Oil Tanker
-
ఆయిల్ ట్యాంకర్లో బీర్ బాటిళ్లా?! ఎంతకు తెగించారు రా? వైరల్ వీడియో
బీహార్లో ఓ ఆయిల్ ట్యాంకర్లో మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యవహారం తెలుగులోకి వచ్చింది.దీంతో పోలీసులు వల పన్నడంతో డ్రైవర్ ,మద్యం వ్యాపారి ట్యాంకర్ను జాతీయ రహదారిపై వదిలి అక్కడి నుంచి ఉడాయించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.పోలీసు అధికారులు అందించిన సమాచారం ప్రకారం హిందుస్థాన్ పెట్రోలియం ట్యాంకర్లో సుమారు 200 బీరు డబ్బాలను తరలించేందుకు ప్రయత్నించారు స్మగర్లు. అయితే దీనికు ఎక్సైజ్ శాఖకు పక్కా సమాచారం అందిండంతో స్మగ్లర్లను పట్టుకునేందుకు ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని గమించిన స్మగ్లర్లు ట్యాంకర్ను జాతీయ రహదారి వైపు మళ్లించడాన్ని గమనించిన అధికారులు రోడ్డు దిగ్బంధనం చేశారు. దీంతో డ్రైవర్, మద్యం వ్యాపారి అక్కడినుంచి పలాయనం చిత్తగించారు. నాగాలాండ్లో రిజిస్టర్ అయిన ట్యాంకర్ను ముజఫర్పూర్లో స్వాధీనం చేసుకున్నామని అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ విజయ్ శేఖర్ దూబే తెలిపారు. అలాగే పట్టుబడిన మద్యం అరుణాచల్ ప్రదేశ్లో తయారైందని వెల్లడించారు. మద్యం అక్రమ రవాణా చేసిన స్థానిక వ్యాపారిని గుర్తించి, అతడిని అరెస్టు చేసేందుకు దాడులు నిర్వహిస్తున్నామని, అతనిపై కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.కాగా బీహార్లో మద్యం అమ్మకం నిషేధం అమల్లో ఉంది. దీంతో మద్యం, అక్రమ రవాణాకు, విక్రయాలకు వ్యాపారులు వినూత్న మార్గాలను ఆశ్రయిస్తున్నారు. కొన్నిసార్లు అంబులెన్స్లు, ట్రక్కులలో తరలించిన వైనాన్ని చూశాం. అంతేకాదే మద్యం బాటిళ్లను నిల్వ చేసేందుకు పెట్రోల్ ట్యాంకుల లోపల కంపార్ట్మెంట్లు నిర్మించుకున్న సందర్భాలూ ఉన్నాయి. మరోవైపు కల్తీ మద్యం బారిని పడి పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ये बिहार है बाबू! मुजफ्फरपुर में तेल टैंकर से पेट्रोल की बजाय निकलने लगी अवैध शराब#Bihar pic.twitter.com/gE0GJP4afl— Mangal Yadav (@MangalyYadav) October 23, 2024 -
చమురు ట్యాంకర్కు మంటలు
ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారుల దాడులకు గురైన ‘సోయూనియన్’ అనే 900 అడుగుల భారీ చమురు ట్యాంకర్ ఇది. ఆగస్ట్ 21వ తేదీన ట్యాంకర్కు అంటుకున్న మంటలు ఇప్పటికీ చల్లారలేదు. ఇందులోని 10 లక్షల బ్యారెళ్ల ముడి చమురు లీకైతే మునుపెన్నడూ లేనంతగా సముద్ర పర్యావరణానికి హాని కలుగుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అందుకే, సాధ్యమైనంత మేర ట్యాంకర్లోని చమురును తరలించే అత్యంత క్లిష్టమైన ప్రక్రియను మొదలుపెట్టనున్నారు. గ్రీస్కు చెందిన ఈ నౌక యాజమాన్యం ఈ విషయంలో సౌదీ అరేబియా సాయం కోరింది. అప్పటి వరకు మరిన్ని దాడులు జరగకుండా గ్రీస్, ఫ్రాన్సు నౌకలు ‘సోయూనియన్’కు కాపలాగా ఉన్నాయి. -
Oman: చమురు నౌక మునక.. 13 మంది భారతీయులతో సహా 16 మంది గల్లంతు
ఒమన్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. యెమెన్ వైపు వెళుతున్న చమురు నౌక ఒకటి సముద్రంలో మునిగిపోయింది. ఒమన్కు చెందిన మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం ఈ చమురు నౌక పేరు ప్రెస్టీజ్ ఫాల్కన్.ప్రమాదం జరిగిన సమయంలో దీనిలో 16 మంది సిబ్బంది ఉన్నారు. వీరి జాడ ఇంకా తెలియరాలేదు. గల్లంతైనవారిలో 13 మంది భారతీయ పౌరులు, ముగ్గురు శ్రీలంక పౌరులు ఉన్నారని సమాచారం. ఈ చమురు నౌకకు తూర్పు ఆఫ్రికా దేశమైన కొమొరోస్ జెండా ఉంది. ఈ చమురు నౌక ఒమన్ ప్రధాన పారిశ్రామిక డుక్మ్ పోర్ట్ సమీపంలో మునిగిపోయింది.ఈ ట్యాంకర్ షిప్ యెమెన్ వైపు వెళ్తుండగా దుక్మ్ పోర్ట్ సమీపంలో బోల్తా పడింది. సమాచారం అందిన వెంటనే స్థానిక అధికారులు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. మునిగిపోయిన చమురు నౌక 117 మీటర్ల పొడవు ఉంది. దీనిని 2017లో నిర్మించారని తెలుస్తోంది. కొమొరోస్ ఫ్లాగ్ ఉన్న ఈ ఆయిల్ ట్యాంకర్ షిప్ రాస్ మదారకాకు ఆగ్నేయంగా 25 నాటికన్ మైళ్ల దూరంలో మునిగిపోయిందని మారిటైమ్ సేఫ్టీ సెంటర్ ఒక ట్వీట్లో తెలిపింది. A Comoros flagged oil tanker capsized 25 NM southeast of Ras Madrakah. SAR Ops initiated with the relevant authorities. #MaritimeSecurityCentre— مركز الأمن البحري| MARITIME SECURITY CENTRE (@OMAN_MSC) July 15, 2024 -
బ్రిటిష్ నౌకపై హౌతీల దాడి
జెరూసలేం: యెమెన్లో హౌతీ తిరుగుబాటుదారులు మళ్లీ రెచి్చపోయారు. బ్రిటిష్ చమురు ట్యాంకర్తోపాటు మొట్టమొదటిసారిగా అమెరికా యుద్ధ నౌక యూఎస్ఎస్ కారీ్నపైకి క్షిపణులను ప్రయోగించారు. బ్రిటిష్ చమురు నౌక మంటల్లో చిక్కుకోగా, అందులోని 22 మంది భారతీయ సిబ్బందిని కాపాడేందుకు భారత నావికా దళం ఐఎన్ఎస్ విశాఖపట్నం అక్కడికి హుటాహుటిన తరలి వెళ్లింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి ఎర్ర సముద్రంలోని ఏడెన్ సింధులో చోటుచేసుకుంది. బ్రిటిష్ చమురు నౌక ఎంవీ మర్లిన్ లువాండా లక్ష్యంగా హౌతీలు ప్రయోగించిన క్షిపణితో నౌకలో అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. విపత్తు సమాచారం అందుకున్న భారత నేవీకి చెందిన డె్రస్టాయర్ ఐఎన్ఎస్ విశాఖపట్నం అక్కడికి చేరుకుంది. నౌకలో మంటలను ఆర్పి, సిబ్బందిని కాపాడేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. నౌకలోని సిబ్బందిలో 22 మంది భారతీయులతోపాటు ఒక బంగ్లాదేశీ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఘటనలో ఎవరికీ ఎటువంటి హాని కలగలేదని సమాచారం. ఇలా ఉండగా, ఏడెన్ సింధు శాఖలో పయనించే చమురు నౌకలే లక్ష్యంగా హౌతీ తిరుగుబాటుదారుల దాడులు పెరిగిన నేపథ్యంలో అమెరికాకు చెందిన యుద్ధ నౌక యూఎస్ఎస్ కార్నీని మోహరించింది. ఈ నౌకపైకి శుక్రవారం హౌతీలు మొట్టమొదటిసారిగా క్షిపణిని ప్రయోగించారు. దీనిని మధ్యలోనే కూల్చివేసినట్లు అమెరికా నేవీ ప్రకటించింది. -
ఎర్రసముద్రంలో అలజడి.. మరో రెండు నౌకలపై డ్రోన్ దాడి
ఎర్రసముద్రంలో మరో రెండు నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేశారు. 25 మంది భారతీయులు ఉన్న ఆయిల్ ట్యాంకర్పై డ్రోన్దాడి చేశారని భారత నౌకాదళం తెలిపింది. అయితే.. ఇండియన్ జెండా లేని నౌకపైనే దాడి జరిగినట్లు స్పష్టం చేసింది. గాబన్ జెండాతో ప్రయాణిస్తున్న నౌకపై దాడి చేశారని వెల్లడించింది. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని పేర్కొంది. మరోవైపు నార్వేజియన్ జెండా కలిగిన మరో ఆయిల్ ట్యాంకర్పై కూడా హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేశారు. అయితే.. భారత జెండా కలిగిన నౌకపై హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేశారని అమెరికా ఇంటెలిజెన్స్ పొరపాటున ఇంతకుముందు తెలిపింది. కానీ అలాంటిదేమీ లేదని తర్వాత భారత నౌకాదళం తెలిపింది. ఆయిల్ ట్యాంకర్ ఎంవీ సాయిబాబాపై దాడి జరిగినట్లు స్పష్టం చేసింది. మరోవైపు నార్వేజియన్ జెండా కలిగిన మరో ఆయిల్ ట్యాంకర్పై కూడా హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేశారు. అలాగే, అమెరికా యుద్ధ నౌక యూఎస్ఎస్ లబూన్ పై కూడా డ్రోన్ దాడులకు ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆ డ్రోన్ల్ను యుద్ధనౌక కూల్చివేసిందని అమెరికా సెంట్కామ్ వెల్లడించింది. ఈ ఘటనల తర్వాత అక్టోబర్ 17 తర్వాత వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల సంఖ్య 15కు చేరినట్లు పేర్కొంది. ఓవైపు గుజరాత్ సమీపంలో ఇజ్రాయెల్కు చెందిన నౌకపై ఇరాన్ దాడి చేసినట్లు అమెరికా పేర్కొంది. ఈ ఘటనతో అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యెమెన్లో కేంద్రీకృతమైన ఇరాన్ మద్దతుగల హౌతీలు.. గాజాలో ఇజ్రాయెల్ యుద్ధానికి ప్రతిస్పందనగా ఎర్ర సముద్రంలో దాడులకు పాల్పడుతున్నారు. బాబ్ అల్-మందాబ్ జలసంధి గుండా వెళుతున్న నౌకలపై దాడులతో అంతర్జాతీయ వాణిజ్యానికి అంతరాయం కలిగిస్తున్నారు. ఇదీ చదవండి: డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే.. -
నెత్తురోడిన రహదారులు.. రెండు వేర్వేరు ప్రమాదాల్లో తొమ్మిది మంది మృతి
దేశంలో రహదారులు మృత్యు ద్వారాలను తలపించాయి.. వేర్వేరు చోట్ల జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో మెుత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు సాక్షి, చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తిరువత్తూర్ జిల్లా వానియంబాడి రహదారిపై శనివారం తెల్లవారుజామున రెండు ప్రైవేటు ట్రావెల్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో అయిదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. దాదాపు 60 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. చండీగఢ్: హర్యానా రాష్ట్రంలోనూ శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. గురుగ్రామ్ సమీపంలోని ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారిపై వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా వేగంగా దూసుకొచ్చి కారును, మరో వ్యాన్ను బలంగా ఢకొట్టింది. దీంతో ఆయిల్ ట్యాంకర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు కారుకు సైతం అంటుకోవడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వ్యాన్ డ్రైవర్ కూడా అక్కడికికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సమాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఘటన తర్వాత ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ పరారయ్యాడని, అతడిని పట్టుకునేందుకు గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ట్యాంకర్లో సీఎన్జీ సిలిండర్లు ఉండటంతో మంటలు చెలరేగినట్లు పేర్కొన్నారు. చదవండి: టోల్ప్లాజా వద్ద కారు బీభత్సం.. పలువురు మృతి -
230 కిలోమీటర్ల వేగంతో రోల్స్ రాయిస్ బీభత్సం
చంఢీగడ్: హర్యానాలోని నూహ్లో దారుణం జరిగింది. జాతీయ రహదారిపై రోల్స్ రాయిస్ కారు ఓ ట్యాంకర్ను ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ట్యాంకర్ యూటర్న్ తీసుకునే క్రమంలో ఈ ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. కారు అతి వేగమే ప్రమాదానికి కారణం అని వెల్లడించారు. కారు, ట్యాంకర్ రెండు కూడా ఒకే దారిలో వస్తున్నాయి. ఈ క్రమంలో ట్యాంకర్ యూటర్న్ కోసం నిలిచి ఉంది. వెనకే ఉన్న రోల్స్ రాయిస్ దాదాపు గంటకు 230 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చింది. అదుపుతప్పి నిలిచి ఉన్న ట్యాంకర్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు, ట్యాంకర్కు మంటలు అంటుకున్నాయి. కారు అతి వేగమే ప్రమాదానికి కారణం అని స్థానికులు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెనకే మరో కారులో వస్తున్న బాధిత కుటుంబ సభ్యులు వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కారు విలువ దాదాపు రూ.10 కోట్లు ఉంటుందని స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: రాహుల్ గాంధీ ఇక ఆ బంగ్లాకు వెళ్లలేరు.. ఎందుకంటే..? -
ముంబై-పూణె ఎక్స్ప్రెస్ వేపై ఆయిల్ ట్యాంకర్కు మంటలు
-
మోహిదీపట్నం ఎన్ఎండీసీ వద్ద ఆయిల్ ట్యాంకర్ బోల్తా
-
ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. మాసబ్ ట్యాంక్లో భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: మాసబ్ ట్యాంక్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మాసబ్ట్యాంక్ ఎన్ఎండీసీ వద్ద ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తాపడింది. ట్యాంకర్ రోడ్డు అడ్డంగా పడిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇరువైపుల ట్రాఫిక్ స్తంభించడంతో వాహనాలు గంటల తరబడి ట్రాఫిక్లో నిలిచిపోయాయి. మాసబ్ ట్యాంక్, మోహిదీపట్నం, పీవీ ఎక్స్ప్రెస్, బంజారాహిల్స్ రోడ్ నెం1, లక్డీకాపూల్, ఖైరతాబాద్లో ట్రాఫిక్ నిలిచిపోయింది.ఈ మార్గానికి అనుసంధానమైన దారుల్లోనూ వాహనాలు భారీగా నిలిచిపోయాయి . విషయం తెలుసుకున్న ట్రాఫఙక్ పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని క్రేన్ సాయంతో ట్యాంకర్ను పక్కకు తోశారు. ట్రాఫిక్ క్లియన్ చేసేందుకు పోలీసులు కష్టపడుతున్నారు. రోడ్డుపై ఆయిల్ ఉండటంతో వాహనదారులు జారిపడుతున్నారు. మాసబ్ ట్యాంక్ ఫైఓవర్ నుంచి ఆయిల్ కిందకి పడిపోతుంది. మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ కిందా పైన ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. -
లండన్ బ్రిడ్జిపై పేలిన ఆయిల్ ట్యాంకర్.. వీడియో వైరల్..
లండన్లో ఓ బ్రిడ్జిపై ఆయిల్ ట్యాంకర్ పేలిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఆ చుట్టుపక్కల భయానక వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. అగ్నిమాపక సిబ్బంది గంటలపాటు శ్రమించి మంటనలు అదుపుచేశారు. అయితే కారు టైరు పేలిపోయి అదుపుతప్పి ఆయిల్ ట్యాంక్ను ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం అనంతర దృశ్యాలను అటువైపుగా వెళ్తున్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాసేపట్లోనే అవి వైరల్గా మారాయి. Fire on the gold star bridge in groton Ct😳 pic.twitter.com/pxbAMKWWec — chrisstevens7 (@Moneymakerzzz91) April 21, 2023 Firefighters battle a blaze on the Goldstar Memorial Highway, l- 95 south #newlondon #groton pic.twitter.com/SQdDvmiitV — Greg Smith (@SmittyDay) April 21, 2023 Kayaker Matt Stone of Chester caught this footage from the water near the Gold Star Bridge boat launch @thedayct pic.twitter.com/EyGqSU5Cit — Elizabeth Regan (@eregan_ct) April 21, 2023 చదవండి: సొంత నగరంపైనే రష్యా బాంబింగ్ -
‘పుష్ప’ను ఫాలో అయ్యి.. పరారయ్యారు!
శృంగవరపుకోట/నర్సీపట్నం: ఇటీవల విడుదలైన పుష్ప సినిమాలో పాల ట్యాంకర్లో ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేస్తారు. ఈ ఐడియా ఏదో మనకు పనికొస్తుంది అనుకున్నారో ఏమో.. ఆ గంజాయి స్మగ్లర్లు అచ్చం అదే ఐడియాను అనుసరించారు. ఆయిల్ ట్యాంకర్లో గంజాయి రవాణా చేస్తూ విజయనగరం జిల్లా ఎస్.కోట పోలీసులకు దొరికిపోయారు. అరకు నుంచి ఎస్.కోట వైపు వస్తున్న ఆయిల్ ట్యాంకర్లో అక్రమంగా గంజాయి తరలిస్తున్నారన్న సమాచారం ఆదివారం ఎస్.కోట ఎస్ఐ తారకేశ్వరరావుకు అందింది. దీంతో తన సిబ్బందితో కలిసి బొడ్డవర చెక్పోస్టు వద్ద కాపుకాశారు. ఉదయం 7.30 గంటల సమయంలో ఆయిల్ ట్యాంకర్ను పోలీసులు అడ్డుకున్నారు. తొలుత తమ లారీలో ఎలాంటి గంజాయి లేదని డ్రైవర్, క్లీనర్లు బుకాయించారు. పోలీసులు ట్యాంకర్ పైకి ఎక్కి నాలుగు కంపార్ట్మెంట్లపై క్యాప్లకు ఉన్న నట్లు తీసేందుకు ప్రయత్నించగా వారు అక్కడ నుంచి ఉడాయించారు. ట్యాంకర్ను పోలీస్స్టేషన్కు తరలించి నాలుగు కంపార్ట్మెంట్ల క్యాప్లు తెరచి చూడగా.. ముందున్న కంపార్ట్మెంట్, వెనుక ఉన్న రెండు కంపార్ట్మెంట్లను ఖాళీగా వదిలేశారు. మధ్యలోని రెండో కంపార్ట్మెంట్లో లోడ్ చేసిన 780 కిలోల 149 గంజాయి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.30 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు. పరారైన నిందితుల కోసం గాలిస్తున్నారు. నర్సీపట్నంలో రూ.3 లక్షల విలువైన గంజాయి స్వాధీనం లారీలో తరలిస్తున్న 1100 కిలోల గంజాయిని విశాఖ జిల్లా నర్సీపట్నం రూరల్ పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు ఎస్ఐ రమేష్ తన సిబ్బందితో కలిసి చింతపల్లి రోడ్డు నెల్లిమెట్ట వద్ద శనివారం రాత్రి వాహన తనిఖీలు నిర్వహించారు. పోలీసులను గమనించిన డ్రైవర్ కొద్ది దూరంలో లారీ ఆపి పారిపోయాడు. లారీని పోలీసులు తనిఖీ చేయగా సుమారు రూ.3 లక్షల విలువైన గంజాయి బయటపడింది. -
ఆయిల్ కోసం ఎగబడ్డ జనాలు.. ఒక్కసారిగా పేలుడు.. 91 మంది మృతి
-
ఆయిల్ కోసం ఎగబడ్డ జనాలు.. ఒక్కసారిగా పేలుడు.. 91 మంది మృతి
సియర్రాలియోన్/ ఆఫ్రికా: ఆఫ్రికాలో దారుణం చోటు చేసుకుంది. ఆయిల్ ట్యాంకర్ పేలిన ఘటనలో 91 మంది మృతి చెందారు. ఈ సంఘటన ఆఫ్రికా సియర్రాలియోన్లో శనివారం చోటు చేసుకుంది. సియర్రాలియోన్ రాజధాని ఫ్రీటౌన్లో ఈ పేలుడు సంభవించింది. ఆ వివరాలు.. ఆయిల్ ట్యాంకర్ నుంచి చమురు లీకవతుండటంతో దాన్ని పక్కనే ఉన్న గ్యాస్ స్టేషన్ వద్ద నిలిపి ఉంచారు. విషయం తెలిసిన స్థానికులు లీకవుతున్న చమురును పట్టుకునేందుకు గుంపులు గుంపులుగా అక్కడకు చేరుకున్నారు. (చదవండి: భూమి కుంగడంతోనే ప్రమాదం) ఇదే సమయంలో అటుగా వచ్చిన బస్సు.. ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్ను ఢీకొట్టడంతో భారీ పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పలువురు స్థానికులు, బస్సు ప్రయాణికులు మృతి చెందారు. ఇప్పటి వరకు మొత్తం 91 మంది మృతి చెందినట్లు అధికారుల ప్రకటించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. చదవండి: రాత్రికి రాత్రే శ్మశానాలుగా మారిపోయాయి.. అసలేం జరిగింది? -
శామీర్పేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు సజీవ దహనం
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ జిల్లా శామీర్పేట రాజీవ్ రహదారిపై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొట్టిన ఘటనలో మంటలు చెలరేగి ఒక వ్యక్తి సజీవ దహనమయ్యాడు. నగరం నుండి తమిళనాడు సేలం కు వెళ్తున్న కంటైనర్ ను లారీ ఓవర్టేక్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రెండు లారీల మధ్య రాపిడి జరగడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా.. ఒక వ్యక్తి సజీవదహనమయ్యాడు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కాగా, మృతుడికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ఫైర్ ఇంజిన్ లు సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. -
చమురు నౌకలో అగ్ని ప్రమాదం
న్యూఢిల్లీ: శ్రీలంక తీరంలో ఎమ్టీ న్యూ డైమండ్ అనే నౌక ప్రమాదానికై గురైంది. కువైట్ నుంచి భారత తూర్పు తీరంలోని ఒడిశా పారాదీప్ తీరానికి ఆయిల్ ట్యాంకర్తో బయల్దేరిన పనామా పడవలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడగా.. మరొకరు గల్లంతైనట్లు సమాచారం. ప్రమాద సమయంలో నౌకలో మొత్తం 23 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రక్షణ చర్యల్లో సాయం అందించాల్సిందిగా కోరిన శ్రీలంక నావికా దళ అభ్యర్థన మేరకు భారత్కు చెందిన మూడు కోస్ట్గార్డు షిప్పులు అక్కడికి బయల్దేరాయి. శౌర్య, సారంగ్, సముద్రలను అక్కడికి పంపడంతో పాటుగా తక్షణ సహాయక చర్యల కోసం ఓ విమానాన్ని కూడా తరలించినట్లు ఇండియన్ కోస్ట్గార్డ్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. కాగా చమురుతో బయల్దేరిన ఈ నౌక శనివారం పారాదీప్ తీరానికి చేరుకోవాల్సి ఉండగా.. ఇంతలో ప్రమాదం చోటుచేసుకుంది. #SavingLives #SAR #FireFighting assistance sought by Sri Lanka Navy from @IndiaCoastGuard for fire and explosion onboard Oil Tanker #MTNewDiamond 37 NM east off #Srilanka coast. #ICG ships and aircraft deployed for immediate assistance @DefenceMinIndia @MEAIndia pic.twitter.com/OsvgyZfKq0 — Indian Coast Guard (@IndiaCoastGuard) September 3, 2020 -
కనకదుర్గ వారధిపై లీక్ అయిన ఆయిల్
తాడేపల్లిరూరల్: కృష్ణానది కనకదుర్గవారధిపై ఓ ట్యాంకర్లోనుంచి డీజిల్ ఆయిల్ లీక్ అవ్వడంతో వారధిపై ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బుధవారం గుంటూరు నుంచి విజయవాడ వెళ్తున్న డీజిల్ టాంకర్లోనుంచి ఆయిల్ లీక్ అయింది. సుమారు 500 మీటర్ల పొడవునా ఆయిల్ లీక్ అయిన అనంతరం గమనించిన ట్యాంకర్ డ్రైవర్ వాహనాన్ని ఆపి లీక్ అవుతున్న ఆయిల్ను నిలుపుదల చేశాడు. ఆయిల్ లీక్ అవ్వడంతో భారీ వాహనాలు సైతం జారిపోయాయి. సమాచారం అందుకున్న తాడేపల్లి ట్రాఫిక్ సీఐ బ్రహ్మయ్య, తాడేపల్లి సీఐలు అంకమ్మరావు, సుబ్రహ్మణ్యం ఘటనా స్థలానికి వెళ్లి, లీక్ అయి రోడ్డు మీద ఉన్న ఆయిల్పైన ఇసుక చల్లించి వాహనాలను వదిలారు. అయినప్పటికీ కార్లు, ద్విచక్రవాహనాలు జారుతూ ఉండడంతో తిరిగి మరలా ట్రాఫిక్ నిలిపివేసి మరోసారి ఇసుక చల్లించి దానిపైన సర్ఫ్ చల్లి విజయవాడ అగ్నిమాపక సిబ్బందిచేత నీళ్లు కొట్టించి శుభ్రం చేశారు. ఇలా శుభ్రం చేయడానికి గంటన్నర వ్యవధి పట్టడంతో కనకదుర్గవారధి 22వ కానా దగ్గర నుంచి కొలనుకొండ వరకు జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎట్టకేలకు రోడ్డు శుభ్రం చేసిన అనంతరం పోలీసులు ట్రాఫిక్ను పునరుద్ధరించారు. -
భూమి కుంగడంతోనే ప్రమాదం
టంగుటూరు: మండల పరిధిలోని టి.నాయుడుపాలెం సమీపంలో బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఆయిల్ ట్యాంకర్ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. విజయవాడ నుంచి 58 ట్యాంకర్లతో కడప వెళుతున్న గూడ్స్ రైలు 580 ఎగువ రైల్వే బ్రిడ్జి వద్దకు రాగానే పట్టాలు తప్పింది. మొత్తం ఏడు ట్యాంకర్లు పట్టాలు తప్పగా నాలుగు ట్యాంకర్లు బ్రిడ్జి కింద పడి ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడి దగ్ధమయ్యాయి. ఈ సంఘటన జరిగిన ప్రాంతం నుంచి ఐఓసీ లే అవుట్ పక్కనే ఉండటంతో భయాందోళన నెలకొంది. మంటలు క్రమం క్రమంగా పెద్దవి కావడంతో స్థానిక గ్రామస్తులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న ఐఓసీ రెస్క్యూ టీం, సౌత్ సెంట్రల్ రైల్వే రెస్క్యూ టీం, రైల్వే అధికారులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రమాదం ఎలా జరిగింది.. ప్రమాద విషయం తెలుసుకున్న రైల్వే అడిషనల్ ఆర్ఎం రామరాజు సంఘటనా స్థలానికి చేరుకొని ఇంజినీరింగ్ బృందంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై కమిటీ వేశామని, వారం రోజుల్లో నివేదిక వస్తుందని తెలిపారు. ప్రాథమిక అంచనా ప్రకారం మూడవ రైల్వే నిర్మాణ పనుల వల్ల భూమి కుంగి రైలు పట్టాలు తప్పినట్లు భావిస్తున్నామన్నారు. అగ్నిమాపక శాఖ అధికారులు సకాలంలో మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పిందని తెలిపారు. మిగిలిన 50 ట్యాంకర్లను టంగుటూరుకు చేర్చామన్నారు. గురువారం ఉదయం 300 మంది కార్మికులు మరమ్మతులు చేసి రైళ్ల రాకపోకలు పునరుద్ధరించారు. సంఘటనా స్థలాన్ని రైల్వే అధికారులు, ఒంగోలు డీఎస్పీ ప్రసాద్, సింగరాయకొండ సీఐ శ్రీనివాసులు, ఎస్సై రమణయ్యలు పరిశీలించారు. -
ఆయిల్ ట్యాంక్ పగలడంతో..
చెన్నై : తమిళనాడులో ఓ ట్యాంకర్ ప్రమాదానికి గురవడంతో.. వేల లీటర్ల రిఫైండ్ ఆయిల్ రోడ్డుపాలయింది. చెన్నై నుండి సేలం జిల్లా అత్తూర్కు ఆయిల్ లోడ్తో వెళ్తున్న ట్యాంకర్ కామరాజనగర్లో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయిల్ ట్యాంక్ పగిలిపోయింది. దీంతో వేలలీటర్ల ఆయిల్ వృథాగా పోయింది. స్థానికులు గిన్నెలు, బిందెలతో ఆయిల్ను పట్టుకునేందుకు పోటీ పడ్డారు. -
జిబ్రాల్టర్లో విడుదలైన నలుగురు భారతీయులు
లండన్: ఇరాన్కు చెందిన ఆయిల్ ట్యాంకర్లో ఉండి అరెస్టయిన కెప్టెన్ సహా నలుగురు భారత సిబ్బందిపై పోలీసుల విచారణ ముగిసి వారు జిబ్రాల్టర్లో గురువారం విడుదలయ్యారు. స్పెయిన్కు దక్షిణాన, సముద్ర తీరంలో ఉండే బ్రిటిష్ ప్రాంతమే ఈ జిబ్రాల్టర్. పనామా జెండా కలిగిన ఈ ఆయిల్ ట్యాంకర్ జిబ్రాల్టర్ జలాల్లోని ఐరోపా పాయింట్ వద్ద ఉండగా, గత నెల 4వ తేదీన జిబ్రాల్టర్ అధికారులు వారిని అడ్డగించి ట్యాంకర్ను తమ అధీనంలోకి తీసుకుని అందులోని 28 మంది సిబ్బందిని అరెస్టు చేశారు. సిబ్బందిలో ఎక్కువ మంది భారతీయులే. సిరియాపై యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఆంక్షలున్నాయి. ఈ ఆయిల్ ట్యాంకర్ ద్వారా సిరియాకు ముడి చమురును తీసుకెళ్తున్నారనే అనుమానంతో జిబ్రాల్టర్ అధికారులు సిబ్బందిని అరెస్టు చేశారు. అయితే అది సిరియాకు వెళ్తున్నది కాదని అప్పటి నుంచి ఇరాన్ ప్రభుత్వం, ట్యాంకర్ సిబ్బంది చెబుతూనే ఉన్నారు. దీంతో తాజాగా నలుగురు భారతీయులపై పోలీసులు విచారణ ముగించి, వారిని జిబ్రాల్టర్లో విడుదల చేశారు. -
ఆధిపత్యపోరులో భారతీయులు బందీలు
న్యూఢిల్లీ/లండన్: బ్రిటన్–ఇరాన్ల మధ్య సాగుతున్న ఆధిపత్యపోరులో భారతీయులు చిక్కుకున్నారు. తమ చమురునౌకను బ్రిటన్ స్వాధీనం చేసుకోవడంతో ప్రతీకారంగా హోర్ముజ్ జలసంధిగుండా వెళుతున్న బ్రిటిష్ చమురు నౌక ‘స్టెనా ఇంపెరో’ను ఇరాన్ శుక్రవారం స్వాధీనం చేసుకుంది. ఈ నౌకలో మొత్తం 23 మంది సిబ్బంది ఉండగా, వీరిలో కెప్టెన్ సహా 18 మంది భారతీయులే. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన భారత విదేశాంగ శాఖ ఈ 18 మందిని విడిపించేందుకు ఇరాన్తో చర్చిస్తోంది. చెరలోని భారతీయ సిబ్బందిని త్వరలో స్వదేశానికి తీసుకొస్తామని విదేశాంగ కార్యదర్శి రవీశ్ తెలిపారు. ఈ విషయమై హోర్ముజ్గన్ ప్రావిన్సు నౌకాశ్రయాలు, మారిటైమ్ డైరెక్టర్ జనరల్ అల్హమొరాద్ మాట్లాడుతూ..‘బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న ‘స్టెనా ఇంపెరో’ నౌక ఇరాన్కు చెందిన చేపల బోటును ఢీకొట్టింది. అంతర్జాతీయ నిబంధనల్ని ఉల్లంఘించింది. ఈ నౌకలో మొత్తం 23 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో కెప్టెన్ సహా 18 మంది భారతీయులు కాగా, రష్యా, ఫిలిప్పీన్స్, లాత్వియా, ఇతర దేశాలకు చెందిన ఐదుగురు ఉన్నారు’ అని తెలిపారు. స్వీడన్కు చెందిన స్టెనా బల్క్ అనే కంపెనీ ఈ నౌకను బ్రిటన్ కేంద్రంగా నిర్వహిస్తోంది. ఈ విషయమై స్టెనా బల్క్ ప్రెసిడెంట్ ఎరిక్ హనెల్ మాట్లాడుతూ..‘మా నౌక హోర్ముజ్ జలసంధిలో ఉండగానే మరో చిన్నపాటి నౌక, హెలికాప్టర్ దాన్ని సమీపించాయి. అంతర్జాతీయ జలాల్లోకి ‘స్టెనా ఇంపెరో’ ప్రవేశించిన కొద్దిసేపటికే సౌదీఅరేబియాలోని జుబైల్ నగరంవైపు కాకుండా దిశను మార్చుకుని ఇరాన్వైపు వెళ్లింది’ అని చెప్పారు. ఈయూ ఆంక్షలను ఉల్లంఘించి సిరియాకు ముడిచమురు సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలతో ఇరాన్కు చెందిన చమురు నౌకను బ్రిటిష్ మెరైన్లు జీబ్రాల్టర్ జలసంధి వద్ద ఇటీవల స్వాధీనం చేసుకున్నారు. -
రన్వేపై జారి పడిన ఇంధన ట్యాంకు
పనాజి: గోవా అంతర్జాతీయ విమానాశ్రయంలోభారీ ప్రమాదం తప్పింది. ఉన్నట్టుండి యుద్ధవిమానానికి సంబంధించిన ఆయిల్ ట్యాంకు రన్వే పై జారిపడింది. దీంతో ఇంధనం రన్వేపై పడి, మంటలంటుకున్నాయి. దట్టమైన పొగ అలుముకుంది. ఈ అనుకోని ఘటనతో ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. చర్యలు తీసుకోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. అయితే ముందు జాగ్రత్త చర్యగా రెండు గంటలపాటు కార్యకలాపాలను నిలిపి వేశారు. గోవా విమానాశ్రయంలో అన్ని రకాల సేవలను రెండు గంటల పాటు సస్పెండ్ చేశామని ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అధికారులు శనివారం మధ్యాహ్నం ట్విటర్ ద్వారా ప్రకటించారు. డబోలిం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో నావీకి చెందిన మిగ్ 29 కె విమానంలోని డిటాచ్బుల్ ఫ్యూయల్ ట్యాంకు రన్వేపై జారిపడిందని అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. భారతీయ నౌకా దళానికి చెందిన సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని రన్ వేను శుభ్రపరిచి, మరమ్మతు పనులు చేపట్టారని తెలిపారు. సాయంత్రం 4 గంటలకు యథావిధిగా కార్యక్రమాలు తిరిగి మొదలవుతాయని తెలిపారు. యుద్ధ విమానం కూడా సురక్షితంగానే ఉన్నట్లు వారు తెలిపారు. Due to jettisoned fuel tank on runway during MIG sortie the operations are closed for two hrs at Goa airport. Pl bear with us. — Goa Airport (@aaigoaairport) June 8, 2019 -
పెట్రోల్ ట్యాంకర్ పేలి 58 మంది మృతి
నియామే: ఆఫ్రికా దేశం నైగర్ రాజధాని నియామేలో బోల్తా పడిన పెట్రోల్ ట్యాంకర్ నుంచి స్థానికులు పెట్రోల్ సేకరిస్తుండగా అది పేలి 58 మంది మరణించారు. అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గర్లోని రైలు పట్టాలపై ఆదివారం రాత్రి ట్యాంకర్ బోల్తా పడి పెట్రోల్ కారుతుండగా, ఆ పెట్రోల్ను తెచ్చుకోడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడకు చేరుకున్నారు. అనంతరం ట్రక్కు పేలడంతో అక్కడ ఉన్నవాళ్లలో చాలా మంది మరణించారు. చుట్టుపక్కల ఇళ్లు కూడా ఈ మంటల కారణంగా ధ్వంసమయ్యాయి. 58 మంది మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. -
వరదలో కొట్టుకుపోయిన ఆయిల్ ట్యాంకర్
-
కొట్టుకుపోయిన ఆయిల్ ట్యాంకర్; మగ్గురు గల్లంతు
లక్నో: దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని చేకూరుస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్లో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు పొంగిపోర్లుతున్నాయి. దిగువ రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో ఈ ప్రభావం అధికంగా కనబడుతోంది. వరదల్లో చిక్కుకుని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ ఆయిల్ ట్యాంకర్ వరదల్లో కొట్టుకుపోయిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీచేశారు. అయితే వీటిని సరిగా అంచనా వేయని ఓ ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ బిజ్నూర్ నుంచి ఉత్తరాఖండ్ వెళ్లేందుకు తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. మధ్యలో గాగ్రా నదిలో వరద ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో ఆ వాహనం అందులో పడి కొట్టుకుపోయింది. ఆయిల్ ట్యాంకర్లో ప్రయాణిస్తున్న వ్యక్తులు తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది. దీనిని నది ఒడ్డున ఉన్న కొందరు వ్యక్తులు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విషయం తెలుసుకున్న రెస్క్యూ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలు ప్రారంభించాయి. ఉత్తరాఖండ్లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. బిజ్నూర్, ఉధమ్సింగ్ నగర్ జిల్లాలో వరద ప్రభావం ఎక్కువగా ఉండనున్నట్టు అధికారులు తెలిపారు. -
వరదల్లో చిక్కున్న ట్యాంకర్; మగ్గురు గల్లంతు
-
లోయలో పడిన ఆయిల్ ట్యాంకర్
సాక్షి, అరకులోయ : అరకులోయ–సుంకరమెట్ట రోడ్డులోని కొత్తభల్లుగుడ హాస్టల్ సమీపంలోని మలుపువద్ద ఓ ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి లోయలోకి దూసుకుపోయి బోల్తా పడింది. గురువారం రాత్రి 9గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ట్యాంకర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న సమయంలో విద్యుత్ వైర్లు కలిసిపోయి, సమీపంలోని ట్రాన్స్ఫారం వద్ద విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విద్యుత్ సరఫరా జరిగి ఉంటే ఈ ఆయిల్ ట్యాంకర్ పేలిపోయి పెద్దప్రమాదం జరిగి ఉండేది. విశాఖపట్నం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి ఎనిమిది వేల లీటర్ల డీజిల్, నాలుగు వేల లీటర్ల పెట్రోల్తో అరకులోయలోని నాయక్ ఆయిల్ బంక్కు ట్యాంకర్ బయలుదేరింది. గమ్యస్థానానికి 10 నిమిషాల్లో ట్యాంకర్ చేరుకుంటుందనగా కొత్తభల్లుగుడ హాస్టల్ సమీపంలోని మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించబోయే సమయంలో బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో అదుపు తప్పిన ట్యాంకర్ మలుపులోని రక్షణగోడ, విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి లోయలోకి బోల్తా కొట్టింది. ట్యాంకర్ డ్రైవర్ హరి,క్లీనర్ చిన్నలకు గాయాలయ్యాయి. వీరిద్దర్నీ విశాఖపట్నంలోని ఆస్పత్రికి తరలించారు. ఐవోసీ అధికారుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేసి, సంఘటన స్థలాన్ని పరిశీలించారు రూ.9 లక్షల ఆయిల్ నేలపాలు ఈ ప్రమాదం కారణంగా రూ.9 లక్షల విలువైన డీజిల్, పెట్రోల్ నేలపాలయ్యాయి. ట్యాంకర్ బోల్తా పడిందన్న సమాచారం తెలుసుకున్న కొత్త భల్లుగుడ,సమీపంలోని గ్రామాల గిరిజనులు సంఘటన ప్రాంతానికి చేరుకుని వృథాగా పోతున్న పెట్రోల్,డీజిల్ను బిందెలు,డబ్బాలతో పట్టుకున్నారు. ఆయిల్ ట్యాంకర్ కావడంతో మంటలు వ్యాపించే ప్రమాదం ఉందని ట్యాంకర్వద్దకు వెళ్లవద్దని పోలీసులు గిరిజనులను హెచ్చరించారు. ట్యాంకర్ వద్దకు వెళ్లకుండా నిలువరించారు. అందిన సమాచారం మేరకు పాడేరు అగ్నిమాపక వాహనం రాత్రి 11గంటల సమయంలో సంఘటన స్థలానికి వచ్చింది. మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది శుక్రవారం మధ్యాహ్నం వరకు తగిన చర్యలు తీసుకున్నారు. విద్యుత్ స్తంభం విరిగిపోవడంతో పాటు, వైర్లు తెగిపడడంతో ఈ ప్రాంతంలో గురువారం రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. -
ఆయిల్ ట్యాంకర్లో ఎర్రచందనం రవాణా
-
ఆయిల్ ట్యాంకర్లో ఎర్రచందనం దుంగల రవాణా
సాక్షి, కడప: ఎర్రచందనం స్మగ్లర్లు కొత్త పంథాను ఎన్నుకున్నారు. ఆయిల్ ట్యాంకర్లో ఎర్రచందనం దుంగలు తరలిస్తూ పట్టుబడ్డారు. వైఎస్సార్ జిల్లా సిద్దవటం మండలం కనుమలోపల్లె దగ్గర ఆయిల్ ట్యాంకర్లో రవాణా అవుతున్న 95 ఎర్రచందనం దుంగలను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ కోటి రూపాయలు ఉంటుందని అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు వాహనాల ద్వారా రవాణా చేస్తే పోలీసులు పట్టుకుంటారన్న భయంతో ఆయిల్ ట్యాంకర్లో దుంగలను నింపి రవాణా చేస్తుండడం విశేషం. అయితే ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
151 మంది అగ్నికి ఆహుతి
► ట్యాంకర్ బోల్తా పడటంతో పెట్రోల్ కోసం పోటెత్తిన జనం ► అకస్మాత్తుగా పేలిన ట్యాంకర్ ► పాక్లోని పంజాబ్లో దుర్ఘటన లాహోర్: పాకిస్తాన్లోని పంజాబ్లో జాతీయ రహదారిపై ఆదివారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఆయిల్ ట్యాంకర్ పేలిపో వడంతో 151 మంది దుర్మరణం చెందారు. మరో 140 మంది గాయాలపాలయ్యారు. పవిత్ర రంజాన్ పండుగకు ఒకరోజు ముందు చోటుచేసుకున్న ఈ దుర్ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కరాచీ నుంచి 50 వేల లీటర్ల పెట్రోల్తో లాహోర్ వెళ్తున్న ట్యాంకర్ బహవల్పూర్ జిల్లా అహ్మద్పూర్ వద్ద టైర్ పేలడంతో బోల్తాపడింది. దీంతో ట్యాంకర్లోని పెట్రోల్ లీక్ అయింది. దీన్ని గమనించిన స్థానిక గ్రామాల ప్రజలు పెట్రోల్ను తీసుకోవడానికి వందల సంఖ్యలో ట్యాంకర్ వద్దకు చేరుకున్నారు. ఈ సమయంలో ఉన్నట్టుండి భారీ పేలుడు సంభవించింది. దీంతో అక్కడ గుమిగూడిన జనం మంటల్లో చిక్కుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తి సిగరెట్ అంటించడం వల్లే పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు. ‘కనీసం 123 మంది వరకు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరో 100 మందిని సహాయక సిబ్బంది సమీప ఆస్పత్రులకు తరలించారు. అందులో 50 మంది పరిస్థితి విషమంగా ఉంది’ అని బహవల్పూర్ జిల్లా సమన్వయ అధికారి రాణా సలీమ్ అఫ్జల్ తెలిపారు. సహాయక చర్యలు చేపట్టిన అధికారి జమ్ సజ్జాద్ మాట్లాడుతూ, ‘చాలావరకు శరీరాలు పూర్తిగా కాలిపో యాయి. డీఎన్ఏ పరీక్షల ద్వారానే వారిని గుర్తించగలం’ అని వివరించారు. వెళ్లిపోమని చెప్పినా వినలేదు.. ట్యాంకర్ వద్దకు చుట్టుపక్క గ్రామాల ప్రజలు కూడా వచ్చారని, అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా పోలీసులు ఎంత చెప్పినా వారు వినలేదని బహవల్పూర్ ప్రాంతీయ పోలీసు అధికారి రాజా రిఫాత్ తెలిపారు. అకస్మాత్తుగా ట్యాంకర్ పేలడంతో సెకన్ల వ్యవధిలో అక్కడున్న వారు మంటల్లో చిక్కుకున్నారని పేర్కొన్నారు. క్షతగాత్రులను తరలించడానికి తన సొంత హెలికాప్టర్ను పంపిన పంజాబ్ ముఖ్యమంత్రి షాబాజ్ షరీఫ్.. బాధితులకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. కాగా, రంజాన్ వేడుకలు జరుపుకునేందుకు లండన్ వెళ్లిన ప్రధాని నవాజ్ షరీఫ్ తన పర్యటనను రద్దు చేసుకుని పాక్కు తిరుగు పయనమయ్యారు. -
ఆయిల్ ట్యాంకర్ పేలి 123 మంది మృతి
బహవల్పూర్: పాకిస్తాన్లో ఘోర ప్రమాదం జరిగింది. పంజాబ్ రాష్ట్రం బహవాల్పూర్లోని అహ్మద్పూర్లో ఆయిల్ ట్యాంకర్ పేలడంతో 123 మంది ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు ప్రమాదంలో ఆయిల్ ట్యాంకర్ నుంచి ఆయిల్ లీక్ అవుతుండటంతో దానిని తీసుకోవడానికి ఎగబడ్డవారితో పాటు.. అటుగా వెళ్తున్న పలువురు వాహనదారులు ఈ ప్రమాదంలో మృతిచెందినట్లు తెలుస్తోంది. మరో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. ఆయిల్ ట్యాంకర్ సమీపంలో సిగరెట్ తాగడం మూలంగా ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారిలో చాలామందికి 70 శాంతం కన్నా ఎక్కువ కాలిన గాయాలయ్యాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. మృతులను గుర్తుపట్టాలంటే డీఎన్ఏ టెస్ట్లు చేయాలని.. వారి శరీరాలు పూర్తిగా తగులబడ్డాయని సహాయక చర్యలు నిర్వహిస్తున్న అధికారులు వెల్లడించారు. -
బైక్ను ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్,మహిళ మృతి
-
ఘోర రోడ్డు ప్రమాదం ..
♦ పూతలపట్టువద్ద ఘోర రోడ్డు ప్రమాదం ♦ ముగ్గురి మృతి ♦ ఐదుగురికి గాయాలు లేకలేక పుట్టిన కొడుకు పుట్టు వెంట్రుకలు తిరుమల శ్రీవారి సన్నిధిలో తీయించాలని మహారాష్ట్రకు చెందిన దంపతులు అనుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా టెంపో ట్రావెల్లర్ వాహనంలో బయలుదేరారు. మరో రెండు గంటల్లో స్వామి సన్నిధి చేరుకోవాల్సి ఉంది. ఇంతలో విధి వక్రించింది. రెప్పపాటులో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన యాదమరి మండలంలక్ష్మయ్యకండిగ వద్ద ఆదివారం తెల్లవారు జామున జరిగింది. మొక్కు తీర్చుకుందామని వెళ్లిన వారు తిరిగిరాని లోకాలకు చేరుకున్నారని తెలియడంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. మూడు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. లక్ష్మయ్యకండిగ(యాదమరి) : యాదమరి మండలం లక్ష్మ య్యకండిగ గ్రామం వద్ద చెన్నై – బెంగళూరు జాతీయ రహదారిలో ఆదివా రం వేకువజామున 5 గంటల ప్రాం తంలో టెంపో ట్రావెల్లర్ వాహనం ఆయిల్ ట్యాంకర్ను ఢీకొనడంతో ముగ్గురు మృతిచెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. చిత్తూరు వెస్ట్ సీఐ ఆదినారాయణ, యాదమరి ఎస్ఐ రఘుపతి నాయుడు కథనం మేరకు.. మహారాష్ట్రలోని ఇండోర్ ప్రాంతానికి చెందిన సౌరవ్, శివలింగయ్య, విశాల్ కుటుం బాలు పదేళ్ల క్రితం కర్ణాటక రాష్ట్రం తుముకూరులోని ఇండస్ట్రియల్ ఏరియాలో స్థిరపడ్డాయి. అనేక ఏళ్లుగా తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలని అనుకుంటున్నారు. వీలు పడలేదు. ఈ క్రమంలో సౌరవ్, కామాక్షి దంపతులకు లేకలేక కొడుకు రిధయ్ పుట్టాడు. బాలుడి పుట్టు వెంట్రుకలను తిరుమల శ్రీవారి సన్నిధిలో తీయించడంతోపాటు స్వామిని తనివితీరా దర్శించుకోవాలని మూడు కుటుంబాల్లోని 11 మంది సభ్యులు అనుకున్నారు. టెంపో ట్రావెల్లర్ను బాడుగకు తీసుకుని శనివారం రాత్రి 11.30 గంటలకు సంతోషంగా బయలుదేరారు. వాహనాన్ని డ్రైవర్ విశాల్ బాబు (26) నడుతుపుతున్నాడు. ఆదివారం వేకువజామున 5 గంటల ప్రాంతంలో యాదమరి మండలం లక్ష్మయ్యకండిగ గ్రామం వద్ద చెన్నై–బెంగళూరు జాతీయ రహదారిలో చెన్నై నుంచి బెంగళూరుకు వెళుతున్న పామోలిన్ ట్యాంకర్ను టెంపో ట్రావెల్లర్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో చిన్నారి రిధయ్(2) అక్కడికక్కడే మృతి చెందాడు. కామాక్షి(27), సంతోషిని(47), శివలింగయ్య(38), రేణుక(30), పూజ(9), అభిషేక్(8), డ్రైవర్ విశాల్ బాబు(26)కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తిం చిన స్థానిక యువకులు వెంటనే పోలీ సులకు సమాచారం అందించి గాయపడిన వారిని 108లో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కామాక్షి, డ్రైవర్ విశాల్బాబు మృతి చెందారు. సంతోషిని, శివలింగయ్య, రేణుక, పూజ, అభిషేక్ ను వేలూరు సీఎంసీకి తరలించారు. సంతోషిని పరిస్థితి పరిస్థితి విషమంగా ఉంది. విశాల్(31), దీప్తి(31), సౌరవ్(30), రవికుమార్(25), లారీ ట్యాంకర్ డ్రైవర్ లోకేష్(26)కు తెలికపాటి గాయాలయ్యాయి. వారు చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చిత్తూరు వెస్ట్ సీఐ ఆదినారాయణ, యాదమరి ఎస్ఐ రఘుపతి నాయుడు తెలిపారు. మొక్కు తీర్చుకునేందుకు వెళుతుండగా.. మాది మహారాష్ట్రలోని ఇండోర్ ప్రాంతమని, పదేళ్ల క్రితం కర్ణాటకలోని తుమ్ముకూరుకు వచ్చి ఇండస్ట్రియల్ ఏరియాలో పనులు చేసుకుంటూ జీవిస్తున్నామని బాధితులు తెలిపారు. సౌరవ్, కామాక్షి దంపతులకు లేకలేక కొడుకు రిధయ్ పుట్టడంతో అతనికి తిరుమలలో వెంట్రుకలు తీయాలని మొక్కుకున్నారని పేర్కొన్నారు. సౌరవ్తోపాటు, అతని అమ్మ సంతోషిని, విశాల్, అతని భార్య దీప్తి, శివలింగయ్య, అతని భార్య రేణుక, వారి పిల్లలు అభిషేక్, పూజ, మరో స్నేహితుడు రవికుమార్తో కలిపి 11 మంది బయలుదేరామన్నారు. ప్రమాదంలో మొక్కుబడి ఉన్న పిల్లవాడు, అతని తల్లి చినిపోవడం చాల బాధాకమని కన్నీరుమున్నీరయ్యారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ ప్రమాదం జరిగిన వెంటనే విషయం తెలుసుకున్న డీఎస్పీ లక్ష్మీనాయుడు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కిలోమీటర్ల మేర నిలిచిపోయిన ట్రాఫిక్ను పునరుద్ధరించారు. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. -
సెల్ఫీ సరదా.. ఎంత పని చేసింది!
ఆయిల్ ట్యాంకర్పైకి ఎక్కి ఫొటో తీయించుకోబోయి విద్యుత్ షాక్కు గురైన వైనం తీవ్రగాయాల పాలైన గీతం వర్సిటీ విద్యార్థి అరకులోయ: ఫొటో సరదా..ఆ విద్యార్థి ప్రాణం మీదకు తెచ్చింది. ఆగి ఉన్న గూడ్స్ ఆయిల్ ట్యాంకర్ పైకి ఎక్కి ఫొటో తీయించుకోవాలన్న కోరిక అతడిని తీవ్ర గాయాలపాలయ్యేలా చేసింది. ఆటవిడుపు కోసం నలుగురు స్నేహితులతో అరుకులోయకు వచ్చిన హెండ్రీ జోన్స్ (20) సోమవారం ఉదయం అరకు రైల్వేస్టేషన్ సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైలు పైకెక్కి ఫొటో తీయించుకోవాలనుకున్నాడు. గార్డు బోగీ పక్క ఉన్న గూడ్స్ ఆయిల్ ట్యాంకర్ పైకి ఎక్కి ఫొటో తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో పైన ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో కింద పడిపోయాడు. స్పృహ కోల్పోయిన అతడిని చూసి చనిపోయాడనుకొని అక్కడకు వెళ్లడానికి ఎవరూ సాహసించలేకపోయారు. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది అతడిని పరిశీలించగా ఊపిరితో ఉండటాన్ని గుర్తించి అరుకులోయ ఏరియా ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం విశాఖలోని కింగ్జార్జ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం జోన్స్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, క్షతగాత్రుడు జోన్స్ విశాఖలోని మద్దిలపాలెం నివాసి. గీతం వర్సిటీలో బీటెక్ మెకానికల్ బ్రాంచిలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సూర్యాపేటలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా
-
ఆయిల్ ట్యాంకర్లో 950 కిలోల గంజాయి
అనకాపల్లి (విశాఖపట్నం) : ఆయిల్ ట్యాంకర్లో గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో శుక్రవారం సాయంత్రం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆయిల్ ట్యాంకర్లో తరలిస్తున్న 950 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మన్యం నుంచి మహానగరానికి తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. -
సినీ ఫక్కీలో దారిదోపిడీ
ఆయిల్ ట్యాంకర్ను అడ్డగించిన దుండగులు డ్రైవర్ను బెదిరించి రూ.3 లక్షల అపహరణ తాళ్లరేవు : సినీ ఫక్కీలో ఆయిల్ ట్యాంకర్ను కారుతో అడ్డుకున్న దుండగులు, డ్రైవర్ను బెదిరించి నగదు దోచుకున్న సంఘటన సంచలనం కలిగించింది. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నుంచి వస్తున్న పెట్రోల్ ట్యాంకర్ను దుండగులు దారికాచి, డ్రైవర్ను బెదిరించి రూ.3 లక్షలు దోచుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. యానాం నుంచి విశాఖపట్నం వెళుతున్న పెట్రోల్ ట్యాంకర్, తాళ్లరేవు మండలం మట్లపాలెం బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి దుండగులు కారుతో అడ్డగించారు. కారులోంచి ముగ్గురు వ్యక్తులు కిందకు దిగారు. వారిలో ఒకరు ట్యాంకర్ క్యాబిన్లోకి వెళ్లి డ్రైవర్ సాకా సత్యనారాయణను బెదిరించాడు. ట్యాంకర్ను ఆపకుండా పోతావా అంటూ అతడిపై దాడిచేశారు. నగదు ఇవ్వకపోతే చంపేస్తానని హెచ్చరించడంతో, పెట్రోలు కొనుగోలు కోసం తీసుకెళుతున్న రూ.3 లక్షల నగదును సత్యనారాయణ వారికిచ్చేశాడు. ఈ మేరకు సత్యనారాయణ స్థానిక కోరంగి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో కొల్లు నరసింహబాబుతో పాటు మరో ఇద్దరిపై ఏఎస్సై ఆర్వీఎన్ మూర్తి కేసు నమోదు చేశారు. కాకినాడ రూరల్ సీఐ పవన్కిషోర్ పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనపై పలు అనుమానాలు..! మట్లపాలెం వద్ద జరిగిన దారి దోపిడీ కేసులో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసుతో యానాంకు చెందిన పలువురు ప్రముఖులకు ప్రమేయమున్నట్టు తెలిసింది. ఈ కేసు నుంచి మిగిలిన ఇద్దరిని కాపాడేందుకు కొందరు ప్రజాప్రతినిధుల ద్వారా యత్నిస్తున్నట్టు సమాచారం. -
బొల్లాపల్లిలో రోడ్డు ప్రమాదం..ముగ్గురి మృతి
బొల్లాపల్లి మండల మేళ్లవాగు వద్ద వినుకొండ-కారంపూడి ప్రధాన రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను ఆయిల్ ట్యాంక ర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా..మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఆయిల్ ట్యాంకర్ అదే వేగంలో ఓ చెట్టును ఢీకొట్టడంతో డ్రైవర్కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను కారంపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆయిల్ ట్యాంకర్, కళాశాల బస్సు ఢీ
విద్యార్థులకు స్వల్ప గాయాలు తప్పిన పెను ప్రమాదం ఆర్టీఏ జంక్షన్లో ఘటన మామునూరు : వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ను వెనక నుంచి ఓ కళాశాల బస్సు ఢీకొట్టిన ఘటన నాయిడు పెట్రోల్ బంక్ సమీపంలోని ఆర్టీఏ జంక్షలో శుక్రవారం ఉదయం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్ 5వ డివిజన్ బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన బస్సు హన్మకొండలో సుమారు 30 మంది విద్యార్థులను ఎక్కించుకుని కళాశాలకు బయల్దేరింది. ఈ క్రమంలో వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై నాయుడుపెట్రోల్ బంక్ సమీపంలో ఆర్టీఏ జంక్షన్కు బస్సు చేరుకోగానే ఒక్కసారిగా అదుపు తప్పి డీజిల్ ట్యాంకర్ను వెనుక నుంచి అతివేగంగా ఢీకొట్టింది. దీంతో విద్యార్థులు స్వల్పగాయాలతో క్షేమంగా బయటపడ్డారు. ఆయిల్ ట్యాంకర్ వెనుక భాగం పాక్షికంగా ధ్వంసం కాగా బస్సు ముందుభాగం నుజ్జునుజ్జయింది. దీంతో భయాందోళనకు గురైన విద్యార్థులు అక్కడి నుంచి ఆటోల్లో ఆస్పత్రికి తరలివెళ్లగా మరికొందరు విద్యార్థులు వాహనాలపై కళాశాలకు వెళ్లారు. ఒకవేళ ఈ ప్రమాదంలో నిండుగా ఉన్న డీజిల్ ట్యాంకర్ గనుక పగిలి ఉంటే పెనుప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు అందోళన వ్యక్తం చేశారు. అకస్మాత్తుగా బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతోనే అదుపు తప్పిందని డ్రైవర్ తెలిపారు. మామునూరు పోలీసులు చేరుకుని ప్రమాద తీరును పరిశీలించారు. ట్రాఫిక్ జామ్ కాకుండా బస్సు, ఆయిల్ ట్యాంకర్ను రోడ్డుపై నుంచి తొలగించారు. ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ ఫిర్యాదు మేరకు వాగ్దేవి కళాశాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాంప్రసాద్ తెలిపారు. -
ఆయిల్ ట్యాంకర్ ఢీకొని వ్యక్తి మృతి
ఘట్కేసర్(రంగారెడ్డి): వేగంగా వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తి(30) అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం అంకుశాపూర్ వద్ద గురువారం చోటుచేసుకుంది. వరంగల్ వైపు నుంచి నగరానికి వస్తున్న ఆయిల్ ట్యాంకర్ అంకుశాపూర్ వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టింది. వాహనం అతని తల పై నుంచి పోవడంతో.. అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆయిల్ ట్యాంకర్ ఢీకొని వ్యక్తి మృతి
అర్వపల్లి: రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో.. అతను అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా అర్వపల్లి మండలం నాగారం బంగ్లా సమీపంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బైరపోయిన పాపయ్య(55) ఇంటి ముందు రోడ్డు దాటుతుండగా.. తిరుమలగిరి నుంచి సూర్యాపేట వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో పాపయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మరణించినా.. హీరోగా మారాడు!
ఒకవైపు మృత్యువు దూసుకొస్తోంది. ఆ విషయం విమానంలో ఉన్నవాళ్లెవరికీ తెలియదు.. పైలట్కు మాత్రం తెలుసు. అయినా ఎలాగోలా ఇతరుల ప్రాణాలు కాపాడాలని చివరి క్షణం వరకు ప్రయత్నించాడు. దగ్గర్లోనే ఆయిల్ ట్యాంకర్, రైల్వే ట్రాక్ ఉన్నా.. విమానం వాటి మీదకు పడకుండా దూరంగా చెట్ల మీద పడేలా చూశాడు. బీఎస్ఎఫ్ విమాన ప్రమాదంలో మృతి చెందిన ఆ పైలట్.. హీరోగా నిలిచాడు. సూపర్ కింగ్ బి200 విమాన ప్రమాదంలో 10 మంది బీఎస్ఎఫ్ సిబ్బంది మరణించిన ఘటనలో పైలట్.. నష్టాన్ని తగ్గించేందుకు తీవ్రంగా కృషిచేశాడు. టేకాఫ్ తర్వాత కొన్ని సెకన్లకే విమానంలో ఒక ఇంజన్ ఫెయిల్ అవ్వడాన్ని గుర్తించిన అతడు.. విమానాశ్రయం సరిహద్దు గోడ దగ్గర ఉన్న చెట్టుపై పడేలా చేసి భారీ నష్టాన్ని తగ్గించాడు. ఉదయం బయలుదేరిన క్షణంలోనే పైలట్ కెప్టెన్ భగవతి ప్రసాద్ ఇంజన్లో సమస్య ఉందని గ్రహించాడు. ఇంతలోనే కూలిపోతున్న పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించి భారీ నష్టాన్ని నియంత్రించగలిగాడు. కానీ కేవలం 60 సెకన్లలోనే పైలట్ ప్రసాద్, కో పైలట్ రాజ్ దేశ్ సహా పదిమంది బీఎస్ఎఫ్ సిబ్బంది జీవితాలు ఆహుతైపోయాయి. ప్రమాదం జరుగుతోందని తెలిసినా సిబ్బందిని రక్షించే సమయం లేకపోయింది. ఇంజన్లో సాంకేతిక లోపం రావడంతో నేలపై పడబోయిన విమానాన్ని 180 డిగ్రీల్లో యు టర్న్ తీసుకొన్నాడు. భారీనష్టం వాటిల్లకుండా చూసేందుకు పైలట్ తీవ్రంగా ప్రయత్నించి, విమానాన్ని బలవంతంగా చెట్టుకు గుద్దించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. విమానంలో సాంకేతిక లోపం వచ్చిందని గమనించగానే పైలట్ ఏటీసీ అనుమతితో ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించాడని కొందరు అధికారులు, ఇతర ఆధారాల ద్వారా తెలుస్తోంది. అయితే ఢిల్లీ పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైలు ఢీకొని మహిళ మృతి
వెల్దుర్తి: రైలు పట్టాలు దాటుతున్న ఓ మహిళను ప్రమాదవశాత్తు రైలు ఢీకొన్న సంఘటన వెల్దుర్తి మండలంలోని మాసాయిపేట- శ్రీనివాస్నగర్ రైల్వే స్టేషన్ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. మాసాయిపేట గ్రామం ఎస్సీ వాడకు చెందిన బ్యాగరి నాగమ్మ, యాదయ్యలు రైల్వే పట్టాలు దాటుతుండగా సికింద్రాబాద్ నుండి నాందేడ్ వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ రైలు అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆ మహిళ తలబాగం రైతు పట్టాల మధ్యలో పడి ఉండగా కాళ్ళు, చేతులు విరిగిపోయి రైలు పట్టాల అవతలి భాగంలో పడిపోయాయి. ఈ సంఘటనను గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారాన్ని తెలియజేసినట్టు తెలిసింది. -
ఆయిల్ ట్యాంకర్కు మంటలు
రాజమండ్రి : రాజమండ్రి రూరల్ కోలమూరు గ్రామం వద్ద మంగళవారం ఉదయం ఆయిల్ ట్యాంకర్ నుంచి మంటలు చెలరేగడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనలో ట్యాంకర్ క్యాబిన్ పూర్తిగా దగ్థమైంది. ట్యాంకర్ నుంచి పెట్రోల్ తీయడం వల్లే మంటలు చెలరేగయని తెలుస్తోంది. ట్యాంకర్ డ్రైవర్ వెంటనే అప్రమత్తం అవ్వడంతో ఘోర ప్రమాదం తప్పింది. మంటలను గుర్తించిన వెంటనే డ్రైవర్ వాహనాన్నిరోడ్డు పక్కన ఆపి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. -
రోడ్డుపై ప్రవహించిన నూనె.. పలువురికి గాయాలు
కాటేదాన్: రంగారెడ్డి జిల్లా కాటేదాన్ పారిశ్రామిక వాడ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడడంతో రోడ్డుపై నూనె ప్రవహించింది. పాత కర్నూలు రోడ్డు, మధుబన్ కాలనీ చౌరస్తాలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఆ మార్గంలో వస్తున్న పలువురు వాహనదారులు జారి కిందపడిపోగా గాయాలపాలయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పొలాల్లోకి దూసుకెళ్లిన ఆయిల్ట్యాంకర్
వరంగల్: వేగంగా వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి రోడ్డు పక్క ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన వరంగల్ జిల్లా హంటర్రోడ్లో జరిగింది. శ్రీలక్ష్మి దుర్గ ట్రాన్స్పోర్టుకు చెందిన ఆయిల్ ట్యాంకర్ ఈ రోజు ఉదయం వరంగల్ వెళ్తుండగా అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఇది గమనించిన స్థానికులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. జేసీబీల సాయంతో దాన్ని రోడ్డు మీదకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ఆయిల్ ట్యాంకర్ పేలి 85 మంది మృతి
జుబా: ఆయిల్ ట్యాంకర్ పేలి 85 మంది దుర్మరణం చెందగా, 100 మంది తీవ్రంగా గాయపడినట్టు అక్కడి ప్రభుత్వం అధికారకంగా గురువారం వెల్లడించింది. దక్షణ సూడన్ రాజధాని జూబాకు 250 కిలోమీటర్ల దూరంలో మార్థి అనే చిన్న టౌన్ సమీపంలో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకున్నట్టు ప్రభుత్వాధికారి ఒకరు పేర్కొన్నారు. ఆయిల్ ట్యాంకర్ లో ఇంధనాన్ని వెలికితీస్తుండగా ప్రమాదవాశాత్తూ ఆయిల్ ట్యాంకర్ పెద్ద శబ్ధంతో పేలడంతో మంటలు తీవ్రంగా వ్యాపించాయి. ఈ పేలుడు ధాటికి తీవ్ర గాయాల పాలైన బాధితులందరినీ అత్యవసర చికిత్స నిమిత్తం మార్ధి ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. మంటల తీవ్రత కారణంగా శరీర భాగాలు కాలిపోవడంతో మంట భరించలేక క్షతగాత్రులంతా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆస్పత్రిలో ఇచ్చే మందులు కూడా బాధితులకు ఉపశమనం అందించలేకపోతున్నాయని చాంధీ సేవియర్ అనే వైద్యుడు తెలిపారు. -
ఆయిల్ ట్యాంకర్, ఆటో ఢీ
కొణిజర్ల (ఖమ్మం) : ఆయిల్ ట్యాంకర్ ఆటోను ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మండలంలోని తనికెళ్ల గ్రామ సమీపంలో ఆటోను వేగంగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం బాధితుడు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆయిల్ ట్యాంకర్ దగ్ధం
-
ఆయిల్ ట్యాంకర్ దగ్ధం
మోతే (నల్లగొండ) : ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్ నుంచి మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటన సోమవారం నల్లగొండ జిల్లా మోతే మండలం నామవరం గ్రామంలోని పంజాబీ దాబా వద్ద జరిగింది. వివరాల ప్రకారం.. స్పిరిట్ లోడుతో హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ను డ్రైవర్.. మోతే మండలం నామవరం గ్రామం సమీపంలో ఉన్న పంజాబీ దాబా వద్ద నిలిపాడు. డ్రైవర్, క్లీనర్లిద్దరూ తినేందుకు వెళ్లగా ట్యాంకర్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. స్పిరిట్ ట్యాంకర్ కావడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి చూస్తుండగానే కాలి బూడిదైంది. కాగా దాబాకు సమీపంలోనే పెట్రోల్ బంక్ కూడా ఉండటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం జరుగలేదు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దూసుకొచ్చిన మృత్యువు
తాడేపల్లిగూడెం : ఆయిల్ ట్యాంకర్ ఆ అత్తాకోడళ్ల పాలిట మృత్యుశకటమైంది. జాతీయ రహదారి డివైడర్పై కూర్చున్న వారిపైకి లారీ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన గురువారం ఉదయం తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి జాతీయరహదారిపై కమ్మ కల్యాణ మండపం వద్ద చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. తణుకు రూరల్ మండలం తే తలి గ్రామానికి చెందిన భూపతిరాజు సత్యనారాయణరాజు, అతడి కుమారుడు శివరామరాజు దంపతులు రెండు మోటార్ సైకిళ్లపై తేతలి నుంచి ద్వారకాతిరుమలకు కల్యాణం చేయించుకునేందుకు బయలుదేరారు. వారు తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి జాతీయ రహదారి కమ్మ కల్యాణ మండపం దగ్గరకు వచ్చేసరికి ఒక మోటార్ సైకిల్ వెనుక చక్రం పేలిపోయింది. దీంతో సత్యనారాయణరాజు భార్య ధనలక్ష్మి (45) , శివరామరాజు భార్య గీతా పావని (25)ని దింపి పంక్చర్ వేరుుంచుకొచ్చే వరకు డివైడర్పై ఉండాలని కూర్చోపెట్టారు. సుమారు పది అడుగుల వెడల్పు కలిగిన డివైడర్పై వారు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. సత్యనారాయణరాజు తనతో పాటు ఉన్న కూతురు కొడుకు (మనుమడు) వర్మను తీసుకుని మెకానిక్ కోసం గ్రామంలోకి వెళ్లేందుకు రోడ్డుకు అటువైపునకు వెళ్లగా శివరామరాజు లఘుశంక తీర్చుకునేందుకు పక్కకు వెళ్లారు. ఈలోగా తణుకు నుంచి విజయవాడ వైపునకు అతివేగంగా వెళుతున్న ట్యాంకర్ అదుపు తప్పి డివైడర్పైకి ఎక్కి అక్కడే కూర్చొన్న ధనలక్ష్మి, పావనిలపై నుంచి దూసుకెళ్లింది. లారీ వారిని సుమారు 150 మీటర్ల దూరం వరకు ఈడ్చుకొని పోయింది. తీవ్రగాయాలపాలైన వారిద్దరు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్ లారీని వదిలి పరారయ్యారు. శివరామకృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదును పురస్కరించుకుని తాడేపల్లిగూడెం రూరల్ ఎస్సై వి.చంద్రశేఖర్ కేసు నమోదు చేశారు. మృతదేహాలకు తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం చేశారు . పెళ్లిరోజునే ఘటన శివరామరాజు, పావని దంపతుల పెళ్లిరోజు గురువారం కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి ద్వారకాతిరుమల చినవెంకన్నను దర్శించుకుని కల్యాణం జరిపించుకునేందుకు ఉదయం ఇంటి వద్ద నుంచి మోటార్ బైక్లపై సంతోషంగా బయలు దేరారు. అప్పటివరకు సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ప్రయూణిస్తుండగా మోటార్ సైకిల్ టైర్ పంక్చర్ కావడంతో ఆగాల్సి వచ్చింది. కళ్లెదుటే తమ భార్యలు అనంతలోకాలకు చేరడంతో ఘటనాస్థలంలో తండ్రీకొడుకుల రోదనలు చూపరులను కలచివేశాయి. తేతలిలో విషాదఛాయలు తేతలి (తణుకు) : పెదతాడేపల్లి అయిదో నంబర్ జాతీయరహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అత్తాకోడళ్లు మృతి చెందిన ఘటనతో తేతలిలో విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామానికి చెందిన అత్తాకోడళ్లు భూపతిరాజు ధనలక్ష్మి ,భూపతిరాజు గీతాపావని దుర్మరణం పాలవడంతో కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. శివరామరాజు తణుకులో ఫొటోస్టూడియో నిర్వహించుకుంటూ తల్లిదండ్రులతోనే కలిసి జీవిస్తున్నాడు. అతడికి మూడేళ్ల కిత్రం గీతాపావనితో వివాహమైంది. వారికి పిల్లలు లేరు. ధనలక్ష్మికి గీతా పావని స్వయానా అన్నయ్య కూతురు కావడంతో ఆమెను కూతురు కంటే ఎక్కువగా అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. వీరి మృతిపై గ్రామ ప్రముఖులు సంతాపం తెలిపారు. -
ఆయిల్ ట్యాంకర్ లో మంటలు
ఘట్కేసర్: ఎండ తీవ్రతకు ఓ ఆయిల్ ట్యాంకర్ ఇంజిన్లోంచి మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం తప్పింది. లారీ క్యాబిన్లో ఉన్న డ్రైవర్, క్లీనర్తో సహా 8 మంది సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. పోలీసులు, ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన గోవర్ధన్రెడ్డి ఆయిల్ ట్యాంకర్ మండల పరిధిలోని అంకుశాపూర్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ నుంచి శుక్రవారం సాయంత్రం 5 వేల లీటర్ల పెట్రోలు, 15 వేల లీటర్ల డీజిల్తో శివరాంపల్లిలోని సుప్రజ ఫిల్లింగ్ స్టేషన్కు బయలుదేరింది. డ్రైవర్ రాజేష్, క్లీనర్తో పాటు మరో ఆరుగురు వాహనంలో ఉన్నారు. మార్గమధ్యలో మండల కేంద్రంలోని మాధవరెడ్డి ఫ్లైఓవర్ వద్ద ఇంజిన్ నుంచి పొగలు వచ్చాయి. గమనించిన డ్రైవర్ రాజేష్ మిగతా వారిని అప్రమత్తం చేశాడు. వారంతా నడుస్తున్న ట్యాంకర్ నుంచి దూకేశారు. డ్రైవర్ రాజేష్ వాహనానికి ఆపి దిగాడు. క్షణాల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇంజిన్, క్యాబిన్ పూర్తిగా కాలిపోయాయి. రాజేష్ వెంటనే హెచ్పీసీఎల్ సంస్థ వారికి సమాచారం ఇచ్చారు. వారు ఫైర్ ఇంజిన్ను ఘటనా స్థలానికి పంపించారు. ముందు జాగ్రత్తగా నగరంలోని అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. మంటలు కొద్దిసేపటికి అదుపులోకి వచ్చాయి. ట్యాంకర్లోని డీజిల్, పెట్రోల్కు నిప్పు అంటుకోకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు, హెచ్పీసీఎల్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు ముందస్తు జాగ్రత్తగా రోడ్డుపై రాకపోకలు సాగించే వాహనాలను మరో మార్గంలోకి మళ్లించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవీందర్ తెలిపారు. -
రోడ్డు ప్రమాదం: 57 మంది దుర్మరణం?
-
రోడ్డు ప్రమాదం: 57 మంది దుర్మరణం
కరాచీ: పాకిస్థాన్ లో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ఆయిల్ ట్యాంకర్ ను బస్సు ఢీకొన్న ఘటనలో కనీసం 57 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. కరాచీ నుంచి షికాపూర్ కు వెళుతున్నఓ బస్సు సూపర్ హైవేపై అతి వేగంగా వస్తున్నఆయిల్ ట్యాంకర్ ను ఢీకొట్టడంతో రెండు వాహనాల్లో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతి కావడంతో భారీ సంఖ్య లో ప్రాణ నష్టం వాటిల్లింది. బస్సులో ఒక మహిళ, చిన్నారితో సహా 57 మంది వరకూ దుర్మరణం పాలైనట్లు ప్రాథమిక సమాచారం. ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని కరాచీ కమిషనర్ షోయబ్ సిద్ధిఖి తెలిపారు. -
గుండెపోటే గురుదేవుడు! ఆయిల్ ట్యాంకరే అవధూత!!
నవ్వింత ఈమధ్య మా రాంబాబు గాడిలో స్థితప్రజ్ఞత మరీ ఎక్కువైపోయింది. ఏం చెప్పినా అందులోంచి తాత్వికతను తవ్వి తీస్తున్నాడు. మొన్న నేనూ వాడూ ఆఫీసులోకి ప్రవేశించాక ఒక్కటంటే ఒక్క అడుగు దూరంలో లిఫ్ట్ మిస్సయ్యింది. సినిమాకు వెళ్లాక మన ముందు వాడికి టికెట్టు దక్కి, మనకు చిక్కనప్పటి బాధ ఆవరించి... నిరాశతో ‘అబ్బా’ అన్నాను. ‘‘హు... జీవితంలోనే లిఫ్ట్ దొరకలేదు. ఆఫ్టరాల్ ఈ లిఫ్ట్ మిస్సయితే బాధేముందిలేరా’’ అన్నాడు వాడు. ‘‘ఇందాకే కదరా, బస్సు మిస్సయితే ఎవరో బైకువాడు లిఫ్ట్ ఇచ్చాడు అన్నావ్’’ అని అడిగా. ‘‘కానీ బస్సులో నా స్వీట్హార్ట్ వెళ్తోంది కదా. బైకు లిఫ్టు దొరికిందని ఆనందించనా, బస్సు మిస్సయిందని విచారించనా?’’ ఊరెళ్దామని ఓరోజు రాత్రి ఎనిమిదింటికి వెళ్లాల్సిన రైలును పట్టుకోడానికి బయల్దేరాం మేం. కానీ నిమిషమున్నర వ్యవధిలో రైలు కాస్తా పాముల వాడి చేతుల్లోంచి పారిపోయే పాములా జారిపోయింది. పారిపోవడంతో సరిపెట్టిందా... చివరి బోగీ వెనక నల్లటి బ్యాక్గ్రౌండ్ మీద ‘ఎక్స్’ అనే అక్షరంతో వెక్కిరించింది. ‘ఆన్సర్షీటు మీద నీ జవాబు తప్పురా అనే మార్కే సదరు ఎక్స్’ - అంటాడు వాడు. ఎందుకైనా మంచిదని వాణ్ణి ఊరడిద్దామని ‘‘పోతే పోనీలేరా... ఇంకో రైల్లో వెళదాం లే’’ అన్నాను. ‘‘తప్పిపోయిన రైలుకు రిజర్వేషనైన టికెటుంటుంది. అయినా మిస్సవ్వక తప్పదు. ఇప్పుడెక్కాల్సిన రైలుకు రిజర్వేషనుండదు. అయినా ఎక్కక తప్పదు. అదేరా జీవితం’’ అన్నాడు వాడు. నిజమేననిపించింది. ‘‘నా బాధల్లా రైలు మిస్సయినందుకు కాదురా. మన చేతిలో టికెటు ఉన్నా, అధికారికంగా రిజర్వేషన్ చేయించుకుని సుఖంగా వెళ్లాల్సిన బెర్త్ అక్కడే ఉన్నా... దాని మీద ఎవడో తాను ఊహించని విధంగా, హాయిగా ప్రయాణిస్తుంటాడు. అధికారికంగా మనకు దఖలు పడాల్సిన సుఖాన్ని ఇంకెవడో అయాచితంగా అనుభవిస్తాడు. ఇదే జీవితం’’ అన్నాడు వాడు. అక్కసు లేదా అసూయ అనండి, మానవసహజమైన వాడి వైఖరికీ, ప్రవర్తనకూ సాటి మనిషిగా పూర్తిగా మద్దతుపలికాన్నేను. ఈమధ్యే రాంబాబు గాడికి మొదటిసారి హార్ట్ఎటాక్ వచ్చింది. హాస్పిటల్లో ఉన్నప్పుడు పరామర్శకు వెళ్లడం కుదరలేదు. వాడు కాస్త కోలుకున్నాక క్రమం తప్పక మార్నింగ్ వాక్ చేస్తున్నప్పుడు వాడితో జాయిన్ కావడం మొదలు పెట్టాను. ఈ క్రమంలో అప్పుట్లో మిస్ అయిన పరామర్శనూ, ఓదార్పునూ, ధైర్యాన్నీ ఒకే డోసులో ఇద్దామని- ‘‘పోన్లేరా... మైల్డ్ స్ట్రోకే కదా. మొదటి స్ట్రోకు వచ్చాక అన్ని జాగ్రత్తలూ తీసుకుంటే దాదాపు నలభై ఏళ్లు బతికారు ఏఎన్నార్. మామూలువాళ్ల కంటే ఇలా స్ట్రోక్ వచ్చాక జీవితాన్ని క్రమబద్ధం చేసుకున్నవాళ్లే సుదీర్ఘకాలం జీవించార్రా’’ అంటూ మంచి ఆరోగ్యకరమైన జీవితం కావాలంటే మామూలు వాళ్లైనా సరే అర్జెంటుగా గుండెపోటు తెచ్చుకోవడం చాలా అవసరం, అదెంతో మంచిది అన్నంత ఇన్స్పైరింగ్గా ఓ లెక్చర్ ఇచ్చా. రోడ్డు మీద మేము వాకింగ్ చేస్తున్న సమయంలోనే ఓ ఆయిల్ ట్యాంకర్ వెళ్తూ కనిపించింది. దాన్ని చూడగానే మళ్లీ మా రాంబాబుగాడిలో తాత్వికత నిద్రలేచింది. ‘‘హు... ఈ గుండే... దానితో నడిచే ఈ జీవితమూ ఆయిల్ ట్యాంకర్ వంటివేరా’’ అన్నాడు వాడు. నేను బిత్తరపోతూ అదేంట్రా అన్నాను. ‘‘చూశావా విచిత్రం... ఆయిల్ ట్యాంకర్ నిండా అనేక గ్యాలన్ల ఇంధనం ఉంటుంది. కానీ ఆ వాహనానికి గుండె కాయలాంటి చిన్న ట్యాంకర్లో ఉండే పెట్రోలు నిండుకుంటే అంతటి ఆయిల్ ట్యాంకరూ ఆగిపోతుంది. అలాగని నేరుగా ట్యాంకరులోని ఇంధనాన్ని వాహనానికి ఉన్న ట్యాంకులో పోసుకోడానికి వీలు కాదు. మన గుండె కూడా అంతేగదరా. దాని నాలుగ్గోడల నిండా ఎప్పుడూ రక్తం ఉండనే ఉంటుంది. అలాంటి గుండె కూడా మెదడుకు తన ఆధార్ కార్డూ, తన రేషన్ కార్డూ గట్రా చూపించి తన కోటా రక్తాన్ని మాత్రమే తాను వాడుకోవాలి. అన్ని అవయవాలకూ రక్తం సరఫరా చేసే దానికే రక్తం అందకపోతే, ఎంతటి మనిషైనా అంతటితో పోవాల్సిందే కదా. ఇది కూడా టికెట్టుండీ రెలైక్కలేకపోవడం, మన స్వీట్ హార్ట్ బస్సులో ఉండీ, బస్సెక్కలేకపోవడం లాంటిదే కదరా. జ్ఞానాన్ని నేర్చుకోవాలనే గుణం ఉండాలిగానీ... గుండెపోటూ గురువవుతుంది, ఆయిల్ ట్యాంకరూ అవధూత అవుతుంది. మిస్సయిన బస్సూ మహాతత్వ సారాన్ని బోధిస్తుంది’’ అంటూ పెద్ద పెద్ద మహాయోగులూ, యోగగురువులూ ఇచ్చేలాంటి స్పీచ్ ఇచ్చాడు వాడు. - యాసీన్ -
ఆయిల్ ట్యాంకర్ను ఢీకొన్న వోల్వో బస్సు
గుంటూరు : గుంటూరు జిల్లా రొంపిచర్ల మండం అన్నవరప్పాడు వద్ద శుక్రవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆగివున్న ఆయిల్ ట్యాంకర్ను వెనుక నుంచి ఒక ప్రైవేటు వోల్వో బస్సు ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ప్రకాశం జిల్లా కొండేపీకి చెందిన సిహెచ్ రమణయ్య, టంగుటూరుకు చెందిన బాలబ్రహ్మచారిల పరిస్థితి విషమంగా వుంది. గాయపడిన మరో 16 మంది ప్రయాణీకులను చికిత్సల కోసం నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వోల్వో బస్సు హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
వరంగల్లో పేలిన ఆయిల్ ట్యాంకర్