
డీఆర్డీవో శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందన
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం డీఆర్డీవో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. అగ్ని-4 ఉపరితల క్షిపణి ప్రయోగం విజయవంతంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.
ఒడిశాలోని బాలాసోర్లోని అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్ నుంచి డీఆర్డీవో శాస్త్రవేత్తలు అగ్ని-4 క్షిపణి ప్రయోగాన్ని ప్రయోగించారు. నాలుగు వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఈ క్షిపణి సునాయసంగా ఛేదించగలిగింది. ఈ క్షిపణికి వెయ్యి కిలోల పేలోడ్ను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంది.