పర్వతారోహకులు మంటల్లో కాలిపోయారు | Five mountain climbers killed in China forest fire | Sakshi
Sakshi News home page

పర్వతారోహకులు మంటల్లో కాలిపోయారు

Published Sun, Mar 22 2015 6:36 PM | Last Updated on Thu, Oct 4 2018 6:10 PM

Five mountain climbers killed in China forest fire

బీజింగ్: చైనాలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుని పర్వతారోహణ చేస్తున్న ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పర్వతారోహణ ప్రాంతంలో ఉన్న అటవీ ప్రాంతానికి నిప్పు అంటుకోవడం వల్ల ఈ ప్రాణ నష్టం సంభవించింది. చైనాలోని దాలియన్ అనే నగరంలో దాహేయ్ అనే పర్వతం ఉంది. దీనికి దిగువ భాగంతోపాటు కొండమీదుగా పెద్దపెద్ద అటవీ వనాలున్నాయి.

ఈ పర్వతాన్ని ఎక్కేందుకు తరచూ పర్వతారోహకులు వెళుతుంటారు. ఈ క్రమంలోనే కొందరు వ్యక్తులు పర్వతారోహణ చేస్తున్న సమయంలో మంటలు అంటుకోగా అందులో చిక్కుకుని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘటన ప్రాంతానికి దాదాపు 300 మంది అగ్ని మాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement