రోడ్డు ప్రమాదం: 57 మంది దుర్మరణం | At Least 57 People Killed in Fiery Pakistan Bus-Oil Tanker Crash | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదం: 57 మంది దుర్మరణం

Published Sun, Jan 11 2015 10:21 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

రోడ్డు ప్రమాదం: 57 మంది దుర్మరణం - Sakshi

రోడ్డు ప్రమాదం: 57 మంది దుర్మరణం

కరాచీ: పాకిస్థాన్ లో ఆదివారం ఉదయం  ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ఆయిల్ ట్యాంకర్ ను బస్సు ఢీకొన్న ఘటనలో కనీసం 57 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది.  కరాచీ నుంచి షికాపూర్ కు వెళుతున్నఓ బస్సు సూపర్ హైవేపై అతి వేగంగా వస్తున్నఆయిల్ ట్యాంకర్ ను ఢీకొట్టడంతో రెండు వాహనాల్లో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతి కావడంతో భారీ సంఖ్య లో ప్రాణ నష్టం వాటిల్లింది.

 

బస్సులో ఒక మహిళ,  చిన్నారితో సహా 57 మంది వరకూ దుర్మరణం పాలైనట్లు ప్రాథమిక సమాచారం. ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని కరాచీ కమిషనర్ షోయబ్ సిద్ధిఖి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement