నేపాల్లో మరో మారు భూకంపం | Mild earthquake hits Nepal | Sakshi
Sakshi News home page

నేపాల్లో మరో మారు భూకంపం

Published Mon, Aug 10 2015 11:23 AM | Last Updated on Sun, Sep 3 2017 7:10 AM

Mild earthquake hits Nepal

నేపాల్: పెను భూకంపానికి గురైన నేపాల్లో మరోసారి భూమి కంపించింది. సోమవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 4.9 తీవ్రతో స్వల్ప భూకంపం సంభవించింది. దీంతో ప్రజలంతా ఒక్కసారిగా భయం గుప్పిట్లోకి జారుకుని ఇళ్ల బయటకు పరుగులు తీశారు.

గోర్ఖా అనే ప్రాంతంలో భూకంపం కేంద్రం నమోదై ఉన్నట్లు జాతీయ భూగర్భ శాస్త్రజ్ఞులు తెలిపారు. ఖట్మాండుకు 150 కిలో మీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉండటంతో ప్రకంపనలు ఖట్మాండుకు కూడా వ్యాపించాయి. గత ఏప్రిల్ 25న భారీ భూకంపం చోటుచేసుకుని దాదాపు పదివేలమంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement