాయణ, నాయకులు మజిదుల్లాఖాన్, పటేల్ వనజ, జి.రమేశ్, శ్రీనివాస్ బహదూర్, జానకిరాములు, చంద్రన్న, జాన్వెస్లీ, కిల్లె గోపాల్, సాగర్, వెంకట్రాములు ప్రసంగించారు. -
రాష్ట్రంలో రాజకీయ సంచలనం సృష్టిస్తాం
సంగారెడ్డి క్రైం: రాబోయే రోజుల్లో రాష్ట్రంలో రాజకీయ సంచలనం సృష్టిస్తామని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని వీరభద్రం అన్నారు. బీఎల్ఎఫ్ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని సంగారెడ్డిలో మంగళవారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాతా అభివృద్ధిలో వెనుకబడే ఉన్నామన్నారు. ప్రభుత్వాలు మారినా రైతు ఆత్మహత్యలు మాత్రం ఆగడం లేదన్నారు. తెలంగాణ ఏర్పడితే మూతపడిన పరిశ్రమలను తిరిగి తెరిపిస్తామని ప్రగల్బాలు పలికిన కేసీఆర్ ఏ ఒక్క పరిశ్రమను తెరిపించ లేకపోయారన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం లేదన్నారు. ప్రతి క్వింటాలుకు రూ.8 వేల నష్టం వాటిళ్లుతోందని, అయినా ఎకరాకు రూ.4 వేలు ఇస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 119 స్థానాల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులను ఒక్కటే అడుగుతున్నామని, సామాజిక వర్గానికి సీట్లు ఇస్తాం, మీరు ఇస్తారా అని సవాల్ విసిరారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ చైర్మన్ నల్లా సూర్యప్రకాశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 40 వేల ఓట్లు ఉన్న వెలమ సామాజిక వర్గం అధికారం చెలాయిస్తోందని, 80 శాతానికిపైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రాజ్యాధికారానికి అర్హులు కారా? అని నిలదీశారు. కార్యక్రమంలో నాయకులు చుక్క రాములు, బీఎల్ఎఫ్ కన్వీనర్ మజీదుల్లాఖాన్, బీఎల్ఎఫ్ రైతు చైర్మన్ వనజ పాల్గొన్నారు. -
సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా మళ్లీ ‘తమ్మినేని’
నల్లగొండ: సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా రెండోసారి తమ్మినేని వీరభద్రం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో గత నాలుగు రోజుల పాటు జరిగిన సీపీఎం రాష్ట్ర ద్వితీయ మహాసభలు ముగిశాయి. మహాసభల చివరి రోజైన బుధవారం రాష్ట్ర కార్యవర్గ నూతన కమిటీని ఎన్నుకున్నారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ తెలంగాణలో బలోపేతం చేసే దిశగా నాలుగు రోజుల పాటు జరిగిన మహాసభల్లో ప్రధానంగా చర్చించారు. ఈ సభలకు జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి, ప్రకాష్ కారత్, బీవీ రాఘవులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బీఎల్ఎఫ్ నేతృత్వంలో సీపీఎం పంథా ఏవిధంగా వ్యవహరించాలనే దానిపైన నాలుగు రోజుల సమావేశాల్లో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 13 మంది సభ్యులతో రాష్ట్ర కార్యదర్శి వర్గం, 60 మంది సభ్యులతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మిగిలిన 12 మంది కార్యదర్శివర్గ సభ్యుల్లో ఎస్. వీరయ్య, చెరుపల్లి సీతారాములు, జి.నాగయ్య, చుక్క రాములు, నంద్యాల నర్సింహారెడ్డి, సున్నం రాజయ్య, బి.వెంకట్, టి.జ్యోతి, జూలకంటి రంగారెడ్డి, పి.సుదర్శన్రావు, జి.రాములు, డి.జి. నర్సింహారావు. రాష్ట్ర కేంద్ర సభ్యులుగా 30 మంది, రాష్ట్ర సెంటర్ కొత్త సభ్యులుగా ఏడుగురు, వివిధ జిల్లాల నుంచి 23 మంది సభ్యులతో కలిపి మొత్తం 60 మందితో కొత్త కార్యవర్గం ఏర్పాటైంది. వీరితో పాటు ఆహ్వానితులు 9 మంది, ప్రత్యేక ఆహ్వానితులు ముగ్గురిని నియమించారు. ఆహ్వానితులు: కాసాని ఐలయ్య (భద్రాద్రి కొత్తగూడెం), ఆర్. సుధాభాస్కర్ (రాష్ట్ర కేంద్రం), పి.సోమయ్య (రాష్ట్ర కేంద్రం), నాగటి రాములు (రాష్ట్ర కేంద్రం), ఎండి జబ్బార్ (వనపర్తి), ఎ.మల్లేష్ (మెదక్), జి. ముకుందరెడ్డి (కరీంనగర్), జి. జగదీష్ (రాష్ట్ర కేంద్రం), టి. స్కైలాబ్ (రాష్ట్ర కేంద్రం), ప్రత్యేక ఆహ్వానితులుగా మల్లు స్వరాజ్యం, సారంపల్లి మల్లారెడ్డి, పి.రాజారావు. పొద్దుపోయే వరకు సాగిన ఎన్నిక.. రాష్ట్ర కార్యవర్గ సభ్యుల ఎన్నిక రాత్రి పొద్దుపోయే వరకు సాగింది. 60 మంది సభ్యులను ఎన్నుకునే క్రమంలో మరో సభ్యుడు పోటీకి దిగడంతో అనివార్యంగా ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. దీంతో దాదాపు రెండుగంటలకు పైగా కార్యవర్గ సభ్యుల ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి తలెత్తడంతో రాష్ట్ర కమిటీని రాత్రి 9 గంటలకు ప్రకటించారు. -
ఎరుపెక్కిన నల్లగొండ
నల్లగొండ టౌన్: సీపీఎం రాష్ట్ర ద్వితీయ మహాసభలకు నల్లగొండ ముస్తాబైంది. ఈ నెల 4వ తేదీ నుంచి 4 రోజులపాటు జరిగే ఈ సభలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎర్ర జెండాలు, ఎర్ర తోరణాలతో పట్టణమం తా ఎరుపుమయమైంది. ఆదివారం ఉదయం 11 గంటలకు మహాసభలు ప్రారంభమవుతాయి. ముందుగా పార్టీ జిల్లా కార్యాలయం నుంచి ఐదువేల మంది రెడ్షర్ట్ వలంటీర్లతో కవాతు చేస్తారు. ప్రారంభ సభకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్బ్యూరో సభ్యులు ప్రకాశ్ కారత్, బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొంటారు. అనంతరం ప్రతినిధుల సభ ప్రారంభమవుతుంది. సభలో జాతీయ, రాష్ట్ర స్థాయి సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి తదితర అంశాలతో పాటు బహుజన ఫ్రంట్ ఏర్పాటు విషయం పై చర్చించనున్నారు. ఈ సభలకు రాష్ట్రంలోని 31 జిల్లాలకు చెందిన నేతలు, 800 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. మహాసభల విజయవంతం కోసం అన్ని గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. 15 రోజులుగా కళాకారులు ఆటాపాటలతో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నేడు ఫొటో ఎగ్జిబిషన్: సభల సందర్భంగా నల్లగొండ లోని అంబేద్కర్ భవన్లో శనివారం ఫొటోలు, కార్టూన్న్లతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారు. -
ఎస్సీ వర్గీకరణకు మద్దతు: సీపీఎం
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ బిల్లును బీజేపీ ప్రభుత్వం పార్లమెం టులో ప్రవేశపెడితే సీపీఎం మద్దతి స్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఆదివారం ఎంబీ భవన్లో తమ్మినేని వీరభద్రంతో ఎమ్మార్పీఎస్ వ్యవ స్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ భేటీ అయ్యారు. సోమవారం ఎమ్మా ర్పీఎస్ నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశానికి రావాలని మంద కృష్ణ తమ్మినేనిని ఆహ్వానించారు. దీనికి తమ్మినేని సానుకూలంగా స్పందించారు. కేసీఆర్ది నియంతృత్వ పాలన... సీఎం కేసీఆర్ను విమర్శించే వారిని జైలులో నిర్బంధించేందుకే ఐపీసీ 506, 507 సెక్షన్లలను ప్రభుత్వం నాన్ బెయిలబుల్ సెక్షన్లుగా మార్చిందని వీరభద్రం విమర్శించారు. సెక్షన్ల మార్పు కేసీఆర్ నియంతృత్వ పాలనకు నిదర్శనమన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పరుష పదజాలంతో దూషించినప్పుడు ఆయనను జైలుకు పంపితే ఉద్యమాన్ని ఎలా నడిపేవారని ప్రశ్నించారు. కేసీఆర్ తన అప్రజాస్వామిక విధానాలకు స్వస్తి పలకాలని తమ్మినేని హితవు పలికారు. -
ఎగుమతులు తగ్గిపోయాయి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటు తర్వాత రూ.15 వేల కోట్ల ఎగుమతులు తగ్గిపోయాయని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ.రాఘవులు అన్నారు. జహీరాబాద్, జడ్చర్ల, దామరచర్లలో ఏర్పాటు చేయాలనుకున్న డ్రైపోర్టులను మంజూరు చేయించుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలసి శనివారం విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది కేంద్రం ప్రజా బడ్జెట్ను రూపొందించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ నిర్ణయాలు దేశాన్ని ఆర్థిక మాంద్యంలోకి నెట్టాయని, వ్యవసాయాన్ని విస్మరించారని విమర్శించారు. దేశవ్యాప్తంగా రైతులు నష్టాల్లో ఉన్నారని వీరిని ఆదుకునేలా గిట్టుబాటు ధర కల్పిం చే చట్టం తేవాలన్నారు. టీఆర్ఎస్ ఎన్నికల హామీలను నెరవేర్చాలని కోరారు. ప్రత్యామ్నాయం కోసమే బీఎల్ఎఫ్: తమ్మినేని కేంద్ర ప్రైవేటీకరణ చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం వంతపాడుతోందని, రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న నష్టాన్ని కూడా ప్రశ్నించలేని దుస్థితిలో కేసీఆర్ ఉన్నారని తమ్మి నేని విమర్శించారు. వచ్చేనెల 4 నుంచి 7 వరకు నల్లగొండలో రాష్ట్ర మహాసభలు జరుగుతాయని తెలిపారు. ఈ సందర్భంగా మహాసభల పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కోసమే బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) ఏర్పాటైందని అన్నారు. బీజేపీతో, మరోవైపు ఎంఐంఎతో దోస్తీ చేస్తూ సీఎం కేసీఆర్ ఓట్ల రాజకీయం చేస్తున్నారన్నారు. -
28 పార్టీలతో బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్
సాక్షి, హైదరాబాద్: రాజ్యాధికారమే లక్ష్యంగా రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికకు అంకురార్పణ జరిగింది. ఈ నెల 25న 28 పార్టీలతో కలసి బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) ప్రారంభం కానుంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోటీ చేయాలని లెఫ్ట్, బహుజన నేతలు నిర్ణయించారు. హైదరాబాద్లో 25న భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసి ఈ వేదికను ప్రకటించనున్నారు. బహిరంగ సభకు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్, ఎంసీపీఐ (యూ) జాతీయ నేత ఎం.డి.గౌస్ హాజరు కానున్నారు. గురువారం హైదరాబాద్లో ప్రత్యామ్నాయ రాజకీయ ఫ్రంట్ ఏర్పాటుపై సన్నాహక సమావేశం జరిగింది. ప్రొఫెసర్ కంచ ఐలయ్య, కాకి మాధవరావు, పి.ఎల్. విశ్వేశ్వరరావు, సాంబ శివరావు, గద్దర్, పటేల్ వనిత, మాజిదుల్లా ఖాన్ తదితరులు సమా వేశంలో పాల్గొన్నారు. బీఎల్ఎఫ్ అధ్యక్షుడిగా నల్లా సూర్యప్రకాశ్, కన్వీనర్గా తమ్మినేని వీరభద్రం నియమితులయ్యారు. పూలే, అంబేడ్కర్ ఆలోచనలతో.. పూలే–అంబేడ్కర్–మార్క్స్ ఆలోచనల మేళవింపుతో ఫ్రంట్కు రూపకల్పన చేశామని తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఇప్పుడున్న రాజకీయాలకు ప్రత్యామ్నాయంగానే బహు జన్ లెఫ్ట్ ఫ్రంట్ రూపుదిద్దుకుందన్నారు. ఫ్రంట్లో ఇప్పుడున్న 28 పార్టీలతో పాటు సీపీఐ, న్యూడెమోక్రసీతో పాటు ఇతర వామ పక్ష పార్టీలను కూడా చేరాలని ఆహ్వాని స్తున్నామని తమ్మినేని తెలిపారు. -
ఫీజు నియంత్రణ నివేదికను వెల్లడించాలి
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం నియమించిన ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ ఫీజులను నియంత్రించకపోగా పెంచాలని సిఫారసు చేయడం అన్యాయమని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ప్రైవేటు స్కూళ్ల ఫీజులు రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్నాయని, తక్షణమే కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని సోమవారం డిమాండ్ చేశారు. అధిక ఫీజులు అరికట్టాలని సాగిన ఉద్యమాల వల్లే కమిటీని ప్రభుత్వం నియమించిందని గుర్తుచేశారు. మేనేజ్మెంట్ల సహాయ నిరాకరణ వల్ల ఏప్రిల్లో ఇవ్వాల్సిన నివేదిక 10 నెలలు ఆలస్యంగా ఇచ్చినట్లు తెలుస్తోందని అన్నారు. నివేదికలో ఫీజుల భారం తగ్గించాలని ప్రతిపాదించకపోగా.. మరింత పెంచేలా సూచనలు చేసినట్లు తమకు సమాచారం ఉందని తెలిపారు. విద్యారంగాన్ని పట్టిపీడిస్తున్న కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల సమస్యపై చర్చించడానికి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. -
గిరిజనుల సమస్యలపై అఖిలపక్షం: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: లంబాడీలు, ఆది వాసీల మధ్య ఘర్షణ లను పరిష్కరించ డానికి ప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై వామపక్ష పార్టీల సమావేశం సీపీఎం కార్యాలయంలో మంగళవారం జరిగింది. బంజారాలు, ఆదివాసీల మధ్య ఘర్షణ పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని తమ్మినేని ఆరోపించారు. ఈ సమస్యకు తక్షణమే పరిష్కారం చూపే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగ అరెస్టు అక్రమమని అన్నారు. -
‘బిల్ట్’లో ఉత్పత్తిని పున:ప్రారంభించాలి
సాక్షి, హైదరాబాద్: కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, బల్లాపూర్ ఇండస్ట్రీస్(బిల్ట్)లో ఉత్పత్తిని పున:ప్రారంభించాలని సీఎం కె.చంద్రశేఖర్రావును సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయనకు లేఖ రాశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కమలాపురంలో రేయాన్స్ పల్ప్ ఉత్పత్తి కోసం ఏపీ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ ద్వారా ఏపీ రేయాన్స్ సంస్థ 1975లో ప్రారంభమైందని, 1981లో ఉత్పత్తి ప్రారంభించిందని తమ్మినేని తెలిపారు. విదేశాల నుంచి పల్పును దిగుమతి చేసుకోవడంతో ఇక్కడి నుంచి పల్పు అమ్మకాలు నిలిచిపోయాయని, 2014 ఏప్రిల్ నుంచి కొనుగోళ్లు నిలిపివేశారన్నారు. దీంతో ఈ పరిశ్రమపై ఆధారపడిన 2 వేల మంది కార్మికులు, పరోక్షంగా మరో పది వేల మంది ఉపాధి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఈ సంస్థను పున:ప్రారంభిస్తామని, రూ.30కోట్ల సబ్సిడీ ఇస్తామని 2015లో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో కార్మికులు దుర్భర జీవితం గడుపుతున్నారన్నారు. ఇప్పటికే వీరిలో 13 మంది చనిపోగా, ఇటీవల ఓ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు. కార్మికుల దయనీయ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం చేసిన వాగ్దానాన్ని అమలు చేయాలని కోరారు.