కాటేదాన్: రంగారెడ్డి జిల్లా కాటేదాన్ పారిశ్రామిక వాడ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడడంతో రోడ్డుపై నూనె ప్రవహించింది. పాత కర్నూలు రోడ్డు, మధుబన్ కాలనీ చౌరస్తాలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఆ మార్గంలో వస్తున్న పలువురు వాహనదారులు జారి కిందపడిపోగా గాయాలపాలయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.