
రైలులో ఏం జరిగింది?
‘ధనుష్, కీర్తీ సురేశ్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘తొడరి’ని ‘రైల్’ పేరుతో బేబి రోహిత రజ్న సమర్పణలో ఆదిరెడ్డి, ఆదిత్యారెడ్డి తెలుగులో విడుదల చేస్తున్నారు. నేడు రిలీజ్ అవుతోన్న ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడు తూ-‘‘ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు జరిగే రైలు ప్రయాణమే ఈ చిత్రం. యూత్ఫుల్ ఎంటర్టైనర్. ధనుష్, కీర్తిల నటన హైలెట్. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వస్తోంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: వెట్రివేల్ మహేంద్రన్, సంగీతం: డి.ఇమ్మాన్, దర్శకత్వం: ప్రభు సాల్మన్.