హైదరాబాద్ లోని మియాపూర్ పోలీస్ స్టేషన్కు కూత వేటు దూరంలో పట్టపగలు ప్రమాదం సంభవించింది. వేగంగా వస్తున్న వాహనం రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
Published Fri, Jun 10 2016 4:16 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
Advertisement
Advertisement