crash
-
ఇండస్ఇండ్ ఇన్వెస్టర్లకు షాక్
న్యూఢిల్లీ: డెరివేటివ్స్ పోర్ట్ఫోలియో ఖాతాల నిర్వహణలో రూ. 2,100 కోట్లమేర అంతరం నమోదైనట్లు తాజాగా ప్రయివేట్ రంగ సంస్థ ఇండస్ఇండ్ బ్యాంక్ వెల్లడించింది. అయితే బ్యాంక్వద్ద తగినంత రిజర్వులు, మూలధనం ఉండటంతో కవర్ చేసుకోగలమని పేర్కొంది. అయితే యాజమాన్యం హామీ ఇచ్చినప్పటికీ ఇన్వెస్టర్లలో ఆందోళనలు తలెత్తాయి. ఫలితంగా ట్రేడింగ్ ప్రారంభంలోనే ఇండస్ఇండ్ షేరు 10% పతనమైంది. ఆపై మరింత బలహీనపడుతూ 20% సర్క్యూట్ను తాకింది. సర్క్యూట్ నుంచి రిలీజ్ అయ్యాక మరింత దిగజారింది. వెరసి ట్రేడింగ్ ముగిసేసరికి 27% కుప్పకూలి రూ. 657 వద్ద నిలిచింది. ఒక దశలో రూ. 649 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది. ఏం జరిగిందంటే? ఖాతాలో వ్యత్యాసాన్ని గతేడాది(2024) సెప్టెంబరు– అక్టోబర్లో గుర్తించినట్లు ఇండస్ఇండ్ బ్యాంక్ సీఈవో, ఎండీ సుమంత్ కథ్పాలియా పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రాథమిక సమాచారాన్ని ఆర్బీఐకు గత వారమే నివేదించినట్లు తెలియజేశారు. అయితే తుది వివరాలు బయటి ఏజెన్సీతో చేయిస్తున్న ఆడిట్ ద్వారా వెల్లడికానున్నట్లు పేర్కొన్నారు. నివేదిక ఏప్రిల్ మొదట్లో వెలువడనున్నట్లు తెలియజేశారు. లాభదాయకత, మూలధన పటిష్టత నేపథ్యంలో ఈ ప్రభావాన్ని బ్యాంక్ సర్దుబాటు చేసుకోగలదన్నారు. 2024 ఏప్రిల్1కు ముందు 5–7ఏళ్లుగా డెరివేటివ్ పోర్ట్ఫోలియో ఖాతాలో తేడా నమోదవుతూ వచ్చిందని చెప్పారు. ఎక్స్ఛేంజీలకు సమాచారం...డెరివేటివ్స్ పోర్ట్ఫోలియోలో కొన్ని అంతరాలున్నట్లు సోమవారం ఇండస్ఇండ్ బ్యాంక్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు నివేదించింది. వీటి వల్ల బ్యాంక్ నెట్వర్త్పై 2.35 శాతంమేర ప్రతికూల ప్రభావం పడే వీలున్నట్లు పేర్కొంది. అంతర్గత సమీక్ష ద్వారా ఈ అంశాన్ని గుర్తించినట్లు వెల్లడించింది. వీటిని స్వతంత్రంగా సమీక్షించి నిర్ధారించేందుకు బయటి ఏజెన్సీని ఎంపిక చేసినట్లు తెలిపింది.కాగా.. ట్రెజరీ బిజినెస్లో గుర్తించిన వ్యత్యాసం అంతర్గత, చట్టబద్ధ, ఆర్బీఐ ఆడిట్లలో బయటపడకపోవడం గమనార్హం! 2024 ఏప్రిల్ 1నుంచి డెరివేటివ్స్లో ఇంటర్నల్ ట్రేడ్ను నిలిపివేస్తూ 2023 సెప్టెంబరులో జారీ అయిన ఆర్బీఐ సర్క్యులర్ కారణంగా అంతర్గత బుక్పై సమీక్షకు తెరతీసినట్లు సుమంత్ వెల్లడించారు. దీంతో బయటి ఆడిట్కు ఆదేశించినట్లు తెలియజేశారు. అయితే బ్యాంక్ ఎండీ, సీఈవోగా తిరిగి ఎంపిక చేయడంలో ఆర్బీఐపై ఈ అంశంప్రభావం చూపి ఉండవచ్చని పేర్కొన్నారు. బ్యాంక్ బోర్డు మూడేళ్ల కాలానికి ప్రతిపాదించగా.. గత వారం ఆర్బీఐ ఏడాది కాలానికే సుమంత్ బాధ్యతల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.రూ. 19,000 కోట్లు ఆవిరి...షేరు భారీ పతనంతో ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే ఇండస్ఇండ్ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)కు ఒక్కరోజులోనే రూ. 19,000 కోట్లమేర చిల్లుపడింది. ఈ నెల 10న నమోదైన రూ. 70,150 కోట్ల నుంచి బ్యాంక్ మార్కెట్ విలువ తాజాగా రూ. 51,168 కోట్లకు క్షీణించింది. బ్యాంక్ షేరు 2018 ఆగస్ట్లో రూ. 2038 వద్ద చరిత్రాత్మక గరిష్టానికి చేరింది. గతేడాది అంటే 2024 ఏప్రిల్ 8న రూ. 1,576 వద్ద నమోదైన గరిష్టం నుంచి తాజాగా 52 వారాల కనిష్టం రూ. 649ను తాకింది. వెరసి 59 శాతం పతనమైంది. ఫండ్స్ లబోదిబో ఇది ఇండెక్స్ షేరు కావడంతో 2025 ఫిబ్రవరికల్లా 35 మ్యూచువల్ ఫండ్స్ 360 పథకాల ద్వారా ఇండస్ఇండ్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేశాయి. 20.88 కోట్ల షేర్లను కలిగి ఉన్నాయి. ఈ హోల్డింగ్స్ విలువ రూ. 20,670 కోట్లు కాగా.. షేరు తాజా పతనంలో రూ. 6,970 కోట్లు ఆవిరైంది. దీంతో హోల్డింగ్స్ విలువ రూ. 13,700 కోట్లకు పరిమితమైంది. ఇక ప్యాసివ్ ఫండ్స్ సైతం బ్యాంక్ షేర్ల పతనంతో ప్రభావితమైనట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. -
ట్రంప్ ఎఫెక్ట్.. స్టాక్మార్కెట్లు అల్లకల్లోలం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రకటన శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లో కల్లోలం సృష్టించింది. మార్చి 4నుంచి కెనడా, మెక్సికోలపై సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఆ ప్రకటన దేశీయ స్టాక్ మార్కెట్లో ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. దీంతో మదుపర్లు ఇవాళ ఒక్కరోజే రూ.10లక్షల కోట్లు నష్టపోయారు.అంతర్జాతీయ ప్రతికూల అంశాలతో ఈ వారం ప్రారంభం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలతో కొనసాగాయి. మార్కెట్లో చివరి రోజున శుక్రవారం సైతం దేశీయ స్టాక్ మార్కెట్లో భారీ మొత్తంలో సంపద ఆవిరైంది. ఫలితంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు వరుస నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు.. మదుపరుల సంపదను లక్షల కోట్ల రూపాయల్లో కరిగించేశాయి. ఈ వారంలో మదుపర్లు సుమారు రూ.30లక్షల కోట్లకు పైగా నష్టపోయినట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇక ట్రంప్ సుంకాల ప్రకటనతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. 10 శాతం అధిక సుంకాలు విధిస్తామని చైనాను ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ సుంకాల ప్రకటన అనంతరం బలహీనమైన ప్రపంచ సంకేతాల మధ్య ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. 400 పాయింట్ల ప్రతికూల గ్యాప్తో ప్రారంభమైన బీఎస్ఈ సెన్సెక్స్ 73,141 వద్ద కనిష్టానికి పడిపోయి, చివరకు 1,414 పాయింట్లు లేదా 1.9 శాతం నష్టంతో 73,198 వద్ద ముగిసింది. ఈ క్రమంలో బీఎస్ఈ సెన్సెక్స్ 2,113 పాయింట్లు (2.8 శాతం) నష్టంతో వారాన్ని ముగించింది. అలాగే ఫిబ్రవరి నెలలో 4,303 పాయింట్లు లేదా 5.6 శాతం క్షీణించింది. సెన్సెక్స్ ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 85,978 నుంచి దాదాపు 15 శాతం నష్టపోయింది.ఇక నిఫ్టీ 1.9 శాతం లేదా 420 పాయింట్ల నష్టంతో 22,125 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 ఇండెక్స్ ఫిబ్రవరిలో 5.9 శాతం క్షీణించి, జీవితకాల గరిష్ట స్థాయి 26,277 నుంచి 16 శాతానికి చేరువైంది. నిఫ్టీ గరిష్ట స్థాయి నుంచి 20 శాతం వరకు పడిపోతే బేర్ మార్కెట్ పరిధిలోకి ప్రవేశిస్తుంది.ఐటీ, ఆటో షేర్లు తీవ్రంగా దెబ్బతినడంతో అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు భారీగా పెరిగాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ అత్యధికంగా 7 శాతం నష్టపోయింది. టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్ టెల్, టాటా మోటార్స్, టైటాన్, ఇన్ఫోసిస్, నెస్లే ఇండియా 4- 6 శాతం చొప్పున నష్టపోయాయి. సెన్సెక్స్ 30 షేర్లలో 27 షేర్లు 1 శాతానికి పైగా క్షీణించాయి. సెన్సెక్స్ 30 షేర్లలో ఒక్క హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మాత్రమే 2 శాతం లాభంతో మెరిసింది.విస్తృత మార్కెట్లో బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు 2 శాతానికి పైగా నష్టపోయాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ గత 5 సంవత్సరాలలో అతిపెద్ద నెలవారీ పతనాన్ని నమోదు చేసింది. అన్ని రంగాల సూచీలు 1 శాతానికి పైగా నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ ఐటీ, ఆటో సూచీలు 4 శాతం చొప్పున నష్టపోయాయి. ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్, క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్లు 2 శాతానికి పైగా నష్టపోయాయి. -
మధ్యప్రదేశ్లో కూలిన యుద్ధ విమానం
భోపాల్ : మధ్యప్రదేశ్ రాష్ట్రం శివపురి సమీపంలో వైమానిక దళానికి చెందిన ట్విన్ సీటర్ మిరాజ్ 2000 యుద్ధ విమానం కూలిపోయింది. నివాస ప్రాంతాల్లో కూలకపోవడంతో పెనుప్రమాదమే తప్పింది. ట్విన్ సీటర్ మిరాజ్ 2000లో ప్రయాణిస్తున్న ఇద్దరు పైలెట్లు సురక్షితంగా ప్రాణాలతో భయటపడ్డారు. A twin-seater Mirage 2000 fighter aircraft today crashed near Shivpuri in Madhya Pradesh while it was on a routine training sortie. A Court of Inquiry is being ordered to ascertain the cause of the crash. More details are awaited: Defence officials pic.twitter.com/I1mMYpN6gj— ANI (@ANI) February 6, 2025 -
చరిత్రలోనే అతిపెద్ద స్టాక్మార్కెట్ క్రాష్ రాబోతోందా?
ప్రఖ్యాత రచయిత, ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తకాన్ని రచించిన రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) స్టాక్ మార్కెట్కు (stock market) సంబంధించి సంచలన జోస్యం చెప్పారు. "చరిత్రలో అతిపెద్ద స్టాక్ మార్కెట్ క్రాష్" వచ్చే ఫిబ్రవరిలో సంభవిస్తుందని ఆయన అంచనా వేశారు. ఈ మేరకు ఆయన అందర్నీ అప్రమత్తం చేస్తూ ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ చేశారు. రాబోతున్న ఈ మహా పతనం సాంప్రదాయ పెట్టుబడి మార్కెట్లను అతలాకుతలం చేస్తుందని, అయితే వెంటనే మేల్కొని అప్రమత్తమయ్యేవారికి ఇది ఒక పెద్ద అవకాశంగా తాను చూస్తున్నట్లు కియోసాకి పేర్కొన్నారు. తన 2013 నాటి రిచ్ డాడ్ పుస్తకంలోనూ కియోసాకి రాబోయే స్టాక్ మార్కెట్ క్రాష్ గురించి హెచ్చరించారు. గతంలో వచ్చిన అన్ని పతనాలు దీని ముందు దిగదుడుపే అని కూడా అందులో చెప్పారు.2025 ఫిబ్రవరిలో స్టాక్ మార్కెట్ భారీ క్రాష్ సంభవించే అవకాశం ఉందని కియోసాకి తాజాగా చేసిన ట్వీట్.. ఆ పుస్తకంలోని జోస్యం నిజమవుతోందని సూచిస్తోంది. అయినప్పటికీ, దీని ద్వారా వినాశనం జరుగుతుందని కియోసాకి ఏమీ భావించడం లేదు. ఈ క్రాష్ గొప్ప కొనుగోలు అవకాశాన్ని అందిస్తుందని నమ్ముతున్నారు. "ఈ క్రాష్లో అన్నీ విక్రయానికి వస్తాయి" అని వివరించారు. మార్కెట్ పతనం సమయంలో కార్లు, ఇళ్లు వంటివి తక్కువ ధరకు వస్తాయంటున్నారు.ఇది మంచి వార్తే..కియోసాకి ప్రకారం ఇది మంచి వార్త. స్టాక్, బాండ్ మార్కెట్ల నుండి మూలధనం ప్రత్యామ్నాయ పెట్టుబడులలోకి, ముఖ్యంగా బిట్కాయిన్లోకి ప్రవహిస్తుంది. పెట్టుబడిదారులు సురక్షితమైన, మరింత లాభదాయకమైన ఎంపికలను వెతుకుతున్నందున, క్రిప్టోకరెన్సీ భారీ వృద్ధిని అందుకుంటుందని ఆయన అంచనా వేస్తున్నారు. బిట్కాయిన్, బంగారం, వెండి వాటిలో పెట్టుబడులు పెట్టాలని కియోసాకి చాలా కాలంగా తన ఫాలోవర్లకు సూచిస్తున్నారు.భవిష్యత్తు క్రిప్టోకరెన్సీదే..సంస్థాగత, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి క్రిప్టోకరెన్సీ ఆదరణ పొందుతున్న నేపథ్యంలో బిట్కాయిన్ను సురక్షిత స్వర్గంగా కియోసాకి అభివర్ణిస్తున్నారు. మార్కెట్ అస్థిరత సమయంలో బిట్కాయిన్ వృద్ధికి ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తుందని, ముఖ్యంగా స్టాక్లు, బాండ్లు వంటి సాంప్రదాయ ఆస్తులు తమ ఆకర్షణను కోల్పోతాయని ఆయన అభిప్రాయపడ్డారు. బిట్కాయిన్లో అతి చిన్న యూనిట్ అయిన సతోషి ఉన్నా కూడా గణనీయమైన సంపదకు దారితీస్తుందని కియోసాకి నొక్కిచెబుతున్నారు. 100 మిలియన్ల సతోషిలు కలిపితే ఒక బిట్కాయిన్. కియోసాకి అంచనా వేసిన మార్కెట్ క్రాష్ సమయం సమీపిస్తున్న కొద్దీ ఇన్వెస్టర్లలో గుబులు పుడుతుంటే ఆయన జోస్యం నిజమవుతుందా లేదా అని ప్రపంచం నిశితంగా గమనిస్తోంది.In RICH DADs PROPHECY-2013 I warned the buggiest stock market crash in history was coming. That crash will be in February 2025.Good news because in a crash everything goes on sale. Cars and houses on sale now.Better news billions will leave the stock and bond markets and…— Robert Kiyosaki (@theRealKiyosaki) January 27, 2025 -
స్టాక్ మార్కెట్కు వైరస్ అటాక్.. కుప్పకూలిన సూచీలు
చైనాలో విజృంభిస్తున్న హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) భారత్లోకి అడుగుపెట్టింది. ఈ వైరస్కు సంబంధించిన రెండు కేసులను ఒకటి కర్ణాటకలో, మరొకటి గుజరాత్లో భారత ప్రభుత్వం నిర్ధారించిన తర్వాత స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు అప్రమత్తం అయ్యారు. జాగ్రత్త విధానాన్ని ఎంచుకున్నారు. దీంతో అమ్మకాల ఒత్తిడితో దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. దేశీయ బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ (BSE) సెన్సెక్స్, ఎన్ఎస్ఈ (NSE) నిఫ్టీ 50 వారంలో మొదటి ట్రేడింగ్ సెషన్ను భారీ నష్టాలతో ముగించాయి. కౌంటర్లలో అమ్మకాల ఒత్తిడితో ఒక్కో సూచీ 1 శాతానికి పైగా పడిపోయింది. 30 షేర్ల సెన్సెక్స్ 1,258.12 పాయింట్లు లేదా 1.59 శాతం పతనమై 77,964.99 వద్ద స్థిరపడింది. ఈ రోజు ఈ ఇండెక్స్ 79,532.67 నుంచి 77,781.62 రేంజ్లో ట్రేడవుతోంది.సెన్సెక్స్ను ప్రతిబింబిస్తూ నిఫ్టీ 50 కూడా 388.70 పాయింట్లు లేదా 1.62 శాతం తగ్గి 23,616.05 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 సోమవారం నాడు 24,089.95 గరిష్ట స్థాయిని నమోదు చేయగా, రోజు కనిష్ట స్థాయి 23,551.90గా ఉంది.నిఫ్టీ50లోని 50 స్టాక్లలో 43 స్టాక్లు నష్టాలను చవిచూశాయి. ట్రెంట్, టాటా స్టీల్, బీపీసీఎల్, ఎన్టిపిసి, అదానీ ఎంటర్ప్రైజెస్ 4.60 శాతం వరకు నష్టపోయిన టాప్ లూజర్స్. మరోవైపు అపోలో హాస్పిటల్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టైటాన్ కంపెనీ, హెచ్సిఎల్ టెక్, ఐసిఐసిఐ బ్యాంక్ 1.94 శాతం వరకు లాభాలతో గ్రీన్లో ముగిసిన 7 షేర్లలో ఉన్నాయి.మార్కెట్లలో అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్, ఇండియా VIX, 15.58 శాతం క్షీణించి 15.65 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ స్మాల్క్యాప్ 100, నిఫ్టీ మిడ్క్యాప్ 100 సూచీలు వరుసగా 2.70 శాతం, 3.20 శాతం చొప్పున క్షీణించడంతో విస్తృత మార్కెట్లు కూడా బెంచ్మార్క్లను ప్రతిబింబించాయి.అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి, నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ అత్యంత దారుణంగా దెబ్బతింది. 4 శాతం నష్టపోయింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా భారీ నష్టాలను చవిచూశాయి. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ దాదాపు రూ.12 లక్షల కోట్ల మేర క్షీణించి రూ.439 లక్షల కోట్లకు పడిపోయింది.ఉదయం ఇలా..దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Market) సోమవారం ఉదయం ప్రారంభంలో లాభాల్లో ట్రేడయ్యాయి. ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ(Nifty) 74 పాయింట్లు లాభపడి 24,082కు చేరింది. సెన్సెక్స్(Sensex) 286 పాయింట్లు ఎగబాకి 79,523 వద్ద ట్రేడయింది. అమెరికా డాలర్ ఇండెక్స్ 108.91 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్(Crude Oil) బ్యారెల్ ధర 76.3 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.6 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.26 శాతం లాభపడింది. నాస్డాక్ 1.77 శాతం ఎగబాకింది.దేశీ స్టాక్ మార్కెట్లను ఈ వారం ప్రధానంగా కార్పొరేట్ ఫలితాలు నడిపించనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర(2024–25) మూడో త్రైమాసిక ఫలితాల సీజన్ ప్రారంభంకానుంది. దీనికితోడు పారిశ్రామికోత్పత్తి గణాంకాలు సైతం విడుదలకానున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు అక్టోబర్–డిసెంబర్(క్యూ3) ఫలితాలు, ఆర్థిక గణాంకాలపై దృష్టి పెట్టనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇవికాకుండా ప్రపంచ రాజకీయ, భౌగోళిక అంశాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు.ఇదీ చదవండి: మానసిక ఆరోగ్యానికీ బీమా ధీమావారాంతాన(డిసెంబర్ 10న) ప్రభుత్వం నవంబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి ఇండెక్స్(ఐఐపీ) గణాంకాలు వెల్లడించనుంది. అక్టోబర్లో ఐఐపీ వార్షికంగా 3.5 శాతం పుంజుకుంది. అంతేకాకుండా డిసెంబర్ నెలకు హెచ్ఎస్బీసీ సర్వీసెస్ పీఎంఐ గణాంకాలు విడుదలకానున్నాయి. వచ్చే నెల మొదట్లో కేంద్ర ప్రభుత్వం సార్వత్రిక బడ్జెట్ను ప్రకటించనుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
179 మంది మృతి..‘నాదే పూర్తి బాధ్యత’
దక్షిణ కొరియాలోని ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయం(Muan International Airport)లో జరిగిన జెజు ఎయిర్ విమాన ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి బాధ్యత తీసుకుంటానని సంస్థ సీఈఓ కిమ్ ఇబే తెలిపారు. దక్షిణ కొరియాలో ఆదివారం జరిగిన విమాన ప్రమాదంలో 179 మంది మృతి చెందారు. ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. విమానం ల్యాండింగ్ గేర్ వైఫల్యం అవ్వడంతో రన్వేపై జారుతూ ఎయిర్పోర్ట్ రక్షణ గోడను ఢీకొట్టి ఈ ప్రమాదం జరినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై జెజు ఎయిర్(Jeju Air) సీఈఓ స్పందిస్తూ కారణంతో సంబంధం లేకుండా పూర్తి బాధ్యత వహిస్తారని తెలిపారు.థాయ్లాండ్ నుంచి 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో దక్షిణ కొరియాలోని సియోల్కు 290 కిలోమీటర్ల దూరంలోని ముయాన్కు జెజు ఎయిర్కు చెందిన ఎయిర్క్రాఫ్ట్(Aircraft) ఆదివారం బయలుదేరింది. ఉదయం 9 గంటల సమయంలో ముయాన్ ఎయిర్పోర్ట్లో దిగుతుండగా విమానం ముందు భాగంలోని ల్యాండింగ్ గేర్ తెరుచుకోలేదు. అప్పటికే ల్యాండింగ్కు ముందు ఏటీసీ నుంచి పైలట్లకు ‘బర్డ్స్ట్రైక్’ వార్నింగ్ ఇచ్చారు. కానీ అప్పిటికే పరిస్థితి చేదాటిపోయిందని పైలట్ సిగ్నల్ పంపించారు. విమానం ముందు భాగంలోని ల్యాండింగ్ గేర్ వైఫల్యంతో రన్వేపై జారుతూ వెళ్లిన విమానం ఎయిర్పోర్ట్ రక్షణ గోడను ఢీకొని క్షణాల్లో మంటలు అంటుకుని పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మినహా అందరూ ప్రాణాలు కోల్పోయారు.ఇదీ చదవండి: యాపిల్ ఐఫోన్ 14, ఎస్ఈ నిలిపివేత..కారణం..ఘటనపై జెజు ఎయిర్ సీఈఓ కిమ్ ఇబే స్పందిస్తూ..‘ఈ విషాదకరమైన సంఘటన తీవ్రంగా కలచివేసింది. కారణంతో సంబంధం లేకుండా, ఘటనకు నేను పూర్తి బాధ్యత తీసుకుంటాను. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ప్రమాదంపై చేపడుతున్న విచారణకు అన్నివిధాలా సహకారం అందిస్తాం’ అని చెప్పారు. ఈ ప్రమాదానికి ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడానికి దర్యాప్తు కొనసాగుతోంది. -
బ్రెజిల్లో ఘోర విమాన ప్రమాదం.. పది మంది దుర్మరణం
రియో డిజనీరో: బ్రెజిల్లో క్రిస్మస్ వేళ విషాద ఘటన జరిగింది. ఓ వ్యాపారవేత్త తానే నడుపుతూ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి వెళుతున్న విమానం ప్రమాదవశాత్తు కుప్పకూలింది. విమానం ఇళ్లను ఢీకొట్టి కూలిపోవడంతో అందులో ఉన్న 10 మంది మృతి చెందారు. విమానం పడిన చోట భవనాల్లో ఉన్న మరో పదిహేను మందికి గాయాలయ్యాయి. టూరిస్టు పట్టణం గ్రామడోలో ఈ ఘటన చోటు చేసుకుంది.బ్రెజిలియన్ సివిల్ డిఫెన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం విమానం తొలుత ఓ బిల్డింగ్ను ఢీకొట్టి తర్వాత అందులో కింది ఫ్లోర్లో ఉన్న మొబైల్ ఫోన్లు అమ్మే షాపులోకి దూసుకెళ్లింది. దీంతో విమానంలో ఉన్నవారంతా మృతిచెందారు. గ్రామడో పర్వత ప్రాంతంలోని పాపులర్ టూరిస్టు డెస్టినేషన్. ఇది పర్యాటకులకు చాలా ఇష్టమైన ప్రదేశం.మరికొన్ని రోజుల్లో క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో ఇక్కడికి టూరిస్టుల తాకిడి ఎక్కువగా ఉంది. -
సీట్బెల్ట్తో కిడ్నీలకూ రక్షణ!
కారు డ్రైవిం చేసే సమయంలో సీట్బెల్ట్ పెట్టుకోవడంతో కేవలం యాక్సిడెంట్స్లో ప్రాణరక్షణ మాత్రమేగాక... కిడ్నీలకూ మంచి రక్షణ కలుగుతుందంటున్నారు అధ్యయన వేత్తలు. సీట్ బెల్ట్స్ కట్టుకున్నప్పుడు యాక్సిడెంట్ జరిగిన మరుక్షణం ఎయిర్బ్యాగ్ తెరచుకొని, వాహనంలోని వ్యక్తుల ప్రాణాలు కాపాడుతుందన్న విషయం తెలిసిందే. సీట్ బెల్ట్ పెట్టుకోవడమన్న అంశం కారణంగా వాహనంలోని ఎయిర్బ్యాగ్స్ తెరచుకుని, ప్రయాణికుల తలనూ, ఛాతీనీ అన్నివైపుల నుంచి ఆవరించడం వల్ల యాక్సిడెంట్ తాలూకు దెబ్బలను ప్రయాణికులకు తగలకుండా చూస్తాయి. అయితే ఇది మాత్రమే కాకుండా ఈ ఎయిర్బ్యాగ్ అనేది డ్రైవింగ్ చేసే వ్యక్తి మూత్రపిండాలనూ కాపాడుతుందని అమెరికన్ యూరాలజీ అసోసియేషన్కు చెందిన కొందరు అధ్యయన వేత్తలు చెబుతున్నారు. దాదాపు మూడు లక్షల మందిపై నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం తేటతెల్లమైనట్లు పేర్కొన్నారు. ఈ అధ్యయనం ద్వారా యాక్సిడెంట్ తర్వాత ఎయిర్బ్యాగ్ విచ్చుకోవడం వల్ల 2,580 మంది కిడ్నీలకు రక్షణ లభించిందంటూ వారు వివరించారు. (చదవండి: ముక్కుదిబ్బడ బాధిస్తోందా?! ) -
కుప్పకూలిన విమానం..
-
ప్రాణం తీసిన సెల్ఫ్ డ్రైవింగ్ కార్.. నలుగురు భారతీయులు దుర్మరణం
ఒట్టావా : టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కారు నలుగురు ప్రాణాలు తీసింది. కెనడా టొరంటో నగరం లేక్ షోర్ బౌలేవార్డ్ ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు మృత్యువాత పడ్డారు. ఓ యువతి ప్రాణపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గుజరాత్లోని గోద్రా చెందిన ఒకే కుటుంబసభ్యులు కేట్ గోహిల్,నీల్ గోహిల్తో పాటు వారి స్నేహితులు ఆ కారులో ఉన్నట్లు కెనడా స్థానిక మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. స్థానిక పోలీసుల సమాచారం మేరకు..టొరంటో నగరంలో బుధవారం అర్ధరాత్రి 12:15 గంటల సమయంలో లేక్ షోర్ బౌలేవార్డ్ రహదారిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కారులో అతి వేగతంతో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో టెస్లా కారు బ్యాటరీలో లోపాలు తలెత్తాయి. కారు అదుపు తప్పి పక్కనే ఉన్న గార్డ్ రైల్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో టెస్లా కారులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో కారులో ఉన్న యువతి యువకులు మంటల్లో చిక్కుకున్నారు.సరిగ్గా ప్రమాదం జరిగి వెంటనే ఆటుగా వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడు టెస్లా కారు అద్దాలు పగులగొట్టి బాధితుల్ని రక్షించే ప్రయత్నం చేశారు. కారు లోపల ఉన్న ఓ యువతిని బయటకు లాగి ఆస్పత్రికి తరలించారు. మిగిలిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతి పరిస్థితి సైతం విషమంగా ఉన్నట్లు సమాచారం.టెస్లా కారు ప్రమాదంపై స్థానికుడు ఫోర్మెన్ బారో మాట్లాడుతూ..ప్రమాదం జరిగిన ప్రాంతంలో నది ప్రవహిస్తుంది. ఆ నదికి ఎదురుగా మేం ఉన్నాం. కారు నుంచి 20 నుంచి 20 అడుగుల పైకి మంటలు ఎగిసి పడ్డాయి. దీంతో వెంటనే బాధితుల్ని రక్షించేందుకు ప్రయత్నించాం. అప్పటికే ఘోరం జరిగిందని విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద ఘటనపై భారత్లో ఉన్న వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తామని తెలిపారు. -
అంబానీకి మార్కెట్ సెగ.. రూ. 1.32 లక్షల కోట్లు ఆవిరి!
ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీకి షేర్ మార్కెట్ సెగ తగిలింది. భారత్లో అత్యంత విలువైన సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని షేర్లు భారీగా పతనమవడంతో భారీ నష్టాన్ని చవిచూసింది.షేర్ మార్కెట్లో అమ్మకాల జోరుతో కేవలం నాలుగు రోజుల్లోనే కంపెనీ రూ. 1.32 లక్షల కోట్లు నష్టపోయింది. కొద్ది రోజుల క్రితం రూ. 20 లక్షల కోట్ల మార్కును అధిగమించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ అక్టోబర్ 4 నాటికి రూ.18.76 లక్షల కోట్లకు తగ్గింది. శుక్రవారం కంపెనీ షేరు ధర రూ.42.45 (1.51%) తగ్గింది.ఇదీ చదవండి: పడిలేచిన కెరటంలా అనిల్ అంబానీ..రిలయన్స్ షేరులో భారీ క్షీణత కనిపించినప్పటికీ దేశంలో ముఖేష్ అంబానీనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. ఫోర్బ్స్ ప్రకారం.. అక్టోబర్ 4 నాటికి అంబానీ రియల్ టైమ్ నెట్వర్త్ రూ.916055 కోట్లు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, నిరంతర విదేశీ మూలధన ప్రవాహం కారణంగా మార్కెట్ క్రాష్ అయింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సరఫరా అనిశ్చితి కారణంగా గ్లోబల్ క్రూడ్ ధరలు పెరగడం మార్కెట్ సెంటిమెంట్లను దెబ్బతీసింది. -
దలాల్ స్ట్రీట్.. ఢమాల్! మార్కెట్ల భారీ పతనం
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీగా పతనమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1,729.77 పాయింట్లు లేదా 2.05% పతనమై 82,536.52 వద్ద ముగిసింది. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ 529.95 పాయింట్లు లేదా 2.05% క్షీణించి 25,266.95 వద్దకు పడిపోయింది.బీఎస్ఈ సెన్సెక్స్లో ఒక్క జేఎస్డబ్ల్యూ స్టీల్ మాత్రమే గ్రీన్లో ట్రేడవుతోంది. మిగిలిన షేర్లు స్టాక్లు ఎరుపు రంగులో ఉన్నాయి. లార్సెన్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటర్స్, రిలయన్స్, మారుతీ సుజుకీ టాప్ లూజర్స్గా ఉన్నాయి.అదేవిధంగా నిఫ్టీ 50లో జేఎస్డబ్ల్యూ స్టీల్, ఓఎన్జీసీ మాత్రమే లాభపడగా, బీపీసీఎల్, శ్రీరామ్ ఫైనాన్స్, లార్సెన్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటర్స్ భారీ నష్టాలను చవి చూశాయి.పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ఫలితంగా భారత్ వాణిజ్యంపై ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పశ్చమాసియాలో వేగంగా మారిపోతున్న భౌగోళిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అప్రమత్తమైన మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ పతనంలో కొనసాగుతున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
రష్యాలో కుప్పకూలిన హెలికాప్టర్.. 22 మంది మృతి
మాస్కో: తూర్పు రష్యాలో 22 మందితో ప్రయాణిస్తూ అదృశ్యమైన హెలికాప్టర్ ఘటన విషాదాంతమైంది. హెలికాప్టర్ కూలిపోయినట్లు అధికారులు ప్రకటించారు. హెలికాప్టర్ నుంచి చివరిసారి సంకేతాలు వచ్చిన ప్రాంతంలో హెలికాప్టర్ శకలాలను గుర్తించినట్లు వెల్లడించారు.హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నవారిలో అందరూ చనిపోయినట్లు భావిస్తున్నామని, ఇప్పటివరకు 17 మంది మృతదేహాలు వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. మిగతా ఐదుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు.A Vityaz Aero Mil Mi-8 helicopter (RA-25656) impacted terrain at an elevation of 900 m after taking off from the Vachkazhets volcano in Kamchatka Krai, Russia. At least 17 occupants have reportedly died:https://t.co/qGBfRTfp6z pic.twitter.com/fEUPuoUZQ4— Aviation Safety Network (ASN) (@AviationSafety) September 1, 2024 ఎంఐ-8 శ్రేణికి చెందిన ఈ హెలికాప్టర్.. ముగ్గురు సిబ్బంది, 19 మంది ప్రయాణికులతో రష్యా తూర్పు ప్రాంతంలోని కమ్చత్కా ద్వీపకల్పంలోని వచ్కజెట్స్ అగ్ని పర్వతం సమీపం నుంచి శనివారం(ఆగస్టు31) బయల్దేరింది. కానీ, గమ్యస్థానానికి చేరలేదు.వచ్కజెట్స్ సమీపంలో రాడార్ నుంచి హెలికాప్టర్ మాయమైంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులే ప్రమాదానికి కారణమైనట్లు అంచనా వేస్తున్నారు. ఎంఐ-8 శ్రేణి హెలికాప్టర్లు తరచు ప్రమాదాలకు గురవుతున్నప్పటికీ రష్యాలో వాటిని ఎక్కువగా వినియోగిస్తుండడం గమనార్హం. -
ఇది టైప్ చేశారంటే అంతే.. ఐఫోన్ క్రాష్!
ఐఫోన్లు, ఐప్యాడ్లలో కొత్త బగ్ ఒకటి బయటపడింది. కొన్ని అక్షరాలను టైప్ చేస్తే ఐఫోన్లు, ఐప్యాడ్లు క్రాష్ అవుతున్నాయి. “”: తర్వాత ఏదైనా అక్షరం టైప్ చేయగానే స్ప్రింగ్బోర్డ్ అని పిలిచే యాపిల్ డివైజ్ ఇంటర్ఫేస్ క్షణంలో క్రాష్ అయ్యి తిరిగి లాక్ స్క్రీన్కి వెళ్తోంది.ఈ విషయాన్ని మొదట ఓ సెక్యూరిటీ రీసెర్చర్ గుర్తించారు. ఆ తర్వాత టెక్ పబ్లికేషన్ ‘టెక్క్రంచ్’ కూడా దీన్ని పరీక్షించింది. సెట్టింగ్స్ యాప్ లేదా యాప్ యాప్ లైబ్రరీలోని సెర్చ్ బార్లో ఈ అక్షరాలను టైప్ చేయగా క్రాష్ అవుతోందని ధ్రువీకరించింది. కొన్ని సందర్భాల్లో డివైజ్ సాధారణ స్థితికి రావడానికి ముందు స్క్రీన్ ఒక సెకను బ్లాక్గా ఫ్లాష్ కావచ్చని పేర్కొంది.అయితే ఈ బగ్ భద్రతా ముప్పు కాదని నిపుణులు చెబుతున్నారు. ఐఓఎస్ సెక్యూరిటీ రీసెర్చర్ అయిన రియాన్ స్టోర్జ్ సమస్యను విశ్లేషిస్తూ ఇది మీ డివైజ్ భద్రతకు హాని కలిగించదని నిర్ధారించారు. డబుల్యూ అనే సెక్యూరిటీ స్టార్టప్ని స్థాపించిన మరో ఐఓఎస్ నిపుణుడు పాట్రిక్ వార్డ్లే కూడా బగ్ కొంచెం ఇబ్బంది కలిగించేదే అయినా ప్రమాదకరం కాదని అంగీకరిస్తున్నారు.కాగా ఈ బగ్పై యాపిల్ ఇంకా స్పందించలేదు. అయితే వారు భవిష్యత్తు అప్డేట్లో దాన్ని పరిష్కరించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ అసౌకర్యాన్ని నివారించాలనుకుంటే, మీ ఐఫోన్, ఐప్యాడ్ సెర్చ్ బార్లలో “”: అని మాత్రం టైప్ చేయొద్దు. -
నేపాల్లో హెలికాప్టర్ ప్రమాదం.. నలుగురి మృతి
ఖాట్మాండు: నేపాల్లో హెలికాప్టర్ కూలిపోయింది. బుధవారం మధ్యాహ్నం నువాకోట్ జిల్లాలోని శివపురి ప్రాంతంలో ఎయిర్ డైనాస్టీ హెలికాప్టర్ కూలిపోయిందని స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఘటనలో మొత్తం నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఖాట్మాండు నుంచి రాసువాకు వెళ్తుండగా నువాకోట్ జిల్లాలోని సూర్య చౌర్-7 వద్ద హెలికాప్టర్ కొండను ఢీకొట్టినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందటంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. హెలికాప్టర్ మధ్యాహ్నం 1:54 గంటలకు ఖాట్మండు నుంచి బయలుదరి.. సూర్య చౌర్ చేరుకున్న తర్వాత అధికారులతో సిగ్నల్స్ కోల్పోయినట్లు తెలుస్తోంది. టేకాఫ్ అయిన మూడు నిమిషాలకే హెలికాప్టర్లో సంబంధాలు తెగిపోయనట్లు అధికారులు పేర్కొన్నారు. -
మార్కెట్ క్రాష్.. సెన్సెక్స్ 2,222 పాయింట్లు పతనం
దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం భారీగా పతనమయ్యాయి. ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్న బెంచ్ మార్క్ సూచీలు ఏమాత్రం కోలుకోలేపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలో భారీ నష్టాల ప్రభావంతో భారతీయ మార్కెట్లు భారీగా వెనక్కి తగ్గాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 2,222.55 పాయింట్లు లేదా 2.74% క్షీణించి 78,759.40 వద్దకు పడిపోయింది. నిఫ్టీ కూడా 667.75 పాయింట్లు లేదా 2.70% శాతం నష్టపోయి 24,049.95 వద్దకు క్షీణించింది.రంగాలవారీగా అన్ని సూచీలు రెడ్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 50లో టాటా మోటార్స్ టాప్ లూజర్గా ఉండగా, టాటా స్టీల్, మారుతీ, అదానీ పోర్ట్స్, ఎస్బిఐ మరియు జెఎస్డబ్ల్యు స్టీల్ భారీగా క్షీణించాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
18 లక్షల కోట్ల సంపద ఆవిరి..
-
15 వేల మంది తొలగింపు ప్రకటన.. షేర్లు భారీ పతనం
ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ ఇంటెల్ కార్పోరేషన్ భారీగా నష్టపోయింది. భారీ వృద్ధి అంచనాతో 15,000 ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికను ప్రకటించిన మరుసటి రోజే ఆ కంపెనీ షేర్లు 40 సంవత్సరాలలో అతిపెద్ద పతనాన్ని చవిచూశాయి.శుక్రవారం న్యూయార్క్లో ట్రేడింగ్ ప్రారంభించిన తర్వాత షేర్లు 26% పైగా పడిపోయాయి. కంపెనీ మార్కెట్ విలువలో సుమారు 32 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయాయి. బ్లూమ్బెర్గ్ సంకలనం చేసిన డేటా ప్రకారం, కనీసం 1982 నుంచి కంపెనీ స్టాక్ అతిపెద్ద ఇంట్రాడే పతనాన్ని ఇది సూచిస్తోంది.ప్రస్తుత త్రైమాసికంలో అమ్మకాలు 12.5 బిలియన్ డాలర్ల నుంచి 13.5 బిలియన్ డాలర్లుగా ఉంటాయని కంపెనీ గురువారం తెలిపింది. బ్లూమ్బెర్గ్ సంకలనం చేసిన డేటా ప్రకారం విశ్లేషకులు సగటున 14.38 బిలియన్ డాలర్లు అంచనా వేశారు. కానీ ఇంటెల్ ఒక్కో షేరు 3 సెంట్ల చొప్పున నష్టపోయాయి. ఇంటెల్ కంపెనీలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,10,000 మంది ఉద్యోగులు ఉండగా 15% మందికిపైగా తగ్గించాలని యోచిస్తున్నట్లు ఇంటెల్ తాజాగా తెలిపింది. -
వైరల్ వీడియోల కోసం మరీ ఇలానా..! ఏకంగా రైలు పట్టాలనే..!
ఇటీవల సోషల్ మీడియా పిచ్చి మాములుగా లేదు. ఎంతలా అంటే సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ చేసేందుకు ఎలాంటి పిచ్చి పనులు చేసేందుకైనా వెనకాడటం లేదు. వ్యూస్, లైక్లు, ఫాలోవర్లు ఇదే లోకం, లక్ష్యం అన్నట్లుగా ఎలా పడితే అలా వీడియోలు తీసి పోస్ట్ చేస్తున్నారు. అది సమంజసమైన వీడియోనేనా, నెటిజన్లకు ఉపయోగపడుతుందా అనేది అనవసరం. కొందరైతే ఘోరం ప్రమాదాలను సృష్టించి ఇతరుల ప్రాణాల రిస్క్లో పడేసి మరీ వీడియోలు తీసేస్తున్నారు. ఇలాంటి పనే చేశాడు 17 ఏళ్ల కుర్రాడు.ఏం చేశాడంటే..అమెరికాలోని నెబ్రస్కా రాష్ట్రానికి చెందిన 17 ఏళ్ల కుర్రాడికి యూట్యూబ్లో వీడియో వైరల్ చేయాలనే కోరికతో దారుణానికి ఒడిగట్టాడు. వీడియో కోసం అని ఏప్రిల్లో మోన్రోయ్ అనే ప్రాంతం వద్ద ఉన్న రైలు క్రాసింగ్ వద్దకు వెళ్లాడు. అక్కడ రైళ్ల మార్గాలను నిర్దేశించే స్విచ్ల లాక్ తీసి వాటిల్లో మార్పులు చేశాడు. సమీపంలో తన కెమెరా ట్రైపాడ్ అమర్చి కాచుకొని కూర్చున్నాడు. ఇంతలో బీఎన్ఎస్ఎఫ్ సంస్థకు చెందిన రెండు లోకోమోటీవ్లు, ఐదు బోగీలు వచ్చాయి. ఆ డ్రైవర్ ఏం జరిగిందో గుర్తించే సమయానికి అవి పట్టాలు తప్పాయి.ప్రమాదం సృష్టించిన ఈ బాలుడే మళ్లీ రైల్వే అధికారులకు ఫోన్ చేసి అప్రమత్తం చేశాడు. విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకొని ప్రమాదం ఎలా జరిగిందని దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. అక్కడ ఎవరో కీలక స్విచ్లను మార్చినట్లు గుర్తించారు. ఎందుకనో పోలీసులు అనుమానంతో సమాచారం అందించిన బాలుడినే గట్టిగా విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. విచారణలో ఆ బాలుడు..తాను పట్టాలు తప్పుతున్న రైలు వీడియో చిత్రీకరించాలనుకున్నట్లు తెలిపాడు. కానీ ఆ స్విచ్ మార్పులతో తనకు సంబంధం లేదని బుకాయించాడు. అయితే అధికారులు అక్కడి సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా.. ప్రమాదానికి ముందు వాహనంలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చినట్లు గుర్తించారు. అతడు బాలుడితో సరిపోలాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపర్చారు. ఈ ప్రమాదం కారణంగా ఒహామా పబ్లిక్ పవర్ డిస్ట్రిక్ట్కు, బీఎన్ఎస్ఎఫ్ రైల్వేకు దాదాపు రూ.2 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందట.(చదవండి: స్టైల్ ఐకాన్ నటాషా పూనావాలా గ్లాస్ మాదిరి పర్సు ధర ఎంతంటే..?) -
'ఆశకు స్ఫూర్తి ఆమె'!..ఏకంగా 33 వేల అడుగుల ఎత్తు నుంచి విమానం కూలినా..!
మన కళ్లముందే దారుణ ప్రమాదాలను ఫేస్ చేసి మరీ మృత్యుంజయులై బయటపడిన కొందరూ వ్యక్తులును చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. నమ్మశక్యం కానీ నిజంలా అద్భుతంగా కనిపిస్తారు ఆయా వ్యక్తులు. అలాంటి మిరాకిల్ లాంటి ఘటనే ఈ మహిళ జీవితంలో చోటు చేసుకుంది. ఆ సంఘటన కారణంగానే ఆమె వార్తల్లో నిలిచింది. పైగా గిన్నిస్ బుక్ ఆప్ రికార్డులకు కెక్కింది కూడా. ఏంటా మిరాకిల్ సంఘటన అంటే..వివరాల్లోకెళ్తే..ఆ మహిళ పేరు వెన్నా వులోవిచ్. ఫ్లైట్ అటెండెంట్గా పనిచేస్తోంది. సరిగ్గా జనవరి 26, 1972న యుగోస్లావ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 367లో ఫైట్ అటెండెంట్గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఒక భయానక ప్రమాదం జరిగింది. ఓ అనుమానాస్పద బాంబు కారణంగా ఆమె ప్రయాణిస్తున విమానం చెకోస్లోవేయా పర్వతాల మీదుగా కూలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న మొత్తం 27 మంది ప్రయాణికులు, సిబ్బంది అక్కడికక్కడే చనిపోయారు. ఒక్క ఫైట్ అటెండెంట్ వులోవిక్ మాత్రమే ప్రాణాలతో బయటపడింది. నిజం చెప్పాలంటే వులోవిక్ ప్రయాణిస్తున్న విమానం గాల్లోనే పేలింది. ఏకంగా 33 వేల అడుగుల నుంచి కూలిపోయింది. ఇక్కడ వులోవిక్ కనీసం పారాచూట్ లేకుండా అంత ఎత్తు నుంచి పడిపోయినా..బతికిబట్టగట్ట గలిగింది. ఇదే అందర్నీ ఒకింత ఆశ్చర్యచకితులను చేసింది. అయితే దర్యాప్తుల బృందం విమానం భూమిపై కూలిపోతున్నప్పుడూ తోక భాగంలోని ఫుడ్ రూమ్లో వులోవిక్ చిక్కుపోవడంతో సేఫ్గా ఉన్నట్లు తెలిపింది. ఆ తోక భాగం అటవీ ప్రాంతలో పడిపోయి మంచుతో కప్పబడి ఉండటంతో ఆమె అరుపులు అరణ్యరోదనగా మారాయి. ఆమె అదృష్టం కొద్ది అక్కడ పనిచేస్తున్న అటవీ వర్కర్లకు ఆ అరుపులు వినపడ్డాయి. వెంటనే వారు ఆమెను గుర్తించి ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె ఏకంగా పదిరోజులకు పైగా కోమాలోనే ఉండిపోయింది. ఈ ప్రమాదంలో వులోవిక్ పుర్రెకి తీవ్ర గాయం, రెండు వెన్నుపూసలు చితికిపోవడం, కటి, పక్కటెముకలు, రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో నడుము తాత్కలికి పక్షవాతానికి గురయ్యి కొన్ని రోజులు బెడ్కే పరిమితం కావాల్సి వచ్చింది. ఇంతటి స్థితిలో కూడా ఆమె ఆశను వదులుకోలేదు. పైగా నిరాశను దగ్గరకు రానివ్వలేదు. నెమ్మదిగా వులోవిక్ పూర్తి స్థాయిలో కోలుకుంది. ఆ తర్వాత ఎయిర్లైన్లో డెస్క్ జాబ్లో విధులు నిర్వర్తించేందుకు తిరిగి వచ్చింది. ఇలా వులోవిక్. మృత్యంజయురాలై నిలవడమే గాక మళ్లీ తన కాళ్లమీద నిలబడి అద్భుతంగా జీవించడంతో .. 1985లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ల కెక్కింది. ఆశకు అసలైన నిర్వచనం ఇచ్చి.. ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది ఈ సెర్బియా మహిళ వులోవిక్. తనకు దేవుడిచ్చిన మరో జీవితాన్ని విభిన్న నేపథ్యాల ప్రజల మధ్య అవగాహన పెంచి ,శాంతిగా ఉండేలా చేసేందుకు అంకితం చేసింది. ఇక వుల్విక్ 2016లో 66 ఏళ్ల వయసులో మరణించింది. ఇది మాములు మిరాకిల్ స్టోరీ కాదు కదా..!(చదవండి: అమిత్ షా నివాసంలో పద్మగ్రహీతలకు విందు....మెనులో ఎలాంటి రెసిపీలు ఉన్నాయంటే..) -
షారుక్ ఖాన్ చిన్న పొరపాటు.. కోట్ల రూపాయల నష్టం!
స్టార్ హీరో షారుక్ ఖాన్ గతేడాది జవాన్ మూవీతో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నారు. కోలీవుడ్ స్టార్ అట్లీ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఆ తర్వాత రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో డంకీ మూవీలో నటించారు. కానీ ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. షారుక్ ప్రస్తుతం తన తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు.ఇదిలా ఉండగా.. షారుక్ గతంలో డాన్, డాన్-2 చిత్రాల్లో నటించారు. ఆ సమయంలో అతను పనికి మేకర్స్ భారీ నష్టం వాటిల్లిందని కింగ్ ఖాన్ సహానటుడు అలీ ఖాన్ వెల్లడించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన అలీ ఖాన్.. షారుక్ కారును ఎలా క్రాష్ చేశాడో గుర్తు చేసుకున్నారు. అతను చేసిన పని వల్ల మేకర్స్కు రూ. 2.6 కోట్ల నష్టం జరిగిందని తెలిపారు.అలీ ఖాన్ మాట్లాడుతూ..' బెర్లిన్లో ఛేజ్ సీక్వెన్స్ను చిత్రీకరిస్తున్నాం. షారుక్ ఎడమవైపు.. నేను కుడివైపు ఉన్నా.. ఫర్హాన్ అక్తర్ షాట్లో కనిపించకుండా వెనుక సీట్లో దాక్కున్నాడు. ప్రియాంక చోప్రా పాల్గొన్న ఈ కారు ఛేజింగ్ సీక్వెన్స్లో క్రాష్ జరిగింది. షారుక్ కారు నడపడంతోనే ఈ ప్రమాదం జరిగింది. బానెట్పై లైట్లు, రెండు పెద్ద కెమెరాలు ఉన్నాయి. వాటి విలువ రూ. 2.6 కోట్లు. ఈ ఘటనలో అవన్నీ ధ్వంసమయ్యాయి. అదృష్టం కొద్ది మా అందరికీ ఎలాంటి గాయాలు కాలేదని' అన్నారు. కాగా.. డాన్ -2 మూవీ 2011లో విడుదలైంది. ఇటీవలే రణవీర్ సింగ్, కియారా అద్వానీతో డాన్ -3 తెరకెక్కించనున్నట్లు డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ ప్రకటించారు. -
Nasa: మార్స్పై హెలికాప్టర్ క్రాష్
కాలిఫోర్నియా: అంగారకుని(మార్స్)పై అమెరికా అంతరిక్ష పరిశోపధన సంస్థ నాసాకు చెందిన మినీ హెలికాప్టర్ మూడేళ్ల ప్రస్థానం ముగిసింది. అంగారకునిపై ఈ నెల 18న చివరిసారిగా ఎగిరి ల్యాండ్ అయ్యే సమయంలో రోటర్ చెడిపోయి మినీ హెలికాప్టర్ క్రాష్ అయినట్లు నాసా ప్రకటించింది. మార్స్పై ఇన్జెన్యూటీ మినీ హెలికాప్టర్ ప్రయాణం ముగిసిందని నాసా అధికారులు తెలిపారు. హెలికాప్టర్ క్రాష్కు గల కారణాలను అణ్వేషిస్తున్నట్లు చెప్పారు. 2021 ఏప్రిల్లో మార్స్పై ల్యాండ్ అయినప్పుడు తొలుత హెలికాప్టర్ 30 రోజులు పనిచేస్తుందని అనుకున్నారు. అయితే అనూహ్యంగా అది 3 సంవత్సరాల పాటు పనిచేసి మార్స్పై 14 సార్లు ఎగరగలిగింది. సౌరవ్యవస్థలో సరికొత్త ఏవియేషన్ ప్రయోగాలకు ఇన్జెన్యూటీ నాంది పలికింది. మార్స్పై ఇన్జెన్యూటీ హెలికాప్టర్ను ప్రిజర్వెన్స్ రోవర్ ఆపరేట్ చేసింది. ఇదీచదవండి.. మూన్ ష్నైపర్ శీర్షాసనం -
గుడ్బై 2023: సుఖోయ్-30.. మిరాజ్-2000 ఢీకొన్న వేళ..
కొద్దిరోజుల్లో 2023వ సంవత్సరం ముగియబోతోంది. ఆశలు రేకెత్తిస్తూ.. 2024 మన ముందుకు వస్తోంది. కొత్త సంవత్సరం ప్రజలకు కొత్త ఆనందాన్ని అందించబోతోంది. అయితే 2023 దేశ ప్రజలకు కొన్ని మంచి, కొన్ని చెడు జ్ఞాపకాలను అందించింది. 2023 జనవరి 28న గగనతలంలో ఊహకందని ఘటన చోటుచేసుకుంది. మన దేశానికి చెందిన రెండు శక్తివంతమైన యుద్ధ విమానాలు సుఖోయ్-30, మిరాజ్-2000 ఒకదానికొకటి ఢీకొని ధ్వంసమయ్యాయి. ఈ రెండు యుద్ధ విమానాలు గ్వాలియర్లోని మహారాజ్పురా ఎయిర్బేస్ నుండి సాధారణ శిక్షణ కోసం బయలుదేరాయి. ఈ ప్రమాద ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచింది. మధ్యప్రదేశ్లోని మోరెనాలోని పహర్ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మన్పూర్ మహాదేవ్ అడవిలో మిరాజ్ యుద్ధ విమానం కూలిపోయింది. సుఖోయ్కు చెందిన రెక్కలు మోరెనాలోని పహర్ఘర్ ప్రాంతంలో పడిపోయాయి. మిగిలిన విమానం రాజస్థాన్లోని భరత్పూర్లోని ఉచైన్ పోలీస్ స్టేషన్లోని నాగ్లా బిజా గ్రామ సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో మిరాజ్ పైలట్ వింగ్ కమాండర్ హనుమంతరావు సారథి మృతి చెందగా, సుఖోయ్ పైలట్లిద్దరూ గాయపడ్డారు. ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మిరాజ్-2000 చాలా కాలంగా భారత వైమానిక దళంలో భాగంగా ఉంది. ఫిబ్రవరి 2019లో జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు భారత వైమానిక దళానికి చెందిన 12 మిరాజ్-2000 యుద్ధ విమానాలను వినియోగించారు. భారత వైమానిక దళం తెలిపిన వివరాల ప్రకారం ఈ విమానాలు.. విమాన శిక్షణ మిషన్లో ఉండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక పైలట్ మృతి చెందగా, ఇద్దరు పెలట్లు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే దిశగా విచారణ కొనసాగుతోంది. ఇది కూడా చదవండి: దేశమంతటా క్రిస్మస్ వెలుగులు.. చర్చిలు శోభాయమానం! -
తుఫ్రాన్లో కూలిపోయిన శిక్షణ విమానం.. పైలట్ మృతి
సాక్షి, మెదక్: మెదక్ జిల్లాలోని తుఫ్రాన్లో శిక్షణ విమానం కూలిపోయింది. అయితే, విమానం కూలిపోయిన వెంటన భారీగా మంటలు చెలరేగడంతో పూర్తిగా కాలిపోయినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పైలెట్, కో-పైలట్ మృతిచెందారు. వివరాల ప్రకారం.. తుఫ్రాన్ మున్సిపల్ పరిధిలోని టాటా కాఫీ కంపెనీ సమీపంలో ఉన్న గుట్టల మధ్య సోమవారం ఉదయం శిక్షణ విమానం కూలిపోయింది. కాగా, కూలిన విమానాన్ని దుండిగల్ ఎయిర్పోర్టుకు సంబంధించిన శిక్షణ విమానంగా గుర్తించినట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా విమానం కూలిపోవడంతో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. Two Indian Air Force pilots were killed in action when their Pilatus trainer aircraft crashed at 8:55 during training at Air Force Academy, Dindigul in Telangana. The pilots include an instructor and one cadet: Indian Air Force officials pic.twitter.com/48bGdfawRy — ANI (@ANI) December 4, 2023 -
‘ఉత్తర కాశీ’ ఆపరేషన్లో స్వల్ప ఆటంకం!
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలోని సిల్క్యారాలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు చివరి దశకు చేరాయి. నవంబర్ 12న ఈ ప్రమాదం జరిగింది. నేడు గురువారం ఉదయం 8 గంటలకే కార్మికులను బయటకు తీసుకురావాల్సి ఉండగా, తవ్వకాల సమయంలో శిథిలాలు అడ్డు రావడంతో సహాయక చర్యలకు ఆటకం ఏర్పడింది. రెస్క్యూ ఆపరేషన్లో ఉపయోగిస్తున్న భారీ యంత్రాలు, కంప్రెసర్ యంత్రాల యజమాని శైలేష్ గులాటీ మీడియాతో మాట్లాడారు. కార్మికుల దగ్గరకు చేరేందుకు చేస్తున్న తవ్వకాల్లో ఐదారు మీటర్ల మేరకు తవ్వాల్సి ఉండగా, ఇనుప శిధిలాలు అడ్డుపడటంతో పనులను ఆపాల్సి వచ్చిందన్నారు. శిథిలాలలో ఇనుప పైపులు, రాడ్లు ఉన్నాయన్నాయన్నారు. వీటిని తొలగించి, కార్మికుల దగ్గరకు చేరుకునేందుకు సాంకేతిక సాయాన్ని అందించేందుకు ఢిల్లీ నుంచి నిపుణుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. వారి రాకతో సహాయక చర్యలు మరింత ముమ్మరం అయ్యాయి. లోపల చిక్కుకున్న కార్మికులతో మాట్లాడుతున్నామని, ఆహారం అందించడానికి అమర్చిన పైపు ద్వారానే సంభాషణ జరుగుతున్నదని శైలేష్ గులాటీ తెలిపారు. కూలీలకు పూర్తిస్థాయిలో ఆహారం అందిస్తున్నామని, ఇంతకుముందు డ్రై ఫ్రూట్స్ మాత్రమే పంపించామని అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: తుది దశకు రెస్క్యూ ఆపరేషన్ -
దారుణం: పొగమంచుతో వందల కొలది వాహనాలు ఢీ.. ఏడుగురు మృతి
న్యూయార్క్: అమెరికా, లూసియానాలో పొగమంచు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాదాపు 158 వాహనాలు వేగంగా వచ్చి ఢీకొన్నాయి. వాహనాలు ఒకదానికొకటి చొచ్చుకొచ్చి మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఇంటర్స్టేట్-55 రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. పాంట్ చార్ట్రెయిన్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో వాహనాలు కుప్పలుగా పడి ఉన్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన భయానక విషయాలను ప్రత్యక్ష సాక్షులు ఈ విధంగా వివరించారు. రహదారి అంతా పొగమంచుతో అస్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు 30 నిమిషాల పాటు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. క్షతగాత్రుల రోదనలతో భయానక వాతావరణం ఏర్పడింది. ఓ కారు ఏకంగా వంతెన దాటి నీటిలో పడిపోయింది. డ్రైవర్లు రోడ్లుపైకి వచ్చి సహాయం కోరుతున్నారు. 7గురు చనిపోగా.. దాదాపు 30 మంది గాయపడ్డారు. దాదాపు 11 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. అమెరికాలో కార్చిచ్చు కారణంగా వెలువడిన పొగతో పొగమంచు కలిసిపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేసిన అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమయ్యింది. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖా అధికారులతో సమన్వయం చేసుకుని తదుపరి కార్యాచరణ చేపడతామని వెల్లడించారు. రహదారిని మూసేసే అంశంపై చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఇదీ చదవండి: పుతిన్ ఆరోగ్యంపై పుకార్లు.. ఖండించిన క్రెమ్లిన్ -
విషాదం: బిలియనీర్ వికాస్, నటి గాయత్రి లగ్జరీ కార్ క్రాష్, వీడియో వైరల్
బాలీవుడ్ మూవీ 'స్వదేశ్' లో షారుఖ్ ఖాన్తో కలిసి నటించిన యాక్టర్ గాయత్రి జోషి ప్రయాణిస్తున్న లగ్జరీ కారు ప్రమాదానికి గురైంది. గాయత్రితోపాటు, భర్త, వ్యాపారవేత్త వికాస్ ఒబెరాయ్ తృటిలో ఈ ప్రమాదంనుంచి తప్పించుకున్నారు. అయితే మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. ఇటలీలో విహార యాత్రలో ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సార్డినియా సూపర్కార్ ఎక్స్పీరియన్స్ సమయంలో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ప్రమాదం జరిగినప్పుడు గాయత్రి ప్రయాణిస్తున్న లంబోర్ఘిని కారు మరో లగ్జరీ కారు ఫెరారీని, క్యాంపర్ వ్యాన్ని ఢీకొట్టింది. లంబోర్ఘిని ,ఫెరారీతో సహా ఇతర లగ్జరీ వాహనాలతో పాటు, మినీ ట్రక్కును ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఇది జరిగింది. దీంతో ఫెరారీ కారులో ఉన్న స్విట్జర్లాండ్కు జంట ప్రాణాలు కోల్పోయారు. మీడియా నివేదికల ప్రకారం, ఫెరారీలో మంటలు చెలరేగడంతో మెలిస్సా క్రౌట్లీ(63) మార్కస్ క్రౌట్లీ, 67 అక్కడి క్కడే ప్రాణాలొదిలారు. వికాస్ ఒబెరాయ్ మేనేజర్ ప్రకారం గాయత్రి, వికాస్ జంట ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. కాగా మహారాష్ట్రలోని నాగ్పూర్లో జన్మించిన గాయత్రీ జోషి వీడియో జాకీగా తన కెరీర్ను ప్రారంభించింది. అడ్వర్టైజింగ్ మోడల్గా కూడా పనిచేసింది. హన్స్ రాజ్ హన్స్ 'ఝంజరియా, జగ్జిత్ సింగ్ 'కాఘజ్ కి కష్టి'తో సహా అనేక మ్యూజిక్ వీడియోలలో కనిపించింది. ఆ తర్వాత ఫెమినా ఇండియా అందాల పోటీల్లో విజేతగా నిలవాలనే లక్ష్యంతో 2000లో ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ టైటిల్ గెలుచుకుంది. అలాగే మిస్ ఇంటర్నేషనల్ 2000లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఇక సినిమాల విషయానికి వస్తే 2004లో అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో వచ్చిన మూవీ 'స్వేడ్స్'లో నటించింది. 2005లో వ్యాపారవేత్త వికాస్ ఒబెరాయ్ని పెళ్లాడి సినిమాలకు గుడ్బై చెప్పింది. వీరికి ఇద్దరు పిల్లలు. వికాస్ ఒబెరాయ్: టాప్ ముంబై రియల్టర్, ఒబెరాయ్ రియల్టీ ఎండీ వికాస్ ఒబెరాయ్. ఫోర్బ్స్ అతని నికర విలువ 3.8 బిలియన్లు డాలర్లుగా అంచనా వేసింది. Two deaths on a Ferrari in Sardina, Italy pic.twitter.com/skT3CaXg0T — Globe Clips (@globeclip) October 3, 2023 -
కన్నడ సినీ నటుడు నాగభూషణ్ అరెస్టు
బెంగళూరు: కారును వేగంగా, నిర్లక్ష్యంగా నడిపి, ఒక మహిళ మరణానికి కారణమైన కన్నడ సిటీ నటుడు నాగభూషణ్ ఎస్.ఎస్.ను పోలీసులు అరెస్టు చేశారు. నాగభూషణ్ కారు శనివారం రాత్రి బెంగళూరులోని వసంతపుర ప్రధాన రహదారిపై కృష్ణ(58), ప్రేమ(48) అనే దంపతులపైకి దూసుకెళ్లింది. వారిద్దరూ ఫుట్పాత్పై నడుస్తుండగా ఈ సంఘటన జరిగింది. తర్వాత కారు కొద్ది దూరం వెళ్లి, కరెంటు స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. ఈ సమయంలో కారును నాగభూషణ్ నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో ప్రేమ మృతిచెందగా, కృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు. కారును నడిపిన నాగభూషణ్ను అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. ప్రమాద సమయంలో మద్యం సేవించి ఉన్నాడో లేదో తెలుసుకొనేందుకు అతడి రక్తపు నమూనాలు సేకరించామని అన్నారు. కారును స్వా«దీనం చేసుకున్నామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
సంతోషంగా పార్టీ.. కళ్ల ముందే ఘోర ప్రమాదం!
సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోలో ఒక జంట ఘనంగా జండర్ రివీల్ పార్టీని ఏర్పాటు చేయడాన్ని గమనించవచ్చు. పార్టీకి భారీగా అతిథులు హాజరయ్యారు. అయితే వీరందరి కళ్ల ముందే విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అది ఒక స్టంట్ విమానం. పార్టీలో రంగులు వెదజల్లేందుకు దానిని వినియోగించారు. ఇదే ప్రమాదానికి కారణంగా నిలిచింది. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్లో షేర్ అయ్యింది. న్యూయార్క్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం ఈ జంట ఎవరన్నదీ వెల్లడికాలేదు. అయితే ఈ వీడియోలో జండర్ రివీల్ పార్టీలో పాల్గొన్న జంట కావలించుకోవడం, పైన విమానం నుంచి రంగులు జాలువారడాన్ని గమనించవచ్చు. ఇంతలోనే విమానం అదుపుతప్పడాన్ని చూడవచ్చు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం విమాన ప్రమాదంలో గాయపడిన పైలెట్ను అధికారులు ఆసుపత్రికి తరలించారు. అయితే అతను మృతి చెందినట్లు వైద్యులు స్పష్టం చేశారు. కాగా తమకు పుట్టబోయే శిశువు.. పాప లేక బాబు అనేది సన్నిహితుల మధ్య వెల్లడించేందుకు జండర్ రివీల్ పార్టీని ఏర్పాటు చేస్తారు. ఈ వీడియో వైరల్ అయిన నేపధ్యంలో నెటిజన్లు పలురకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్ ‘ఇటువంటి జండర్ రివీల్ పార్టీలు అదుపు తప్పుతున్నాయని, ఫలితంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని’ కామెంట్ చేశారు. మరో యూజర్ ‘కొద్ది సేపు నిర్వహించే పార్టీకి ఇంత హడావుడి అనవసరం’ అని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: చీతాతో ఫుడ్ షేర్ చేసుకున్న తాబేలు.. తెగ ఆశ్చర్యపోతున్న నెటిజన్లు! Pilot killed after his Piper PA-25 left wing failed at a gender reveal party in the town of San Pedro, Mexico. pic.twitter.com/6JILK7fsGm — Breaking Aviation News & Videos (@aviationbrk) September 3, 2023 -
తప్పతాగి కారు నడిపి.. నడిరోడ్డుపై మహిళా మంత్రి హల్చల్..
న్యూజిలాండ్ న్యాయశాఖ మంత్రి కిరి అలెన్ తప్ప తాగి డ్రైవింగ్ చేసిన కేసులో తన పదవికి రాజీనామా చేశారు. మోతాదుకు మించి మద్యం సేవించి ఓ ప్రమాదానికి కారణం అయినందున ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. తప్పని స్థితిలో అరెస్టుకు ముందే ఆమె తన మంత్రి పదవికి అలెన్ రాజీనామా చేశారు. ఆదివారం రాత్రి పూటుగా మద్యం సేవించి తన కారుతో పార్కింగ్లో ఉన్న వాహనాలను ఢీకొట్టారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. మోతాదుకు మించి మద్యం సేవించినట్లు గుర్తించారు. అంతేకాకుండా అలెన్ అరెస్టుకు ఆమె ఏమాత్రం సహకరించలేదని పోలీసులు తెలిపారు. అదే రాత్రి ఆమెను పోలీసు స్టేషన్కు తరలించి అక్కడే ఉంచారు. ఈ ఘటనపై స్పందించిన ప్రధాని క్రిస్ హిప్రిన్స్.. మంత్రి అలెన్ మానసికంగా కృంగిపోయి ఉన్నారని తెలిపారు. పదవి బాధ్యతలు నిర్వహించడానికి సిద్ధంగా లేరని తెలిపారు. పైగా క్రిమినల్ కేసు అయినందున రాజీనామాను అంగీకరించినట్లు వెల్లడించారు. అయితే.. పార్లమెంట్ సభ్యురాలిగా మాత్రం కొనసాగనున్నట్లు తెలిపారు. లేబర్ పార్టీలో చాలా వేగంగా ఎదిగిన అలెన్.. వ్యక్తిగత జీవితంలో దెబ్బతిన్నారు. జీవిత భాగస్వామి నుంచి విడిపోయిన నాటి నుంచి ఆమె మానసికంగా దెబ్బతిన్నారు. ఈ ఏడాది అక్టోబర్లో న్యూజిలాండ్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే లేబర్ పార్టీ నుంచి మంత్రి పదవి కోల్పోయినవారిలో అలెన్ నాలుగో మంత్రి కావడం గమనార్హం. ఇదీ చదవండి: అక్రమ వలసలకు చెక్.. ఐరోపా దేశాలు-ట్యునీషియా మధ్య కుదిరిన ఒప్పందం -
కుప్పకూలిన బిజినెస్ జెట్: ఆరుగురు సజీవ దహనం
అమెరికాలోని కాలిఫోర్నియాలో మరో విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. కాలిఫోర్నియా పొలాల్లో ఓ ప్రైవేట్ జెట్ విమానం కుప్పకూలిపోయింది.ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. రివర్సైడ్ కౌంటీ షెరీఫ్ అధికారుల వివరాల ప్రకారం శనివారం తెల్లవారుజామున ఫ్రెచ్వ్యాలీ విమానశ్రయం సమీపంలో సెస్నా బిజినెస్ జెట్ విమానం కూలియింది. లాస్ వెగాస్లోని హ్యారీ రీడ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ముర్రిటాలోని ఫ్రెంచ్ వ్యాలీ విమానాశ్రయం సమీపంలో కూలిపోవడంతో ఆరుగురు వ్యక్తులు మరణించారని అధికారులు తెలిపారు. సెస్నా సీ550 బిజినెస్ జెట్ మంటల్లో చిక్కుకున్నట్లు రివర్సైడ్ కౌంటీ షెరీఫ్ డిపార్ట్మెంట్ తెలిపింది. దీంతో బిగైల్ టెల్లెజ్-వర్గాస్(33) రైస్ లెండర్స్(25) మాన్యువల్ వర్గాస్-రెగాలాడో(32) లిండ్సే గ్లీచే(31) అల్మా రజిక్ (51) , ఇబ్రహెం రజిక్(46) సజీవ దహనమైపోయారు. పైలట్ ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ విధానాన్ని ప్రయత్నించిన తర్వాత విమానం రన్వేకు 500 అడుగుల దూరంలో కూలిపోయిందని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. ఇదే ప్రాంతంలో ఘోరమైన విమాన ప్రమాదం జరిగిన కొద్ది రోజులకే ఈ ప్రమాదం జరగడం ఆందోళన రేపింది. -
వింబుల్డన్లో దారుణం.. స్కూల్లోకి దూసుకెళ్లిన కారు..
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ సమీపంలోని ఒక ప్రాధమిక పాఠశాల భవనంలోకి ల్యాండ్ రోవర్ కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చిన్నారులు, ఇద్దరు పెద్దవారు గాయపడినట్టు చెబుతున్నాయి స్థానిక మెట్రోపాలిటన్ పోలీసు వర్గాలు. మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లండన్లోని వింబుల్డన్ దగ్గర క్యాంపు రోడ్డులోని "ద స్టడీ ప్రిపరేటరీ స్కూలు"లోకి ఒక ల్యాండ్ రోవర్ వేగంగా దూసుకెళ్లింది. ఈ పాఠశాల 4-11 ఏళ్ల లోపు బాలికల కోసం ప్రత్యేకించబడినది. బ్రిటీషు కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల ప్రాంతంలో పెద్ద శబ్దం చేసుకుంటూ గోల్డ్ కలర్ కార్ స్కూల్లోకి దూసుకుని రావడంతో ఏడుగురు చిన్నారులు, ఇద్దరు పెద్దవారు గాయపడ్డారని తెలిపారు. ఇది ఉగ్రవాద చర్య కాదని స్పష్టం చేసిన మెట్రోపాలిటన్ పోలీసులు ప్రమాద సమాచారం తెలియగానే సంఘటన స్థలానికి కనీసం 20 ఎమర్జెన్సీ ఎయిర్ అంబులెన్స్ లు చేరుకొని గాయపడిన వారికి తక్షణ చికిత్స అందిస్తున్నారని, ప్రమాదానికి కారణమైన మహిళా డ్రైవరును సంఘటన స్థలంలోనే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. ఈ సంఘటన గురించి తెలియగానే లండన్ అధికారులు, నాయకులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సహాయక బృందాలను అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు బాధితుల క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఇది కూడా చదవండి: గమ్యానికి చేరువలో పొరపాటు.. ప్రైజ్ మనీ గోవిందా.. -
ఆ దుర్ఘటన తర్వాత టికెట్లు రద్దయ్యాయి!..వివరణ ఇచ్చిన రైల్వేస్
ఒడిశాలో బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘెర రైలు ప్రమాదం కారణంగా వేలాది మంది టికెట్లు రద్దుచేస్తుకున్నారంటూ వార్తలు వచ్చాయి. అదీగాక ఓ కాంగగ్రెస్ నాయకుడు భక్త చరణ్ దాస్ కూడా ఓ మీడిమా సమావేశంలో అదే వాదన వినిపించాడు. కాంగ్రెస్ పార్టీ ఆ నాయకుడు మీడియా సమావేశానికి సంబంధించిన క్లిప్ను కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ మేరకు చరణ్ దాస్ ఆ వీడియో క్లిప్లో...ఇలాంటి రైలు ప్రమాదం గతంలో ఎన్నడూ జరగలేదని, వందలాది మంది ప్రాణాలు కోల్పోగా..వెయ్యి మంది దాక గాయపడ్డారు. ఈ ఘటన అందర్నీ బాధించింది. ప్రమాదం తర్వాత వేలాది మంది టికెట్లు రద్దు చేసుకున్నారు. అని చెబుతున్నట్లు వీడియోలో కనిపించింది. దీనిపై ఐఆర్సీటీసీ తీవ్రంగా స్పందించింది. ఇది వాస్తవంగా తప్పు అని..టికెట్ బుకింగ్ రద్దు డేటాను కూడా అందించింది. ఆ ఘటన తర్వాత టికెట్ల రద్దు పెరగలేదని, అందుకు విరుద్ధంగా రద్దులు తగ్గాయని పూర్తి వివరణ ఇస్తూ ట్వీట్ చేసింది ఐఆర్సీటీసీ. కాగా, ఈ ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) దర్యాప్తు చేస్తోంది. పాయింట్ మేషీన్ లేదా ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సిస్టమ్తో ఏదైన సమస్య లేదా రీకాన్ఫిగరేషన్ లేదా సిగ్నలింగ్ లోపం కారణంగా రైలు ట్రాక్లు మార్చారా అనే దానిపై కూలంకషంగా దర్యాప్తు చేస్తోంది సీబీఐ. This is factually incorrect. Cancellations have not increased. On the contrary, cancellations have reduced from 7.7 Lakh on 01.06.23 to 7.5 Lakh on 03.06.23. https://t.co/tn85n03WPn — IRCTC (@IRCTCofficial) June 6, 2023 (చదవండి: ప్రమాదం జరిగి 4 రోజులు .. ఇంకా గుర్తించని 101 మృతదేహాలు..) -
Odisha Train Crash: హృదయ విదారక ఘటన: జో బైడెన్
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం భారతదేశంలో దాదాపు మూడు దశాబ్దాలలో జరిగిన ఘోర రైలు ప్రమాదాల్లో ఒకటి. ఈ ఘటనలో కనీసం 288 మంది మరణించగా, దాదాపు 1100 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఆ ఘటన తన హృదయాన్ని కలిచివేసిందన్నారు. ఈ ఘటనలో తమవారిని కోల్పోయిన అనేకమందికి సానుభూతిని తెలియజేయడమే గాక, తీవ్రంగా గాయపడిన వారు ఈ ఘటన నుంచి సత్వరమే కోరుకోవాలని దేవుడిన ప్రార్థిస్తున్నానని ఒక ప్రకటనలో తెలిపారు బైడెన్. భారత్, అమెరికా ఇరు దేశాలు ఒక కుటుంబం వలే సంస్కృతి సంబధాలతో లోతైన బంధాన్ని పెనవేసుకుంది. అమెరికా అంతటా ప్రజలు భారతదేశ ప్రజల తోపాటు సంతాపం వ్యక్తం చేస్తున్నాం. రికవరీ ప్రయత్నాలు కొనసాగుతున్నందున ఈ విషాదకర ఘటన నుంచి బయటపడేలా మా ఆలోచనలన్ని భారతదేశ ప్రజల చుట్టూనే ఉంటాయని బైడెన్ అన్నారు. (చదవండి: ఈ పాపం ఎవరిది?..ఇది సాంకేతిక సమస్య లేదా మానవ లోపమా?..) -
కూలిన ఐఏఎఫ్ శిక్షణ విమానం.. పైలట్లకు గాయాలు
సాక్షి, బెంగళూరు: భారత వైమానిక దళాని (ఐఏఎఫ్)కి చెందిన విమానం కుప్పకూలిన ఘట నలో ఇద్దరు పైలట్లు గాయపడ్డారు. కర్ణాటకలోని చామరాజనగర జిల్లా భోగాపుర వద్ద గురువారం ఈ ఘటన జరిగింది. వింగ్ కమాండర్ తేజ్పాల్, కో పైలట్ భూమిక బెంగళూరు ఎయిర్ఫోర్స్ స్టేషన్ నుంచి సూర్యకిరణ్ రకం చిన్న శిక్షణ విమానంలో బయలుదేరారు. తిరిగి వస్తుండగా సాంకేతిక సమస్య తలెత్తి విమానం కుప్పకూలింది. ఇంధనం అంటుకుని కాలిపోయింది. తేజ్పాల్, భూమిక ప్యారాచూట్ల సాయంతో దూకి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. తేజ్పాల్ వెన్నెముకకు గాయమైంది. విమానం బహిరంగ ప్రదేశంలో కూలడంతో ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. సంఘటన ప్రాంతానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న ప్రజలను నియంత్రించేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. రెండు రోజుల క్రితం బెళగావి జిల్లా సాంబ్రా ఎయిర్పోర్టు నుంచి బయలుదేరిన రెడ్బర్డ్ శిక్షణ విమానం వ్యవసాయ క్షేత్రంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. అందులోని ఇద్దరు పైలట్లు గాయాలతో బయటపడ్డారు. -
శిక్షణ విమానం క్రాష్ ల్యాండింగ్
కర్ణాటక: సాంకేతిక లోపం కారణంగా శిక్షణ విమానం అత్యవసరంగా దిగింది. ఈ సంఘటన బెళగావిలో జరిగింది. ఇద్దరు పైలట్లతో కలిసి బెళగావి సాంబ్రా విమానాశ్రయం నుంచి రెడ్బర్డ్ ఫ్లయింగ్ అకాడమీకి చెందిన చిన్నపాటి శిక్షణ విమానం మంగళవారం ఉదయం 9:30 గంటలకు టేకాఫ్ అయ్యింది. 7 కిలోమీటర్ల దూరం ప్రయాణించాక మారిహళ సమీపంలో సాంకేతి లోపం తలెత్తింది. వెంటనే హొన్నిహళ సమీపంలోని రోడ్డు పక్కనున్న పొలంలో క్రాష్ ల్యాండింగ్ చేశారు. విమానం వేగంగా నేలను తాకడం వల్ల ముందు చక్రాలు, రెక్కలు ధ్వంసమయ్యాయి. ఓ పైలట్కు మాత్రం చిన్న గాయాలయ్యాయి. పైలట్ను వాయుసేన ఆస్పత్రిలో చేర్చి చికిత్సలు అందిస్తున్నారు. మారిహళ పోలీసులు, పెద్దసంఖ్యలో జనం విమానం వద్దకు చేరుకున్నారు. -
బ్రిటన్ ప్రధాని నివాసంపై కారుతో దాడికి యత్నం?
బ్రిటన్ ప్రధాన మంత్రి అధికారిక నివాసం వద్ద ఓ వ్యక్తి కారుతో దాడికి యత్నించాడు. ఈ పరిణామం అందర్నీ షాక్ కి గురి చేసింది. వెంటనే అక్కడి భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆ వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకోగా.. ఆ సమయంలో సునాక్ తన కార్యాలయంలో ఉన్నట్లు తెలుస్తోంది. లండన్ లోని ప్రధాని అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ గేటును ఓ వ్యక్తి కారుతో ఢీకొట్టాడు. బ్రిటన్ కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నివాసం గేటును కారు ఢీకొన్న వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాస్త వయసున్న ఆ వ్యక్తిని సంకెళ్లతో బంధించి తీసుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. సాధారణంగా బ్రిటన్ ప్రధాని నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ వద్ద ఎప్పుడూ గట్టి సెక్యూరిటీ ఉంటుంది. రక్షణ వ్యవస్థలో భాగంగా బలమైన ఇనుప గేట్లు ఉంటాయి. దేశ పార్లమెంటుకు ఇది దగ్గరి మార్గం. ఇక్కడి ఎంట్రెన్స్ వద్ద గతంలోనే లోనే భారీ గేట్లను ఏర్పాటు చేశారు. 1991లో ఐరిష్ రిపబ్లిక్ ఆర్మీ లండన్లో బాంబు దాడులకు పాల్పడిన దృష్ట్యా ఇక్కడ భద్రతను పెంచారు. కాగా తాజా ఘటన వెనుక నిందితుడి ఉద్దేశం ఏంటన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. గురువారం సాయంత్రం బ్రిటన్ ప్రధాని నివాసం వద్ద జరిగింది ఉగ్ర దాడి కాకపోవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. క్రిమినల్ డ్యామేజ్, డేంజరస్ డ్రైవింగ్ ఆరోపణలపై అతడిని అరెస్టు చేసినట్టు వారు చెప్పారు. ఇదిలా ఉంటే.. అమెరికాలో అధ్యక్ష భవనం వైట్ హౌస్ వద్ద 19 ఏళ్ళ సాయివర్షిత్ కందుల ఓ అద్దె ట్రక్కుతో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన మూడు రోజులకే బ్రిటన్ ప్రధాని నివాసం వద్ద అదే తరహా ఘటన చోటు చేసుకోవడగం గమనార్హం. ఇదీ చదవండి: అడ్డొస్తే ఎవరినైనా లేపేస్తా: సాయివర్షిత్ -
అధ్యక్ష రేసులో ఆయన.. ట్విటర్ అతలాకుతలం
శాన్ ఫ్రాన్సిస్కో: ఆయన అగ్రరాజ్యం అధ్యక్ష రేసుపై ఆసక్తి ప్రకటించాడు. ఆ క్షణం నుంచే ప్రచారం ప్రారంభిస్తున్నానని తెలిపాడు. అయితే అందుకు ఆయన ఎంచుకున్న వేదిక.. అవతలి నుంచి సంభాషణ జరిపిన వ్యక్తి.. తదితర కారణాలతో సోషల్ మీడియా అతలాకుతలం అయ్యింది. ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెశాంటిస్ అమెరికా అధ్యక్ష రేసులో ప్రచారం ప్రారంభించారు. అమెరికా పునర్వైభవం కోసం తాను పోటీ చేయబోతున్నట్లు ట్వీట్ చేశారాయన. సారథ్యం వహించే ధైర్యం కావాలి, గెలిచే శక్తి ఉండాలి అంటూ తన ప్రచార నినాదాన్ని సైతం ప్రకటించారాయన. అయితే.. ఆ సమయంలో ట్విటర్ క్రాష్ అయిపోవడం గమనార్హం. అంతకు ముందు ఆయన రిపబ్లికన్ పార్టీ తరుపున అధ్యక్ష బిడ్ను ధృవీకరిస్తూ ఫెడరల్ ఎన్నికల అధికారులకు నామినీ పత్రాలను సమర్పించారు. దీంతో రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్కు పోటీగా.. రాన్ సైతం బిడ్లో నిలిచినట్లయ్యింది. ట్విటర్ సీఈవో ఎలన్ మస్క్తో కలిసి లైవ్ ఆడియో ఛాట్లో పాల్గొన్నారు ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెశాంటిస్. ఆరున్నర లక్షల మందికిపైగా ఆ సంభాషణను లైవ్లో విన్నారు. ఇంకేం.. ఆ సమయంలో ట్విటర్ పదే పదే క్రాష్ అయ్యింది. I’m running for president to lead our Great American Comeback. pic.twitter.com/YmkWkLaVDg — Ron DeSantis (@RonDeSantis) May 24, 2023 గతేడాది అక్టోబర్లో ఎలన్ మస్క్.. ట్విటర్ను టేకోవర్ చేశాడు. ఆ సమయంలోనే వేలమందిని తొలగించాడు. వాళ్లలో బగ్స్ను ఫిక్స్ చేసే ఇంజినీర్లు సైతం ఉండడం గమనార్హం. ఒకేసారి ట్విటర్పై లక్షల్లో యూజర్లు ఎగబడినప్పుడు.. ఆ హెవీ ట్రాఫిక్ కారణంగా ఇలాంటి అంతరాయం ఏర్పడుతుంది. ఈ ఏడాదిలో ట్విటర్ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం ఇది ఆరోసారి. Ron DeSantis fought against President Donald Trump's America First agenda while in Washington. pic.twitter.com/YytIGaSjyX — MAGA War Room (@MAGAIncWarRoom) May 24, 2023 అయితే.. ఈ ప్రభావం ట్విటర్ను ముందు ముందు దారుణంగా దెబ్బ తీయొచ్చని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. మరోవైపు అదే టైంలో.. #FailuretoLaunch #Crashed, #DeSaster లాంటి హ్యాష్ట్యాగ్లు ట్విటర్ విషయంలో ట్రెండ్ అవుతుండడం గమనార్హం. -
జోబైడెన్ హత్యకు భారత సంతతి యువకుడి యత్నం..
-
జోబైడెన్ హత్యకు భారత సంతతి యువకుడి యత్నం.. ట్రక్కుతో వైట్హౌస్పై దాడి
ఓ యువకుడు అమెరికా అధ్యక్షడు జో బైడెన్ని హత్య చేయాలని చేసిన యత్నం తీవ్ర కలకలం రేపింది. ఆ యువకుడు వైట్హౌస్ పరిసరాల్లోకి ట్రక్కుతో దూసుకొచ్చి బారికేడ్లను ఢీకొట్టాడు. అతను సోమవారం రాత్రి 10 గంటలకు ఈ ఘటనకు పాల్పడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న యూఎస్ పోలీసులు అతను లాఫాయోట్ పార్క్ వెలుపల ఉన్న బోలార్డ్లోకి ఉద్దేశ పూర్వకంగా డ్రైవింగ్ చేసినట్లు పేర్కొన్నారు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ట్రక్కుపై నాజీ జెండాను పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. సదరు యువకుడిని భారత సంతతికి చెందిని తెలుగు యువకుడు సాయివర్షిత్ కందులగా పోలీసులు గుర్తించారు. అతన్ని విచారించగా అమెరికా అధ్యక్షుడిపై దాడి చేసేందుకు ఆరు నెలలుగా ప్లాన్ చేశానని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అతనిపై ర్యాష్ డ్రైవింగ్, ఆస్తుల ధ్వంసంతో పాటు అధ్యక్షుడి హత్యకు కుట్ర పన్నిన కేసులు నమోదు చేశారు. (చదవండి: నమ్మకమే పునాది) -
కారుమీద కూలిన భారీ వృక్షం
-
ఆర్మీ హెలికాప్టర్లు ఢీకొని..9 మంది మృతి
ఫోర్ట్కాంప్బెల్(అమెరికా): కెంటకీలో అమెరికా ఆర్మీకి చెందిన రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లు ఢీకొన్న ఘటనలో 9 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పోర్ట్ కాంప్బెల్కు 30 మైళ్లదూరంలో బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఘటన చోటుచేసుకుంది. 101 ఎయిర్బోర్న్ డివిజన్కు చెందిన హెచ్హెచ్–60 బ్లాక్ హాక్ హెలికాప్టర్లు రెండూ రాత్రి వేళ జరుగుతున్న రోజువారీ శిక్షణ సమయంలో ప్రమాదానికి గురికావడంపై దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో కొంత అటవి, కొంతమైదానం ఉన్నాయని కెంటకీ గవర్నర్ ఆండీ చెప్పారు. -
Cheetah Crash: లెఫ్టినెంట్ కల్నల్ వీవీబీ రెడ్డి వీరమరణం
సాక్షి, యాదాద్రి: అరుణాచల్ ప్రదేశ్లో ఇవాళ భారత సైన్యానికి చెందిన హెలికాప్టర్ ‘చీతా’ కూలి ఇద్దరు పైలట్లు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. అయితే అమరుడైన లెఫ్టినెంట్ కల్నల్ వీవీబీ రెడ్డి తెలంగాణవాసి కావడం గమనార్హం. దీంతో ఆయన స్వస్థలం బొమ్మలరామారంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కల్నల్ వీవీబీ రెడ్డి స్వస్థలం యాదాద్రి జిల్లా బొమ్మలరామారం. ఆయన పూర్తి పేరు ఉప్పల వినయ్ భాను రెడ్డి. తల్లిదండ్రులు నర్సింహ్మారెడ్డి, విజయలక్ష్మీలు. అయితే.. మేడ్చల్ జిల్లా మల్కాజ్ గిరిలో ఆయన కుటుంబం నివాసం ఉంటోంది. ఆయన సతీమణి స్పందన కూడా ఆర్మీలో డెంటల్ డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో చీతా ఎయిర్క్రాఫ్ట్.. సంగే గ్రామం నుంచి అసోం సోనిట్పూర్ జిల్లా మిస్సమారి వైపు వెళ్లాల్సి ఉంది. అయితే పావు గంటకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సంబంధాలు తెగిపోయింది. అరుణాచల్ ప్రదేశ్ వెస్ట్ కామెంగ్ జిల్లా మండాలా వద్ద అది ప్రమాదానికి గురైనట్లు ఆర్మీ వర్గాలు గుర్తించాయి. అయితే.. ఆపై అందులో ఉన్న పైలట్ లెఫ్టినెంట్ కల్నల్ వీవీబీ రెడ్డి, కో పైలట్ మేజర్ జయంత్ ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. చివరకు వాళ్లు మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించింది ఆర్మీ. -
నల్ల సముద్రంలో కూలిన అమెరికా డ్రోన్.. రష్యా పనే..
కీవ్: రష్యా యుద్ధ విమానం నల్ల సముద్రంపై అమెరికా నిఘా డ్రోన్ను ఢీకొట్టింది. మంగళవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. దీంతో అమెరికా సైన్యం తమ డ్రోన్ను కిందకు దించింది. తమ హెచ్చరికలను లెక్కచేయకుండా ఉక్రెయిన్పై దండయాత్ర కొనసాగిస్తున్న రష్యాపై అమెరికా ఇప్పటికే ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అమెరికా–రష్యా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా డ్రోన్ను రష్యా ఫైటర్ జెట్ ఢీకొట్టడం సంచలనాత్మకంగా మారింది. తాజా సంఘటన గురించి అమెరికా జాతీయ భద్రతా సలహాదారు అధ్యక్షుడు జో బైడెన్కు తెలియజేశారు. నల్ల సముద్రంపై అంతర్జాతీయ ఎయిర్స్పేస్లో రష్యాకు చెందిన రెండు ఎస్యూ–27 ఫైటర్ జెట్లు ఎలాంటి రక్షణ లేకుండా విన్యాసాలు చేపట్టాయని, అందులో ఒక విమానం అమెరికాకు చెందిన ఎంక్యూ–9 డ్రోన్ను ఢీకొట్టిందని యూఎస్ యూరోపియన్ కమాండ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. చదవండి: ఆస్ట్రేలియాకు అమెరికా సబ్మెరైన్లు -
అయ్యయ్యో కొత్త కారు, రోడ్డు మీదకి రాకముందే ఇలా! వైరల్ వీడియో
సాధారణంగా చాలా మందికి కారు కొనటం ఒక కల, ఆ కల నిజమయ్యే సమయంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు భారీ నష్టాలను కలిగిస్తాయి. ఇటీవల ఒక వ్యక్తి కారు కొనుగోలు చేసిన కొన్ని నిముషాల్లోనే ప్రమాదానికి గురైంది, దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నివేదికల ప్రకారం, ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి డీలర్షిప్ ముందు ఉన్న రోడ్డుపై ఫోక్స్వ్యాగన్ వర్టస్ ప్రమాదానికి గురైంది. డెలివరీ తీసుకునే సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం ఎక్కువగా దెబ్బతినింది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇందులో కస్టమర్ల తొందర, అత్యుత్సాహం వల్ల జరిగిన పొరపాట్లు స్పష్టంగా తెలుస్తుంది. డ్రైవింగ్ పూర్తిగా నేర్చుకోకుండా కారు నడిపితే ఇలాంగే ఉంటుందనటానికి ఇది మంచి ఉదాహరణ. నిజానికి భారతీయ మార్కెట్లో ఫోక్స్వ్యాగన్ వర్టస్ రూ. 11,21,900 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద విడుదలైంది. ఈ సెడాన్ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఇది రెండు వేరియంట్స్, రెండు ఇంజిన్ ఆప్సన్షతో అందుబాటులో ఉన్నాయి. ఫోక్స్వ్యాగన్ వర్టస్ 1.0-లీటర్ టిఎస్ఐ త్రీ-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 115 హెచ్పి పవర్, 178 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తే, 1.5-లీటర్ టిఎస్ఐ ఫోర్-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 150 హెచ్పి పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంతే కాకుండా ఈ సెడాన్ లాటిన్ NCAP క్రాస్ టెస్ట్లో 5 స్టార్ రేటింగ్ పొంది దేశీయ మార్కెట్లో అత్యంత సురక్షితమైన వాహనంగా నిలిచింది. -
పంట పొలాల్లో కూలిన భారీ బెలూన్.. 1,050 కిలోల బరువు
సాక్షి, నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామ శివారులో ఆదివారం ఉదయం 7.30 గంటల సమయంలో ఆకాశం నుంచి ఓ భారీ బెలూన్కు సంబంధించిన యంత్రం కూలడం కలకలం సృష్టించింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బెలూన్ యంత్రాన్ని పరిశీలించారు. దానిని హైదరాబాద్లోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్)కు చెందిన బెలూన్గా గుర్తించారు. బెలూన్ యంత్రం తర్నికల్ సమీపంలోని పొలాల్లో పడిపోగా.. జిల్లాలోని ఊర్కొండ మండలం శివారులోని బండారు బాలయ్యకు చెందిన మామిడితోటలో తెలుపు రంగు భారీ బెలూన్ పడిపోయింది. దీని మొత్తం బరువు సుమారు 1,050 కిలోలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఒక్కసారిగా ఆకాశం నుంచి యంత్రం తమ దగ్గరలో వచ్చి పడిపోవడంతో భయం వేసిందని, కాసేపటి వరకు ఏమీ అర్థం కాలేదని రాజిరెడ్డి అనే రైతు చెప్పారు. టీఐఎఫ్ఆర్కు చెందిన హరినాయక్ నేతృత్వంలోని బృందం బెలూన్, యంత్ర పరికరాలను హైదరాబాద్కు తరలించింది. ఖగోళ, వాతావరణ పరిశోధన కోసమే.. అంతరిక్ష పరిశోధనలతోపాటు భూ ఉపరితలంపై వాతావరణ కాలుష్యం, ఓజోన్ పొర పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు హైదరాబాద్లోని తమ బెలూన్ ఫెసిలిటీ సెంటర్ నుంచి ఈ నెల 17న ప్లాస్టిక్ రీసెర్చ్ బెలూన్ను ఆకాశంలోకి పంపించామని టీఐఎఫ్ఆర్కు చెందిన సైంటిఫిక్ ఆఫీసర్ నాగేందర్రెడ్డి తెలిపారు. 176 మీటర్ల పొడవు ఉండే ఈ బెలూన్ పేలిపోయే ప్రమాదం లేదని, జనసమ్మర్ధం లేనిచోట నెమ్మదిగా ల్యాండ్ చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. చదవండి: తలసరి ‘విద్యుత్’లో 5వ స్థానం -
నియంత్రణ సంస్థలు పక్కాగా ఉన్నాయి
న్యూఢిల్లీ: భారత నియంత్రణ సంస్థలు ఎంతో కచ్చితత్వంతో, కఠినంగా పనిచేస్తుంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం మార్కెట్లలో నెలకొన్న పరిణామాలు అంతర్జాతీయ ఇన్వెస్టర్లలో అనిశ్చితికి దారితీశాయా? అంటూ గౌతమ్ అదానీ గ్రూప్ షేర్ల పతనం గురించి ఓ వార్తా సంస్థ అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందించారు. దశాబ్దాలుగా ఎన్నో పాఠాలు నేర్చుకున్నామని చెబుతూ.. నియంత్రణ సంస్థలు మన మార్కెట్ను చక్కని, సరైన స్థితిలో నిలబెట్టినట్టు పేర్కొన్నారు. ముందున్నట్టే భారత్ ఇక మీదటా చక్కని నియంత్రణలతో కూడిన ఫైనాన్షియల్ మార్కెట్గా కొనసాగుతుందన్నారు. ‘‘అంతర్జాతీయంగా ఎక్కువగా చర్చించుకుంటున్న ఓ సంఘటన భారత మార్కెట్లు ఎంత గొప్పగా నిర్వహించబడతాయనే దానికి నిదర్శనం కాబోదు’’అని మంత్రి పేర్కొన్నారు. అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ సంస్థ అదానీ గ్రూపు కంపెనీలు, షేర్లపై ఆరోపణలతో ఓ నివేదిక విడుదల చేయడం తెలిసిందే. ఈ నివేదిక తర్వాత అదానీ గ్రూపు కంపెనీలు ఈ వారంలో ఊహించని విధంగా భారీ నష్టాలు చూశాయి. దీంతో ఆర్థిక మంత్రి దీనిపై స్పష్టత ఇచ్చారు. మెరుగ్గా బ్యాంకింగ్ వ్యవస్థ భారత బ్యాంకింగ్ వ్యవస్థ నేడు ఎంతో సౌకర్యంగా ఉందని మంత్రి సీతారామన్ స్పష్టం చేశారు. నికర నిరర్థక రుణాలు (ఎన్పీఏలు) చాలా కనిష్ట స్థాయికి దిగొచ్చినట్టు చెప్పారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. కేబినెట్ ఆమోదం పొందిన పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల నగదీకరణను ముందుకు తీసుకెళతామని ప్రకటించారు. -
ఆ విమానం నేరుగా మావైపే వచ్చింది... వెలుగులోకి కీలక విషయాలు
నేపాల్ విమానం కూలిన విషాద ఘటన గురించి ప్రత్యక్ష సాక్షులు కొన్ని ఆసక్తికర విషయాలు మీడియాకి వివరించారు. ఈ మేరకు ఒక స్థానిక నివాసి కల్పనా సునార్ ఆ విమానం బాంబు లాంటి పేలుడుతో తమ వైపుకు దూసుకురావడాన్ని చూసినట్లు పేర్కొంది. ఆ సమయంలో తాను బట్టలు ఉతుకుతున్నానని చెప్పింది. ఆ విమానం పాత విమానాశ్రయానికి, కొత్త విమానాశ్రయానికి మధ్య ఉన్న సేతి నది వద్ద కుప్పకూలిందని, ఆ నది లోయ చుట్టు నల్లటి దట్టమైన పొగ కమ్మేయడం చూశానని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో విమానం అసాధారణ రీతిలో వంగి ఉండటం చూశానని చెప్పుకొచ్చింది. మరో ప్రత్యక్ష సాక్షి గీతా సునార్ తమ ఇంటికి 12 మీటర్ల దూరంలో విమానం రెక్క పడిందని తెలిపారు. అది మా నివాసాలకు కాస్త దూరంలో పడిందని లేదంటే మా నివాసాలు దగ్ధమయ్యేవని, చాలా నష్టం వాటిల్లేదని చెప్పింది. సేతి నదికి రెండువైపులా మంటలు చెలరేగాయని, మృతదేహాలు చెల్లచెదురుగా పడి ఉన్నాయని చెప్పింది. అలాగే 11 ఏళ్ల పిల్లలు సమీర్, ప్రజ్వల్ తాము ఆసమయంలో ఆడుకుంటుండగా ఏదో బొమ్మ విమానం పడుతున్నట్లుగా కనిపించిందని, ప్రయాణికులు అరుపులు కూడా వినిపించాయని చెప్పారు. కాసేపటికి మా వైపుకి దూసుకురావడంతో భయంతో పారిపోయామని చెప్పారు. ఏదో టైర్ క్రాష్ అయినంత సౌండ్ వినిపించిందని అది మమ్మల్ని తాకినట్లు అనిపించిందని చెప్పుకొచ్చారు. క్రాష్ అయిన కాసేపటికి దగ్గరకు వెళ్దామంటే దట్టమైన పొగ వ్యాపించి ఏమి కనిపించలేదని స్థానికుల చెప్పారు. అయితే విమానంలోని సుమారు ఏడు నుంచి ఎనిమిది విండోలు చెక్కు చెదరకుండా ఉంటే ఎవరైనా సజీవంగా బతికి ఉంటారని భావించామని అన్నారు. మరికొంతమంది ఈ ఘటన జరగుతుండగా భయాందోళనతో ఉన్నామని, తాము చూస్తుండగానే విమానం మిగతా సగం వైపుకి కూడా మంటలు వ్యాపించాయని చెప్పుకొచ్చారు. కాగా, ఈ ఘటనలో సుమారు 68 మంది ప్రయాణికులు చనిపోగా..ఇంకా నలుగురు మృతదేహాల ఆచూకి లభించలేదు. సోమవారం కూడా వారి కోసం నేపాల్ భద్రతా సిబ్బంది గాలించడం పునః ప్రారంభించారు. అలాగే ప్రమాద స్థలం నుంచి బ్లాక్బాక్స్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. (చదవండి: నేపాల్ విమాన ఘటన: కోపైలట్ విషాద గాథ..నాడు భర్తలాగే భార్య కూడా..) -
షాకింగ్ ఘటన: రైల్వే పట్టాలపై కూలిన డ్రోన్
ఢిల్లీ మెట్రో స్టేషన్లో అనుహ్య ఘటన చోటు చేసుకుంది. మెట్రో రైలు పట్టాలపై ఒక డ్రోన్ క్రాష్ అయ్యింది. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగింది. దీంతో వెంటనే అధికారులు అప్రమత్తమై హెచ్చరికలు జారీ చేసి ఢిల్లీ మెట్రో జసోలా విహార్ స్టేషన్ను కొద్దిసేపు తాత్కాలికంగా మూసేశారు. ఈ మేరకు పోలీసులు ఆ డ్రోన్ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. విచారణలో ఈ డ్రోన్ ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీకి చెందినదని అధికారులు తెలిపారు. తనిఖీల్లో డ్రోన్లో కొన్ని మందులు దొరికాయని తెలిపారు. మందులను పంపేందుకు కంపెనీ డ్రోన్ను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. అయినా హై సెక్యూరిటీ ఉన్న ప్రాంతాల్లో డ్రోన్లు ముప్పు పొంచి ఉందని అలాంటి ప్రదేశాల్లో ఎలాంటి డ్రోన్లు ఉపయోగించకూడదని అధికారులు తెలిపారు. అయినా అధికారుల అనుమతి లేకుండా వాటిని ఉపయోగించడం చట్టం విరుద్ధమని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం మెట్రో స్టేషన్ని పునః ప్రారంభించారు. భద్రతా కారణాల దృష్ట్యా జసోలా విహార్ షాహీన్ బాగ్ నుంచి బొటానికల్ గార్డెన్ మధ్య మెట్రో రైలు సేవలు అందుబాటులో లేవని, మిగిలిన లైన్లో యథావిధిగా సేవలు కొనసాగుతున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ట్వీట్ చేసింది. (చదవండి: జమ్మూ కశ్మీర్లో భారీగా మారణాయుధాలు పట్టివేత) -
Viral Video: బీచ్ లో ల్యాండ్ అయిన విమానం
-
గాల్లో ఎగిరిన కొద్దిసేపటికే ఎమర్జెన్సీ ల్యాండింగ్..దెబ్బకు తలకిందులుగా..
ఇద్దరు వ్యక్తులతో వెళ్తున్న సింగిల్ ఇంజిన్ విమానం క్రాష్ అయ్యి కెమెరాకు చిక్కింది. ఈ ఘటన న్యయార్క్లోని లాస్ ఏంజింల్స్లోని శాంటా మోనికా బీచ్లో చోటు చేసుకుంది. ఆ విమానం మోనికా విమానాశ్రయం నుంచి బయలు దేరిన తొమ్మిది నిమిషాలకే అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. అయితే విమానం ఎయర్ పోర్టఖి కొద్ది దూరంలో ఉండటంతో.. బీచ్లోని ఇసుక మీద తలకిందులుగా ల్యాండ్ అయ్యింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వాస్తవానికి పైలెట్ మాలిబుకు వెళ్లాలనుకున్నాడు. ఐతే విమానం పసిఫిక్ పాలిసేడ్స్ సమీపంలో ఇంజన్లో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో పైలెట్ శాంటా మోనికా ఎయిర్పోర్ట్కి తిరిగి రావడానికి ప్రయత్నించాడు. కానీ పీర్ సమీపంలోని బీచ్ వద్ద అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ బీచ్లో ల్యాండ్ చేయడమనేది మీ స్వంత అవగాహనతో చేయాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో పైలెట్కి బీచ్ తీరంలోవిమానాన్ని ల్యాండ్ చేయడం కష్టమై ఒక్కసారిగా తలకిందులైపోయింది. ఈ అనుహ్య ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అధికారులు వారిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి గురించి ఇంకా తెలియాల్సి ఉంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. View this post on Instagram A post shared by Frank Deville (@fthemagician) -
తండ్రికి గుండె నొప్పి వచ్చిందని..కారుని వేగంగా పోనివ్వడంతో...
ఒక వ్యక్తి తండ్రికి గుండె నొప్పి రావడంతో రక్షించుకోవాలన్న తాపత్రయంలో కారుని వేగంగా పోనిచ్చి ప్రాణాలపైకి తెచ్చుకున్నాడు. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....నోయిడాలోని బహ్లోల్పూర్ నివాసి ప్రదీప్ సింగ్ తండ్రి భూప్ సింగ్ అతని భార్య తొమిదేళ్ల కుమార్తె బులంద్షహర్లో ఉన్న పచౌటా ఆలయానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా హఠాత్తుగా తండ్రికి గుండె నొప్పి వచ్చింది. దీంతో తండ్రిని రక్షించుకోవాలన్న ఆత్రుతలో కారుని వేగంగా పోనిచ్చాడు. కారు మితిమీరిన వేగంతో అదుపుతప్పి హైవే సమీపంలోని గొయ్యిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ప్రదీప్ భార్య, తండ్రి తీవ్రంగా గాయపడ్డారు. అతడి తండ్రిని ఘజియాబాద్లోని ఆస్పత్రికి తీసుకువెళ్లగా, భార్యని కోట్ దాద్రిలోని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఐతే ఈ ప్రమాదంలో అతని భార్య ప్రాణాపాయం నుంచి బయటపడగా, అతని తండ్రి మాత్రం చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదం నుంచి ప్రదీప్, అతడి భార్య, కుమార్తె సురక్షితంగా బయటపడినట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: శ్రద్ధా హత్య కేసు: అఫ్తాబ్ని తరలిస్తున్న వ్యాన్పై దాడి... రక్షణగా ఉన్న పోలీసులకు రివార్డు) -
టేకాఫ్ అయిన కొద్ది క్షణంలోనే కుప్పకూలిన విమానం ఆ తర్వాత...
మరణం అంచులదాక వెళ్లి అనూహ్యంగా బయటపెడితే ఎవరికైనా ఏడుపూ ఆనందం ఒకేసారి తన్నుకుంటూ వచ్చేస్తాయి. ఔను! జీవితం మనకు మరో అవకాశం ఇచ్చిందనుకుంటాం. మళ్లీ సమర్ధవంతంగా జీవితాన్ని ఎలా పునర్నిర్మించాలో ఆలోచించుకుంటాం కదా. అచ్చం అలానే ఇక్కడొక జంట చచ్చపోతాం అనుకునేంత భయానక ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. వివరాల్లోకెళ్తే....పెరూ రాజధాని లిమాలోని విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లో రన్వేపై కుప్పకూలిపోయింది. అక్కడే ఉన్న అగ్నిమాపక వాహనాన్ని ఢీకొని మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో సిబ్బంది తోపాటు, దాదాపు 120 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఐతే ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ ఒక జంట వెంటనే సెల్ఫీ తీసుకున్నారు. ఇలాంటి ప్రమాదం తర్వాత కాసేపు భయాందోళనలకు లోనవ్వడం సహజం. కానీ జీవితం మరో అవకాశం ఇచ్చిందన్న ఆనందంతో తాము ఇలా సెల్ఫీతో సెలబ్రేట్ చేసుకుంటున్నాం అని ఆనందంగా చెబుతున్నారు ఆ దంపతులు. ఈ సెల్ఫీ ఫోటోను ఏ 320 సిస్టమ్స అనే ఫేస్బుక్లో 'సెల్ఫీ ఆఫ్ ద ఇయర్' అనే క్యాప్షన్తో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: లాటరీ తగలడమే శాపమైంది...లవర్తో భార్య జంప్) -
క్రిప్టో ఇన్వెస్టర్లకు ఆర్బీఐ రక్షణ
న్యూఢిల్లీ: ఆకాశమే హద్దుగా పెరిగిపోయిన వివాదాస్పద క్రిప్టో కరెన్సీలు అకస్మాత్తుగా మళ్లీ పాతాళానికి పతనమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల కొద్దీ డాలర్ల ఇన్వెస్టర్ల పెట్టుబడులు హరించుకుపోతున్నాయి. 2021లో 3 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న క్రిప్టోల మార్కెట్ విలువ కేవలం ఏడాది వ్యవధిలోనే 1 ట్రిలియన్ డాలర్ కన్నా తక్కువకి పడిపోవడం ఈ కరెన్సీల్లో ఉన్న రిస్కులను ప్రపంచానికి మరోసారి తెలియజేసింది. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద క్రిప్టో ఎక్సే్చంజీగా వ్యవహరించిన ఎఫ్టీఎక్స్ కుప్పకూలడంతో దాని సహ–వ్యవస్థాపకుడు శామ్ బ్యాంక్మన్–ఫ్రైడ్ సంపద కేవలం రోజుల వ్యవధిలో ఏకంగా 16 బిలియన్ డాలర్లు హరించుకుపోయింది. భారీ సంపద ఇంత వేగంగా కరిగిపోయిన అతి తక్కువ సందర్భాల్లో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం. ఈ ఉదంతం ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో ఇన్వెస్టర్లను కుదిపేసింది. ప్రధాన స్రవంతిలోకి చేరి అందరి విశ్వసనీయతను పొందేందుకు నానా తంటాలు పడుతున్న క్రిప్టోలపై .. ఇప్పటిదాకా ఉన్న కాస్తో కూస్తో నమ్మకాన్ని కూడా సడలించేసింది. ఆర్బీఐ, ప్రభుత్వ అస్త్రాలతో క్రిప్టో లావాదేవీల కట్టడి.. అయితే, క్రిప్టో ప్రపంచంలో అల్లకల్లోలం రేగుతున్నప్పటికీ దేశీ ఇన్వెస్టర్లు మాత్రం ఈ ప్రభావాల నుండి కొంత సురక్షితంగానే ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. క్రిప్టోలపై ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం ఆది నుండి కఠిన వైఖరులు పాటిస్తుండటమే మన ఇన్వెస్టర్లను కాస్త కాపాడుతోందని వారు తెలిపారు. క్రిప్టోలకు గుర్తింపునిచ్చేందుకు ఆర్బీఐ నిరాకరిస్తుండటం, ప్రభుత్వం పన్ను అస్త్రాన్ని ప్రయోగించడం .. వంటి అంశాలు దేశీయంగా డిమాండ్ను తగ్గించేందుకు, తద్వారా ఇన్వెస్టర్లను కొంత సురక్షితంగా ఉంచేందుకు దోహదపడినట్లు పేర్కొన్నారు. క్రిప్టోలకు చట్టబద్ధత కల్పించకపోయినప్పటికీ వాటి లావాదేవీలపై వచ్చే లాభాల మీద 30 శాతం పన్ను విధించింది ప్రభుత్వం. అంతేకాకుండా వర్చువల్ డిజిటల్ కరెన్సీలకు చెల్లింపులు రూ. 10,000 దాటితే 1 శాతం టీడీఎస్ కూడా విధించింది. ఇలాంటి చర్యలతో క్రిప్టోల జోలికి వెళ్లకుండా ఇన్వెస్టర్లను కాస్త కట్టడి చేసినట్లయిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ‘ఈ విషయంలో హీరోలు ఎవరు? ఇంకెవరు మన కేంద్ర ప్రభుత్వం, సెబీ, ఆర్బీఐ మొదలైనవే. భారతీయ బ్రోకింగ్ సంస్థలు కూడా క్రిప్టోల్లోకి ప్రవేశించి ఉంటే ఎంత మంది ఎంత డబ్బు పోగొట్టుకుని ఉండేవారో కదా. ప్రభుత్వం, ఆర్బీఐ ఇన్ని చర్యలు తీసుకుంటున్నా .. దాదాపు 3 శాతం మంది భారతీయులు క్రిప్టోల్లో ఇన్వెస్ట్ చేశారు. చివరిగా చెప్పేదేమిటంటే.. ఈ పతనం ఇంకా ముగియలేదు. మార్కెట్ పడిపోయింది కదా అని దయచేసి కొనుగోళ్లకు బైల్దేరవద్దు‘ అంటూ దేశీయంగా అతి పెద్ద ఆప్షన్స్ ప్లాట్ఫాం సెన్సిబుల్డాట్కామ్ సీఈవో ఆబిద్ హసన్ ట్వీట్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్రిప్టోలకు గుర్తింపు ఇవ్వకూడదన్న ఆర్బీఐ, ప్రభుత్వ నిర్ణయాలు సరైనవేనని అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఎక్సే్చంజెస్ మెంబర్స్ ఆఫ్ ఇండియా (ఏఎన్ఎంఐ) ప్రెసిడెంట్ కమ్లేష్ షా అభిప్రాయపడ్డారు. -
వెంట్రుకవాసిలో తప్పిన పెను ప్రమాదం...కారుని క్రాష్ చేసేలా వచ్చిన హెలికాప్టర్
ఉక్రెయిన్లోని ఒక హైవేపై ఒక హెలికాప్టర్ వ్యతిరేకదిశలో వస్తున్న కారుకి సమీపంగా తక్కువ ఎత్తులో ఎగురుతూ వచ్చింది. చూస్తున్న వాళ్లకి హెలికాప్టర్ కారుని క్రాష్ చేస్తుందేమో అనిపించేలా సమీపించింది. క్రాష్ అయ్యే సమయానికి పైలెట్ చాలా చాకచక్యంగా హెలికాప్టర్ని పక్కకు తప్పించాడు. చెప్పాలంటే... జస్ట్ వెట్రుకవాసిలో ప్రమాదం తప్పిందనే చెప్పాలి. అందుకు సంబంధించిన వీడియోని ఉక్రెయిన్ మంత్రిత్వ శాఖ 'వెల్కమ్ టు ఉక్రెయిన్' అనే క్యాప్షన్ని జోడించి మరీ పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఐతే నెటిజన్లు మాత్రం పైలెట్ చాలా అనుభవశాలి కాబట్టి ఎలాంటి ప్రమాదం సంభవించకుండా జాగ్రత్త పడగలిగాడని ప్రశంసించారు. కానీ కొంతమంది నెటిజన్లు మాత్రం ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. అదీగాక రష్యా భూ, వాయు మార్గాల్లో బాంబు దాడులను కూడా వేగవంతం చేసింది. అందువల్ల గగనతలంలోని మిసైల్ దాడులను తప్పించుకునేందుకు, శత్రు రాడార్లు గుర్తించకుండా ఉండేలా ఇలా ఉక్రెయిన్ పైలెట్లు తక్కువ ఎత్తులో హెలికాప్టర్తో పయనిస్తున్నారు కాబోలు, బహుశా యుద్ధానికి సంబంధించిన సాధన అయ్యి ఉంటుందంటూ రకరకాలుగా తమ అభిప్రాయాలను వెలిబుచ్చుతూ ట్వీట్ చేశారు. Welcome to Ukraine 🇺🇦 pic.twitter.com/LdFhrzwn2m — Defense of Ukraine (@DefenceU) October 20, 2022 (చదవండి: పంచెకట్టు, షేర్వాణీలో మెరిసిపోతున్న ఒబామా: ఫోటో వైరల్) -
చీతా హెలికాప్టర్ క్రాష్ ...పైలెట్ మృతి
న్యూఢిల్లీ: చీతా హెలికాప్టర్ అరుణాచల్ ప్రదేశ్ కూలిపోయినట్లు భారత ఆర్మీ పేర్కొంది. ఈ ఘటనలో పైలెట్, మృతి చెందగా, కో పైలెట్ తీవ్ర గాయాలపాలైనట్లు వెల్లడించింది. ఈ ప్రమాదం తవాంగ్ ప్రాంతంలో ఉదయం 10 గం.ల సమయంలో జరిగినట్లు తెలిపారు. ఈ చీతా హెలీకాప్టర్లో ఇద్దరు పైలెట్లు ప్రయాణిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రమాదం సంభవించిన వెంటనే ఇద్దరు పైలెట్లను ఆర్మీ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఐతే లెఫ్టినెంట్ సౌరభ యాదవ్ పరిస్థితి చాలా విషమంగా ఉండటంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. అలాగే కో పైలెట్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదని చెప్పారు. ఇదే ఏడాది మార్చిలో మరో చీతా హెలికాప్టర్ జమ్ము కాశ్మీర్ సరిహద్దుల్లో కూలిన సంగతి విధితమే. ఆఘటనలో కూడా పైలెట్ మృతి చెందగా, కోపైలెట్కి తీవ్ర గాయాలపాలయ్యాడు. (చదవండి: ఢిల్లీలో ‘ఉచిత విద్యుత్’పై దర్యాప్తు) -
బ్లాక్ ఫ్రైడే: పాతాళానికి రూపాయి
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిసాయి. కీలక సూచీలు అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో ఆరంభంలోనే కుదేలయ్యాయి. రోజంతా అదే ధోరణి కొనసాగింది. చివర్లో స్వల్పంగా కోలుకున్నప్పటికీ బ్యాంకింగ్, ఐటీ, ఆటో సహా అన్ని రంగాల షేర్లు నష్టాలను చవి చూశాయి. మూడవ సెషన్లో పతనాన్ని నమోదు చేయడమే కాదు, వరుసగా నాల్గవ వారాంతంలోనూ క్షీణించాయి. సెన్సెక్స్ 1020 పాయింట్లు కుప్పకూలి 58098 వద్ద ముగిసింది. తద్వారా 58,500 స్థాయిని కూడా కోల్పోయింది. నిఫ్టీ 302 పాయింట్లు పతనమై 17327వద్ద స్థిరపడింది. ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, పీఎన్బీ, యాక్సిస్, ఇండస్ ఇండ్ తదితర బ్యాంకింగ్ షేర్లతోపాటుపవర్గ్రిడ్, హిందాల్కో, అపోలో, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ నష్టపోయాయి. మరోవైపు దివీస్ లాబ్స్, సన్ఫార్మా, సిప్లా, ఐటీసీ, టాటా స్టీల్ లాభపడ్డాయి. అటు అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి 25 పైసలు పడిపోయి ఆల్టైమ్ కనిష్ట స్థాయి 81.04 వద్ద ముగిసింది. -
చైనా సర్కార్కు సవాల్ విసురుతున్న దెయ్యాల నగరాలు
ఒక్క రియల్ ఎస్టేట్ రంగం నష్టాల్లో కూరుకుపోతే దేశ ఆర్ధిక వ్యవస్థే తల్లకిందులైపోతుందా ఏంటి? అని చాలా మంది బుగ్గలు నొక్కుకోవచ్చుకానీ.. చైనా విషయంలో మాత్రం అది నూటికి నూరు పాళ్లూ నిజమే అంటున్నారు ఆర్ధిక వేత్తలు. ఎందుకంటే చైనా స్థూల జాతీయోత్పత్తిలో రియల్ ఎస్టేట్ రంగం వాటా 29 శాతం. దీనికి కారణాలు లేకపోలేదు. చైనాలో కోటికి పైగా జనాభా ఉండే నగరాలు పదికి పైనే ఉన్నాయి. 1970ల తర్వాత చైనాలో పట్టణీకరణ వేగం అందుకుంది. మామూలు వేగం కాదు. రాకెట్ వేగంతో పట్టణాలు,నగరాలు విస్తరించారు. పెద్ద మొత్తంలో గ్రామీణ ప్రజలు ఉపాధి అవకాశాలు అంది పుచ్చుకుంటూ నగరాలకు వలసలు రావడం మొదలు పెట్టింది అప్పుడే. ఇదీ చదవండి: China: రియల్ ఎస్టేట్ కంపెనీల దివాలా, కంటిమీద కునుకు లేని చైనా) 50ఏళ్ల వ్యవధిలో ఈ వలసలు ఎంత వేగంగా పెరిగాయంటే ప్రస్తుతం చైనాలో పట్టణ జనాభా 64 శాతం మేరకు పెరిగిపోయింది. అంటే గ్రామీణ చైనాలో కేవలం 36 శాతం మంది ప్రజలు మాత్రమే జీవిస్తున్నారు. అందరూ పట్టణాలవైపు మొగ్గు చూపడంతో అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది. భూముల క్రయ విక్రయాలు.. రియల్ ఎస్టేట్ వ్యాపారపు జోరు కారణంగా ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చి చేరుతోంది. ఆదాయంలో సింహభాగం రియల్ ఎస్టేట్ పైనే ఆధార పడుతోంది చైనా. రియల్ బూమ్ యాభై ఏళ్లల్లో ఏటేటా పెరిగిపోతూ చైనా ఆర్ధిక వ్యవస్థను ఓ పెద్ద బుడగలా పెంచేసింది. ఇపుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక్క సారిగా కుదుపునకు లోను కావడంతో చైనా భవిష్యత్ ఏంటా అని ఆర్ధిక రంగ నిపుణులు సైతం కంగారు పడుతున్నారు. నిజానికి ఇటువంటి సంక్షోభం ఏ ఇతర దేశంలో చోటు చేసుకున్నా అది ఆ దేశాలను కోలుకోలేని విధంగా దెబ్బతీయడం ఖాయం. (చైనా డొల్లతనం..దాచేస్తే దాచని సత్యం!) ఇదీ చదవండి: చైనాలో ఇంత దారుణంగా ఉందా? అసలు ఏం జరుగుతోంది? పైకి అంతెత్తున కనిపిస్తున్న చైనాలో పరిస్థితి తలకిందులయ్యేలా ఉందని చాలా మందే హెచ్చరిస్తున్నారు. గంభీరంగా కనిపించే డ్రాగన్ పాలకులు లోలోన తీవ్ర కలవరానికి గురవుతున్నారని చెబుతున్నారు. అయితే పాలకులు ఈ సంక్షోభాన్ని కూడా అధిగమించగల సత్తా ఉన్నారని ఆ దేశ ఆర్ధిక వేత్తలు బీరాలు పలుకుతున్నారు. ఎవర్ గ్రాండే, ఫాంటాసియాలు చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఎవర్ గ్రాండే ఆస్తులపై ప్రభుత్వం ఓ కన్నేసింది. దెయ్యాల నగరాలు.. ఔను చైనాలో ఇప్పుడు ఎక్కడ చూసినా దెయ్యాల నగరాలే. అంటే నిజంగా దయ్యాలు ఉంటాయని కాదు కానీ.. ఆ నగరాల్లో ఎవరూ ఉండరని అర్థం. చైనాలోని ఈ దెయ్యాల నగరాలే ఇపుడు ప్రభుత్వానికి పెద్ద సవాల్. చైనాలో చాలా నగరాల్లో లక్షలాది సంఖ్యలో ఇళ్లు నిర్మించి ఉన్నాయి. చిత్రం ఏంటంటే చాలా నగరాల్లో నిర్మించిన ఇళ్లు ఖాళీగానే ఉన్నాయి. అంటే ఈ నగరాల్లో ఇళ్లను కొనుగోలు చేసే వారు కేవలం పెట్టుబడుల కోసమే వాటిని కొంటున్నారు. అంతే కానీ ఇల్లు కొని గృహప్రవేశాలు చేసి అందులో కాపురం ఉండడానికి ఎంత మాత్రం కాదు. ఇలా అందరూ పెట్టుబడులకోసం కొని పెట్టుకున్న ఇళ్లతో నగరాలు వెల వెల బోతూ కనిపిస్తాయి చైనాలో. ఇలాంటి నగరాలనే ఘోస్ట్ సిటీస్ అంటారు. అవే దెయ్యాల నగరాలన్నమాట. చైనాలోని దెయ్యాల నగరాల్లో నిర్మించిన ఆకాశహర్మ్యాల్లో కనీసం 20 శాతం ఇళ్లు ఖాళీగా ఉన్నాయి. ఈ ఇళ్లను పంచిపెడితే 9 కోట్ల మందికి ఇళ్లు అందించవచ్చన్నమాట.జర్మనీ, ఫ్రాన్స్, కెనడా వంటి దేశాల్లోని మొత్తం జనాభాకు సరిపడ ఇళ్లు చైనాలో ఖాళీగా అఘోరిస్తున్నాయి. 2021 లో చైనాలో ఇళ్ల నిర్మాణాల్లో 14 శాతం తగ్గుదలనమోదయ్యింది. లక్షలాది చదరపు అడుగుల విస్తీర్ణంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. వరుస సంక్షోభాల కారణంగానే ఎవ్వరి దగ్గరా డబ్బులు లేవు. అందుకే కోట్లాది ఇళ్లు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. వేలాది బిలియన్ల డాలర్లమేరకు పెట్టుబడి పెట్టిన వెంచర్లు మధ్యలోనే ఆగిపోవడం..రియల్ వ్యాపారులనే కాదు చైనా ప్రభుత్వాన్నీ కంగారు పెడుతోంది. యావత్ ప్రపంచాన్ని శాసించేయాలని సామ్రాజ్య వాద విస్తరణ కాంక్షతో రగిలిపోతోన్న చైనాలో అసలు పరిస్థితి చాలా భయంకరంగా ఉందని ఆర్ధిక రంగ నిపుణులు అంటున్నారు. -
భూమిని ఢీ కొట్టిన జెట్ విమానం...మంటల్లో సైతం ఎగిరి...: వీడియో వైరల్
అమెరికా నెవాడాలో వార్షిక ఎయిర్ రేస్ పోటీలు జరుగుతుంటాయి. అందులో భాగంగా చివరి రోజు జరుగుతున్న ఛాంపియన్షిప్ పోటీల్లో అనుహ్య ప్రమాదం చోటుచేసుకుంది. ఉన్నటుండి ఒక జెట్ విమానం ఒక్కసారిగా భూమిని ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆ మంటల్లో సైతం విమానం ఎగురుతూ దూరంగా ఒక చోట ఆగిపోయింది. ఈ ఘటనలో పైలెట్ అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా జెట్ విమానాలన్నీ సురక్షితంగానే ల్యాండ్ అయ్యాయి. ఈ భయానక ప్రమాదం కారణంగా మిగతా ఈవెంట్లన్నింటిని రద్దు చేశారు. ఐతే మిగతా పైలెట్ల ఎవరూ ప్రమాదం బారిన పడలేదని తెలిపారు. ప్రతి ఏటా సెప్టెంబర్లో నెవాడాలోని రెనో స్టెడ్ ఎయిర్పోర్ట్లో ఎయిర్ రేస్లు జరుగుతుంటాయి. ఈ మేరకు ఎయిర్ రేస్ల చైర్మన్ ఫ్రెడ్ టెల్లింగ్ మాట్లాడుతూ... నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు(ఎన్టీఎస్బీ), ఫెడరల్ ఏవియేషన్ అడ్మినస్ట్రేషన్ ఈ ప్రమాదానికి గల కారణాలపై వివరణాత్మక దర్యాప్తును జరుపుతాయని వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: వీడియో: 'ఆమె ఎవరసలు?'.. రాణి అంత్యక్రియల కవరేజ్పై బ్రిటన్ ప్రజల ఆగ్రహం) -
రెసిషన్ భయాలు: రుపీ మరోసారి క్రాష్
సాక్షి, ముంబై: గ్లోబల్ మాంద్యం భయాలతో డాలర్తో పోలిస్తే దేశీయ కరెన్సీ రూపాయి మరోసారి బలహీనపడింది ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ దేశాలకు కూడా ఆర్థిక కష్టాలు తప్పవనే ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ వ్యాఖ్యల నేపథ్యంలో శుక్రవారం ఆరంభంలోనే రూపాయి పతనమైంది. డాలర్తో రూపాయి మారకం విలువ 11 పైసలు పడిపోయి 79.82 వద్దకు చేరింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచబ్యాంకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన కేంద్ర బ్యాంకులు మాంద్యంలోకి వెళ్లవచ్చని తాజాగా హెచ్చరించాయి. దీనికి తోడు అమెరికాలోద్రవ్యోల్బణం స్థాయి కూడా ఊహించని రీతిలో ఉండటతో వచ్చేవారం ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేటువడ్డన భారీగా ఉంటుందనే అంచనాలు ఇన్వెస్టర్లను సెంటిమెంట్ను దెబ్బ తీసాయి. గురువారం ముగింపు 79.7012తో పోలిస్తే, కీలకమైన 80 స్థాయికి అతి వేగంగా జారిపోతోంది. దీనికి తోడు ఈక్విటీ మార్కెట్ల భారీ నష్టాలు కూడా రూపాయి క్షీణతకు దారి తీసింది.సె న్సెక్స్ ఒక దశలో ఏకంగా 750 పాయింట్లు కుప్పకూలి 60వేల దిగువకు, అనంతరం 59500 దిగువకు పడిపోయింది. అటు నిఫ్టీ కూడా కీలకమైన మద్దతుస్థాయిని 18వేలను, ఆ తరువాత 17750 స్థాయిని కూడా కోల్పోయింది. -
స్టాక్మార్కెట్ క్రాష్, రుపీ రికార్డు కనిష్టం
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం భారీ పతనాన్ని నమోదు చేశాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో ఆరంభంలోనే సెన్సెక్స్ ఏకంగా 1100 పాయింట్లు కుప్పకూలింది. దాదాపు అన్ని రంగాల షేర్లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 995 పాయింట్లు పతనమై 57842 వద్ద, నిఫ్టీ 295 పాయింట్ల నష్టంతో 17265 వద్ద కొన సాగుతున్నాయి. ఐటీ దిగ్గజాలు టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్, టీసీఎస్, విప్రో, బజాజ్ ఫిన్సర్వ్ నష్ట పోతున్నాయి. అయితే హెచ్యూఎల్, బ్రిటానియా, అపోలో హాస్పిటల్, మారుతి, నెస్లే లాభపడు తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ 45వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)పై అందరి దృష్టి నెలకొని ఉంది. ఫలితంగా రిలయన్స్ కూడా నష్టాల్లో ఉంది. మరోవైపుడాలరు డాలరు మారకంలో రూపాయి ఆల్ టైం కనిష్టానికి చేరింది. ప్రారంభ ట్రేడింగ్లో డాలర్తో పోలిస్తే 26 పైసలు పతనమై రికార్డు కనిష్టం 80.10 స్థాయిని టచ్ చేసింది. ప్రస్తుతం 80.02 వద్ద ట్రేడ్ అవుతోంది. -
హెలికాప్టర్ కూలి 14 మంది మృతి: నార్కో టెర్రరిస్టు అరెస్టే కారణమా?
మెక్సికో : సినాలోవాలో మెక్సికన్ నేవీ హెలికాప్టర్ కూలిన ఘటన విషాదాన్ని నింపింది. ఉత్తర రాష్ట్రమైన సినాలోవాలో బ్లాక్ హాక్ మిలిటరీ హెలికాప్టర్ కూలిపోవడంతో 14 మంది మరణించారని, మరొకరు గాయపడ్డారని మెక్సికన్ నేవీ శుక్రవారం తెలిపింది. ఈ దుర్ఘటనపై దర్యాప్తు జరుగుతోందని తెలిపింది. నావీ మోస్ట్ వాంటెడ్ నార్కో టెర్రరిస్టును అదుపులోకి తీసుకున్న నేపథ్యంలోనే ఈ క్రాష్ జరిగి ఉంటుందా అనే అనుమానాలు వెల్లువెత్తాయి. సినాలోవాలో 69 ఏళ్లడ్రగ్ లార్డ్ రాఫెల్ కారో క్వింటెరో మాక్స్ అనే మిలిటరీ-శిక్షణ పొందిన ఫీమేల్ బ్లడ్హౌండ్కి పట్టుబడ్డాడని నేవీ శుక్రవారం తెలిపింది. అతని అరెస్టు తరువాత హెలికాప్టర్ క్రాష్ కావడం చర్చకు దారితీసింది. అయితే అతని అరెస్టకు ఈ ప్రమాదానికి సంబంధం ఉందన్న సమాచారం ఏమీ లేదని నేవీ ఒక ప్రకటనలో తెలిపింది. 1985లో అమెరికాలోడ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మి నిస్ట్రేషన్ ఏజెంట్ "కికి" కమరేనాను కిడ్నాప్ చేసి. చిత్ర హింసలకు గురిచేసి, హత్య చేసిన కేసులో దోషిగా తేలిన కరుడుగట్టిన డ్రగ్ లార్డ్ రాఫెల్ కారో క్వింటెరోను నావికాదళం అరెస్ట్ చేసింది. కమరేనా హత్యకు క్వింటెరోకు 40 సంవత్సరాల జైలు శిక్ష విధించగా, 28 ఏళ్ల శిక్ష తరువాత 2013లో, మెక్సికన్ న్యాయస్థానం అతనిని విడుదల చేయాలని ఆదేశించింది. ఇది అమెరికా అధికారులకు ఆగ్రహాన్ని తెప్పించింది. మెక్సికో సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని రద్దు చేసే సమయానికి, కారో క్వింటెరో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇరు దేశ దౌత్య సంబంధాలను దెబ్బ తీసింది. ఆ తరువాత సినాలోవా కార్టెల్కు తిరిగి వచ్చి డ్రగ్ దందా మొదలు పెట్టాడు క్వింటెరో. ఎఫ్బీఐ టాప్ 10 మోస్ట్ వాంటెడ్ ఫ్యుజిటివ్ల జాబితాలో ఉన్న అతనిపై 20 మిలియన్ల యూఎస్ డాలర్ల బహుమతికూడా ఉంది. ఇది డ్రగ్ ట్రాఫికర్గా రికార్డు. మరోవైపు క్వింటెరో అరెస్టును అమెరికా ప్రభుత్వం ప్రశంసించింది. అమెరికా అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్, కారో క్వింటెరోను తక్షణమే అప్పగించాలని కోరనున్నట్లు తెలిపారు."ఇది చాలా పెద్దవిషయం" అని వైట్ హౌస్ సీనియర్ లాటిన్ అమెరికా సలహాదారు జువాన్ గొంజాలెజ్ ట్వీట్ చేశారు. క్వింటెరో కారో అరెస్ట్తో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడంలో అమెరికా, మెక్సికో మధ్య సంబంధాలు మెరుగుపడనున్నాయని అధికారులు భావిస్తున్నారు. -
కేంద్రం కొత్త పన్నుల షాక్, రిలయన్స్, ఓఎన్జీసీ ఢమాల్!
సాక్షి, ముంబై: కేంద్ర ప్రభుత్వం కొత్తగా విధించిన పన్ను పోటుతో రిలయన్స్, ఓఎన్జీసీ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. అంతర్గతంగా ఇంధన కొరతను నివారించేందుకు ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై ఎగుమతి పన్నులు, దేశీయ ముడి చమురు ఉత్పత్తిపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం లేదా విండ్ఫాల్ పన్ను విధించింది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓఎన్జీసీ షేర్లు శుక్రవారం కుప్పకూలాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు రికార్డ్ స్థాయికి చేరడంతో భారీగా లాభపడిన చమురు ఉత్పత్తిదారులపై ఇండియా విండ్ఫాల్ పన్నును ప్రవేశ పెట్టింది. అలాగే గ్యాసోయిల్, గ్యాసోలిన్ జెట్ ఇంధనం దిగుమతులపై సుంకాలను విధించింది. దీంతో రిలయన్స్ స్టాక్ 8.7 శాతం వరకు పడిపోయింది. 2020, నవంబర్ 2 తరువాత ఇదే అతిపెద్ద ఇంట్రాడే పతనం. ఫలితంగా దేశంలోని ఆయిల్-టు-రిటైల్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్కెట్ విలువలో 19.35 బిలియన్ డాలర్ల మేర తగ్గిందని రాయిటర్స్ నివేదించింది. బీఎస్ఈలో రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ 16.5 లక్షల కోట్లుగా ఉంది. ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఓఎన్జీసీ ఏకంగా 12.3 శాతం క్షీణించింది 2020 మార్చి 23 తరువాత ఇదే అతిపెద్ద పతనం. ఆయిల్ ఇండియా దాదాపు 11 శాతం క్షీణించగా, మంగళూరు రిఫైనరీ, పెట్రోకెమికల్ 10 శాతం క్షీణించాయి. కాగాపెట్రోల్, ఏటీఎఫ్ ఎగుమతులపై లీటరుకు రూ. 6, డీజిల్ ఎగుమతిపై లీటర్కు రూ. 13 పన్ను విధించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై టన్నుకు రూ. 23,250 అదనపు పన్ను విధించింది. మరోవైపు డాలర్తో రూపాయి శుక్రవారం మరో ఆల్టైమ్ కనిష్టం 79.11కి చేరుకుంది, గత కొన్ని వారాలుగా ఆల్ టైమ్ కనిష్టానికి చేరుతున్న సంగతి తెలిసిందే. -
రెసిషన్ భయాలు: స్టాక్ మార్కెట్లు ఢమాల్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు యూఎస్ ఫెడ్ వడ్డీ రేటు భారీ పెంపు తరువాత గురువారం భారీ లాభాలతో మురిపించాయి. కానీ ఆ మురిపెం ఎంతో సేపు నిలవలేదు. ప్రపంచ ఆర్థిక మాంద్యం భయాల కారణంగా నెలకొన్న భారీ సెల్లింగ్ ధోరణితో కీలక సూచీలు రెండూ భారీ పతనాన్ని నమోదు చేశాయి. సెన్సెక్స్ 1046 పాయింట్లు నష్టంతో 51495 వద్ద, నిఫ్టీ 332 పాయింట్లు కుప్పకూలి 15360 వద్ద స్థిరపడ్డాయి. ఫలితంగా సెన్సెక్స్ 52 వేలు, నిఫ్టీ 15400 దిగువకు జారిపోవడం గమనార్హం. బ్యాంకింగ్, ఐటీ, మెటల్ ఇలా అన్ని రంగాల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ రియాల్టీ, ఆటో, బ్యాంక్, ఐటీ సూచీలు 2 శాతంపైగా పతనమయ్యాయి. అలాగే విమాన ఇంధన ధరలు భారీగా పెరగడంతో విమానయాన రంగ షేర్లు నష్టపోయాయి. ఆఖరి గంటలో అమ్మకాల సెగ మరింత పెరిగింది. ఫలితంగా 2021 మే నాటికి స్ఠాయిల కిందికి రికార్డు పతనమైనాయి. టెక్ మహీంద్ర,టాటా స్టీల్ , విప్రో,ఇన్ఫోసిస్, హిందాల్కో, గ్రాసిం 52 వారాల కనిష్టానికి చేరాయి. టాటా మోటార్స్, రిలయన్స్ వేదాంత, టాటా స్టీల్, స్పైస్ జెట్, ఇండిగో, కోల్ ఇండియా, ఓఎన్జీసీ ఇతర టాప్ లూజర్స్గా నిలిచాయి. అటు డాలరు మారకంలో దేశీ రూపాయి కూడా నష్టాల్లోనే ముగిసింది. బుధవారంనాటి 78.22 ముగింపుతో పోలిస్తే 15 పైసలు ఎగిసి 78.07 వద్ద ట్రేడింగ్ను ఆరంభించింది. -
బిట్ కాయిన్ క్రాష్: మార్కెట్ క్యాప్ ఢమాల్!
సాక్షి, న్యూఢిల్లీ: క్రిప్టో మార్కెట్ మరోసారి ఘోరంగా కుప్పకూలింది. గత 24 గంటల్లో క్రిప్టోకరెన్సీ గ్లోబల్ మార్కెట్ క్యాప్ 5.54 శాతం క్షీణించింది. గ్లోబల్ మార్కెట్ క్యాప్ 5.54 శాతం క్రాష్ అయ్యి 1.24 ట్రిలియన్ల డాలర్లకు పరిమితమైంది. బిట్కాయిన్, ఎథరమ్ వంటి టాప్ క్రిప్టో కరెన్సీలు తీవ్ర పతనాన్ని నమోదు చేశాయి. కాయిన్ మార్కెట్ డేటా ప్రకారం బిట్కాయిన్ 6.14 శాతం తగ్గి 29,823 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఎథరమ్ కూడా మేజర్ డౌన్ట్రెండ్ని నమోదు చేసింది. 5.63 శాతం కుప్పకూలి 1,826 డాలర్ల వద్ద ఉంది. బీఎన్బీ టోకెన్ 5.59 శాతం క్షీణించింది. సోలానా గణనీయంగా 12.73 శాతం పడిపోయింది. ఫలితంగా సోలానా బ్లాక్చెయిన్ నెట్వర్క్ను గత రాత్రి ప్రపంచవ్యాప్తంగా నిలిపివేసి, 4 గంటల తర్వాత పునరుద్ధరించారు. అటు ఎక్స్ఆర్పీ కూడా గత 24 గంటల్లో 5.98 శాతం పడిపోయింది. ఏడీఏ టోకెన్ 7.47 శాతం తగ్గింది. డాజీకాయిన్ 5.95 శాతం క్రాష్ అయింది. మొత్తంమీద, ప్రధాన టాప్ టోకెన్లు గత 24 గంటల్లో భారీగా పతనాన్ని నమోదు చేయడం గమనార్హం అయితే యూఎస్డీటీ టెథర్ గత 24 గంటల్లో దాని విలువలో 0.02 శాతం అప్ట్రెండ్ని, యూఎస్డీసీ స్టేబుల్కాయిన్లు 0.01 శాతం అప్ట్రెండ్ని కనబర్చాయి. కాగా ఆర్థిక సంక్షోభం ప్రభావం ఇపుడు అందరిపైనా కనిపిస్తోందినీ, ఇది క్రిప్టోల కదలికలపై కూడా ఉంటుందని ఈ నేపథ్యంలో పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని జేపీ మోర్గాన్ చేజ్ సీఈవో జామీ డిమోన్ సూచించారు. -
అదే నా కొంప ముంచింది: పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ!
Paytm Share Decline Reason, న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం పేటీఎమ్ షేరు విలువ పతనంకావడానికి మార్కెట్ల ఆటుపోట్లే కారణమని వన్97 కమ్యూనికేషన్స్ సీఈవో విజయ్ శేఖర్ శర్మ పేర్కొన్నారు. అధిక వృద్ధికి వీలున్న స్టాక్స్పై ఇటీవల మార్కెట్ హెచ్చుతగ్గులు ప్రభావం చూపినట్లు పేర్కొన్నారు. రానున్న ఆరు త్రైమాసికాల్లోకంపెనీ లాభనష్టాలులేని(బ్రేక్ఈవెన్) స్థితికి చేరుకోగలదని అంచనా వేశారు. నిర్వహణ లాభాలు(ఇబిటా) ఆర్జించే స్థాయికి చేరగలదని అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా అధిక వృద్ధికి వీలున్న స్టాక్స్లో మార్కెట్ ఒడిదుడుకులు ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు వాటాదారులకు రాసిన లేఖలో శర్మ పేర్కొన్నారు. పేటీఎమ్ బ్రాండుతో వన్97 కమ్యూనికేషన్స్ డిజిటల్ పేమెంట్ సర్వీసులందిస్తున్న సంగతి తెలిసిందే. నేలచూపుల్లో...: గతేడాది షేరుకి రూ. 2,150 ధరలో పబ్లిక్ ఇష్యూకి వచ్చిన వన్97 కమ్యూనికేషన్స్ కొద్ది రోజులుగా పతన బాటలో సాగుతూ వస్తోంది. ఇటీవల బీఎస్ఈలో రూ. 520 వద్ద జీవితకాల కనిష్టాన్ని చవిచూసింది. తాజాగా 5 శాతం బలపడి రూ. 637 వద్ద ముగిసింది. ఈ ఆర్థిక సంవత్సరం(2022) ఫలితాలు ప్రకటించవలసి ఉన్నదని, ప్రస్తుతం కంపెనీ బిజినెస్ అవకాశాలు ప్రోత్సాహాన్నిస్తున్నాయని లేఖలో శర్మ ప్రస్తావించారు. ఇది కొనసాగనున్నట్లు భావిస్తున్నామంటూనే, ఏడాదిన్నర కాలంలో నిర్వహణ ఇబిటాను సాధించగలమన్న ధీమా వ్యక్తం చేశారు. వెరసి 2023 సెప్టెంబర్కల్లా ఆశించిన ఫలితాలు అందుకోగలమని అభిప్రాయపడ్డారు. తద్వారా దీర్ఘకాలంలో వాటాదారులకు విలువ చేకూర్చనున్నట్లు తెలియజేశారు. ఇందుకు అనుగుణంగా మార్కెట్ విలువ ఐపీవో స్థాయికి చేరాకమాత్రమే తనకు జారీ అయిన షేర్లు తనకు సొంతమవుతాయని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. -
యుద్ధ ట్యాంక్ కారుని నుజ్జునుజ్జు చేసింది...కానీ ఆవ్యక్తి
Military Vehicle Crushing Car: గత నాలుగు రోజులుగా రష్యా బలగాల వైమానిక క్షిపణి దాడులతో ఉక్రెయిన్ అతలాకుతులం అవుతోంది. ఈ నేపథ్యంలో ఒక సాయుధ వాహనం వేగంగా వస్తున్న కారు పైకి దూసుకువచ్చింది. ఆ సాయుధ వాహనం కింద కారు నుజ్జునుజ్జు అయిపోయింది. నిజానికి మనుషులు బతికి ఉండే అవకాశమే లేదు అన్నంతగా ఆ కారు ధ్వంసమైంది. విచిత్రమేమిటంటే ఆ కారులోని మనిషి బతికే ఉన్నాడు. ఈ ఘటన రైల్వే ట్రాక్కి సమీపంలో చోటు చేసుకుంది. అయితే ఆ సాయుధ వాహనం వెనుక కూడా రెండు కార్లు వస్తున్నాయి. కానీ ఆ సాయుధ వాహనం స్కిడ్ అయ్యిందో లేక వేగంగా వాహనాన్ని అడ్డుకునే క్రమంలో అలా వచ్చిందా అనేది తెలియలేదు. పైగా ఆ సాయుధ వాహనానం రష్యాకి సంబంధించినదేనా అనే దానిపై కూడా స్పష్టత లేదు. కానీ ఆ కారులోని వృద్ధుడు క్షేమంగా బయటపడటం మాత్రం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అయితే సీసీటీవలో గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువుగా ఉందని అదే మనిషి ప్రాణాలను కాపాడి ఉంటుందని నిపుణులు అంటున్నారు. Za sve one koji ne žele da vide šta Putin radi u Ukrajini. Ruski narod ne stoji iza ovoga. Ovo je Putinov lični rat. Na obraz medjunarodnoj zajednici koja ovo nemo posmatra.#Ukraine pic.twitter.com/aqfhpMuX9A — Balša Božović (@Balshone) February 25, 2022 Lucky driver. He is alive! pic.twitter.com/Ry99BX375D — Ragıp Soylu (@ragipsoylu) February 25, 2022 (చదవండి: నా కుక్కపిల్ల లేకుండా ఉక్రెయిన్ విడిచి రాను!: భారతీయ విద్యార్థి) -
యుద్దం వస్తే అంతే.. స్టాక్ మార్కెట్లు క్రాష్.. హోరెత్తిపోతున్న మీమ్స్
సాధారణ అంశాలకే ప్రభావితమయ్యే స్టాక్ మార్కెట్లు. ఉక్రెయిన్పై రష్యా చేపడుతున్న దాడులు ప్రతిగా అమెరికా దాని మిత్ర దేశాలు విధిస్తున్న ఆంక్షలతో కకావికాలం అవుతున్నాయి. ఇండియా, సింగపూర్, చైనా, అమెరికన్ నాస్డాక్, యూరప్, జపాన్ ఇలా ఆ దేశం ఈ దేశం అని కాకుండా ప్రపంచ స్టాక్ మార్కెట్లు బాంబుల మోతకు తీవ్రంగా కంపిస్తున్నాయి. అమ్మకాల ఒత్తిడిలో కూరుకుపోయాయి. క్షణాల వ్యవధిలోనే లక్షల కోట్ల సంపద ఆవిరవుతోంది. ఆలస్యం చేసిన కొద్ది మార్కెట్లు మరింతగా కుంగిపోతుండటంతో ఇన్వెస్టర్లు గగ్గోలు పెడుతున్నారు. యుద్ధం ఎఫెక్ట్తో ఇన్వెస్టర్లు ఓవైపు కంగారు పడుతుంటే మరోవైపు దొరికిందిరా ఛాన్స్ అన్నట్టుగా అప్పటికప్పుడు మీమ్స్ తయారు చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు. మార్కెట్లు ఎలా కుప్పకూలి పోతున్నాయి. ఇన్వెస్లర్లు సంపద అంతా కోల్పోయి ఎలా బికారుల్లా మారుతున్నారో తెలియజేస్తూ సరికొత్త మీమ్స్తో సోషల్ మీడియాను దున్నేస్తున్నారు. యుద్ధంతో నెలకొన్న ఉత్కంఠ క్షణాల మధ్య ఈ మీమ్స్ కొంత ఉపశమనం కలిగిస్తున్నాయి. Stock market after #RussiaUkraineConflict#stockmarketcrash pic.twitter.com/6ZimNz5n9n — byehoe_baeno (@byehoe_baeno) February 24, 2022 *stonks and Internet money 🤷🏿♂️#stockmarketcrash pic.twitter.com/yDFtq78EBu — Lawrance Sibanyoni ☠ (@lawrydraco) January 26, 2022 Buying vegetables after #stockmarketcrash pic.twitter.com/3RnChEFs9z — Yolo Muse (@YoloMuse) January 24, 2022 Global Stock Markets today #RussiaUkraineConflict #stockmarketcrash pic.twitter.com/UcRJoeAuCX — Nigel D'Souza (@Nigel__DSouza) February 24, 2022 -
సముద్రంలో కుప్పకూలిన హెలికాప్టర్
ఇంతవరకు మనం హెలకాప్టర్ క్రాష్కి సంబంధించిన పలు ఘటనలు గురించి విన్నాం. ఇటీవల యూకేలోని యూనిస్ తుపాను కారణంగా వీచిన ఈదురు గాలుల బీభత్సానికి విమానం ఎంత ప్రమాదకరంగా ల్యాండ్ అయ్యిందో చూశాం. అయితే ఇక్కడొక హెలికాప్టర్ ఎలాంటి సాంకేతిక లోపం తలెత్తిందో గానీ అందరూ చూస్తుండగానే బీచ్లోని అలల పైకి దూసుకుపోయింది. అసలు విషయంలోకెళ్తే...అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక హెలికాప్టర్ కూలిపోయింది. భారత కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 1.20 నిమిషాలకు ఫ్లోరిడాలోని రద్దీగా ఉండే మియామీ బీచ్లో ముగ్గురు ప్రయాణికులతో కూడిన రాబిన్సన్ R44 హెలికాప్టర్ కూలిపోయిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్తో హెలికాప్టర్ క్రాష్కి గల కారణాన్ని ఏజెన్సీ దర్యాప్తు చేస్తోంది. ఈ మేరకు మయామి బీచ్ పోలీసులు, అగ్నిమాపక విభాగాలు ఘటనాస్థలికి వచ్చి ఇద్దరు ప్రయాణికులను స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు ట్విట్టర్లో తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. This afternoon at 1:10 p.m., MBPD received a call of a helicopter crash in the ocean near 10 Street. Police and @MiamiBeachFire responded to the scene along with several partner agencies. Two occupants have been transported to Jackson Memorial Hospital in stable condition. 1/2 pic.twitter.com/heSIqnQtle — Miami Beach Police (@MiamiBeachPD) February 19, 2022 (చదవండి: హెలికాప్టర్ బొమ్మతో ఆడుకుంటుండగా హేళన.. సీరియస్గా తీసుకుని కొడుకు పెళ్లికి ఏకంగా హెలికాప్టర్!) -
బాజాభజంత్రీలతో పెళ్లి బృందం.. ఒక్కసారిగా షాక్.. కాడెద్దులు పరుగో పరుగు..
వెల్దుర్తి(కర్నూలు జిల్లా): బాజా భజంత్రీలతో వెళ్తున్న పెళ్లి బృందంపై కాడెద్దులు బండితో సహా పరుగుతీయడంతో ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన రామళ్లకోటలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన సాలెవాళ్ల పెళ్లికి సంబంధించిన కార్యక్రమంలో భాగంగా పెళ్లి బృంద సభ్యులు గ్రామ సమీపాన గల పాలకొమ్ము, పుట్టమన్ను తీసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సమయంలో బోయనపల్లెకు చెందిన రైతు తన ఎద్దులబండి (టైర్ల చక్రాలు కలిగిన బండి)లో వేరుశనగ కట్టె తీసుకువెళ్లేందుకు రామళ్లకోటకు వచ్చి వనం వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద గల పంక్చర్ షాపు వద్ద టైర్లలో గాలి చెక్ చేసుకుంటున్నాడు. చదవండి: భర్త సంతకు తీసుకువెళ్లలేదని ఎంత పనిచేశావమ్మా.. ఆలయం పక్క నుంచి బాజాభజంత్రీలతో పెళ్లి బృందం ముందు వెళ్తుండగా కాడెద్దులు ఒక్కసారిగా బండితో సహా వెనుక నుంచి పరుగు లంఘించుకుంటూ వచ్చాయి. ఎదురుగా ఉన్న పెళ్లిబృందాన్ని ఢీకొట్టుకుంటూ దూసుకుని వెళ్లాయి. ఈ ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. కాడెద్దులు పరుగుపరుగున అరకిలోమీటరు దూరం వెళ్లిన తరువాత కాడి పట్టెలు తెగిపోయి బండి నుంచి విడిపోయాయి. అక్కడి నుంచి పొలాల వైపు పరుగుతీయడంతో వాటిని పట్టుకునేందుకు యజమానికి దాదాపు గంట సమయం పట్టింది. గాయపడిన ఇద్దరు మహిళలను చికిత్స కోసం వెల్దుర్తి ఆసుపత్రికి తరలించారు. -
Aircraft Crashes: కుప్పకూలిన ఆర్మీ ట్రైనర్ హెలికాప్టర్
న్యూఢిల్లీ: ఆర్మీ ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్ క్రాష్కు గురవటం కలకలంగా మారింది. ఈ ప్రమాదం బిహార్లోని బోధ్ గయా బ్లాక్లో చోటు చేసుకుంది. కాగా, ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్.. ట్రైనింగ్లో భాగంగా ఇద్దరు ట్రైనీలకు ఎయిర్క్రాఫ్ట్లో శిక్షణ నిస్తుంది. దీనిలో భాగంగా వీరు ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ గయా సమీపంలో కుప్పకూలింది. ట్రైనీ ఉద్యోగులు.. హెలికాప్టర్ టెకాఫ్కు ప్రయత్నించిన కొద్ది నిమిషాల్లోనే ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో.. హెలికాప్టర్ అక్కడే ఉన్న పొలాల్లో దూసుకుపోయిందని సీనియర్ అధికారి తెలిపారు. కాగా, హెలికాప్టర్ కిందపడటాన్ని చూసిన గ్రామస్థులు వెంటనే సంఘటన స్థలానికి పరుగున వెళ్లి చేరుకున్నారు. హెలికాప్టర్ చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీశారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, ట్రైనీలకు చిన్నపాటి గాయాలు మాత్రమే అయ్యాయని ఆర్మీ సిబ్బంది తెలిపారు. హెలికాప్టర్ క్రాష్కు గల కారణాలపై విచారణ చేపట్టామని తెలిపారు. #WATCH | An aircraft of the Indian Army’s Officers’ Training Academy in Gaya, Bihar today crashed soon after taking off during training. Both the pilots in the aircraft are safe. Video source: Local village population pic.twitter.com/gauLWCrfxN — ANI (@ANI) January 28, 2022 చదవండి: ‘సిద్ధూ డబ్బుకోసం అమ్మనే వదిలేశాడు.. ఆమె అనాథలా చనిపోయింది’ -
జస్ట్ మిస్.. లేదంటే తలకాయ్ నిమ్మకాయలా నలిగేది.. వీడియో వైరల్!
సాధారణంగా వర్షా కాలంలో రోడ్లన్నీ తడిసి ముద్దవుతుంటాయి. అలాంటి రోడ్లపై ద్విచక్ర వాహనంలో ప్రయాణించే వారికి ప్రమాదాలు ఎదురైన ఘటనలు బోలెడు ఉన్నాయి. ఎందుకంటే ఆ సమయాల్లో రోడ్లపై బండి టైర్లకు పట్టులేని కారణంగా వాహనాలు అదుపు తప్పి పడుతుంటాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే మలేషియాలో చోటు చేసుకుంది. అయితే అదృష్టవశాత్తు ఆ వాహనదారునికి ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారి హల్చల్ చేస్తోంది. జస్ట్ మిస్ లేదంటే.. ఆ వీడియోలో.. వర్షం పడతుండడంతో రోడ్డంతా తడిసిపోయి తేమగా ఉంది. అంతలో ఓ బైకర్ వేగంగా దూసుకువచ్చాడు. అంతకు ముందే వర్షంతో రోడ్డు చిత్తడిగా మారడంతో ఆ వాహనదారుడు జారిపడ్డాడు. అయితే వెనకనుంచి అదే లేన్లో ఓ ట్రక్ వస్తోంది. ఇది గమనించిన ఆ బైకర్ తేరుకుని వెంటనే ఆ ట్రక్కు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ఖాళీగా ఉన్న పక్క లేన్ వైపు లేచి పరిగెత్తాడు. కేవలం సెకన్ల వ్యవధిలో ఆ బైకర్ ట్రక్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన ఈ నెల 24న జరిగింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘బాబు చాలా లక్కీ’, ‘జస్ట్ మిస్ లేదంటే’.. అని కామెంట్లు పెడుతున్నారు. చదవండి: ఓటర్లకు డబ్బులు పంచుతూ దొరికిన బీజేపీ మంత్రి కొడుకు.. వీడియో వైరల్ -
ఘోరం: రష్యాలో విమానం కూలి 16 మంది దుర్మరణం
మాస్కో: రష్యాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. తతర్స్తాన్లో ప్రావిన్సుల్లో జరిగిన ఈ ప్రమాదంలో 16 మంది ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో విమానంలో 23 మంది ఉన్నట్లు సమాచారం. పారాచ్యూట్ జంపర్లతో ఎల్ 410 విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. కాగా ఈ ప్రమాదం నుంచి ముగ్గురు బయటపడినట్లు స్థానికి మీడియా తెలిపింది. ఇటీవల ఆగస్టు 12న తూర్పు ప్రాంతంలోని కమ్చట్కా ద్వీపకల్పంలో క్రొనొటస్కే నేచుర్ రిజర్వ్ కురిల్ సరస్సు వద్ద హెలికాప్టర్ కూలి 8 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసింది. తాజాగా ప్రమాదం గురించి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. Avião IghtLight L- 410 com 20 paraquedistas e 2 tripulantes caiu no Tartaristão, Rússia. pic.twitter.com/mVoMJXcpbo — JOÃO (@Joo00556315) October 10, 2021 చదవండి: Xi Jinping: తైవాన్ విలీనం తప్పనిసరి! -
ఎయిర్ అంబులెన్స్ కూలి నలుగురు మృతి
అబూదాబి: అబుదాబి పోలీసుల ఎయిర్ అంబులెన్స్ యూనైటెడ్ అరబ్ ఎమరైట్స్ రాజధాని అబుదాబిలో కూలిపోయిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు, ఇద్దరు వైద్య సిబ్బంది మృతి చెందినట్లు వెల్లడించారు. (చదవండి: రెండో పెళ్లి కోసం తొమ్మిది నెలల పసికందుని 'అమ్మే'సింది) మృతి చెందిన వారిలో పైలట్ ట్రైనర్ ఖమీస్ సయీద్ అల్ హోలీ, లెఫ్టినెంట్ పైలట్ నాసర్ ముహమ్మద్ అల్ రషీది, డాక్టర్ షాహిద్ ఫరూక్ ఘోలం, నర్స్ జోయెల్ క్వియ్ సకార మింటో ఉన్నట్లు అబుదాబి పోలీసులు ధృవీకరించారు. ఈ మేరకు అబుదాబి జనరల్ హెడ్క్వార్టర్స్ పోలీసులు విధుల్లో ఉన్నప్పుడు ఎయిర్ అంబులెన్స్ కూలి మృతి చెందిన వైద్యా బృందానికి, వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. (చదవండి: తక్షణమే చర్యలు తీసుకుంటాం!) -
వచ్చే నెలలో నిశ్చితార్థం: కారు ప్రమాదంలో నటి మృతి
Marathi Actress Ishwari Deshpande Dies In A Car Accident: ప్రియుడితో కలిసి హాలీడే ట్రిప్కు వెళ్లిన నటి ఈశ్వరి దేశ్ పాండే కారు ప్రమాదంలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మరాఠీ నటి ఈశ్వరి ప్రియుడితో కలిసి సెప్టెంబర్ 15న గోవా హాలీడే ట్రిప్కు వెళ్లింది. సోమవారం తెల్లవారుజామున వీరు ప్రయాణిస్తున్న కారు అర్పారో గ్రామానికి సమీపంలోని బాగా-కలాంగుట్ వంతెనపై అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. చదవండి : Shilpa Shetty: జైలు నుంచి వచ్చిన భర్త.. శిల్పా ప్రయాణం ఎటువైపు? కారు సెంట్రల్ లాక్ చేసి ఉండటంతో ఇద్దరూ కారులోంచి బయటకు రాలేకపోయారు. ఈ ప్రమాదంలో ఈశ్వరి(25)తో పాటు ఆమె ప్రియుడు శుభమ్ డెడ్జ్ (28) ప్రాణాలు కోల్పోయారు. చిన్నప్పటి నుంచి నటిగా రాణించాలని కలలు కన్న ఈశ్వరి దేశ్ పాండే హిందీ, మరాఠీ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె చేసిన సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక శుభమ్తో ఈశ్వరికి చాన్నాళ్లుగా పరిచయం ఉంది. వీరి స్నేహం ఇటీవలె ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో వీరి నిశ్చితార్థానికి కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో కారు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ట్రిప్కి వెళ్లి సంతోషంగా తిరిగి వస్తారనుకుంటే శవమై తేలడం బంధువులను, స్నేహితులను షాక్కి గురిచేస్తుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు. Tamannaah: 'అనారోగ్యం.. అందుకే ప్రతిరోజు ఆ జ్యూస్ తాగుతా' -
దేవుడా.. ఆ డివైజ్ లేకుంటే ప్రాణాలు పోయేవే!
రెడ్బుల్-మెర్సెడెస్ టాప్ రేసర్లు మరోసారి దూకుడు చర్యలతో వార్తల్లోకి ఎక్కారు. ప్రపంచ ఛాంపియన్ లూయిస్ హామిల్టన్, రెడ్బుల్ రేసర్ వెర్స్టాపెన్ కార్ల ‘ఢీ’యాక్షన్.. పరస్పర విమర్శలతో వేడెక్కిస్తోంది. ‘‘ఇవాళ నా అదృష్టం బాగుండి బతికా. హలోకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. లేకుంటే ఏమైపోయేవాడినో..’’ అంటూ ప్రమాదం నుంచి బతికి బయటపడ్డ లూయిస్ హామిల్టన్ చెబుతున్నాడు. ఆదివారం వారియంట్ డెల్ రెటాయిలియో రేసుకోర్టులో జరిగిన ఇటలీ పార్కో డీ మోంజా(ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ ఎఫ్1) రేసులో మెక్లారెన్ రేసర్ డానియల్ రిక్కియార్డో(ఆసీస్-ఇటాలియన్) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ రేసులో ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్ లూయిస్ హామిల్టన్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. మొత్తం 53 ల్యాప్లతో జరిగిన రేసులో.. 26వ ల్యాప్ వద్ద 225 కిలోమీటర్ల వేగంతో దూసుకుకొచ్చిన రెడ్బుల్ రేసర్ మాక్స్ వెర్స్టాపెన్ రేస్ కారు.. మెర్సెడెస్ రేసర్ హామిల్టన్ రేస్కారును ఎక్కేసింది. రెండు వాహనాలు ట్రాక్ తప్పి పక్కకు దూసుకెళ్లాయి. 750 కేజీల వెహికిల్ ముందుభాగం పచ్చడికాగా.. క్రాష్లో హామిల్టన్ ప్రాణాలు పోయి ఉంటాయని అంతా కంగారుపడ్డారు!. కానీ, హలొ డివైజ్ వల్ల పెద్దగాయాలేవీ కూడా కాకుండా ప్రాణాలతో బయటపడ్డాడు హామిల్టన్. క్రాష్ తర్వాత తనంతట తానే బయటకు నడుచుకుంటూ వచ్చిన హామిల్టన్.. ఆ తర్వాత మెడ నొప్పి కారణంగా ఆస్పత్రిలో చేరాడు. Another hugely dramatic moment in the Verstappen/Hamilton title battle 💥😮#ItalianGP 🇮🇹 #F1 pic.twitter.com/P4J4bN6wX2 — Formula 1 (@F1) September 12, 2021 హలో.. వివాదం హలొ అనేది సేఫ్టీ డివైజ్. క్రాష్ ప్రొటెక్షన్ వ్యవస్థగా పరిగణిస్తారు. ఓపెన్ వీల్ రేసింగ్ సిరీస్లలో వీటిని వాడ్తారు. డ్రైవర్ తల భాగంలో కర్వ్ షేప్లో ఉంటుంది ఇది. 2016-2017 జులై మధ్యకాలంలో ఈ డివైజ్ను టెస్ట్లకు ఉపయోగించారు. ఫలితాలను ఇస్తుందనే నమ్మకంతో 2018 ఎఫ్ఐఏ సీజన్ నుంచి దీన్ని ఉపయోగిస్తున్నారు. ఆ తర్వాత ప్రతీ రేసులో దీన్ని తప్పనిసరి చేశారు. ఇండీకార్ హలొ మాత్రం ఎయిరోస స్క్రీన్ కోసం వేరే ఫ్రేమ్లో ఉంటుంది. అయితే దీని వాడకంపై వివాదం నడుస్తున్నా.. ఇలా ప్రాణాలు కాపాడటం ఇది రెండోసారి!. గతంలో ఈ డివైజ్ను తీసుకొచ్చిన కొద్దిరోజులకే రేసర్ చార్లెస్ లెక్లెరిక్ పప్రాణాలు కాపాడింది. స్పా ఫ్రాన్కోర్చాంప్స్(2018) రేస్ సందర్భంగా ఫస్ట్ ల్యాప్లోనే ఫెర్నాండో అలోన్సో ‘మెక్లారెన్’తో క్రాష్ అయినప్పటికీ.. ఆ ప్రమాదం నుంచి లెక్లెరిక్ చిన్నగాయం కూడా కాకుండా బయటపడగలిగాడు. ఇక వెర్స్టాపెన్-హామిల్టన్ మధ్య జరిగిన క్రాష్ వివాదానికి తెరలేపింది. వెర్స్టాపెన్కు పెనాల్టీ విధించినప్పటికీ.. మెర్సిడెస్ మేనేజ్మెంట్ మాత్రం ఈ చర్యను తీవ్రంగా భావించాలని కోరుతోంది. చదవండి: డేంజరస్ క్రాష్.. సిగ్గులేకుండా హామిల్టన్ సంబురాలు -
ఆ నిర్ణయం బిట్కాయిన్ కొంపముంచింది..!
గత కొన్ని రోజుల క్రితం నేల చూపులు చూసిన క్రిప్టోకరెన్సీ ఇప్పుడిప్పుడే మెల్లగా కోలుకుంటుంది. బిట్కాయిన్తో పాటు ఈథిరియం, డాగీకాయిన్, వంటి ఇతర క్రిప్టోకరెన్సీల విలువ గణనీయంగా పెరుగుతుంది. ఒకానొక సందర్భంలో నేలచూపులు చూస్తోన్న క్రిప్టోకరెన్సీకి ఎల్సాల్వాడార్, పరాగ్వే దేశాలు తీసుకున్న నిర్ణయాలు కాస్త ఉపశమానాన్ని కల్గించాయి. తాజాగా బిట్కాయిన్ క్రిప్టోకరెన్సీకు ఎల్సాల్వాడార్ దేశం చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. బిట్కాయిన్ను లీగల్ టెండర్గా గుర్తిస్తామనీ ఆ దేశ అధ్యక్షుడు ప్రకటించారు. చదవండి: Afghanistan: అఫ్గన్ పౌరులకు ఇప్పుడు అదే ఆశాదీపం..! ఎల్సాల్వాడార్ ప్రభుత్వం బిట్కాయిన్ను లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఎల్సాల్వాడర్ పౌరులకు 30 డాలర్ల విలువ గల బిట్కాయిన్లను అందించింది. ఎల్సాల్వాడర్ ప్రభుత్వం సుమారు 550 బిట్కాయిన్లను కలిగి ఉంది. ఈ బిట్కాయిన్స్ సుమారు 26 మిలియన్ డాలర్లతో సమానం. బిట్కాయిన్ను స్వీకరించడంతో సుమారు 400 మిలియన్ డాలర్ల లావాదేవీలు ఇతర దేశాలనుంచి వచ్చే అవకాశం ఉందని ఆ దేశ ప్రభుత్వం అభిప్రాయపడింది. ఇష్టంగా లేని ఎల్సాల్వాడర్ పౌరులు..! మరోవైపు బిట్కాయిన్ను లీగల్ టెండర్గా గుర్తించినందుకు ఆ దేశ పౌరుల నుంచి తీవ్రమైన నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. వందలాది మంది పౌరులు రోడ్లపైకి వచ్చి తమ నిరసనను తెలియజేస్తున్నారు. బిట్కాయిన్ మద్దతు ఇచ్చే వ్యవస్ధలు లోపభూయిష్టంగా ఉన్నాయని పౌరులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్ సాల్వడార్ ప్రజలు బిట్కాయిన్ను స్వీకరించడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఎల్ సాల్వడార్లో ఉన్న యూనివర్సిటీడ్ సెంట్రోఅమెరికానా జోస్ సిమెన్ కనాస్ అనే జేసూట్ కాలేజీ ఇటీవల నిర్వహించిన పోల్లో, 67.9 శాతం మంది పౌరులు బిట్కాయిన్ను చట్టపరమైన కరెన్సీగా ఉపయోగించడాన్ని అంగీకరించలేదు. నిరసనలతో భారీగా పతనం.. ఎల్ సాల్వడార్ కొనసాగుతున్న ఉద్రిక్త వాతావరణంతో బిట్కాయిన్ విలువ ఒక్కసారిగా పడిపోయింది. సెప్టెంబర్ ఆరో తేదిన బిట్కాయిన్ ఏకంగా ఒక నెల కనిష్ట స్థాయికి పడిపోయింది. 52 వేల డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్న బిట్కాయిన్ ఏకంగా 42 వేల డాలర్లకు పడిపోయింది. కాగా బిట్కాయిన్ను ఎక్కువ మంది స్వీకరించేందుకుగాను బిట్కాయిన్ ట్రేడర్స్ ఈ క్రిప్టోకరెన్సీ విలువను తగ్గించి ఉంటారని ఊహగానాలు వస్తోన్నాయి. చదవండి: శక్తివంతమైన క్రిప్టోకరెన్సీ ఏదో చెప్పిన ఎలన్ మస్క్...! -
Tesla: టెస్లాను నమ్మొచ్చా?
టెస్లా.. వాహన తయారీలో కొత్త ఒరవడిని సృష్టించిన బ్రాండ్. అమేజింగ్ టెక్నాలజీ, సేఫ్టీ చర్యలు, ఎలక్ట్రిక్ వాహనాలు ఇలా ఎన్నో సంచలనాలతో అమెరికా నుంచి ప్రపంచానికి దూసుకెళ్తోంది. ముఖ్యంగా ఆటోపైలట్ ఫీచర్ ద్వారా వాహనతయారీ రంగంలో ఓ కొత్త ఒరవడి సృష్టించిందనే పేరుంది టెస్లాకి. అలాంటిది వరుస ప్రమాదాలు ఆ బ్రాండ్ను దెబ్బకొట్టే అవకాశాలున్నాయా? అనేదానిపై ఇప్పుడు వాహన నిపుణుల నడుమ సమీక్ష జరుగుతోంది. ఓర్లాండోలో ఆగష్టు 28.. ఉదయం ఐదు గంటల సమయంలో ఆటోపైలెట్తో వెళ్తున్న టెస్లా కారు..ఓ పోలీస్ వాహనాన్ని ఢీ కొట్టింది. ఆ రెండు కార్ల మధ్య ఇరుక్కుపోయిన పోలీస్ అధికారి.. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి కూడా. వీటితో పాటు ఈ ఏడాదిలో ఇప్పటిదాకా జరిగిన యాక్సిడెంట్లను వీడియోలను తెర మీదకు తెస్తున్నారు కొందరు. దీంతో టెస్లా సాంకేతికపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. Happening now: Orange County. Trooper stopped to help a disabled motorist on I-4. When Tesla driving on “auto” mode struck the patrol car. Trooper was outside of car and extremely lucky to have not been struck. #moveover. WB lanes of I-4 remain block as scene is being cleared. pic.twitter.com/w9N7cE4bAR — FHP Orlando (@FHPOrlando) August 28, 2021 టెస్లా క్లియర్గానే.. నిజానికి ఆటోపైలట్ ఫీచర్ విషయంలో టెస్లా మొదటి నుంచి క్లియర్గానే ఉంది. డ్రైవర్ సీట్లో ఎవరైనా ఉన్నప్పుడు మాత్రమే.. ఈ ఫీచర్ను ఉపయోగించాలని చెబుతోంది. ఆటోపైలెట్ ఫీచర్ను ఇప్పటికిప్పుడు డ్రైవర్ లేకుండా ఉపయోగించకూడదని టెస్లా హోం పేజీలో హెచ్చరికను ప్రదర్శిస్తోంది కూడా. కానీ, తాజా యాక్సిడెంట్ వెనుక సీట్లో డ్రైవర్ ఉండగానే జరగడంతో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. ఇక టెస్లా కార్లు గతంలో యాక్సిడెంట్లను పసిగట్టి తప్పించిన సందర్భాలు.. అందుకు సంబంధించిన వీడియోలు కూడా చాలానే ఉన్నాయి. ఈ తరుణంలో వాటి ద్వారా అనుమానాల్ని నివృత్తి చేస్తోంది టెస్లా. అయినప్పటికీ నెగెటివిటీ ఎక్కువగా వ్యాప్తి చెందుతుండడంపై టెస్లా ఆందోళన చెందుతోంది. భారత వర్తకంపై ప్రభావం? టెస్లా ఆటోపైలెట్ ఫీచర్ మీద ఓవైపు అనుమానాలు వ్యక్తం అవుతున్న తరుణంలో.. భారత్లో ఎంట్రీలో చర్చ నడుస్తోంది. కానీ, భారత్ వంటి అతి పెద్ద మార్కెట్ను వదులకునేందుకు టెస్లా సిద్ధంగా లేదని ఆటో ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇక టెస్లా సాంకేతికత.. ఎలక్ట్రిక్ వాహనాల ఎగుమతిపై ఎలాంటి ప్రభావం చూపబోదని భారత ప్రభుత్వం నుంచి స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. ఇప్పటికే నాలుగు మోడల్స్కు అప్రూవల్ కూడా దొరికింది. ముందుగా భారత్కు ఈవీ కార్ల ఎగుమతి, అటుపైనే ప్రొడక్షన్పై ఫోకస్ చేయాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది టెస్లా. ఇప్పటికే సోనా కమ్స్టర్ లిమిటెడ్, సంధార్ టెక్నాలజీస్ లిమిటెడ్, భారత్ ఫోర్జ్ లిమిటెడ్ కంపెనీలు టెస్లాకు విడిభాగాలు అందిస్తున్న తరుణంలో.. వీటి సహకారంతోనే భారత్లోనూ తమ జోరును చూపేందుకు టెస్లా ఉవ్విళ్లూరుతుంది. ఇక కీలకమైన పన్నుల తగ్గింపు విషయంలోనే భారత ప్రభుత్వంతో టెస్లా జరిపే చర్చలు ఓ కొలిక్కి వస్తే.. టెస్లా భారత్లో అడుగుపెట్టడానికి ముహుర్తం ఖరారు కావడం ఒక్కటే మిగులుతుంది. చదవండి: టెస్లాకు పోటీగా ఓలా? -
ల్యాండింగ్ ప్రాబ్లెమ్ తో క్రాష్ అయిన హెలికాప్టర్
-
ఇంటిపై కూలిన ఎయిర్ బెలూన్; 11 మంది సీరియస్
వెల్లింగ్టన్: ఆకాశంలో ఎగురుతున్న ఓ హాట్ ఎయిర్ బెలూన్ ఆకస్మాత్తుగా ఇంటిపై కుప్పకూలిపోవడంతో 11 మంది తీవ్రంగా గాయపడిన దుర్ఘటన న్యూజిలాండ్లో చోటుచేసుకుంది. వివరాలు.. న్యూజిలాండ్లోని సౌత్ ఐలాండ్లోని టూరిస్ట్ ప్రాంతంగా పేరు పొందిన క్వీన్స్టౌన్లోని మోర్వెన్ ఫెర్రీ రోడ్డులో ఉన్న ఒక ఇంటిపై హాట్ ఎయిర్ బెలూన్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 11 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు రెస్య్కూ టీమ్తో ఘటనా స్థలికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా గాయాల తీవ్రత ఎక్కువగా ఉండడంతో వారి పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు తెలిసింది. కాగా ఈ దుర్ఘటనపై న్యూజిలాండ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కెన్యాలో హెలికాప్టర్ కూలి 17 మంది సైనికులు మృతి
నైరోబి: కెన్యాలో ఆర్మీకి చెందిన ఓ హెలికాప్టర్ కూలిన ఘటనలో 17 మంది సైనికులు చనిపోయారు. గురువారం ఉదయం 23 మంది సైనికులతో బయలుదేరిన సైనిక హెలికాప్టర్ కజియాడో కౌంటీలోని ఒలె– తెపెసి వద్ద కూలిపోయింది. ఈ ఘటనలో 17 మంది మృత్యువాతపడగా తీవ్రంగా గాయాల పాలైన ఆరుగురిని ఆస్పత్రికి తరలిం చినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన ఇతర వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. హెలికాప్టర్ కూలిన విషయాన్ని కెన్యా సైన్యం కూడా ధ్రువీకరించింది. వివరాలను మాత్రం బహిర్గతం చేయలేదు. -
దలాల్ స్ట్రీట్లో కరోనా ప్రకంపనలు
సాక్షి,ముంబై: కరోనా సెకండ్వేవ్ ప్రకంపనల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారంకుప్పకూలాయి. కీలక సూచీలు ఓపెనింగ్లోనే రెండున్నరశాతం వరకూ క్షీణించాయి. సెన్సెక్స్ 1400 పైగా క్షీణించి 48,700 కిందికి పతనం కంగా, నిఫ్టీ కీలక మద్దతు స్థాయి 14300 దిగువకు పడిపోయింది. సెన్సెక్స్ 1377పాయింట్లు కోల్పోయి 47464 వద్ద నిఫ్టీ 395 పాయింట్లు పతనమై 14223 వద్ద కొనసాగుతోంది. అటు బ్యాంక్ నిఫ్టీలో కూడా భారీగా అమ్మకాల ధోరణి కనిపిస్తోంది. అన్ని రంగాల షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఆటో రంగ షేర్లు కుప్పకూలాయి. అదానీ పోర్ట్స్, ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్,యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సీ టాప్ లూజర్స్గా ఉన్నాయి. ఆటో స్పేస్లో టాటా మోటార్స్, ఐషర్ మోటర్స్, హీరో మోటోకార్ప్ కూడా ఒక్కొక్కటి 4 శాతం చొప్పున పడిపోయాయి. కాగా దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. కొత్తగా నమోదవుతున్న రోజువారీ కేసుల సంఖ్య మూడు లక్షల మార్క్ దిశగా అడుగులువేస్తోంది వరుసగా ఐదో రోజు రెండున్నర లక్షలకు తగ్గకుండా కొత్త కేసులు నమోద వుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 2,73,810 మందికి కరోనా బారిన పడగా గడిచిన 24 గంటల్లో 1,619 మంది కరోనాతోమరణించారు. -
కరోనా మహమ్మారి విజృంభణ ఇన్వెస్టర్ల కొంపముంచుతోంది..
-
మార్కెట్ల క్రాష్: రూ. 7 లక్షల కోట్లు మటాష్
సాక్షి,ముంబై: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ ఇన్వెస్టర్ల కొంపముంచుతోంది. రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లో కూడా రికార్డు స్థాయిలో అమ్మకాలు వెల్లువెత్తాయి. సోమవారం ట్రేడింగ్లో సెన్సెక్స్ ఏకంగా 1700 పాయింట్లకు పైగా కుప్పకూలింది. దీంతో కేవలం 15 నిమిష్లాలో దలాల్ స్ట్రీట్లో మునుపెన్నడూ లేని విధంగా 7లక్షల కోట్ల మేర పెట్టుబడిదారుల సంపద ఆవిరైంది. ఫలితంగా బీఎస్ఇ-లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 6,86,708.74 కోట్ల రూపాయల నుంచి 2,02,76,533 కోట్లకు పడిపోయింది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ అత్యధికంగా 7 శాతం నష్టపోయింది. ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్ యాక్సిస్ బ్యాంక్ కూడా ఇదే వరుసలో ఉన్నాయి. దీంతో కేవలం కొద్ది నిమిషాల వ్యవధిలోనే రూ. 6.86 లక్షల కోట్ల సంపద హారతి కర్పూరంలా కరిగిపోయింది. కరోనా రెండో దశలో శరవేంగా విస్తరిస్తోంది. మహారాష్ట్ర, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో రికార్డు స్థాయి కేసుల నమోదు ఇన్వెస్టర్లను వణికిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా విస్తరణను అడ్డుకునేందుకు పూర్తి లాక్డౌన్ తప్పదనే భయాలు వెంటాడుతున్నాయి. దీంతో సెన్సెక్స్ 1745 పాయింట్లు కుప్పకూలి 48 వేల దిగువకు చేరింది. అటు నిఫ్టీ కూడా 526 పాయింట్ల నష్టంతో 14313 వద్ద కొనసాగుతోంది. మరోవైపు రానున్న పారిశ్రామికోత్పత్తి సూచి, మార్చి నెల సీపీఐ ద్రవ్యోల్బణ గణాంకాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. అలాగే నాలుగవ క్వార్టర్ ఫలితాలు, ముఖ్యంగా వారంలో ఐటీ మేజర్ల ఫలితాలు ప్రభావితం చేయనున్నాయని, వీటిని దృష్టిలో ఉంచుకోవాలని రిలయన్స్ సెక్యూరిటీస్ స్ట్రాటజీ హెడ్ బినోద్ మోడీ సూచించారు. -
యూసూప్ ఆలీ కి తప్పిన పెను ప్రమాదం
-
సొరంగంలో పట్టాలు తప్పిన ట్రైన్
-
తైవాన్లో ఘోర రైలు ప్రమాదం ఫోటోలు
-
ఘోర రైలు ప్రమాదం: 36 మంది మృతి
సాక్షి, న్యూఢిల్లీ : తూర్పు తైవాన్లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. సుమారు 350మందితో ప్రయాణిస్తున్న రైలు శుక్రవారం ఉదయం పట్టాలు తప్పడంతో 36 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 72 మంది గాయపడ్డారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందనే అందోళన వ్యక్తమవుతోంది. అధికారిక సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ సరిగ్గా పార్క్ చేయని ట్రక్ ఒకటి రైలు పట్టాల పైకి జారిపోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. తైటంగ్కు ప్రయాణిస్తున్న ఈ రైలు హువాలియన్కు ఉత్తరాన ఉన్న ఒక సొరంగంలో పట్టాలు తప్పింది. సహాయ రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని అధికారిక వర్గాలు ప్రకటించాయి. సొరంగం మధ్య ఇరుక్కు పోవడం రక్షణ చర్యలు కష్టంగా ఉన్నాయని పేర్కొన్నాయి. గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కుప్పకూలిన యుద్ధ విమానం, పైలట్ మృతి
సాక్షి, న్యూఢిల్లీ: భారత వైమానిక దళం (ఐఏఎఫ్)కి చెందిన మిగ్-21 బైసన్ యుద్ధ విమానం ప్రమాదం విషాదాన్ని నింపింది. బుధవారం శిక్షణలో భాగంగా ఈ యుద్ధ విమానం కుప్పకూలిన ఘోర ప్రమాదంలో భారత వైమానిక దళానికి చెందిన గ్రూపు కెప్టెన్ ఏ గుప్త మృతి చెందినట్లు ఐఎఎఫ్ తెలిపింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు వెల్లడించింది. సాంకేతిక లోపం కారణంగానే ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. సెంట్రల్ ఇండియాలోని వైమానిక స్థావరంనుంచి రోజువారీ శిక్షణలో భాగంగా బయల్దేరిన విమానం కొద్దిసేపటికే ప్రమాదంలో చిక్కుకుని కుప్ప కూలింది. గుప్త మృతిపై ఐఏఎఫ్ ట్విటర్ ద్వారా తీవ్ర విచారాన్ని ప్రకటించింది. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపింది. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ట్వీట్ చేసింది. The IAF lost Group Captain A Gupta in the tragic accident. IAF expresses deep condolences and stands firmly with the family members. A Court of Inquiry has been ordered to determine the cause of the accident. — Indian Air Force (@IAF_MCC) March 17, 202 -
ఘోర రోడ్డు ప్రమాదం :15 మంది దుర్మరణం
వాషింగ్టన్: అమెరికా-మెక్సికో సరిహద్దు సమీపంలో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. దక్షిణ కాలిఫోర్నియా- మెక్సికో సరిహద్దులోని స్టేట్ రూట్ 115, ఇంపీరియల్ కౌంటీలోని నోరిష్ రోడ్లో యూఎస్వీ కారును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే కన్నుమూయగా, మరొకరు ఆసుపత్రిలో చనిపోయారు. మరో ఏడుగురు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నట్లు ఎల్ సెంట్రో రీజినల్ మెడికల్ సెంటర్ అత్యవసర విభాగం డైరెక్టర్ జూడీ క్రజ్ తెలిపారు. ఎస్యూవీని ట్రక్కు బలంగా ఢీకొట్టడంతో అందులో చిక్కుకున్న వారిని, మృతదేహాలను వెలికి తీసేందుకు శ్రమించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. బాధితులంతా 15 నుంచి 53 ఏళ్ల వయసున్న స్త్రీ, పురుషులు ఉన్నారని,డ్రైవర్ కూడా తీవ్ర గాయాలపాలైనట్టు వెల్లడించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నట్లు జాతీయ రవాణా భద్రతా బోర్డు వెల్లడించింది. కెపాసిటీకి మించి తీసుకు వెళుతూ ప్రమాదానికి గురైందనీ, దాదాపు సుమారు 27 మంది వరకు ఉన్నట్లు స్తానిక బోర్డర్ డివిజన్ చీఫ్ ఆర్టురో ప్లేటెరో పేర్కొన్నారు. మృతుల్లో పది మంది మెక్సికన్ పౌరులు ఉన్నారని, ఇతరుల వివరాలు ఇంకా తెలియరాలేదన్నారు. -
యూజర్లకు షాక్ ఇచ్చిన ఇన్స్టాగ్రామ్
ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్ తమ యూజర్లకు షాక్ ఇచ్చింది. శుక్రవారం రాత్రి పలు సమస్యల కారణంగా సోషల్ మీడియా క్రాష్ అయిందని ట్విట్టర్లో #InstagramCrashing హ్యాష్ ట్యాగ్తో ట్రెండ్ అయింది. కాసేపటి వరకూ పనిచేయకుండా పోయిన ఇన్స్టాగ్రామ్ కాసేపటికి సెట్ అయింది. ఇన్స్టాగ్రామ్ డౌన్ అయిన కాసేపటికే ఇంటర్నెట్లో యూజర్లు మీమ్స్, రియాక్షన్స్తో ప్రపంచవ్యాప్తంగా ట్రోల్ చేశారు. యూజర్లు పెరిగిపోవడంతోనే ఇలా జరిగినట్లుగా నిపుణులు అభిప్రయపడుతున్నారు. సమస్య తీరిపోయిందని చెప్తున్నా.. ఇంకా చాలా మంది యూజర్లు తమ ఫోన్లలో ఇన్స్టాగ్రామ్ యాప్ సరిగా పనిచేయడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. ఇక ఇదే వారం మొదట్లో గూగుల్ సర్వీసులు జీమెయిల్, యూట్యూబ్, గూగుల్ డ్రైవ్ ప్రపంచవ్యాప్తంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. -
వాషింగ్టన్: స్టార్షిప్ నమూనా రాకెట్ క్రాష్
-
మరోసారి విఫలమైన ‘స్పేస్ఎక్స్’
వాషింగ్టన్: మార్స్ మిషన్లో భాగంగా అమెరికా అంతరిక్ష సంస్థ ‘స్సేస్ ఎక్స్’ హెవీ లిఫ్ట్ రాకెట్ స్టార్షిప్ నమూనా ఒకటి ల్యాండ్ అవుతుండగా పేలిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. టెక్సాస్లో బుధవారం ఉదయం టెస్ట్ లాంచ్ సందర్భంగా ఈ పేలుడు చోటు చేసుకుంది. కానీ సంస్థ మాత్రం ఎంతో ‘అద్భుతమైన పరీక్ష.. స్టార్షిప్ టీమ్కు ధన్యవాదాలు’ అంటూ మెసేజ్ చేయడం గమనార్హం. టెస్ట్ ప్రారంభానికి కొన్ని నిమిషాల ముందు స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ టెస్ట్ని ఉద్దేశించి ‘మార్స్.. మేం రాబోతున్నాం’ అంటు ట్వీట్ చేశారు. ల్యాండింగ్ స్పీడ్ను పెంచడం వల్లే ఈ పేలుడు సంభంవించినట్లు సమాచారం. స్టార్షిప్ క్రాష్ అయినప్పటికి.. ఈ పరీక్షలో విజయవంతమైన భాగాలను ఎలాన్ వివరించారు. టేకాఫ్, దాని (పేలుడు పూర్వ) ఖచ్చితమైన ల్యాండింగ్ పథం వంటి అంశాల్లో విజయం సాధించినట్లు తెలిపారు. ‘స్టార్ షిప్ కూలిపోయినప్పటికి మాకు అవసరమైన మొత్తం డాటా లభించింది! అభినందనలు స్పేస్ఎక్స్ బృందం" అని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.(చదవండి: ‘స్పేస్ ఎక్స్’ మరో అద్భుత ప్రాజెక్టు) బుధవారం టెస్ట్ లాంచ్ ప్రారంభం అయిన తర్వాత స్టార్షిప్ కక్ష్యలోకి అధిరోహించింది, ఆ తర్వాత ఒకదాని వెంట ఒకటి ఇంజన్లు బయటకు వచ్చాయి. నింగిలోకి దూసుకెళ్లిన 4 నిమిషాల 45 సెకన్ల వ్యవధి తర్వాత స్టార్షిప్ మూడవ ఇంజిన్ ఆరిపోయింది. దాన్ని నెమ్మదింపజేసే ప్రయత్నంలో అంతవరకు ఆపేసిన ఇంజన్లను పునః ప్రారంభించారు. కాని అది భూమిపైకి దూసుకెళ్లింది. క్రాష్ అయ్యింది. -
హ్యాలో కాపాడింది...
సాఖిర్: బహ్రెయిన్ గ్రాండ్ప్రి ఫార్ములావన్ రేసులో ఆదివారం పెను ప్రమాదమే జరిగినా... హాస్ జట్టు డ్రైవర్ రొమైన్ గ్రోస్యెన్ స్వల్ప గాయాలతో బయటపడటం గొప్ప విశేషం. కారుపై నియంత్రణ కోల్పోయి బారికేడ్లను ఢీకొట్టడంతో కారు రెండు ముక్కలైంది. కాక్పిట్, చాసిస్ వేరుపడ్డాయి. దీంతో పెట్రోల్ లీకేజితో ఒక్కసారిగా సిలిండర్ పేలినట్లు మంటలు చెలరేగాయి. ఇంతటి ఘోరప్రమాదం జరిగినా గ్రోస్యెన్ ప్రాణం మీదికి రాకపోవడంతో ఫార్ములావన్ (ఎఫ్1), బహ్రెయిన్ వర్గాలకు పెద్ద ఊరటే లభించింది. 34 ఏళ్ల గ్రోస్యెన్ను హుటాహుటిన హెలికాప్టర్లో మిలిటరీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అతని చేతి వేళ్లకు కాలిన గాయాలయ్యాయి. ఇది మినహా ఎలాంటి ఫ్రాక్చర్, ప్రాణాపాయ సమస్యలు లేవు. ఇంకా చెప్పాలంటే అంతపెద్ద మంటల్లో... ఫైర్ మార్షల్స్ మంటల్ని అదుపు చేస్తుంటే అతనే ఎంచక్కా బారికేడ్ను దూకుతూ దాటాడు. ఇద్దరు సాయమందించినా... తనే నడుచుకుంటూ అంబులెన్స్ ఎక్కాడు. పెను ప్రమాదం నుంచి అతను చిన్న చిన్న గాయాలతో బయటపడటం నిజంగా అద్భుతమని 1996 ఎఫ్1 చాంపియన్ డామొన్ హిల్ అన్నారు. అదే రక్షించింది... ఫార్ములావన్ ఆధునికతే గ్రోస్యెన్కు ఊపిరి పోసింది. కొన్నేళ్లు పరీక్షించిన మీదట డ్రైవర్ల ప్రాణాలను నిలుపుతుందని భావించిన ఎఫ్1 సంస్థ 2018లో రేస్ కార్లలో హ్యాలో సిస్టమ్ను అమలు చేసింది. డ్రైవర్ తలకు ఏమాత్రం గాయమవ్వకుండా ఉండే రక్షణ కవచం ఇది. కారు కాక్పిట్లో ఓ ఫ్రేమ్గా తలపై భాగాన్ని కవర్ చేస్తుంది. 2016లో వచ్చిన హ్యాలో సిస్టమ్కు లేటెస్ట్ వర్షన్ (ఆధునిక) తోడవడంతో 2017లో ఎఫ్1 సంస్థ ప్రయోగాత్మకంగా పరిశీలించింది. 17 శాతం ప్రాణాపాయాన్ని తగ్గించగలదని ధ్రువీకరించుకున్న ఎఫ్1 ఆ మరుసటి ఏడాది అధికారికంగా అమల్లో పెట్టింది. కానీ ఆనాడు దీన్ని రొమైన్ గ్రోస్యెన్ తీవ్రంగా తప్పుబట్టాడు. ‘హ్యాలో అంటే నాకు అసహ్యం. ఇదేం బాగోలేదు. దీంతో నాకు అస్వస్థత అయిన అనుభవం కలిగింది’ అని స్పందించాడు. కానీ ఇప్పుడదే సంజీవనిగా అతనికి ఉపయోగపడింది. బరిలోకి పియెట్రో... హాస్ టీమ్ డ్రైవర్ గ్రోస్యెన్ తదుపరి రేసుకు దూరమవ్వడంతో హాస్ టీమ్ అతని స్థానాన్ని బ్రెజిల్ రిజర్వ్ డ్రైవర్ పియెట్రో ఫిటిపాల్డికి ఇచ్చింది. దీంతో సాఖిర్లోనే ఈ వారాంతంలో జరిగే రేసుతో పియెట్రో ఫార్ములావన్లో అరంగేట్రం చేయనున్నాడు. పియెట్రో కుటుంబానికి ఎఫ్1తో సుదీర్ఘ అనుబంధం ఉంది. పియెట్రో తాత ఎమర్సన్ 1972, 1974లో ఎఫ్1 వరల్డ్ చాంపియన్గా నిలిచారు. ఎమర్సన్ సోదరుడు విల్సన్... విల్సన్ తనయుడు క్రిస్టియన్ ఫిటిపాల్డి కూడా ఎఫ్1 రేసుల్లో పాల్గొన్నారు. కొన్నేళ్ల క్రితం నేను హ్యాలో సిస్టమ్ను వ్యతిరేకించాను. కానీ ఇప్పుడదే నన్ను కాపాడింది. ఇప్పుడు అది లేకుంటే నేనిలా మీ ముందు మాట్లాడేవాణ్నే కాదు. –గ్రోస్యెన్ -
బహ్రెయిన్ గ్రాండ్ప్రిలో ప్రమాదం
సాఖిర్: ఫార్ములావన్ (ఎఫ్1) బహ్రెయిన్ గ్రాండ్ప్రి రేసులో ఆదివారం పెను ప్రమాదం తప్పింది. తొలి ల్యాప్లో హాస్ జట్టు డ్రైవర్ రొమైన్ గ్రోస్యెన్ నియంత్రణ కోల్పోయి ట్రాక్ పక్కనున్న బారికేడ్లను ఢీకొట్టాడు. వెంటనే అతని కారులో మంటలు చెలరేగాయి. కారు కాక్పిట్, చాసిస్ వేర్వేరుగా రెండు ముక్కలైపోయాయి. మంటలు చెలరేగిన వెంటనే గ్రోస్యెన్ సమయస్ఫూర్తితో స్పందించి కారులో నుంచి బయటకు వచ్చి బారికేడ్లను దాటి సురక్షిత ప్రదేశానికి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అక్కడే ఉన్న సహాయక బృందం కూడా వేగంగా స్పందించి గ్రోస్యెన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. గ్రోస్యెన్ రెండు చేతులకు, మోకాలికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటనతో రేసును గంటన్నరపాటు నిలిపివేశారు. మంటలను పూర్తిగా ఆపేశాక రేసును కొనసాగించారు. రేసు పునఃప్రారంభమయ్యాక రెండో ల్యాప్లోనే రేసింగ్ పాయింట్ జట్టు డ్రైవర్ లాన్స్ స్ట్రాల్ కారు పల్టీలు కొట్టి ట్రాక్ బయటకు వెళ్లింది. 57 ల్యాప్ల ఈ రేసును పోల్ పొజిషన్తో ప్రారంభించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ హామిల్టన్ విజేతగా నిలిచాడు. ఈ సీజన్లోకి హామిల్టన్కిది 11వ విజయం కావడం విశేషం. -
బుల్లెట్కి బలయ్యే అవకాశమివ్వండి
న్యూఢిల్లీ: అరేబియా సముద్రంలో మిగ్–29 కె శిక్షణా విమానం కూలిన ఘటనలో గల్లంతైన కమాండర్ నిశాంత్ సింగ్, గతంలో తన వివాహ అనుమతి కోరుతూ పై అధికారులకు హాస్యపూరితమైన లేఖను రాశారు. తన పెళ్లిని ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ ‘బుల్లెట్ దెబ్బకు బలయ్యే అవకాశాన్నివ్వండి’అంటూ ఆయన రాసిన చమత్కారపూరితమైన లేఖ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. గురువారం మిగ్–29 కె శిక్షణా విమానం అరేబియా సముద్రంలో కూలిపోయింది. ఈ ఘటనలో ఒక పైలెట్ని రక్షించగలిగారు, నిశాంత్ సింగ్ మాత్రం గల్లంతయ్యారు. లాక్డౌన్ కాలంలో తన వివాహానికి అనుమతినివ్వాలని కోరుతూ మే 9వ తేదీన తన వృత్తిలోని అంశాలకు సృజనాత్మకతను జోడిస్తూ అధికారులకు కమాండర్ నిశాంత్సింగ్ హాస్యపూర్వకంగా లేఖ రాశారు. దీనికి ‘మంచిపనులన్నీ శుభం కార్డుతో ముగుస్తాయి, నరకానికి స్వాగతం’’అని నిశాంత్ సింగ్ సీనియర్ అధికారి ప్రతి స్పందించారు. (ఫ్రాన్స్లో భద్రతా బిల్లుపై జనాగ్రహం) -
లడాఖ్ టెన్షన్ : కుప్పకూలిన మార్కెట్
సాక్షి, ముంబై: దేశీయస్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి. సోమవారం ఆరంభంలో ఉత్సాహంగా ఉన్న సూచీలు ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడికి లోనైనాయి. ప్రధానంగా లడఖ్ సరిహద్దులో భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలురీత్యా మార్కెట్లు ఒక్కసారిగా ఒత్తిడికి గురయ్యాయి. దీనికి తోడు పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు, అస్పష్టమైన ఆర్థిక డేటా లాంటి కారణాలతో మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉందని, హై స్థాయిల్లో ఇన్వెస్టర్ల అప్రమత్తత కారణంగా లాభాల స్వీకరణ కనిపించిందని మార్కెట్ నిపుణులు భావించారు. సెన్సెక్స్ 40,000 గరిష్ట స్థాయిని తాకిన సెన్సెక్స్ భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. చివరి అర్ధగంటలో కోలుకున్నప్పటికీ చివరకు సెన్సెక్స్ 839 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 260 పాయింట్లు పతనమైంది. సెన్సెక్స్ ఒకదశలో ఏకంగా 1035 పాయింట్లకు పైగా కుప్పకూలింది. నిఫ్టీ దాదాపు 300 పాయింట్లకు పైగా నష్టంతో 11500 దిగువకు చేరింది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లో ముగిసాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫార్మ ఆటో, ఐటీ, మెటల్, భారీగా నష్టపోయాయి. ఇండస్ఇండ్, సన్ ఫార్మా, ఐసీఐసీఐ, కొటక్ బ్యాంక్, ఐషర్, బజాజ్ ఫిన్, ఎస్బీఐ, శ్రీ సిమెంట్, జీ, సిప్లా, ఎల్అండ్టీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, మారుతీ, యాక్సిస్ భారీ నష్టాల్లో ముగిసాయి. మరోవైపు ఓఎన్జిసి, భారతి ఇన్ఫ్రాటెల్, విప్రో, హెచ్డిఎఫ్సి బ్యాంక్, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా స్వల్పంగా లాభపడ్డాయి. -
అమ్మకాల షాక్- మార్కెట్లు క్రాష్
వరుసగా ఆరో రోజు హుషారుగా ప్రారంభమైన మార్కెట్లలో ఒక్కసారిగా అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో మార్కెట్లకు షాక్ తగిలింది. ప్రస్తుతం సెన్సెక్స్ 674 పాయింట్లు పతనమైంది. 38,793కు చేరింది. వెరసి ఇంట్రాడే గరిష్టం 40,010 నుంచి 1,200పాయింట్లు పడిపోయింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 195 పాయింట్లు కోల్పోయి 11,452 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో గరిష్టంగా 11,794ను తాకింది. లడఖ్ తూర్పు ప్రాంతంలో తిరిగి చైనా బలగాలతో సైనిక వివాదం తలెత్తినట్లు వెలువడిన వార్తలు సెంటిమెంటుకు షాకిచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దీనికితోడు ఆరు రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న మార్కెట్లలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు తెరతీసినట్లు తెలియజేశారు. అన్ని రంగాలూ ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. మీడియా, ఫార్మా, మెటల్, బ్యాంకింగ్, ఆటో, రియల్టీ 5-2.5 శాతం మధ్య పతనమయ్యాయంటే అమ్మకాల తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్ఇండ్, సన్ ఫార్మా, ఐసీఐసీఐ, కొటక్ బ్యాంక్, ఐషర్, బజాజ్ ఫిన్, ఎస్బీఐ, శ్రీ సిమెంట్, జీ, సిప్లా, ఎల్అండ్టీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, మారుతీ, యాక్సిస్ 6-3 శాతం మధ్య క్షీణించాయి. అయితే ఓఎన్జీసీ, ఇన్ఫ్రాటెల్, విప్రో మాత్రమే 2.5-1 శాతం మధ్య బలపడ్డాయి. అదానీ పోర్ట్స్ 0.3 శాతం పుంజుకుంది. పతన బాటలో డెరివేటివ్ కౌంటర్లలో ఎన్ఎండీసీ, పీవీఆర్, ఐబీ హౌసింగ్, పిరమల్, శ్రీరామ్ ట్రాన్స్, ఫెడరల్ బ్యాంక్, భెల్, డీఎల్ఎఫ్, బాష్, జీఎంఆర్, ఆర్బీఎల్ బ్యాంక్, అరబిందో, మదర్సన్, ఐసీఐసీఐ ప్రు, ఎంఅండ్ఎం ఫైనాన్స్, మెక్వోవెల్, దివీస్ 9.3-5 శాతం మధ్య కుప్పకూలాయి. కాగా.. గోద్రెజ్ ప్రాపర్టీస్, ఇండిగో, వేదాంతా, ఐడియా మాత్రమే 4-1 శాతం మధ్య పుంజుకున్నాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 3-4 శాతం చొప్పున పతనమయ్యాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 2278 నష్టపోగా... కేవలం 466 లాభాలతో ట్రేడవుతున్నాయి. -
600 పాయింట్లు కుప్పకూలిన మార్కెట్
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు ఆరంభ నష్టాల నుంచి మరింత పతనమవుతున్నాయి. ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, ఇన్వెస్టర్ల అమ్మకాలతో ఆరంభంలోనే సెన్సెక్స్ 321 పాయింట్లకు పైగా నష్ట పోయింది. తద్వారా లాభాలకు చెక్ పెట్టింది. అక్కడనుంచి ఏమాత్రం కోలుకోని సెన్సెక్స్ ప్రస్తుతం 617 పాయింట్లు కోల్పోయి 36076వద్ద, నిఫ్టీ 180 పాయింట్ల నష్టంతో 10623 వద్ద కొనసాగుతోంది. తద్వారా నిఫ్టీ 10700 స్థాయిని కోల్పోయింది. ఫార్మా, ఐటీ మినహా అన్ని రంగాలు షేర్లు నష్టపోతున్నాయి. ప్రధానంగా ఫైనాన్షియల్, మెటల్, ఆటో షేర్లలో అమ్మకాల ఒత్తిడి మార్కెట్ను పతనం దిశగా తీసుకెళుతోంది. ఇండస్ ఇండ్, హెచ్డీఎఫ్సీ, జీ ఎంటర్ టైన్మెంట్, వేదాంతా, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ టాప్ లూజర్స్గా ఉన్నాయి. మరోవైపు విప్రో, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఆసియన్ పెయింట్స్ లాభపడుతున్నాయి. బయోకాన్, డా. రెడ్డీస్, లుపిన్, దివీస్, ఫోర్టిస్ హెల్త్కేర్, ఆరతి డగ్ర్, లాంటి షేర్లు స్పల్పంగా లాభపడుతున్నాయి. కోవిడ్ -19 కేసుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతూ ఉండటం సెంటిమెంట్నుప్రభావితం చేస్తోందని ఎనలిస్టులు చెబుతున్నారు. మరోవైపు రీటైల్ ద్రవ్యోల్బణం జూన్ మాసంలో 6.09 శాతానికి పడిపోయిన సంగతి తెలిసిందే.ప్రధానంగా బ్యాంకింగ్ షేర్లు నష్టపోతుండగా, ఐటీ షేర్లు లాభపడుతున్నాయి. -
ఆ ఫోటో వాడితే ఫోన్ క్రాష్..
ఓ వాల్పేపర్ వల్ల ఆండ్రాయిడ్ ఫోన్లు క్రాష్ అవుతుందంటూ గత కొద్ది రోజులుగా సోషల్మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫొటోను వాల్పేపర్గా పెట్టుకుంటే.. తమ మొబైల్స్ స్క్రీన్లాక్ దానంతటదే ఆన్ అవడం, వెంటనే ఆఫ్ అవడం జరుగుతోందని ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు ఫిర్యాదు చేశారు. మోంటానాలోని హిమానీనద జాతీయ ఉద్యానవనంలోని సెయింట్ మేరీ సరస్సు ఫోటో ఇది. ఈ క్రమంలో ఈ ఫోటో తీసిన వ్యక్తి ప్రస్తుతం తెర మీదకు వచ్చారు. గౌరవ్ అగర్వాల్ అనే శాస్త్రవేత్త, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్ 2009, ఆగస్టులో దీనిని తీశారు. ఫోటో షేరింగ్ సైట్ ‘ఫ్లికర్’లో అప్లోడ్ చేశారు. అయితే ఈ మధ్య కాలంలో ఈ ఫోటోను వాల్పేపర్గా వాడిన ఆండ్రాయిడ్ ఫోన్లు వాటంతట అవే ఆన్, ఆఫ్ కావడం.. క్రాష్ అవ్వడం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అగర్వాల్ ఈ ఫోటో, దాని వెనక ఉన్న కథను తెలియజేశారు. ఈ సందర్భంగా అగర్వాల్ మాట్లాడుతూ.. ‘ఎవరి ఫోన్ పాడు చేయాలనే ఉద్దేశంతో ఈ ఫోటో తీయలేదు. ఈ ఫోటో వల్ల ఇలాంటి ఇబ్బంది ఎదురవుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగేవరకు నాకు దీని గురించి తెలియదు. నికాన్ కెమెరాతో ఈ ఫోటో తీశాను. తరువాత 'లైట్రూమ్' అనే సాఫ్ట్వేర్ను ఉపయోగించి దాన్ని ఎడిట్ చేశాను. అయితే ఫోటోను ఎక్స్ప్లోర్ చేయడానికి నేను ఎంచుకున్న కలర్ మోడ్.. ఇప్పటి ఆండ్రాయిడ్ ఫోన్లకు అనుకూలంగా లేదు’ అని తెలిపాడు. అంతేకాక ‘ఇక ఇప్పటి నుంచి నేను మరొక ఫార్మాట్ ఉపయోగించబోతున్నాను. ఈ ఫోటోలో ఏమీ తప్పు లేదు, కాని ఇది ఎల్ఆర్ నుండి ప్రోఫోటోఆర్జీబీ ఫార్మాట్లో ఎక్స్ప్లోర్ చేశాను. అందుకే ఈ ఫోటో ఆండ్రాయిడ్ ఫోన్కు అనుకూలంగా లేదు’ అని అగర్వాల్ అన్నారు. ఈ వాల్ పేపర్ సమస్య పెద్దది కావడంతో ఈ నెల 11న దీనికి సంబంధించి ఓ అప్డేట్ను విడుదల చేయనున్నట్లు సామ్సంగ్ ప్రకటించింది. దీనిపై ఓ నిపుణుడు మాట్లాడుతూ.. సదరు ఫొటో ఆర్జీబీ(RGB) కలర్ ఫార్మాట్లో ఉందని, ఆండ్రాయిడ్ ప్రఫర్డ్ ఎస్ఆర్జీబీలో లేకపోవడం వల్లే ఇలా జరుగుతుండొచ్చని చెప్పారు -
ఆ విమానంలో లేను : నటి
ఇస్లామాబాద్ : కరాచీ సమీపంలో శుక్రవారం కుప్పకూలిన పీఐఏ విమానంలో తాను, తన భర్త మరణించినట్టు సాగిన ప్రచారాన్ని పాకిస్తాన్ నటి ఆయేజా ఖాన్ తోసిపుచ్చారు. విమాన ప్రమాదంలో తనతో పాటు తన భర్త డానిష్ తైమూర్ మరణించినట్టు అర్ధం లేని వదంతులను పుట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు. అసత్యాలను వ్యాప్తి చేయడం మానుకోవాలని ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ‘దయచేసి సవ్యంగా వ్యవహరించండి..ఇలాంటి ఫేక్ న్యూస్ను వ్యాప్తి చేయడం విరమించండ’ని ఆమె కోరారు. కాగా, లాహోర్ నుంచి 99 మంది ప్రయాణీకులతో బయలుదేరిన పీఐఏ విమానం కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే కొన్ని నిమిషాల ముందు కుప్పకూలింది. -
గ్లోబల్ దెబ్బ : మార్కెట్లు ఢమాల్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిసాయి. ఆరంభ నష్టాల నుంచి స్వల్పంగా తేరుకున్నా...మిడ్సెషన్ నుంచి మరింత దిగజారింది. సెన్సెక్స్ 886 పాయింట్లు కోల్పోయి 31122 వద్ద, నిఫ్టీ 240 పాయింట్ల నష్టంతో 9142 వద్ద స్థిరపడ్డాయి. తద్వారా నిఫ్టీ 31500 స్థాయికి నిఫ్టీ9150 స్థాయికి దిగువన ముగిసాయి. ఫార్మా, ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే ముగిసాయి ముఖ్యంగా మెటల్ బ్యాంకింగ్, ఫైనాన్సియల్, ఐటీ రంగ షేర్లు భారీగా నష్టాలను మూట గట్టుకున్నాయి. ఇంకా టెలికాం షేర్లు కూడా నష్టపోయాయి. (ఫెడ్ వ్యాఖ్యలు : మార్కెట్ల పతనం) పవర్ గ్రిడ్, హిందాల్కో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, ఎం అండ్ ఎం, ఎన్టీపీసీ , ఎస్బీఐ, యాక్సిస్, ఇండస్ ఇండ్, హెచ్డీఎఫ్సీ, గెయిల్ టాప్ లూజర్స్గా ఉన్నాయి. మరోవైపు నెస్లే, కోటక్ మహీంద్ర, బ్రిటానియా , జీ, మారుతి, భారతి ఇన్ఫ్రాటెల్, ఎల్ అండ్ టీ, యూబీఎల్ లాభపడ్డాయి. మరోవైపు డాలరు మారకంలో రూపాయి 75.56 వద్ద బలహీనంగా ముగిసింది. ( కరోనా ఎప్పటికీ పోదు : డబ్ల్యూహెచ్ఓ తాజా హెచ్చరిక) -
దీర్ఘకాల లాక్డౌన్ : కుప్పకూలిన మార్కెట్లు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా కుప్పకూలాయి. ఆరంభం లాభాలనుంచి ఏమాత్రం పుంజుకోని కీలక సూచీలు చివరికి భారీ నష్టాలతో కీలక మద్దతు స్థాయిలకు దిగువన ముగిసాయి. 2002 పాయింట్లు పతనంతో సెన్సెక్స్ 31715వద్ద, నిఫ్టీ 566 పాయింట్లు కుప్పకూలి 9293 వద్ద స్థిరపడ్డాయి. తద్వారా సెన్సెక్స్ 32వేల దిగువకు చేరగా, నిఫ్టీ 9300 స్థాయిని నిలబెట్టుకోలేకపోయింది. అలా ఈ నెల డెరివేటివ్ సిరీస్ భారీ నష్టాలతో బోణీ చేసింది. దీంతో గత నాలుగు రోజుల లాభాలు మొత్తం ఆవిరైపోయాయి. (లాక్డౌన్ 3.0 : సెన్సెక్స్ ఢమాల్) ప్రభుత్వం కోవిడ్-19 లాక్డౌన్ను మరో రెండువారాల పాటు పొడిగించడంతో సూచీలు సోమవారం కుప్పకూలిపోయాయి.పెరుగుతున్నయుఎస్-చైనా ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేశాయి. దీంతో సెన్సెక్స్ ఒక దశలో 2,086 పాయింట్లు లేదా 6 శాతం కుప్పకూలింది. బ్యాంకింగ్, ఆటో, మెటల్, రియాల్టీ షేర్లు బాగా నష్టపోయాయి. దీర్ఘకాలిక లాక్డౌన్ కార్పొరేట్ ఆదాయాలను ప్రభావితం చేసే అవకాశం ఉందనీ, ఇది ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడిని పెంచుతుందని విశ్లేషకులు తెలిపారు. (లాక్డౌన్ ఎఫెక్ట్ : పీఎంఐ రికార్డు కనిష్టం) మారుతి సుజుకి, బజాజ్ ఆటోలతో సహా పలు ఆటో కంపెనీలు ఏప్రిల్ నెలలో సున్నా అమ్మకాలను సాధించడంతో ఆటో షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. హెచ్డిఎఫ్సి, హెచ్డిఎఫ్సి బ్యాంక్,ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్ టాప్ లూజర్స్ గా ఉన్నాయి. నిఫ్టీ 50-బాస్కెట్ హిందాల్కో ఐసిఐసిఐ బ్యాంక్, వేదాంత, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, హెచ్డిఎఫ్సి, జెఎస్డబ్ల్యు స్టీల్, యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్ కూడా 8-11 శాతం పడిపోయాయి. (ట్రంప్ తాజా బెదిరింపు : ట్రేడ్ వార్ భయాలు) -
లాక్డౌన్ 3.0 : సెన్సెక్స్ ఢమాల్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం భారీ నష్టంతో మొదలైంది. జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన సంకేతాల నడుమ సెన్సెక్స్ 1700 పాయింట్లను కోల్పోయింది. అమెరికా-చైనా ట్రేడ్ వార్, కరోనా వైరస్ కట్టడికోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ మరో 2వారాల పొడగింపు, ఏప్రిల్లో ఆటో అమ్మకాలు శూన్యం కావడం లాంటి కారణాలు ఈ నష్టాలకు దారితీశాయని మార్కెట్ వర్గాల అంచనా. ప్రస్తుతం1683 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 32008 వద్ద, నిఫ్టీ 492 పాయింట్లను నష్టపోయి 9369 వద్ద కొనసాగుతోంది. అన్ని రంగాలు నష్టాల్లోనే ఉన్నాయి. ముఖ్యంగా ఆటో, బ్యాంకింగ్, మెటల్ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. హిందాల్కో, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, జెఎస్డబ్ల్యు స్టీల్, బజాజ్ ఫైనాన్స్ భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. కేవలం సిప్లా, సన్ఫార్మా షేర్లు మాత్రమే 1-1.50 శాతం లాభ పడుతున్నాయి. (జియో మరో భారీ డీల్) -
మరింత పతనం, 8950 దిగువకు నిఫ్టీ
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. ఆరంభ భారీ పతనంనుంచి ఏమాత్రం కోలుకోని సూచీలు మిడ్ సెషన్ నుంచి మరింత దిగజారాయి. అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్ 1264 పాయింట్లకు పైగా కుప్ప కూలగా, నిఫ్టీ 347 పాయింట్లు పతనమై 8911 వద్ద కొనసాగుతోంది. తద్వారా నిఫ్టీ 8950 స్థాయిని కూడా కోల్పోయింది. దాదాపు అన్ని రంగాల షేర్లు భారీ నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. కరోనా , లాక్ డౌన్ సంక్షోభాలతో అంతర్జాతీయముడి చమురు రికార్డు పతనాన్ని నమోదు చేయడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంటు దెబ్బతింది. దీనికి తోడు వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా ప్రకటనతో ఐటీ సెక్టార్లో తీవ్ర ఒత్తిడి నెలకొంది. కోవిడ్-19 సంక్షోభంతో అమెరికాలోకి వలసలను తాత్కాలికంగా నిలిపివేయాలని భావిస్తుండటంతో దాదాపు అన్ని ఐటీరంగ షేర్లు నష్టపోతున్నాయి. బ్యాంకింగ్ షేర్లు, మార్కెట్ హెవీ వెయిట్ షేర్లన్నీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. (సంక్షోభం : బాటిల్ కోక్ కంటే..చౌక) చదవండి : ఆల్ టైం కనిష్టానికి రూపాయి కరోనా : నడిచి..నడిచి..ఇంటికి చేరబోతుండగా -
గుడ్న్యూస్ : భారీగా తగ్గిన బంగారం ధరలు
ముంబై : కొద్దిరోజులుగా భగ్గుమంటూ సామాన్యులకు దూరమైన బంగారం దిగివచ్చింది. ఈక్విటీ మార్కెట్లు కోలుకోవడంతో శుక్రవారం బంగారం ధరలు భారీగా పడిపోయాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తుండటం, స్టాక్మార్కెట్ల కుదేలుతో గత కొద్దిరోజులుగా బంగారం ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. గత సెషన్లో పదిగ్రాముల పసిడి ఏకంగా రూ 47,327కి చేరి సరికొత్త శిఖరాలను తాకింది. అయితే రికార్డు ధరల నుంచి శుక్రవారం ఒక్కరోజే ఎంసీఎక్స్లో పదిగ్రాముల బంగారం ఏకంగా రూ 1396 తగ్గి రూ 45,862 పలికింది. మరోవైపు కిలో వెండి రూ 1342 దిగివచ్చి రూ 42,913కి చేరింది. ఇక భారత్లో మే 3వరకూ లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో బంగారం రిటైల్ విక్రయాలు పడిపోవడం కూడా యల్లోమెటల్ ధరలు కొంతమేర దిగివచ్చాయని ట్రేడర్లు చెబుతున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట పట్టడంతో అంతర్జాతీయ మార్కెట్లలోనూ పసిడి ధర తగ్గుముఖం పట్టింది. కాగా కరోనా మహమ్మారి వ్యాప్తితో పాటు అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో మరికొద్ది నెలలు బంగారం ధరలు ఒడిదుడుకుల మధ్య సాగవచ్చని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. చదవండి : షాకింగ్: బంగారం అమ్మేస్తున్నాం.. -
స్టాక్మార్కెట్ను వెంటాడిన కరోనా ఎఫెక్ట్
ముంబై : ఎకానమీపై కరోనా వైరస్ చూపే ప్రభావాన్ని తగ్గించేందుకు ఆర్బీఐ శుక్రవారం ఆర్థిక స్ధిరత్వానికి పలు చర్యలు ప్రకటించినా స్టాక్మార్కెట్లు ఆరంభ లాభాలను కోల్పోయి నష్టాల్లోకి జారుకున్నాయి. మహమ్మారి బారినపడి ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందన్న ఆందోళనతో కీలక సూచీలు నష్టాల బాట పట్టాయి. ఆరంభంలో 1000 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ ఆర్బీఐ ఉపశమన చర్యలు ప్రకటించిన అనంతరం నెగెటివ్ జోన్లో కూరుకుపోయింది. కరోనా వైరస్ పర్యవసానాలు ఎలా ఉంటాయనే దానిపై వృద్ధి రేటు అంచనాలు ఆధారపడి ఉంటాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించడం మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేసింది. ఆర్థిక వ్యవస్ధ స్ధిరత్వానికి రూ 3 లక్షల కోట్ల నగదును మార్కెట్లోకి చొప్పించినట్టు ఆయన చేసిన ప్రకటనా మదుపుదారులను మెప్పించలేదు. ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో కీలక సూచీలు కుదేలయ్యాయి. మొత్తంమీద బీఎస్ఈ సెన్సెక్స్ 131 పాయింట్ల నష్టంతో 29,.815 పాయింట్ల వద్ద ముగియగా, 18 పాయింట్లు లాభపడిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 8,660 పాయింట్ల వద్ద క్లోజయింది. చదవండి : మార్కెట్లకు రుచించని ప్యాకేజీ -
కరోనా క్రాష్ : రూ 13.88 లక్షల కోట్ల సంపద ఆవిరి
ముంబై : కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు పలు రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించడంతో సోమవారం స్టాక్మార్కెట్లు కుప్పకూలాయి. ఇన్వెస్టర్లు పానిక్ సెల్లింగ్కు దిగడంతో మార్కెట్లో మరో మహాపతనం నమోదైంది. ఓ దశలో బీఎస్ఈ సెన్సెక్స్ పదిశాతంపైగా పతనమవడంతో ట్రేడింగ్ను 45 నిమిషాల పాటు నిలిపివేశారు. వైరస్ ప్రభావం దీర్ఘకాలం కొనసాగుతుందనే ఆందోళనతో అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. బ్యాంకింగ్ షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. మొత్తంమీద బీఎస్ఈ సెన్సెక్స్ 3934 పాయింట్ల నష్టంతో 25,981 పాయింట్ల వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 1136 పాయింట్లు పతనమై 7610 పాయింట్ల వద్ద ముగిసింది. ఒక్కరోజులో కీలక సూచీలు ఈ స్ధాయిలో పతనమవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. స్టాక్మార్కెట్లు పాతాళానికి దిగజారడంతో ఒక్కరోజే రూ 13.88 లక్షల కోట్ల మదుపుదారుల సంపద ఆవిరవగా, గత నెలలో ఇన్వెస్టర్లు రూ 56.22 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూశారు. చదవండి : 12 ఏళ్లలో మొదటిసారి... -
కరోనా షాక్ : కుప్పకూలిన స్టాక్మార్కెట్లు
ముంబై : కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తుండటంతో స్టాక్మార్కెట్లు పేకమేడల్లా కుప్పకూలాయి. మార్కెట్ల మహాపతనం గురువారం కూడా కొనసాగింది. అమ్మకాల వెల్లువతో బీఎస్ఈ సెన్సెక్స్ 38 నెలల కనిష్టస్ధాయిలో 2000 పాయింట్లు పతనమైంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 700 పాయింట్ల నష్టంతో 8000 పాయింట్ల దిగువకు పడిపోయింది. అన్ని రంగాల షేర్లలోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. గత కొద్ది సెషన్లలో పెరుగుతూ వచ్చిన యస్ బ్యాంక్ సైతం నష్టాల బాట పట్టింది. బజాజ్ ఫైనాన్స్ 13 శాతం, కొటాక్ మహింద్ర, ఇండస్ఇండ్ బ్యాంక్ 10 శాతం పైగా నష్టపోతున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్ ఏడు శాతం నష్టాలతో ట్రేడవుతోంది. చదవండి : మహమ్మారి ముంచేసింది! -
బ్లడ్ బాత్ : మూడేళ్ల కనిష్టానికి నిఫ్టీ
సాక్షి, ముంబై: దలాల్ స్ట్రీట్లో కరోనా ప్రభావంతో బ్లడ్బాత్ కొనసాగుతోంది. వరుస నష్టాలతో దేశీయ స్టాక్మార్కెట్లు ప్రధాన మద్దతు స్థాయిలను కోల్పోతూ పాతాళానికి పడిపోతున్నాయి. ఈ క్రమంలో బుధవారం కూడా మరోసారి భారీగా కుదేలయ్యాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో ఆరంభం నుంచే బలహీనంగా ఉన్న సూచీలు మిడ్ సెషన్ నుంచి మరింత నష్టాల్లోకి జారు కున్నాయి. సెన్సెక్స్1451 పాయింట్లు, నిఫ్టీ 430 పాయింట్లకు పైగా కుప్పకూలింది. దాదాపు అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. చివరలో పుంజుకుని సెన్సెక్స్ 1710 పాయింట్లు క్షీణించగా. నిఫ్టీ 498 పాయింట్ల నష్టంతో ముగిసింది. తద్వారా సెన్సెక్స్ 30 వేలు, చివరికి 29 వేల పాయింట్ల స్థాయిని కోల్పోయింది. నిఫ్టీ 8500 పాయింట్ల దిగువన నిఫ్టీ మూడేళ్ల కనిష్ట స్థాయికి చేరుకుంది. బ్యాంకింగ్ రంగ నష్టాలతో నిఫ్టీ బ్యాంకు 2017 తరువాత తొలిసారి 21 వేల స్థాయికి క్షీణించింది. అయితే ఆర్బీఐ బాండ్ల కొనుగోలు ప్రకటనతో ఆఖరి పది నిమిషాల్లో ఊహించని విధంగా కీలక సూచీలు కోలుకోవడం గమనార్హం. హెచ్డిఎఫ్సి ట్విన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ (నాలుగేళ్ల కనిష్టం) టాటా మోటార్స్ 11 ఏళ్ల కనిష్టం, ఐసీఐసీఐ బ్యాంక్ , సింధు ఇండ్ బ్యాంక్, వోడాఫోన్ ఐడియా, బంధన బ్యాంకు సెన్సెక్స్లో భారీగా నష్టపోయాయి. భారతి ఇన్ఫ్రాటెల్, బజాజ్ ఫైనాన్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్సర్వ్, జెఎస్డబ్ల్యు స్టీల్, హీరో మోటోకార్ప్, భారత్ పెట్రోలియం కూడా 6-17 శాతం క్షీణించాయి. మరోవైపు జీ ఎంటర్ టైన్మెంట్, ఐటీసీ,ఎన్ఎండీసీ, ఓఎన్జీసీ, యస్బ్యాంకు, టీసీఎస్ లాభపడ్డాయి. -
కుప్పకూలిన స్టాక్మార్కెట్లు
ముంబై : స్టాక్మార్కెట్లను కరోనా భయాలు వెంటాడుతూనే ఉన్నాయి. మహమ్మారి ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి మళ్లుతుందనే అంచనాలతో అమ్మకాలు వెల్లువెత్తాయి. బీఎస్ఈ సెన్సెక్స్ బుధవారం 1300 పాయింట్లు పతనమై 30 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 328 పాయింట్లు కోల్పోయి 9000 పాయింట్ల దిగువన 8638 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఆరంభంలో లాభాల బాట పట్టిన స్టాక్మార్కెట్లు ఆ తర్వాత నెగెటివ్ జోన్లోకి వెళ్లాయి. 2020లో భారత జీడీపీ 5.2 శాతానికి పరిమితమవుతుందన్న ఎస్అండ్పీ అంచనాలు సైతం మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేసింది. చదవండి : మళ్లీ అదేవరస : కుప్పకూలిన సూచీలు -
మళ్లీ అదే వరస : కుప్పకూలిన సూచీలు
ముంబై : స్టాక్మార్కెట్ల మహాపతనానికి బ్రేక్ పడటం లేదు. కరోనా ఉగ్రరూపంతో పాటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు తగ్గించడంతో మాంద్యం భయాలు వెంటాడంతో గ్లోబల్ మార్కెట్లు షేకవుతున్నాయి. అంతర్జాతీయ ప్రతికూల పరిణామాల నేపథ్యంలో సోమవారం స్టాక్మార్కెట్లు ఆరంభంలోనే కుప్పకూలాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1825 పాయింట్ల నష్టంతో 32,271 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 482 పాయింట్ల నష్టంతో 10,000 పాయింట్ల దిగువన 9472 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు యస్ బ్యాంక్ పునరుద్ధరణకు ప్రణాళిక వెలువడటంతో మదుపరులు కొనుగోళ్లకు దిగడంతో షేర్ 33 శాతం మేర ఎగిసింది. కరోనా వైరస్ ప్రభావం దీర్ఘకాలం కొనసాగుతుందనే అంచనాలు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను ప్రభావితం చేసింది. ఆర్థిక వ్యవస్థ పెను విధ్వంసానికి లోనవుతుందనే ఆందోళనతో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఈక్విటీ మార్కెట్లు కకావికలమతున్నాయి. స్టాక్మార్కెట్ భారీ పతనంతో తొలి 15 నిమిషాల్లోనే రూ 6 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. చదవండి : ‘కోవిడ్’ కోస్టర్..! -
విలయం నుంచి భారీ రికవరీ
సాక్షి, ముంబై: ప్రపంచ మార్కెట్లలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. 2008 తరువాత మొదటిసారి కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ మార్కెట్లను కుదిపివేస్తోంది. దీంతో దేశీయ స్టాక్మార్కెట్లో కీలక ప్రధాన సూచికలు శుక్రవారం 10 శాతం పతనం కావడంతో 45 నిమిషాల పాటు ట్రేడింగ్ను నిలిపి వేశారు. తిరిగి ప్రారంభమైన మార్కెట్లు భారీ రికవరీ సాధించాయి. కనిష్టంనుంచి ఏకంగా సెన్సెక్స్ 5381 పాయింట్లు నిఫ్టీ 1604 పాయింట్లకు పైగా ఎగిసింది. చివరికి సెన్సెక్స్ 1325 పాయింట్లు ఎగిసి 34,103 వద్ద, నిఫ్టీ 365 పాయింట్లు లాభంతో 9955 వద్ద ముగిసింది. నిఫ్టీ మిడ్క్యాప్, నిఫ్టీ స్మాల్క్యాప్ సూచీలు వరుసగా 2.5 శాతం, 0.8 శాతం పెరిగాయి. నిఫ్టీ మీడియా మినహా అన్ని రంగాలు లాభపడ్డాయి. పీఎస్యూ బ్యాంకు 11 శాతం, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ మెటల్ ఒక్కొక్కటి 5 శాతం పెరిగాయి. టాటా స్టీల్, హెచ్డిఎఫ్సి, ఎస్బిఐ, సన్ ఫార్మా, యూపీఎల్, జీ, హీరో మోటోకార్ప్, ఏషియన్ పెయింట్స్, నెస్లే నష్టపోయాయి. అలాగే అంతకుముందు డాలర్తో పోలిస్తే 74.5 రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయిన రూపాయి కూడా భారీగా పుంజుకుని 73.99 వద్ద 0.4 శాతం లాభపడింది. -
పతనమైన సెన్సెక్స్
-
మార్కెట్ల మహాపతనం : ట్రేడింగ్ నిలిపివేత
ముంబై : స్టాక్మార్కెట్ల మహాపతనం కొనసాగుతోంది. ఆర్థిక మాంద్యం నెలకొంటుందనే అంచనాతో అమెరికా మార్కెట్లు నష్టాల బాటపట్టడం, కరోనా భయాలు వెంటాడంతో స్టాక్మార్కెట్లు కుప్పకూలాయి. శుక్రవారం ఉదయం ట్రేడింగ్ ఆరంభంలోనే బీఎస్ఈ సెన్సెక్స్ 3090 పాయింట్లు పడిపోయి 29,687 పాయింట్లకు పతనమైంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఏకంగా 966 పాయింట్ల నష్టంతో 8624 పాయింట్లకు పతనమైంది. నిఫ్టీ 10 శాతం నష్టపోయింది. మదుపరులు అమ్మకాలకు తెగబడటంతో కీలక సూచీలు కుప్పకూలాయి. సెన్సెక్స్, నిఫ్టీలు లోయర్సర్క్యూట్ను తాకడంతో 45 నిమిషాల పాటు ట్రేడింగ్ను నిలిపివేశారు. చదవండి : మహమ్మారి ముంచేసింది! -
అమెరికాలోనూ అదే తీరు, వారంలో రెండోసారి
అమెరికా మార్కెట్లు మరోసారి కుప్పకూలాయి. దాదాపు షేర్లు అన్నీ పాతాళానికి పడిపోవడంతో మరోసారి 15 నిమిషాల బాటు ట్రేడింగ్ను నిలిపివేశారు. ఆరంభంలోనే ఎస్ అండ్ పీ 7 శాతం పతనం కాగా, డౌజోన్స్ 20 శాతానికి పైగా నష్టపోయింది. దాదాపు ప్రధాన షేర్లు అన్నీ లోయర్స్క్యూట్ వద్ద ఫ్రీజ్ అయ్యాయి. దీంతో అమెరికాలో షేర్ల గురువారం నాటి మహా పతనం కారణంగానే అమెరికా మార్కెట్లు కూడా భారీగా నష్టపోతున్నాయి.కాగా దేశీయంగా స్టాక్మార్కెట్లు సుమారు 3వేల పాయింట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే. దాదాపు అన్ని షేర్లు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. స్టాక్మార్కెట్ చర్రితలోనే ఇంట్రాడేలో ఇంత భారీ పతనాన్ని నమోదు చేయడం ఇదే తొలిసారి. కాగా కోవిడ్-19 (కరోనా వైరస్) ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకూ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో యూరప్ పై ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. యూరప్నుంచి అన్ని ప్రయాణాలను 30 రోజుల పాటు నిషేధిస్తున్నట్టుతెలిపారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపారు. ఓవల్ కార్యాలయం నుంచి గురువారం జాతినుద్దేశించిన చేసిన ప్రసంగంలో అధ్యక్షుడు ట్రంప్ కరోనావైరస్ వ్యాప్తితో ప్రభావితమైన చిన్న వ్యాపారాలకు తక్కువ రేట్లకే రుణాలు అందించేలా 50 బిలియన్ డాలర్ల నిధులను కోరనున్నట్లు చెప్పారు. అయితే ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు సంబంధించిన వైద్యపర చర్యలు, ఆర్థిక వ్యవస్థ రక్షణ చర్యలేవీ ప్రకటించకపోవడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంటు ప్రభావితమైందని అక్కడి ఎనలిస్టులు భావిస్తున్నారు. -
సెన్సెక్స్ 3100 పాయింట్లు క్రాష్..
సాక్షి, ముంబై: ప్రపంచ మార్కట్ల పతనం అప్రతిహతంగా కొనసాగుతోంది. దీంతో దేశీయ స్టాక్మార్కెట్లు కూడా ఎన్నడూ లేని భారీ నష్టాలను చవిచూశాయి. దాదాపు అన్ని హెవీ వెయిట్ షేర్లు 52 వారాల కనిష్టానికి పడి పోయాయంటే, పతనం ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు. సెన్సెక్స్ ఇంట్రాడేలో ఏకంగా 3100 పాయింట్లకు పైగా కుదేలవ్వగా, నిప్టీ 900 పాయింట్లు పతనమైంది. ఆఖరి గంటలో స్వల్పంగా పుంజుకుని చివరికి సెన్సెక్స్ 2919 పాయింట్ల నష్టంతో 32778 వద్ద రెండేళ్ల కనిష్టానికి చేరింది. నిఫ్టీ 868 పాయింట్లు పతనమై 9590 వద్ద 32 నెలల కనిష్టానికి చేరింది. తద్వారా నిఫ్టీ 10వేల స్థాయిని, 9600 స్థాయిని కూడా కోల్పోయింది. మెటల్ ఇండెక్స్ మూడేళ్ల కనిష్టానికి, బ్యాంకు నిఫ్టీ రికార్డు స్థాయిలో పడిపోయింది. మొత్తంగా స్టాక్మార్కెట్లో ఇదే అతిపెద్ద ఒకరోజు పతనం. బీపీసీఎల్, యెస్ బ్యాంక్లు 15శాతం పైగా, ఎస్బీఐ, వేదాంతా, ఐటీసీలు 13శాతం పైగా నష్టపోయాయి. టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, అదాని పోర్ట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హీరో మోటోకార్ప్, ఒఎన్జిసి, గెయిల్ ఇండియా, హిందాల్కో కూడా 10 శాతం నుంచి 15 శాతం క్షీణించాయి. టాటా పవర్స్, ల క్ష్మీవిలాస్ బ్యాంకు స్వల్పంగా లాభపడ్డాయి. అటు కరెన్సీ మార్కెట్లో డాలర్కు డిమాండ్ పెరగడం రూపాయి భారీ నష్టపోతోంది. గత కొన్ని వారాలుగా క్రమంగా దిగివస్తున్న రూపాయి ఇవాళ ఒక్క రోజే 61 పైసల మేర నష్టాలను మూట కట్టుకుంది. ట్రేడింగ్ ఆరంభంలోనే రూ. 74.35కు పడిపోయింది. బుధవారం రూ. 73.61 డాలర్ వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. మరోవైపు రాక్లోని అన్బర్ ప్రావిన్స్లోని స్థానిక సాయుధ ముఠాల స్థావరాలపై అమెరికా గురువారం వైమానిక దాడులు నిర్వహించడంతో దేశీయ సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. సాయుధ దళాలు జరిపిన రాకెట్ దాడుల్లో ఇద్దరు అమెరికా సైనికులతోమరో ఇద్దరు మరణించారు. దీనికి ప్రతిగా అమెరికా జరిపిన ప్రతి దాడిలో మొత్తం 25మంది సైనికులు మృతి చెందారు. -
స్టాక్మార్కెట్లో మరో బ్లాక్డే..
ముంబై : డెడ్లీ వైరస్ స్టాక్మార్కెట్లను వణికిస్తోంది. బ్లాక్ మండే షాక్ నుంచి స్టాక్మార్కెట్లు కోలుకోకముందే గురువారం మరోసారి కీలక సూచీలు కుప్పకూలాయి. కరోనా వైరస్ను అంతర్జాతీయ మహమ్మారిగా డబ్ల్యూహెచ్ఓ ప్రకటించడం, గ్లోబల్ మార్కెట్ల పతనంతో స్టాక్మార్కెట్లు భారీ నష్టాలతో ఆరంభమయ్యాయి. అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ప్రపంచ వాణిజ్యం, పెట్టుబడులపై కరోనా ప్రభావం భారీగా ఉంటుందనే అంచనాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. బీఎస్ఈ సెన్సెక్స్ 2372 పాయింట్ల నష్టంతో 33,324 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 726 పాయింట్లు కోల్పోయిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 9732 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. చదవండి : బ్లాక్ మండే ఎఫెక్ట్ : ఊగిసలాటలో స్టాక్మార్కెట్ -
కూలిన పాక్ విమానం
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ రిపబ్లిక్ డే పరేడ్ కోసం రిహార్సల్ చేస్తున్న ఎయిర్ఫోర్స్ ఎఫ్-16 యుద్ధవిమానం బుధవారం ఇస్లామాబాద్లో కుప్పకూలిందని ఎయిర్ఫోర్స్ ప్రతినిధి వెల్లడించారు. మార్చి 23న జరిగే పరేడ్, ఎయిర్ షో కోసం అమెరికన్ తయారీ ఎఫ్-16 విమానం రిహార్సల్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఆ ప్రతినిధి తెలిపారు. విమానం కుప్పకూలడంతో వాటిల్లిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని పాక్ ఎయిర్ఫోర్స్ వెల్లడించింది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సహాయ సిబ్బంది వెళ్లాయని, ప్రమాద కారణాన్ని గుర్తించేందుకు విచారణకు ఆదేశించామని తెలిపింది. చదవండి :పాక్ ఉగ్రవాదులపై దొరబాబు వీరత్వం -
కోవిడ్కు ‘చమురు’ ఆజ్యం, మార్కెట్ కుదేలు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలనుమూటగట్టుకున్నాయి. కోవిడ్-19 (కరోనా వైరస్) ఆందోళనకు తోడు, చమురు సంక్షోభం, స్టాక్మార్కెట్ల పతనానికి మరింత తోడయ్యాయి.దీంతో స్టాక్మార్కెట్ చరిత్రలోనే ఒక రోజులోనే ఇంత భారీ పతనం నమోదుకాలేదు. సెన్సెక్స్ ఇంట్రాడేలో ఏకంగా 2450 పాయింట్లు కుప్పకూలింది. బ్యాంకింగ్, ఆటో సహా అన్ని రంగాలు అమ్మకాలతో కుదేలయ్యాయి. చివరికి సెన్సెక్స్ 1942 పాయింట్లు కుప్పకూలి 35643 వద్ద, నిఫ్టీ 538 పాయింట్ల పతనంతో 10451 వద్ద ముగిసాయి. 10451, తద్వారా సెన్సెక్స్ 36వేల కీలక మద్దతు స్థాయికి దిగువన, నిఫ్టీ 10500 స్థాయికి దిగువన ముగిసింది. యస్ బ్యాంకు, బీపీసీఎల్, భారతి ఇన్ఫ్రాటెల్, ఐషర్ మెటార్స్, ఐవోసీ, యూపీఎల్ మాత్రమే లాభపడ్డాయి. చమురు షాక్తో ఓన్జీసీ, వేదాంతా, రిలయన్స్టాప్ లూజర్స్గా నిలవగా, వీటితోపాటు జీ ఎంటర్టైన్మెంట్, ఇండస్ బ్యాంకు, టాటా స్టీల్, టాటా మోటార్స్, గెయిల్ భారీగా నష్టపోయాయి. -
బ్లాక్మండే : సెన్సెక్స్ 2000 పాయింట్లు పతనం
ముంబై : స్టాక్మార్కెట్లో బ్లాక్ మండే నమోదైంది. యస్ బ్యాంక్ పరిణామాలతో పాటు కరోనా వైరస్ వ్యాప్తిపై భయాందోళనలతో స్టాక్మార్కెట్లు సోమవారం కుప్పకూలాయి. కరోనా వైరస్ ప్రపంచంలో సగం దేశాలకు వ్యాపించడం, కొత్త కేసుల నమోదుతో మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేసింది. స్టాక్మార్కెట్ భారీ నష్టంతో రూ 5 లక్షల కోట్ల మదుపుదారుల సంపద ఆవిరైంది. అమ్మకాల వెల్లువతో బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 2000 పాయింట్ల నష్టంతో 35,573 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 531 పాయింట్లు కోల్పోయిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 10,457 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.ఇక ఓఎన్జీసీ, రిలయన్స్, పవర్గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్ షేర్లు తీవ్రంగా నష్టపోతున్నాయి. చదవండి : ఎగిసి‘పడిన’ స్టాక్ మార్కెట్లు -
బ్లాక్ ఫ్రైడే; సెన్సెక్స్1500 పాయింట్లు క్రాష్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభమైనాయి. సెన్సెక్స్1500 పాయింట్లు కుప్పకూలగా, నిఫ్టీ 400 పాయింట్లు పతనమైంది. అన్ని రంగాల షేర్లు నష్టపోతున్నాయి. దీంతో కీలక సూచీలు రెండూ ప్రధాన మద్దతు స్థాయిలను కోల్పోయాయి. ప్రస్తుతం కోలుకున్నప్పటికీ సెన్సెక్స్ 38 వేలకు దిగువన, నిఫ్టీ 11వేలకు దిగువన కొనసాగుతున్నాయి. బ్యాంకు నిఫ్టీ 1300 పాయింట్లు కుప్పకూలింది. యస్బ్యాంకు 15 శాతం కుప్పకూలగా, మార్కెట్లు 6 నెలల కనిష్టానికి చేరాయి. ఎస్బీఐ తదితర బ్యాంకింగ్ షేర్లతోపాటు, ఆటో,మెటల్ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. టాటా స్టీల్, రిలయన్స్; ఐసీఐసీఐ బ్యాంకు, ఎం అండ్ ఎం, కోల్ ఇండియా నష్టపోతుండగా, హెచ్యూఎల్ ఒక్కటే లాభపడుతోంది. మరోవైపు ప్రైవేటు బ్యాంకు యస్బ్యాంకుపై ఆర్బీఐ విధించిన ఆంక్షలు డిపాజిట్ దారుల్లో భారీ ఆందోళన నింపింది. రూ. 50 వేల విత్ డ్రాయల్ పరిమితి నేపథ్యంలో వారంతా ఏటీఎంల ముందు క్యూ కట్టారు. అలాగే మే నెలకు సంబంధించి ఎఫ్ అండ్ వో కాంట్రాక్టులు కూడా రద్దయ్యాయి. అటు డాలరుమారకంలో రూపాయి కూడా ఇదే దారిలో వుంది. 74 స్థాయి పతనానికి సమీపంలో వుంది. 73.98 వద్ద ట్రేడింగ్ను ఆరంభించింది. అనంతరం 74.07 స్థాయిని తాకింది. ముడి చమురు ధర బ్యారెల్ ధర 50 డాలర్లకు దిగువకు చేరింది. -
కరోనా షాక్: కుప్పకూలిన స్టాక్మార్కెట్లు
సాక్షి, ముంబై : వరుసగా ఏడవ సెషన్లో దేశీయ స్టాక్మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఆరంభ లాభాలనుంచి వెంటనే నష్టాల్లోకి మళ్లిన సూచీలు మిడ్ సెషన్నుంచి మరింత ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు దేశంలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ప్రభావితమైంది. దీంతో సెన్సెక్స్ 700 పాయింట్లు కుప్పకూలగా,నిఫ్టీ 193 పాయింట్లు క్షీణించింది. బ్యాంకు నిఫ్టీ కూడా 770 పాయింట్లు పతనమైంది. తద్వారా సెన్సెక్స్ 38 వేల స్థాయిని కోల్పోయింది. దాదాపు అన్ని రంగాల షేర్లలో అమ్మకాల ధోరణి నెలకొంది. దీంతో ఇంట్రే డే హై నుంచి 1298 పాయింట్లు పతనం కావడం గమనార్హం. యస్ బ్యాంక్, ఎస్బీఐ, టాటా స్టీల్, గెయిల్, హీరో మోటోకార్ప్ భారీగా నష్టపోగా, ఐషర్ మోటార్స్, హెచ్సిఎల్ టెక్, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్ ,టెక్ మహీంద్ర లాభపడుతున్నాయి. ప్రస్తుతం దాదాపు 200 పాయింట్లకు పైగా రికవరీనా సాధించాయి. అయితే ఆఖరి గంట ట్రేడింగ్ కీలకం. -
5 నిమిషాల్లో రూ. 5 లక్షల కోట్లు హాంఫట్
సాక్షి, ముంబై : కోవిడ్-19 ప్రపంచమార్కెట్లను బెంబేలెత్తిస్తోంది. కరోనా వైరస్ వ్యాధి భయాలతో దేశీయ ఈక్విటీ మార్కెట్లో భారీ పతనం నమోదైంది. శుక్రవారం ఆరంభ నష్టాలనుంచి ఏమాత్రం కోలుకోని కీలక సూచీలు మరింత పతనమయ్యాయి. సెన్సెక్స్ 1300 కుదేలైన సెన్సెక్స్ ప్రస్తుతం 39 వేల దిగువకు చేరి 38545 వద్ద, నిఫ్టీ 356 పాయింట్లు క్షీణించి 11276 వద్ద కొనసాగుతోంది. తద్వారా 11300 దిగువకు చేరింది. అన్నిరంగాల్లోనూ అమ్మకాలు భారీగా కొనసాగుతున్నాయి. అత్యధికంగా మెటల్ షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ సైతం 2.50 శాతం నష్టంతో 25వేల దిగువకు చేరింది. దీంతో అయిదే అయిదు నిమిషాల్లో సుమారు రూ. 4 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద, మార్కెట్ క్యాప్ రూ. 5 లక్షల కోట్ల మేర ఆవిరైపోయింది. దీంతో మొత్తం మార్కెట్ క్యాప్ విలువ రూ.150 లక్షల కోట్లకు పడిపోయింది. మొత్తంగా ఆరు రోజుల వరస నష్టాలతో దలాల్ స్ట్రీట్లో రూ.10 లక్షల కోట్లు సంపద హరించుకుపోయింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెనుముప్పుగా మారిన కోవిడ్-10 మహమ్మారిని నియంత్రించకపోతే..గణనీయమైన ప్రతికూల ప్రభావం ఉండనుందని గ్లోబల్ ఈక్విటీ రీసెర్చ్ సంస్థ జెఫెరీస్ విశ్లేషించింది. ముఖ్యంగా దక్షిణ కొరియా, ఇటలీ , ఇరాన్లో ఈ వైరస్ విస్తరించడం ప్రమాదాన్ని సూచిస్తోందని పేర్కొంది. అటు డాలర్ మారకంలో రూపాయి కూడా ఇదే బాటలో వుంది. నిన్నటి ముగింపు 71.55 తో పోలిస్తే 38 పైసలు బలహీనపడి 71.93 వద్ద వుంది. -
డెడ్లీ వైరస్ : కుప్పకూలిన స్టాక్మార్కెట్
ముంబై : కరోనా వైరస్ భయాలు గ్లోబల్ మార్కెట్లను వెంటాడిన ఫలితంగా స్టాక్మార్కెట్లు శుక్రవారం కుప్పకూలాయి. డెడ్లీ వైరస్ ప్రపంచ దేశాలకు వేగంగా విస్తరిస్తుండటంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడం మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేసింది. మెటల్, ఐటీ, రియల్ఎస్టేట్ సహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. టాటా స్టీల్, టాటా ఫైనాన్స్, హెచ్సీఎల్ టెక్ తదితర షేర్లు నష్టపోతున్నాయి. మొత్తంమీద బీఎస్ఈ సెన్సెక్స్ 1110 పాయింట్ల నష్టంతో 38,635 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 313 పాయింట్లు కోల్పోయిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,319 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. -
ప్రతీకార హెచ్చరికలు, మార్కెట్ల పతనం
సాక్షి, ముంబై: అంతర్జాతీయ మార్కెట్లకు తోడు దేశీయ స్టాక్మార్కెట్లు యుద్ధ భయాలతో గజగజ వణికాయి. ఇన్వెస్టర్ల అమ్మకాలతో కీలక సూచీలు రెండూ కీలక మద్దుతుస్థాయిల దిగువకు చేరాయి. చివరకు సెన్సెక్స్ 788 పాయింట్లు కుదేలవ్వగా, నిఫ్టీ 234 పాయింట్లు నష్టపోయింది. రిలయన్స్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ ట్విన్స్ లాంటి దగ్గజాలతో పాటు బ్యాంకింగ్ షేర్లు బాగా నష్టపోయాయి. దీంతో గత నాలుగేళ్లలోని లేని సింగిల్డే నష్టాలను సెన్సెక్స్ నమోదు చేయగా, నిఫ్టీ ఆరు నెలలుగా ఇంతటి నష్టాన్ని చవి చూడలేదు. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకు షేర్లలో అమ్మకాలతో నిఫ్టీ బ్యాంకు కూడా 832 పాయింట్లు కుప్పకూలింది. బజాజ్ ఫైనాన్స్, వేదాంతా, జీ, ఎస్బీఐ, యస్బ్యాంకు, ఇండస్ఇండ్, బజాజ్ ఫిన్సర్వ్ టాప్ లూజర్స్గా ఉన్నాయి. లాభపడిన వాటిలో టైటన్, టీసీఎస్ నిలిచాయి. కాగా ఇరాన్ ముఖ్య సైనికాధికారి కసేమ్ సోలైమాని హత్య మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను రాజేసింది. అలాగే 2015 అణు ఒప్పందం ప్రకారం యురేనియం సుసంపన్న పరిమితులకు కట్టుబడి ఉండబోమని ఇరాన్ ప్రభుత్వం యుద్ధ భయాలను పెంచింది. మరోవైపు సొలైమాని హత్యకు ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటే దానికి మించి పెద్ద ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఈ ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను బలహీనపర్చాయి. దక్షిణ కొరియా కోస్పి 0.8 శాతం, హాంకాంగ్ హాంగ్ సెంగ్ ఇండెక్స్ 0.7 శాతం, జపాన్ నిక్కీ 225 2.1 శాతం బలహీనపడింది. -
వార్ టెన్షన్తో స్టాక్ మార్కెట్కు షాక్..
ముంబై : అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు సోమవారం కుప్పకూలాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు ముసురుకుంటాయనే ఆందోళనతో ఐటీ మినహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఎస్బీఐ, మారుతి సుజుకి, ఆసియన్ పెయింట్స్ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. టైటాన్, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్ స్వల్పంగా లాభపడుతున్నాయి. ఇక బీఎస్ఈ సెన్సెక్స్ 450 పాయింట్ల నష్టంతో 41,012 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 141 పాయింట్లు కోల్పోయిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 12,085 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు అమెరికా-ఇరాన్ల పరస్పర హెచ్చరికలతో యుద్ధ వాతావరణం నెలకొనడంతో బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. దేశీ మార్కెట్లో పదిగ్రాముల పసిడి ఏకంగా రూ 41,000కు ఎగబాకింది. -
యస్ బ్యాంకు షేరు ఎందుకు కుప్పకూలింది?
సాక్షి, ముంబై: ప్రయివేటు రంగ బ్యాంకు యస్ బ్యాంకుకు మరోసారి భారీ అమ్మకాల సెగ తగిలింది. దీంతో గురువారం 52 వారాల కనిస్టానికి పతనమైంది. ప్రధానంగా ప్రమోటర్ గ్రూప్ కంపెనీకి చెందిన మార్పిడికి వీలుకాని డిబెంచర్ల(ఎన్సీడీల) రేటింగ్ను..కేర్ డౌన్గ్రేడ్ చేసిన వార్తలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో ఆ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఫలితంగా అయిదు నెలల్లో ఎన్నడూ లేనంతగా అతిభారీ పతనాన్ని నమోదు చేసింది. ప్రమోటర్ గ్రూప్లోని మోర్గాన్ క్రెడిట్స్ రూ. 800 కోట్ల జారీ అనంతరం ఎన్సీడీల రేటింగ్ను ఏ- నుంచి కేర్ రేటింగ్స్ తాజాగా బీబీబీకు సవరించినట్లు యస్ బ్యాంక్ పేర్కొంది. యస్ బ్యాంక్లో మోర్గాన్ క్రెడిట్స్ 3.03 శాతం వాటాను కలిగి ఉంది. బ్యాంకు షేర్ల ధరలు పతనమైన నేపథ్యంలో ఎంసీపీఎల్, తదితర ప్రమోటర్ల వద్ద గల వాటా విలువ పడిపోవడంతో రేటింగ్ డౌన్గ్రేడ్ చేపట్టినట్లు కేర్ రేటింగ్స్ తెలియజేసింది. ఈ నేపథ్యంలో యస్ బ్యాంక్ షేరు ఇంట్రాడేలో ఎన్ఎస్ఈలో 17 శాతం కుప్పకూలి రూ. 54 వద్ద ముగిసింది. -
భారీ నష్టాల్లో స్టాక్మార్కెట్లు
సాక్షి, ముంబై : చమురు ధరల సెగతో వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలతో కొనసాగుతున్నాయి. ఆరంభ నష్టాలనుంచి మిడ్ సెషన్ తరువాత మరింత దిగజారిన సెన్సెక్స్ 600 పాయింట్లు పతనమై 36509 వద్ద, నిఫ్టీ 170 పాయింట్లు క్షీణించి 10832 వద్ద కొనసాగుతున్నాయి. తద్వారా సెన్సెక్స్ 37వేల స్థాయిని కోల్పోయింది. అలాగే నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 11,000 చివరకు 10900 పాయింట్ల స్థాయిని కోల్పోయింది. సౌదీ అరేబియాలోని అరామ్కో చమురు క్షేత్రాలపై డ్రోన్ దాడుల నేపథ్యంలో సోమవారం చమురు ధరలు ఏకంగా 15 శాతం ఎగశాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటుకు షాక్ తగిలినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఫలితంగా సోమవారం యూరోపియన్, అమెరికన్ స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. దీంతో దేశీయంగా కూడా దాదాపు అన్ని రంగాలూ నష్టపోతున్నాయి ముఖ్యంగా బ్యాంకింగ్, ఆటో, ఐటీ, ఫార్మ షేర్లు భారీగా నష్ట పోతున్నాయి. యాక్సిస్, టెక్ మహీంద్రా, ఎయిర్టెల్, హీరో మోటో, సిప్లా, బీపీసీఎల్, హెచ్డీఎఫ్సీ, ఎల్అండ్టీ, అల్ట్రాటెక్, టాటా మోటార్స్ టాప్ లూజర్స్గా కొనసాగుతుండగా, వేదాంతా, టైటన్, గెయిల్, యస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, హెచ్యూఎల్, యూపీఎల్, ఓఎన్జీసీ, డాక్టర్ రెడ్డీస్, బ్రిటానియా లాభపడుతున్నాయి. -
స్టాక్ మార్కెట్కు భారీ షాక్
ముంబై : ఆర్ధిక ఉద్దీపన ప్యాకేజ్పై ప్రభుత్వం నుంచి స్పష్టత కొరవడటంతో స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీగా పతనమయ్యాయి. మదుపుదారులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో రియల్టీ, మెటల్, ఆటో, పీఎస్యూ షేర్లు భారీగా నష్టపోయాయి. మార్కెట్లోకి మళ్లే విదేశీ పెట్టుబడులపై బడ్జెట్లో పొందుపరిచిన పన్ను ప్రతిపాదనలపైనా కేంద్రం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం, ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం నింపే ఉద్దీపన ప్యాకేజ్పై సైతం ఎలాంటి కదలికా లేకపోవడం మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేసింది. మొత్తంమీద 587 పాయింట్లు నష్టపోయిన బీఎస్ఈ సెన్సెక్స్ 36,472 పాయింట్ల వద్ద ముగియగా 177 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 10,741 పాయింట్ల వద్ద క్లోజయింది. ఇక యస్ బ్యాంక్, వేదాంత, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, ఎస్బీఐ తదితర షేర్లు నష్టపోగా, టీసీఎస్, హెసీఎల్ టెక్ షేర్లు లాభపడ్డాయి. -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
ముంబై : గ్లోబల్ మార్కెట్ల డౌన్ట్రెండ్తో సోమవారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. కార్పొరేట్ ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడం కూడా మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేసింది. జమ్ము కశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులతో మదుపుదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అన్ని రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. బీఎస్ఈ సెన్సెక్స్ 600 పాయింట్ల పైగా నష్టంతో 36,456 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 184 పాయింట్ల నష్టంతో 10,813 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. -
కేంద్ర బడ్జెట్ ప్రకంపనలు స్టాక్ మార్కెట్..
-
స్టాక్ మార్కెట్కు బడ్జెట్ షాక్
ముంబై : స్టాక్ మార్కెట్పై కేంద్ర బడ్జెట్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. బడ్జెట్ మార్కెట్ను మెప్పించడంలో విఫలమవడంతో మదుపుదారులు అమ్మకాలకు తెగబడ్డారు. అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు కొనసాగడంతో సోమవారం కీలక సూచీలు భారీగా పతనమయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లకు దీర్ఘకాల మూలధన రాబడిపై పన్నును పెంచడం ఎఫ్పీఐలను తీవ్ర నిరాశకు లోనుచేసిందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. అమ్మకాల ఒత్తిడితో బీఎస్ఈ సెన్సెక్స్ 700 పాయింట్ల నష్టంతో 38,816 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 215 పాయింట్ల నష్టంతో 11,595 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. గత రెండు సెషన్లలో స్టాక్ మార్కెట్ల భారీ నష్టాలతో మదుపుదారుల సంపద రూ 5 లక్షల కోట్ల మేర ఆవిరైంది. -
వారంతా అమరులయ్యారు
న్యూఢిల్లీ: ఇటీవల అరుణాచల్ప్రదేశ్లో కూలిపోయిన ఏఎన్–32 విమానంలో ఉన్న 13 మంది మరణించినట్లు భారత వైమానిక దళం ధ్రువీకరించింది. గురువారం దట్టమైన అటవీ ప్రాంతంలో విమాన శకలాల కోసం సహాయక బృందం గాలింపులో ఈ విషయం వెల్లడైంది. ‘జూన్ 3న జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ధైర్యవంతులైన వైమానిక వీరులకు భారత వైమానిక దళం నివాళులు అర్పిస్తోంది. వారి ఆత్మ శాంతించాలి. వారి కుటుంబసభ్యులకు మా ప్రగాఢ సానుభూతి’ అని వాయుసేన అధికార ప్రతినిధి ఒకరు గురువారం పేర్కొన్నారు. రష్యాలో తయారైన ఏఎన్–32 విమానం అస్సాంలోని జొహ్రాట్ ప్రాంతం నుంచి చైనా సరిహద్దులోని మెంచుకాకు జూన్ 3న బయల్దేరిన కొద్దిసేపటికే అదృశ్యమైన విషయం తెలిసిందే. అప్పటినుంచి గాలించగా 8 రోజుల తర్వాత సియాంగ్, షియోమి జిల్లాల సరిహద్దులో మంగళవారం ఈ విమాన శకలాలు దొరికాయి. 13 మంది యుద్ధవీరులు అందించిన సేవలను దేశం ఎప్పుడూ మరిచిపోదని ట్విటర్లో కాంగ్రెస్ పేర్కొంది. వారి మృతిపట్ల ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం ప్రకటించారు. కాగా, ఈ ఏడాది ప్రారంభం నుంచి జరిగిన వేర్వేరు ఘటనల్లో మొత్తం పది విమానాలను భారత వాయుసేన కోల్పోయింది. కోల్పోయిన విమానాల్లో ఒక మిరాజ్, ఒక జాగ్వార్, ఒక ఎంఐ17వీ5 హెలికాప్టర్, రెండు హాక్ రకం విమానాలు, రెండు మిగ్ రకం విమానాలు ఉన్నాయి. -
కుప్పకూలిన డైమండ్ విమానం : నలుగురు మృతి
అమెరికా టెక్ దిగ్గజం హనీవెల్కు చెందిన డైమండ్ ఎయిర్ క్రాష్ట్ఖు చెందిన విమానం కుప్పకూలింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో నలుగురు మాత్రమే ప్రయాణించే అవకాశం ఉన్న ఈ బుల్లి విమానం దుబాయ్లో కూలిపోయింది. గురువారం జరిగిన ఈ ప్రమాదంలో పైలట్, కో పైలట్ సహా నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన కారణంగా దుబాయ్ విమానాశ్రయంలో కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. పలు విమానాలు ఆలస్యమైనాయి. ప్రస్తుతం పరిస్థితి చక్కబడిందనీ, ముందు జాగ్రత్త చర్యగా కొన్ని విమానాలను దారి మళ్లించామని ప్రభుత్వం ప్రకటించింది. కాగా దుబాయ్లోని అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలో అత్యంత రద్దీగల విమానాశ్రయాల్లో ఒకటిగా పేరుగాంచింది. దుబాయ్లో ఫ్లైట్ కాలిబ్రేషన్ సర్వీసెస్ నిమిత్తం డీఏ42 విమానాన్ని అద్దెకు తీసుకున్నామని హనీ వెల్ తెలిపింది. ప్రమాదంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసిన సంస్థ బాధిత కుటుంబాలకు హృదయపూర్వక సంతాపాన్ని ప్రకటించింది. Government of Dubai Media Office: The small plane, a diamond 43 owned by Honeywell, had four passengers on board, when it crashed due to a technical malfunction. — Dubai Media Office (@DXBMediaOffice) May 16, 2019 -
జీ, రిలయన్స్ టాప్ లూజర్స్ : వణికిన స్టాక్మార్కెట్లు
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఆరంభంనుంచి భారీ అమ్మకాలతో బలహీనంగా ట్రేడ్ అయిన సూచీలు చివరల్లో మరింత పతనమయ్యాయి. సెన్సెక్స్ 517 పాయింట్లు పతనమై 38 వేల స్థాయిని కూడా కోల్పోయింది. నిప్టీ కూడా 11400 స్థాయి దిగువకు చేరింది. చివరకు 487 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ 37789 వద్ద, నిఫ్టీ 138 పాయింట్లు క్షీణించి 11359 వద్ద ముగిసింది. తద్వారా వరుసగా ఆరో రోజుకూడా నష్టాల్లోనే ముగిసాయి. ప్రధానంగా బ్యాంకింగ్ షేర్ల అమ్మకాలు సూచీలను దెబ్బతీశాయి. బ్యాంకింగ్, మిడ్ క్యాప్ పార్మ, రియల్టీ ఇలా అన్ని సెక్టార్లు నష్టపోయాయి. అలాగే జీ గ్రూపు షేర్ల పతనం, రిలయన్స్ నష్టాలు ప్రభావితం చేశాయి. వేదాంతా సన్ ఫార్మా, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్ బ్యాంకు ఓన్జీసీ, హెచ్డీఎఫ్సీ టాప్ లూజర్స్గా ఉన్నాయి. యూపిఎల్, భారత్ పెట్రోలియం, టైటాన్, కోల్ ఇండియా, పవర్గ్రిడ్ ,జెట్ ఎయిర్వేస్ లాభపడ్డాయి. -
పోల్ను ఢీకొట్టి రెండు ముక్కలైన కారు.. వీడియో వైరల్
న్యూఢిల్లీ : అతి వేగం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. వీకెండ్ కావడంతో ముగ్గురు స్నేహితులు కలిసి హోండా సిటీ కారులో సరదాగా చక్కర్లు కొట్టాలనుకున్నారు. అయితే కారును అతివేగంగా నడపడంతో అదుపుతప్పి పోల్ను ఢీకొట్టి, రెండు ముక్కలై నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఢిల్లీలోని జ్వాలా హేరీ మార్కెట్ దగ్గర శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి అక్కడి సీసీ కెమెరాలో వీడియో రికార్డు అయింది. కారులో ప్రయాణించిన ముగ్గురు యువకులను హిమాన్షు, జయంత్, సాహెబ్గా పోలీసులు గుర్తించారు. ముగ్గురిలో సాహేబ్ కారు నడపగా, ముందు సీటులో హిమాన్షు, జయంత్ కారు వెనుక సీటులో కూర్చొన్నట్టు పోలీసులు చెప్పారు. హిమాన్షు ప్రాణాలు కోల్పోగా, గాయపడ్డ సాహెబ్, జయంత్ను సమీప ఆస్పత్రికి తరలించారు. కారులో ప్రయాణించిన ముగ్గురిలో ఎవరికీ డ్రైవింగ్ లైసెన్స్ లేదని పోలీసులు తెలిపారు. -
భద్రతే ప్రాణప్రదం
అయిదు నెలల వ్యవధి...రెండు విమాన ప్రమాదాలు! ఆ రెండూ బోయింగ్ సంస్థ ఉత్పత్తి చేసినవే కావడం, పైగా 737 మ్యాక్స్–8 మోడల్కి చెందినవి కావడంతో ప్రపంచవ్యాప్తంగా మన దేశంతో సహా 51 దేశాలు ఆ రకం విమానాల వినియోగంపై ప్రస్తుతానికి నిషే«ధం విధించాయి. మరో 11 దేశాల్లో వేర్వేరు విమానయాన సంస్థలు వాటి వినియోగాన్ని ఆపేస్తున్నట్టు ప్రకటించాయి. గత అక్టో బర్లో ఇండొనేసియాకు చెందిన లయన్ ఎయిర్ సంస్థ విమానం జావా సముద్రంలో కుప్పకూలి 189మంది మరణించారు. మొన్న ఆదివారం ఇథియోపియా ఎయిర్లైన్స్కు చెందిన ఆ రకం విమా నమే కూలి 157మంది దుర్మరణం పాలయ్యారు. ఆ రెండూ బయల్దేరిన కొన్ని నిమిషాలకే అనూ హ్యంగా కూలడంతో సహజంగానే అన్ని దేశాల్లోనూ ఆ మోడల్ విమానాలపై సంశయాలు బయ ల్దేరాయి. తమ విమానం డిజైన్లో లోపం లేదని, దాన్ని నడుపుతున్న పైలెట్ల అవగాహన లోపం వల్లే ప్రమాదాలు జరిగి ఉండొచ్చునని బోయింగ్ సంజాయిషీ ఇస్తోంది. అదొక్కటే కాదు... అమె రికా పౌర విమానయాన నియంత్రణ సంస్థ ఫెడరల్ ఎవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) కూడా దాని తరఫున వకాల్తా తీసుకుని ఆ మాటే చెబుతోంది. కానీ వీటిని విశ్వసించడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఎందుకంటే నిరుడు అక్టోబర్లో కూలిన విమానాన్ని నడిపిన పైలెట్కు, కో పైలెట్కు కూడా 11,000 గంటలు విమానాలను నడిపిన అనుభవం ఉంది. తాజాగా ప్రమాదానికి లోనైన విమానాన్ని నడిపిన పైలెట్కు 8,000 గంటలకు మించి విమానాలను నడిపిన అనుభవం ఉంది. బోయింగ్ ఉత్పత్తి చేస్తున్న ప్రయాణికుల విమానాల్లో 737 మ్యాక్స్–8 తాజా మోడల్. రెండేళ్ల క్రితం మార్కెట్లోకొచ్చిన ఆ రకం విమానాలు ఇంతవరకూ ప్రపంచంలో 350 వరకూ ఎగురుతు న్నాయి. మరో 5,000 విమానాలకు ఆర్డర్లున్నాయి. ఇందులో ఇంధనం 15శాతం ఆదా అవుతుందని తేలడమే దీనికి కారణం. కానీ తాజా పరిస్థితి బోయింగ్నూ, దాంతోపాటు ఎఫ్ఏఏనూ బెంబేలెత్తి స్తున్నాయి. ఈ విమానాల ఆర్డర్లు రద్దయినా, కనీసం ప్రస్తుతానికి వాయిదా వేయమని కొనుగోలు దారులు అడిగినా అది ఇబ్బందుల్లో పడుతుంది. దాని ప్రభావం అది ఉత్పత్తి చేసే ఇతర మోడళ్లపై కూడా ఉంటుంది. ఫలితంగా అది, దానితోపాటు అమెరికా ఆర్థిక వ్యవస్థ చిక్కుల్లో పడతాయి. ఏ దేశంలోని విమానయాన సంస్థ అయినా సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోతే అంతర్జాతీయ విమానయాన సంస్థ(ఐసీఓఏ) వెంటనే ఆ దేశాలను అప్రమత్తం చేస్తుంది. విమానయాన సంస్థల తీరుతెన్నులను గమనిస్తూ రేటింగ్ ఇస్తుంది. దాంతోపాటు ఎఫ్ఏఏ సైతం ఫిర్యాదులు చేస్తుం టుంది. కానీ ఇప్పుడు మ్యాక్స్–8 విమానాల భద్రతపై అనుమానాలు పెట్టుకోవద్దని ఎఫ్ఏఏ చెబు తోంది. గత 72 గంటల్లో పలు దేశాలు వీటిని నిలిపివేసినా ఎఫ్ఏఏ అలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ రకం విమానాలను నడుపుతున్న అమెరికాలోని అమెరికన్ ఎయిర్లైన్స్, సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్ సంస్థలు రెండూ వాటిని యధావిధిగా ఉపయోగిస్తున్నాయి. అయితే అక్కడి ప్రయాణికులు, ఆ దేశంలోని విమాన సిబ్బంది సంఘాలు బోయింగ్, ఎఫ్ఏఏల ప్రకటనలను విశ్వసించడంలేదు. వాటిని నడపడానికి భయపడే పైలెట్లపైనా, అందులో సేవలందించడానికి సందేహించే ఇతర సిబ్బందిపైనా ఒత్తిడి తీసుకురావొద్దని విమాన సిబ్బంది సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అందుకు దారితీసిన కారణాలపై పలు రకాల వాదనలు వినబడటం సర్వసాధారణం. వాటికుండే ప్రాతిపదికేమిటని కూడా ఆలోచించకుండా నమ్మేవారూ ఉంటారు. కానీ ఇప్పుడు మ్యాక్స్–8 రకం విమానం గురించి తలెత్తిన అనుమానాలు ఆ మాదిరి వేనా? అనుమానాలకు మాత్రమే కాదు... వాటిపై ఇచ్చే భరోసాకు కూడా సహేతుకమైన ప్రాతి పదిక ఉండాలి. మ్యాక్స్–8 రకంపై అనుమానాలు పెట్టుకోవలసిన అవసరం లేదని బోయింగ్తో పాటు ఎఫ్ఏఏ కూడా ఏ ధైర్యంతో చెబుతున్నట్టు? సుదీర్ఘకాలం నుంచి సర్వీసులో ఉండి, నమ్మ కంగా సేవలందిస్తుంటే ఆ భరోసాను జనం నమ్మడానికి వీలుంటుంది. కానీ మ్యాక్స్–8లు మార్కె ట్లోకి వచ్చి నిండా రెండేళ్లు కాలేదు. ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న ప్రయాణికుల విమానాల్లో వీటి వాటా ప్రస్తుతానికి 2శాతం మాత్రమే. ఇంత స్వల్ప సంఖ్యలో ఉన్న విమానాల్లో రెండు కేవలం ఆర్నెల్ల వ్యవధిలో ఒకే తరహాలో ప్రమాదానికి గురైనప్పుడు అనుమానాలు తలెత్తడంలో ఆశ్చర్య మేముంది? అయినా తాను అనుకుంటున్నదే సరైందని ఎఫ్ఏఏ ఎలా భావిస్తుంది? నిజానికి బోయింగ్ సంగతెలా ఉన్నా ఎఫ్ఏఏ తనకు తానే అయిదు నెలలక్రితం తొలి ప్రమాదం జరిగి నప్పుడే ఆ మోడల్లోని సాంకేతికతపై లోతుగా అధ్యయనం చేయించవలసింది. తమ దేశంలో కూడా వాటి వాడకం పెరిగింది గనుక ఇది అవసరమని ఎఫ్ఏఏ గుర్తించి ఉంటే వేరుగా ఉండేది. కనీసం ఇప్పటికైనా ఆ పని చేయకపోగా బోయింగ్ను వెనకేసుకురావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. గత అక్టోబర్లో ప్రాణాలు కోల్పోయినవారికి చెందిన కుటుంబసభ్యులు కొన్ని రోజులక్రితమే బోయిం గ్పై అమెరికా న్యాయస్థానాల్లో పరిహారం కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. సరిగ్గా ఇదే సమ యంలో తాజా ప్రమాదం చోటుచేసుకుంది. తొలి ప్రమాదం జరిగాక ఆ రకం విమానాలను నడిపేటప్పుడు పైలెట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బోయింగ్ ఒక బులెటిన్ విడుదల చేసింది. ఆ మోడల్లో వినియోగించే విమాన నియంత్రణ సాఫ్ట్వేర్ను ఏప్రిల్నుంచి మరింత మెరుగు పరచనున్నట్టు రెండునెలల క్రితం తెలిపింది. ప్రమాదానికి లోనైన మ్యాక్స్–8 విమానాలు రెండూ ఒకే తరహాలో టేకాఫ్ దశలోనే నియంత్రణకు లొంగలేదని, ఆ తర్వాత కొద్ది నిమిషాలకే కూలి పోయాయని స్పష్టమవుతోంది. కనుక ప్రతిష్టకు పోకుండా ఆ విమానాల సాంకేతిక వ్యవస్థను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, లోపాలను గుర్తించి సరిచేయడం అవసరమని బోయింగ్ సంస్థ గుర్తిం చాలి. అంతవరకూ వాటిని తాత్కాలికంగా నిలిపేయమని వేరే దేశాల విమానయాన సంస్థలనూ కూడా అది కోరాలి. -
నా కుటుంబ సభ్యులందర్నీ కోల్పోయా..
కుప్పకూలిన విమానం : హృదయ విదారక గాథలు ఇథియోపియా విమాన ప్రమాదం పలు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. 157 ప్రయాణికులతో బయలు దేరిన బోయింగ్ 737–8 మ్యాక్స్ విమానం ఆఫ్రికా దేశంలోని ఇథియోపియా గగనతలంలో ఆదివారం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న సిబ్బంది, ప్రయాణికులు మొత్తం ప్రాణాలు కోల్పోయారు. ఇందులో నలుగురు భారతీయులు ఉన్నారు. అయితే ఒక్కొక్కరిదీ ఒక్కో విషాద గాథ. న్యూఢిల్లీకి చెందిన శిఖాగార్గ్ (అటవీ మంత్రిత్వ శాఖ ఐక్యరాజ్యసమితి డెవెలప్మెంట్ ప్రోగ్రామ్ కన్సల్టెంట్) , కెనడా కుటుంబం కథ వింటే హృదయం ద్రవించకమానదు. ఏడడుగులు వేసి మూడు నెలలే...కలలన్నీ కల్లలై ఢిల్లీకి చెందిన శిఖాకు ఇటీవల పెళ్లైంది. అంటే మూడు నెలల క్రితమే ప్రేమికుడు సౌమ్య భట్టాచార్యను వివాహం చేసుకున్నారు. మూడేళ్లకాలంలో చెప్పుకున్న ఊసులు, కన్న కలలునెరవేరకుండానే నవ వధువు శిఖా ఘోర ప్రమాదంలో దుర్మరణం చెందడం ఆమె భర్తను తీవ్రంగా కలిచి వేస్తోంది. విమానం ల్యాండ్ అయిన తరువాత ఫోన్ చేస్తానన్న భార్య మెసేజ్కు సమాధానం ఇచ్చేలోపే.. ఆమె తిరిగిరాని అనంత లోకాలకేగిపోయింది. అంతేకాదు నైరోబి నుంచి తిరిగి వచ్చిన తరువాత హనీమూన్కి వెళ్లాలని కూడా ప్లాన్ చేసుకున్నారట. నిజానికి భర్త భట్టాచార్యకూడా నైరోబి వెళ్లాల్సి వుంది. భార్య శిఖాతో పాటు టికెట్ను కూడా బుక్ చేసుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో అత్యవసర పని పడటంతో ప్రయాణాన్ని విరమించుకోవాల్సింది వచ్చింది. అదే ఆయన ప్రాణాలను నిలబెట్టింది.. కానీ తన ప్రాణానికి ప్రాణమైన సహచరిని శాశ్వతంగా దూరం చేసింది. కన్నవారికి కన్నభూమిని చూపించాలన్న ఆశ తీరనే లేదు కెనడాలోని సదరన్ ఒటారియా నగరం బ్రాంప్టన్కు చెందిన కుటుంబానిది మరో విషాద గాథ. ఒకే కుటుంబంలోని ఆరుగురు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కోషా వైద్య, ప్రేరిత్ దీక్షిత్ దంపతులు తమ గారాల కుమార్తెలు అనుష్క (13), ఆషా(14)లతో కలిసి కెన్యాకు విహార యాత్రకు బయలుదేరారు. ముఖ్యంగా పిల్లలకు మార్చి సెలవులు రావడంతో తన జన్మభూమిని, తను పుట్టిన ఆసుపత్రిని కన్నబిడ్డలకు చూపించాలని తల్లి కోషా వైద్య ఆశపడ్డారు. అక్కడినుంచి సఫారీకి పోవాలని, ఇంకా కొన్ని ముఖ్యమైన ప్రదేశాలను పిల్లలకు చూపించాలని, సరదాగా గడపాలని ఎన్నో కలలు కన్నారు. తమతోపాటు తన తల్లిదండ్రులను కూడా తీసుకెళ్లారామె. కానీ ఆ ఆశ తీరకుండానే మొత్తం ఆరుగురూ ఈ ప్రమాదంలో చనిపోయారు. ఆప్తుల్ని కోల్పోయాను క్షణాల్లో అంతా శూన్యంగా మారిపోయిందని కోశ సోదరుడు మనంత్ వైద్య ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆప్తులందర్నీ పోగొట్టుకున్నానంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆశా, అనుష్క చదువులలో సరస్వతులు అని వారి స్కూలు ప్రిన్సిపల్ చెప్పారు. అలాగే ఆశా మంచి గాయని అనీ, అనుష్క భారత శాస్త్రీయ నృత్యం అన్నా, కంప్యూటర్స్ అన్నా బాగా ఇష్టపడేదని గుర్తు చేసుకున్నారు. ఇది తమ పాఠశాల సిబ్బందినీ, ఇతర విద్యార్థులను తీవ్ర విచారంలో ముంచేసిందన్నారు. వీరి మృతికి సంతాపంగా బ్రాంప్టన్ నగరంలోని సిటీ హాల్లో పతాకాన్ని తదుపరి ఆదేశాల దాకా హాఫ్స్టాఫ్ గా ఉంచాలని అధికారులు ఆదేశించడం విశేషం. కాగా ఈ ప్రమాదంలో కీలక ఆధారమైన బ్లాక్బాక్స్ను అధికారులు కొనుగొన్నారు. ఇందులో విమాన సమాచారం, కాక్పిట్ వాయిస్ రికార్డై ఉందని ఇథియోపియా ఎయిర్లైన్స్ పేర్కొంది. అయితే బ్లాక్బాక్స్ పాక్షికంగా దెబ్బతిందంటున్నఅధికారులు.. దాని నుంచి ఎంత సమాచారం పొందగలమనే దాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. -
కుప్పకూలిన విమానం : 157 మంది మృతి
ఇథియోపియా : అదిస్ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబీకి వెళుతున్న ఇథియోపియా ఎయిర్లైన్స్ విమానం కుప్పకూలింది. ఆదివారం ఉదయం నైరోబీకి బయలుదేరిన ఇథియోపియా ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 737 విమానం మార్గమధ్యంలో ప్రమాదవశాత్తూ కుప్పకూలిందని ఇథియోపియా ప్రధాని కార్యాలయం వెల్లడించింది. విమాన ప్రమాదంలో మరణించిన ప్రయాణీకులకు ఇథియోపియా ప్రధాని కార్యాలయం ప్రభుత్వం, ప్రజల తరపున తీవ్ర సంతాపం తెలుపుతోందని ప్రధాని అబివ్ అహ్మద్ కార్యాలయం ట్వీట్ చేసింది. కాగా, నైరోబీకి వెళుతున్న బోయింగ్ 737 విమానం బిషోపు వద్ద కుప్పకూలిందని, ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 157 మంది ప్రయాణీకులు, సిబ్బంది అందరూ మరణించారని ఇథియోపియా ఎయిర్లైన్స్ నిర్ధారించింది. -
స్టాక్మార్కెట్లు బేర్ : 300పాయింట్లు పతనం
సాక్షి,ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు ఆరంభ నష్టాలనుంచి ఏమాత్రం కోలుకోకుండా మరింత కిందికి దిగజారాయి. ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందుకోవడంతో 300 పాయింట్లకుపైగా పతనమైంది. సెన్సెక్స్ 290పాయింట్లు క్షీణించి 35,585 వద్ద నిఫ్టీ సైతం 102 పాయింట్లు తిరోగమించి 10,644 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు, పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు సెంటిమెంట్ దెబ్బతినడంతో అమ్మకాలు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. దాదాపు అన్ని సెక్టార్లు నష్టపోతున్నాయి. ఫార్మా అత్యధికంగా 4.25 శాతం పతనమైంది. ఫార్మా కౌంటర్లలో డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా , గ్లెన్మార్క్, దివీస్ లేబ్స్, బయోకాన్, పిరమల్, అరబిందో, లుపిన్, కేడిల్లా, సిప్లా 7.5-2 శాతం మధ్య పడిపోయాయి. వీటితోపాటు నిఫ్టీ దిగ్గజాలలో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, అల్ట్రాటెక్, యస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, హిందాల్కో, హీరో మోటో, టాటా స్టీల్ టాప్ లూజర్స్గా నమోదవుతున్నాయి. మరోవైపు ఓఎన్జీసీ, పవర్గ్రిడ్, బీపీసీఎల్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, గెయిల్, ఎల్అండ్టీ లాభపడుతున్నాయి. అటు రూపాయి కూడా ఇదే బాటలోపయనిస్తోంది. డాలరు మారకంలో 15పైసలు నష్టంతో 71.29వద్ద కొనసాగుతోంది. -
కిలో రూపాయికే ఉల్లి
హోల్ సేల్ మార్కెట్లో ఉల్లి ధర మరోసారి రైతు కంట కన్నీరు పెట్టిస్తోంది. ఉల్లిధర కిలో రూపాయి స్థాయికి పడిపోయింది. దేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ మహారాష్ట్రలోని లాసల్గామ్ వ్యవసాయ మార్కెట్లో ఉల్లి ధర భారీగా పడిపోయింది. గత రెండు నెలల కాలంలో ధర ఏకంగా 91శాతం ధర క్షీణించింది. దీంతో రవాణా ఖర్చులు కూడా తమకు దక్క లేదని రైతులు వాపోతున్నారు. అయితే ఉల్లి ధర తగ్గడంతో గోదాముల్లో నిల్వ చేసుకోవాలని రైతులకు మార్కెట్ అధికారులు సూచిస్తున్నారు. అకస్మాత్తుగా ఉల్లి సప్లయ్ మార్కెట్ను ముంచెత్తడంతో రెండు నెలల క్రితం 21 రూపాయిలు పలికిన ధర అక్టోబర్ రూ.17స్థాయికి దిగి వచ్చింది. డిసెంబర్ 24నాటికి ఏకంగా ఒక రూపాయికి పడిపోయింది. గత ఏడాది జులైలో ఒక రూపాయికి చేరిగా, 2016లో కిలో 5పైసలు స్థాయికి పతనమైన సంగతి తెలిసిందే. -
భారీ పతనం : రూ.2లక్షల కోట్ల సంపద ఆవిరి
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి. ఆరంభంనుంచి బలహీనంగా ఉన్న కీలక సూచీలు మిడ్ సెషన్ తరువాత మరింత కుదేలయ్యాయి. ముఖ్యంగా ఆఖరి అర్థగంటలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా నష్టపోయింది. చివరకు సెన్సెక్స్ 690 పాయింట్ల భారీ పతనంతో 35,742వద్ద నిఫ్టీ 197 పాయింట్లు నష్టంతో 10,754వద్ద స్థిరపడింది. నిఫ్టీ బ్యాంకు కూడా 0.7శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.7శాతం కుప్ప కూలింది. ఈ వారమంతా లాభాలతో మురిపించిన మార్కెట్లు వారాంతంలో శుక్రవారం భారీగా నష్టపోయాయి. దీంతో 2లక్షల కోట్ల రూపాయల ఈక్విటీ ఇన్వెస్టర్ల సంపద తుడిచి పెట్టుకుపోయింది. జీ, ఇన్ఫోసీస్, టీసీఎస్, యూపిల్, భారతి ఎయిర్టెల్ ఐవోసీ, రిలయన్స్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ షేర్ల పతనం మార్కెట్లను పతనం దిశగా లాక్కెళ్లింది. అటు అంతర్జాతీయ మార్కెట్లలో భారీ అమ్మకాలు, ఇటు దేశీయంగా ఇన్వెస్టర్ల ఆందోళనతో చేసిన అమ్మకాలు దలాల్స్ట్రీట్ను వణించింది. అలాగే ఆయిల్ ధరలు, ఇటీవల మార్కెట్లలో వరుసగా ఏడు సెషన్లుగా లాభాల కొనసాగడం, లాంగ్ వీకెండ్ కావడంతో ఇన్వెస్టర్ల ప్రాఫిట్ బుకింగ్కు తెర లేచిందని నిపుణులు పేర్కొన్నారు. -
కుదేలైన స్టాక్మార్కెట్లు : 36వేల దిగువకు సెన్సెక్స్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు వరుస లాభాలకు చెక్ పెడుతూ వారంతంలో బలహీనంగా కొనసాగుతున్నాయి. ప్రపంచ మార్కెట్లలో అమ్మకాల నేపథ్యంలో దేశీయంగా అన్ని రంగాలలోనూ ఇన్వెస్టర్ల అమ్మకాల వెల్లువెత్తింది. దీంతో కీలక సూచీలు పతనం బాట పట్టాయి. సెన్సెక్స్ 600 పాయింట్లు పడిపోయి 35,826 కి చేరగా, నిఫ్టీ సైతం 184 పాయింట్లు కోల్పోయి 10,767 స్థాయికి చేరింది. ప్రయివేటు బ్యాంక్స్, ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఆటో ఇలా అన్నిరంగాలూ నష్టపోతున్నాయి. ఐవోసీ 5.5శాతం నష్టపోయింది. ఇంకా రిలయన్స్, ఇన్ఫోసీస్, కోల్ ఇండియా, హెచ్డీఎఫ్సీ, డా.రెడ్డీస్ యూపీఎల్, ఇన్ఫ్రాటెల్, మారుతీ, గెయిల్, ఏషియన్ పెయింట్స్, జీ, టైటన్, బజాజ్ ఆటో టాప్ లూజర్స్గా ఉన్నాయి. అయితే టాటా మోటార్స్, హెచ్పీసీఎల్, ఎన్టీపీసీ స్వల్ప లాభాలతో కొనసాగుతున్నాయి. అటు దేశీయ కరెన్సీ రూపాయి కూడా నష్టాల్లోకి జారుకుంది. డాలరు మారకంలో 55పైసలు నష్టపోయి 70.25 వద్ద ఉంది -
ట్రేడ్వార్ భయం : 400 పాయింట్లు పతనం
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు భారీపతనాన్ని నమోదు చేశాయి. వరుసగా మూడు రోజుల నష్టానికి కొనసాగింపుగా నేడు ( డిసెంబరు 6)న 400 పాయింట్లకు పైగా క్షీణించింది ముఖ్యంగా మందగిస్తున్న అమెరికా ఆర్థికవ్యవస్థ, చైనీస్ టెక్ దిగ్గజం హువే డిప్యూటీ చైర్మన్ మింగ్ అరెస్ట్ నేపథ్యంలో అమెరికా, చైనా మధ్య తిరిగి వాణిజ్య వివాదాలు చెలరేగనున్న అంచనాలు ఇన్వెస్టర్లలో ఆందోళనకు దారితీశాయి. దీంతో అమ్మకాల ఒత్తిడినెలకొంది. ప్రస్తుతం సెన్సెక్స్ 403 పాయింట్లు పతనమై 35,481 వద్ద, నిఫ్టీ 137 పాయింట్లు కోల్పోయి 10,645 వద్ద ట్రేడవుతోంది. రియల్టీ, ఐటీ, ఆటో,బ్యాంకింగ్ సహా అన్ని రంగాలు నష్టపోతున్నాయి. ఐబీ హౌసింగ్ 5.2 శాతం, మారుతీ, టెక్ మహీంద్రా, జీ, హెచ్సీఎల్ టెక్, ఓఎన్జీసీ, ఐషర్, కొటక్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, గ్రాసిమ్ 4-2 శాతం మధ్య పతనమయ్యాయి. ఎన్సీసీ ఆర్కామ్, జస్ట్డయల్, ఓబీసీ, సీజీ పవర్, పీసీ జ్యువెలర్స్, ఎంఅండ్ఎం ఫైనాన్స్ 5.3-4 శాతం నష్టాల్లో ఉన్నాయి. మరోవైపు సన్ ఫార్మా, ఎన్టీపీసీ, పవర్గ్రిడ్ స్వల్ప లాభాలతో కొనసాగుతున్నాయి. కాగా దేశీయ కరెన్సీ రూపాయి డాలరు మారంలో మరోసారి బలహీన ట్రెండ్లోకి జారుకుంది. 2019 ఆర్థిక సంవత్సరంలో 75 స్థాయికి రూపాయి క్షీణిస్తుందని ఎనలిస్టులు చెబుతున్నారు. -
ఆప్ఘనిస్తాన్లో కూలిన హెలికాప్టర్ 25 మంది మృతి
-
ఒక్కరోజులోనే భారీగా నష్టపోయిన ప్రపంచ కుబేరుడు
ముంబై : అంతర్జాతీయ మార్కెట్లు ముఖ్యంగా అమెరికా మార్కెట్లు కుప్పకూలడంతో ప్రపంచవ్యాప్తంగా తొలి 500 మంది సంపన్నులు బుధవారం ఒక్క రోజులోనే భారీ మొత్తంలో సంపదను కోల్పోయారు. కేవలం ఒక్కరోజులోనే అక్షరాలా 7.3 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారు. వీరందరిలో అత్యధికంగా నష్ట పోయింది అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్. ఈయన ఒక్కరే ఈ రోజు ఏకంగా 9.1 బిలియన్ డాలర్ల సంపదను (మన కరెన్సీలో దాదాపు 67 వేల కోట్ల రూపాయలు) కోల్పోయారు. ఈ ఏడాది బిలియనీర్ల సూచీలో వచ్చిన రెండో అతిపెద్ద కుదుపుగా దీనిని బ్లూమ్బెర్గ్ అభివర్ణించింది. వీరందరిలోకి బెజోస్ ఎక్కువగా నష్టపోయినట్లు పేర్కొంది. ఇక యూరప్కు చెందిన బిలియనీర్ బెర్నార్డ్ అర్నాల్ట్ సంపద రూ.33వేల కోట్లు ఆవిరైంది. ఆయన ఈ ఏడాదిలో పెంచుకున్న విలువలో సగం ఒక్కరోజులోనే కోల్పోయారు. ఇక బెర్క్షైర్ హత్వే అధినేత వారన్ బఫెట్ సంపద కూడా దాదాపు రూ.33 వేల కోట్లు తగ్గింది. మరో 67 మంది బిలియనీర్లు తమ సంపదలో దాదాపు రూ.2.3 లక్షల కోట్లను కోల్పోయారు. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు ముదురుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థ వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్ కుదించింది. ఈ రెండు దేశాలూ వచ్చే ఏడాదిలో వాణిజ్య వివాద ప్రభావాలను చవి చూడాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. దీంతో అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయిన నేపథ్యంలో ఈ కుబేరులంతా ఒక్క రోజులేనే తమ సంపదలో అధిక భాగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. దలాల్ స్ట్రీట్కు కూడా ఈ సెగ తాకడంతో ట్రేడింగ్ ప్రారంభంలోనే తొలి 5 నిమిషాల్లో సుమారు రూ.4లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైపోయిన సంగతి తెలిసింది. -
వాల్స్ట్రీట్ సెగ : దలాల్ స్ట్రీట్ ఢమాల్
సాక్షి, ముంబై: స్టాక్మార్కెట్ భారీగా పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లు ముఖ్యంగా అమెరికా మార్కెట్ల భారీ పతనం కావడంతో ఈక్వీటీ మార్కెట్లు కూడా కుదేలయ్యాయి. సెన్సెక్స్ 1000,నిఫ్టీ 300పాయింట్లు నష్టపోయాయి. దీంతో సెన్సెక్స్ 6నెలల కనిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 10200 స్థాయి కిందికి పడిపోయింది దాదాపు అన్ని సెక్టార్లలోనూ భారీ నష్టాలే. బ్యాంక్నిఫ్టీ 600పాయింట్లకు పైగా క్షీణించింది. అన్ని షేర్లు ఆల్ టైం కనిష్టాన్ని తాకాయి. చైనా మధ్య వాణిజ్య వివాదాలు ముదురుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థ వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్ కుదించింది. ఈ రెండు దేశాలూ వచ్చే ఏడాదిలో వాణిజ్య వివాద ప్రభావాలను చవిచూడాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. దీంతో అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. అటు డాలరు మారకంలో రూపాయి కూడా 74.47 వద్ద రికార్డు కనిష్టాన్ని తాకింది. 74.45 వద్ద కొనసాగుతోంది. -
మార్కెట్ క్రాష్: ఝన్ఝన్ వాలా నష్టం ఎంత?
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్ల పతనం పెట్టుబడుదారులను తీవ్ర నష్టాల్లోకి నెట్టేసింది. ముఖ్యంగా ఇండియన్ వారెన్ బఫెట్, ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝన్ఝన్వాలాకు భారీ షాక్ తగిలింది. మిడ్ క్యాప్ హోల్డింగ్స్ లో దాదాపు 75శాతం ఆవిరైపోయింది. ముఖ్యంగా గత నాలుగు సంవత్సరాలుగా నిలకడగా మిడ్ క్యాప్ షేర్లు ఇటీవల వరుస పతనంతో భారీ నష్టపోయాయి. దీంతో ఆయన పోర్ట్ ఫోలియో వాల్యూ రూ.10,000 కోట్ల దిగువకు చేరింది. దలాల్ స్ట్రీట్ లోని బ్లడ్ బాత్తో దిగ్గజ ఇన్వెస్టర్లతో పాటు బడా బాబులకే కోలుకోలేని దెబ్బ తగలగా ఇక సామాన్య ఇన్వెస్టర్ల పరిస్థితి సరేసరి. తాజా గణాంకాల ప్రకారం 2014 సంవత్సరంలో 55 శాతం, 2015లో 7.04 శాతం, 2016లో 8 శాతం, 2017లో 48 శాతం మిడ్ క్యాప్ షేర్లు పెరిగాయి. కానీ ఈ సంవత్సరం మార్కెట్ క్యాప్, మ్యూచువల్ ఫండ్స్ను పునర్నిర్వచించడంతో ఒక్కసారిగా మార్కెట్ క్రాష్ కు గురైంది. మిడ్ క్యాప్ కంపెనీలపై ఓవర్ వాల్యూషన్స్ పెరగడంతో ఒత్తిళ్ళకు గురైయ్యాయి. సుదీర్ఘ కాలం స్టాక్స్ ను హోల్డ్ చేసిన ఘనత కలిగిన రాకేష్ ఝన్ఝున్ వాలా పోర్ట్ ఫోలియోలో లోని స్టాక్స్ ఒక్కసారిగా 75 శాతం పతనమయ్యాయి. పోర్ట్ ఫోలియోలోఉన్న 27 స్టాక్స్ లో కేవలం మూడు మాత్రమే పాజిటివ్గా ఉన్నాయి. ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్, వీఐపీ ఇండస్ట్రీస్, ల్యూపిన్ స్టాక్స్ తప్ప మిగతా అన్ని స్టాక్స్ 75 శాతం ఢమాల్ అన్నాయి. నష్టపోయిన షేర్లు మందన రిటైల్స్ వెంచర్స్ స్టాక్స్ 75శాతానికి పడిపోయాయి. జయప్రకాష్ అసోసియేట్స్ 74.16 శాతానికి పడిపోయాయి. డీబీ రియాలిటీ 63 శాతం, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 61 శాతం, ఆప్ టెక్ 58 శాతం, ప్రోజోన్ ఇన్ టూ ప్రోపర్టీస్ 58 శాతం, బిల్ కేర్ 51 శాతం, ఓరియంట్ సిమెంట్స్, టీవీ18 బ్రాడ్ కాస్ట్, ప్రకాష్ ఇండస్ట్రీస్, మ్యాన్ ఇన్ఫ్రా , అటోలైన్ ఇండస్ట్రీస్, ఫెడరల్ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్ , డెల్టా గ్రూప్ షేర్లు 30- 50 శాతానికి పడిపోవడంతో రాకేష్ నష్టపోయారు. -
రుపీ, చమురు సెగ : దలాల్ స్ట్రీట్ ఢమాల్
సాక్షి, ముంబై: భారీ అమ్మకాలతో దలాల్ స్ట్రీట్ఢమాల్ అంది. ఆరంభంలోనే సెన్సెక్స్ 600 పాయింట్లు కుప్పకూలింది. నిఫ్టీ 167 పాయింట్లు క్షీణించింది. తీవ్ర ఒడిదుడుకుల ధోరణి కొనసాగుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 469 పాయింట్ల నష్టంతో 35, 506 వద్ద,నిఫ్టీ 143 పాయింట్లు క్షీణించి 10,714 వద్ద కొనసాగుతోంది. అన్ని రంగాల్లోనూ అమ్మకాల వెల్లువ కొనసాగుతోంది. ప్రధానంగా రియాల్టీ టాప్ లూజర్గా ఉంది . ఐషర్ మోటార్స్, రిలయన్స్, టీసీఎస్, హీరో మోటో, గెయిల్, ఐసీఐసీఐ, బజాజ్ ఫైనాన్స్ భారీగా నష్టపోతుండగా, ఎల్ అండ్ టీ , హిందాల్కో, జేఎస్యూ డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్ లాభపడుతున్నాయి. అంతర్జాతీయ చమురు ధరలపెరుగుదల, అటు డాలరుతో మారకంలో రూపాయి బుధవారం చారిత్రక కనిష్టానికి పతనంకాగా.. గురువారం మరింత పతనమైంది. 73.70 వద్ద మరో కనిష్టాన్ని తాకింది. రుపీ, చమురు ధరల సెగతో స్టాక్ మార్కెట్లలోనూ అమ్మకాలు వెల్లువెత్తాయి. సెన్సెక్స్ 550 పాయింట్లు పడిపోయి 35,976 వద్ద నిలవగా.. నిఫ్టీ 150 పాయింట్లు పతనమై 10,858 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే.