
పాక్ ప్రధానికి షాక్: మార్కెట్లు క్రాష్
కరాచీ: పనామా గేట్ వ్యవహారం పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్కు పదవీగండం తెచ్చి పెడితే అక్కడి స్టాక్మార్కెట్లను అశని పాతంలా తాకింది. పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు ఒక్క సారిగా కుప్పకూలిపోయాయి. ప్రధాని నవాజ్ షరీఫ్కు ఆ దేశ సుప్రీంకోర్టులో భారీ షాక్ తగలడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన భారీ అమ్మకాలకు దారి తీసింది.
కోర్టు తీర్పుపై అంచనాల నేపథ్యంలో ఆరంభంలో ఒక దశలో 12 వందల పాయింట్లు పడిపోయిన సూచీ ఆ తర్వాత కొద్దిగా తేరుకుని 45వేల మార్క్ వద్ద స్థిరపడింది. అయితే కోర్టు తీర్పు వెలువడిన నిమిషాల్లోనే అక్కడి మార్కెట్లు క్రాష్ అయ్యాయి. కరాచీ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ కెఎస్ఈ 700 పాయింట్లు పతనమైంది. కాగా ఈ తీర్పు నేపథ్యంలో ప్రధానమంత్రి పదవికి షరీఫ్ రాజీనామా చేశారు.