మలేసియా విమానం కూల్చివేతపై నిపుణుల నివేదిక
ద హేగ్(నెదర్లాండ్స్): ఉక్రెయిన్లో జూలై 17న 298 మందితో ప్రయాణిస్తున్న మలేసియా విమానం శక్తిమంతమైన వస్తువులు ఢీకొట్టడం వల్లే నేలకూలిందని డచ్ నిపుణుల కమిటీ ప్రాథమిక నివేదికలో వెల్లడించింది. ఆ విమానాన్ని క్షిపణితోనే కూల్చివేశారన్న వాదనకు మంగళవారం డచ్ భద్రతా మండలి సమర్పించిన ఈ నివేదికతో మరింత బలం చేకూరినట్లైంది. విమానం బ్లాక్బాక్సుల సమాచారం, ఫొటోలు, వీడియోల ఆధారంగా ప్రాథమికంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు కమిటీ తెలిపింది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. విమానాన్ని బయటి నుంచి బలమైన వస్తువులు ఢీకొట్టడం వల్లే కూలినట్లు తెలుస్తోందని, తుది నివేదికను 2015, జూలై నాటికి అందజేస్తామని కమిటీ వెల్లడించింది.
శక్తిమంతమైన వస్తువుల వల్లే విమానం కూలింది
Published Wed, Sep 10 2014 1:51 AM | Last Updated on Sat, Sep 2 2017 1:07 PM
Advertisement
Advertisement