Keerthy Suresh
-
ఐపీఎల్ కోసం దిశా.. ఓదెల కోసం తమన్నా!
ఐపీఎల్ కోసం హాట్ గా ముస్తాబైన దిశా పటానీఓదెల 2 మూవీ ఈవెంట్ లో చీరలో తమన్నాచీరలో అందాల జాబిలిలా ప్రియాంక మోహన్నాభి అందాలు చూపించేస్తున్న రీతూ చౌదరికూతురితో ఆడుకుంటున్న హీరోయిన్ ప్రణీతబేబీ బంప్ ఫొటోలతో యూట్యూబర్ మహాతల్లిమనాలిలో సురేఖావాణి.. కూతురు సుప్రీత కూడాఆఫ్రికన్ డ్యాన్స్ చేసిన టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Sai Ramya Pasupuleti (@ramyaapasupuleti) View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Sushanth (@isushanthreddy) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) -
ఆ హీరో తో చెయ్యను అంటున్న సాయి పల్లవి
-
లుక్స్తోనే కట్టిపడేస్తోన్న కీర్తి సురేష్ ... (ఫోటోలు)
-
శ్రీలంకలో నటి కీర్తి సురేష్ సందడి ఫోటోలు వైరల్
-
వాళ్లు వదిలేశారు.. కీర్తి సురేశ్ స్టార్ అయ్యింది!
కష్టపడితే కొన్నిసార్లు అదృష్టం వరిస్తుంది. మరికొన్నిసార్లు అదే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఓ హీరో చేయాల్సిన మరో హీరో చేసి హిట్ కొట్టడం, ఓ హీరోయిన్ కి రావాల్సిన అవకాశం లాస్ట్ మినిట్ లో మరో బ్యూటీకి దక్కడం లాంటివి జరుగుతూ ఉంటాయి.ఇక కీర్తి సురేశ్ అదృష్టం విషయానికొస్తే.. బాలనటిగా మలయాళంలో సినిమాలు చేసిన ఈమె.. 'నేను శైలజ' అనే తెలుగు మూవీతో హీరోయిన్ అయింది. కానీ కీర్తి కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రమంటే మాత్రం 'మహానటి' అని చెప్పొచ్చు. ఏకంగా ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ కూడా వచ్చింది. అంతలా పేరు తెచ్చిన ఈ సినిమాకు తొలి ఆప్షన్ కీర్తి సురేశ్ కాదని మీకు తెలుసా?(ఇదీ చదవండి: ఓటీటీలోకి మహేశ్ డబ్బింగ్ చెప్పిన 'ముఫాసా'.. అధికారికంగా ప్రకటన)'మహానటి' కోసం నిత్యామేనన్ సహా తదితర హీరోయిన్ల పేర్లు పరిశీలించారు. కానీ చివరకు కీర్తి సురేశ్ దగ్గరకు వచ్చింది. అందివచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకుంది. అలానే తమిళంలో విజయ్ తో చేసిన 'భైరవ'లో కూడా తొలుత త్రిషని అనుకున్నారు. కానీ కీర్తి సెట్ అయింది. హిట్ కొట్టేసింది.మహానటి తర్వాత చాన్నాళ్ల పాటు కీర్తి సురేశ్ కి సరైన మూవీస్ పడలేదు. దీంతో ఈమె పనైపోయిందనే కామెంట్స్ వినిపించాయి. అలాంటి టైంలో 'దసరా' సినిమా ఈమెకు కమ్ బ్యాక్ ఇచ్చింది. ఇందులో తొలుత సమంతని తీసుకోవాలని అనుకున్నారు. కానీ అదృష్టం కీర్తిని వరించింది. అలా వేరే వాళ్లని అనుకుని వద్దనుకోవడం వాళ్లకు ఓ రకంగా బ్యాడ్ లక్ కాగా.. కీర్తి సురేశ్ కి విపరీతంగా కలిసొచ్చేసిందని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: 6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) -
కడపలో సందడి చేసిన సినీనటి కీర్తి సురేష్ (ఫొటోలు)
-
ఆ సినిమా కోసం చాలా భయపడ్డాను: కీర్తి సురేష్
సౌత్ ఇండియా హీరోయిన్ కీర్తీ సురేష్ ముందు రకరకాల రుచికరమైన ఆహారపదార్థాలు ఎన్ని పెట్టినా, తను మాత్రం దోశ కోసమే ఎదురుచూస్తుంది. దోశ అంటే అంత ప్రాణం. ఒకరోజు హీరో నాని ఇంటికి వెళ్లినప్పుడు, డైనింగ్ టేబుల్పై ఉండే ఐటమ్స్ నచ్చక, తానే కిచెన్లోకి వెళ్లి, దోశ వేసుకొని తినింది. ఇక చిరంజీవి గారి వంటవాడికి అయితే, ‘భోళా శకంర్’ షూటింగ్ సెట్లోనూ తనకు పంపే ఆహారం ఎలా ఉండాలో ఫోన్ చేసి, చెప్పి మరీ చేయించుకునేది.చిలిపి అలవాటుచిన్నప్పుడు తరచు రుపాయి నాణేలను నోట్లో పెట్టుకోవడం అలవాటు ఉండేది. అలా రెండుసార్లు మింగేసింది. ఆ అలవాటు మానడానికి చాలా కాలమే పట్టింది. చిన్నప్పుడు ఇంట్లో ఎవరైనా తనని తిడితే, వాళ్లు రెస్ట్రూమ్కి వెళ్లినప్పుడు బయట గడియ పెట్టి వెళ్లిపోతుందట! అలా వాళ్ల అమ్మను చాలాసార్లు ఏడిపించింది. ఇప్పటికీ అలాగే చేస్తుందట!అన్నీ ఫ్లాపులేకీర్తి సినీ ప్రయాణం అనుకున్నంత సాఫీగా ఏమీ సాగలేదు. మొదట్లో తను నటించిన మూడు సినిమాలు చిత్రీకరణ మధ్యలోనే ఆగిపోయాయి. ఆపై విడుదలైన సినిమాలు కూడా అంతంతమాత్రంగానే ఆడాయి. దీంతో దశాబ్దంపాటు ఐరన్లెగ్ ముద్రను ధరించింది.చాలా భయపడ్డాకీర్తి ఎక్కువగా భయపడింది సావిత్రిగారిలా నటించడానికేనట! మహానటి సావిత్రి బయోపిక్ కోసం ముందుగా చాలామంది హీరోయిన్లను అనుకున్నా, చివరకు కీర్తికే ఆ చాన్స్ దక్కింది. ఆ సినిమాకు ఆమెను ఒప్పించడానికి డైరెక్టర్కు తలప్రాణం తోకకొచ్చింది.నా పాట..గాత్రంతోనూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది కీర్తి. ‘సామి స్క్వేర్’లో ‘పుదు మెట్రో రైల్’ పాట పాడింది కీర్తినే.. ‘కల్కి 2898 ఏడీ’ లోనూ బుజ్జిగా ఒక కారుకు వాయిస్ అందించింది. ఇలా నటి, గాయని మాత్రమే కాదు, స్విమ్మర్, ఫ్యాషన్ డిజైనర్ కూడా!బ్యూటీ సీక్రెట్.. ఆరోగ్యం, అందంపై చాలా శ్రద్ధ తీసుకుంటుంది కీర్తి. ఇందుకోసం, సహజమైన పద్ధతుల్నే పాటిస్తుంది. నారింజ తొక్కల పొడి, పచ్చి పసుపు, పాల మీగడ ఇలా ఇంట్లో దొరికే పదార్థాలతోనే ఫేస్ ప్యాక్ వేసుకుంటుంది. షూటింగ్ లేనప్పుడు అసలు మేకప్ వేసుకోదు.అక్క సిద్ధమైందికీర్తి ప్రస్తుతం మరో క్రేజీ ప్రాజెక్ట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘అక్క’ వెబ్ సిరీస్లో లేడీ డాన్గా చాలా బోల్డ్గా, వైల్డ్గా కనిపించబోతోంది. -
భర్తతో కలిసి స్టెప్పులేసిన కీర్తి సురేష్.. వైరల్ అవుతున్న ఫోటోలు
-
ఓటీటీలో 'కీర్తీ సురేష్' బాలీవుడ్ సినిమా.. ఉచితంగానే స్ట్రీమింగ్
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్- కీర్తీ సురేష్ జోడీగా నటించిన చిత్రం ‘బేబీ జాన్’.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా మిగిలిపోయిన ఈ సినిమా భారీగా నష్టాలను మిగిల్చింది. తమిళ దర్శకుడు అట్లీ, సినీ1 స్టూడియోస్, ఏ ఫర్ యాపిల్ పతాకాలపై జ్యోతీ దేశ్పాండే, మురాద్ ఖేతనీ, ప్రియా అట్లీ నిర్మించిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా గతేడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఇప్పటికే అమెజాన్లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, రూ. 349 అద్దె చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. అయితే, నేటి నుంచి ఈ చిత్రాన్ని ఉచితంగానే ఓటీటీలో చూసే అవకాశం ఉంది. హిందీ,తమిళ వర్షన్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ చిత్రం ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో చూడొచ్చు.బేబీ జాన్తో కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అందువల్ల ఈ మూవీపై ఆమే చాలా ఆశలు పెట్టుకుంది. కానీ, ప్రేక్షకులకు ఈ సినిమాకు కనెక్ట్ కాలేదు. దీంతో తన ఫస్ట్ సినిమానే డిజాస్టర్గా మిగిలిపోయింది. 2016లో అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన 'తేరి' సినిమాలో విజయ్ దళపతి, సమంత నటించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇదే కథతో బేబీ జాన్ రీమేక్ అయింది. సుమారు రూ. 160 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం రూ. 60 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. నెట్ పరంగా రూ. 40 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్లో భారీ డిజాస్టర్ లిస్ట్లో బేబీ జాన్ చేరిపోయింది. -
పెళ్లి రోజు ఫోటోలు షేర్ చేసిన కీర్తి సురేశ్..
-
పెళ్లి కూతురి చీరలో కీర్తి సురేశ్.. వజ్రంలా మెరిసిపోతున్న జాన్వీ కపూర్!
పెళ్లి కూతురి చీరలో మెరిసిపోతున్న కీర్తి సురేశ్..క మూవీ హీరోయిన్ తన్వీరామ్ చిల్..ఇండియన్ ఆర్ట్ ఫెయిర్లో రానా సతీమణి మిహికా..బ్లాక్ డ్రెస్లో బిగ్బాస్ బ్యూటీ హోయలు..వజ్రాల డ్రెస్లో ఒదిగిపోయిన్ బాలీవుడ్ భామ జాన్వీ కపూర్.. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Thanvi Ram (@tanviram) -
పెళ్లి కూతురు చీరలో కీర్తి సురేశ్.. తెగ మురిసిపోతున్న ముద్దుగుమ్మ.. (ఫోటోలు)
-
ఓటీటీలో సెడెన్గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ 'బేబీ జాన్'
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటించిన తాజా హిందీ చిత్రం ‘బేబీ జాన్’. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం సడెన్గా ఓటీటీలోకి వచ్చేసింది. కాలీస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తీ సురేష్, వామికా గబ్బి హీరోయిన్లుగా నటించారు. తమిళ దర్శకుడు అట్లీ, సినీ1 స్టూడియోస్, ఏ ఫర్ యాపిల్ పతాకాలపై జ్యోతీ దేశ్పాండే, మురాద్ ఖేతనీ, ప్రియా అట్లీ నిర్మించిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న రిలీజ్ అయింది. అయితే బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్గా మిగిలింది. బేబీ జాన్తో కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అందువల్ల ఈ మూవీపై ఆమే చాలా ఆశలు పెట్టుకుంది. కానీ, ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ కాలేదు. దీంతో తన ఫస్ట్ సినిమానే డిజాస్టర్గా మిగిలిపోయింది.బేబీ జాన్ చిత్రం సడెన్గా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ఈ చిత్రాన్ని చూడాలంటే అదనంగా రూ. 349 రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. వాలెంటైన్స్ డే నుంచి ఈ చిత్రాన్ని ఉచితంగా చూసేందుకు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం హిందీ తమిళ్ వర్షన్లో మాత్రమే బేబీ జాన్ అందుబాటులో ఉంది. ఇంగ్లీష్తో పాటు మరో 9 భాషలలో సబ్ టైటిల్స్తో చూడొచ్చు. 2016లో అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన 'తేరి' సినిమాలో విజయ్ దళపతి, సమంత నటించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇదే కథతో బేబీ జాన్ రీమేక్ అయింది. సుమారు రూ. 160 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం రూ. 60 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. నెట్ పరంగా రూ. 40 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్లో భారీ డిజాస్టర్ లిస్ట్లో బేబీ జాన్ చేరిపోయింది.బేబీ జాన్ కోసం గ్లామర్ డోస్ పెంచిన కీర్తిబేబీ జాన్ మూవీ సాంగ్లో కీర్తి సురేష్ కాస్త గ్లామర్ డోస్ పెంచింది. ఇప్పటి వరకు డీసెంట్ రోల్స్ చేస్తూ.. ఎక్కడా హద్దులు దాటకుండా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు వాటిని క్రాస్ చేసినట్లు నెట్టింట వైరల్ అయింది. దీంతో సినిమాకు మరింత బజ్ క్రియేట్ అయింది. బేబీ జాన్ తర్వాత బాలీవుడ్లో అక్క పేరుతో ఓ వెబ్సిరీస్లో కీర్తి సురేష్ నటిస్తోంది. పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కనున్న ఈ సీరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. -
అంకుల్ అనొద్దన్నాడు.. కావాలంటే అలా పిలవమన్నాడు: కీర్తి సురేశ్
బాలనటిగా వెండితెరకు పరిచయమైంది కీర్తి సురేశ్ (Keerthy Suresh). మలయాళంలో మూడు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది. గీతాంజలి సినిమాతో హీరోయిన్గా మారింది. నేను శైలజ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. తెలుగుతోపాటు తమిళ, మలయాళ భాషల్లోనూ పలు సినిమాలు చేసింది. ఇటీవలే బేబీ జాన్తో హిందీ బాక్సాఫీస్కు పరిచయమైంది.అంకుల్ అని పిలవొద్దుసౌత్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్న కీర్తిని ఓ హీరో పిలిచి మరీ తనను అంకుల్ అని పిలవొద్దని చెప్పాడట! ఇంతకీ ఆ హీరో ఎవరంటే మలయాళ నటుడు దిలీప్. 2002లో దిలీప్ కథానాయకుడిగా నటించిన చిత్రం కుబేరన్. ఇందులో అతడు ముగ్గురు పిల్లల్ని దత్తత తీసుకుంటాడు. అందులో ఒకరు కీర్తి సురేశ్. దిలీప్ కూతురిగా నటించిన కీర్తి.. తర్వాతికాలంలో అతడి ప్రేయసిగా నటించింది. రింగ్ మాస్టర్ (2014) మూవీలో దిలీప్ గర్ల్ఫ్రెండ్గా యాక్ట్ చేసింది. హీరోయిన్గా ఇది ఆమెకు రెండో సినిమా. రింగ్ మాస్టర్ సినిమాలో దిలీప్తో కీర్తి సురేశ్ఆయన కూతురిగా, ప్రేయసిగా..ఈ విషయాన్ని కీర్తి తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది. ఆమె మాట్లాడుతూ.. దిలీప్ (Dileep) సరసన హీరోయిన్గా నటించేందుకు ఎక్కువగా ఆలోచించలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన్ను చూస్తూనే ఉన్నాను. తనేమీ మారలేదు, అలాగే ఉన్నాడు. రింగ్ మాస్టర్ మూవీలో నేనే తన గర్ల్ఫ్రెండ్ అని తెలియగానే నన్ను పిలిచి ఓ మాట చెప్పారు. చిన్నప్పుడు అంకుల్ అని పిలిచేదాన్నని.. అలా మాత్రం పిలవొద్దని కోరాడు. కావాలంటే చేట్ట (అన్నయ్య) అని పిలవమన్నాడు. నేను వెంటనే సరే చేట్ట అన్నాను. రింగ్మాస్టర్ నా మొదటి హిట్ సినిమా అని చెప్పుకొచ్చింది.పేరెంట్స్ సలహాపేరెంట్స్ మేనక-సురేశ్ కుమార్ గురించి చెప్తూ.. 'సినిమాల్లోకి వచ్చేస్తానన్నప్పుడు అమ్మానాన్న నాకు కొన్ని సలహాలిచ్చారు. సమయపాలన పాటించాలని అమ్మ చెప్పేది. తను సమయానికి సెట్లో ఉంటానని నేను కూడా దాన్ని అనుసరించాలని నొక్కి చెప్పింది. సెట్లో పనిచేసేవాళ్ల దగ్గరనుంచి డైరెక్టర్ వరకు అందరికీ ఒకేరకమైన గౌరవం ఇవ్వాలంది.అదే చాలా కష్టంఇండస్ట్రీలో నేను మంచి పేరు సంపాదించుకున్నాను. దాన్ని అలాగే కాపాడుకోవాలని నాన్న చెప్పాడు. మా ఇంట్లోని వాళ్లందరూ మంచి విమర్శకులు. అమ్మానాన్న కంటే కూడా నా సోదరి నుంచి ప్రశంసలు అందుకోవడం అత్యంత కష్టతరమైన విషయం. నేనేంటో నిరూపించుకోవాలి, వాళ్ల దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను' అని కీర్తి చెప్పుకొచ్చింది.చదవండి: క్యూట్ గెటప్లో అల్లు అర్హ, అయాన్ డ్యాన్స్.. -
మెహందీ వేడుక ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్ కీర్తి సురేశ్ (ఫోటోలు)
-
కీర్తి సురేష్ మెహిందీ లెహెంగా విశేషాలు, ఫోటోలు వైరల్
మహానటి ఫేం కీర్తి సురేష్ తన ప్రియుడు ఆంథోనీ తట్టిల్తో గత ఏడాది ఏడు అడుగులు వేసింది. పదిహేనేళ్ల డేటింగ్ను అత్యంత గోప్యంగా ఉంచి ఉన్నట్టుండి ఆంటోనీని వివాహ మాడి అభిమానులు సర్ప్రైజ్ చేసింది. తాజాగా తమ మెహిందీ వేడుకకు సంబంధించిన ఫోటోలును సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇవి వైరల్గా మారాయి. ముఖ్యంగా కీర్తి సురేష్ ధరించిన లేత గులాబీరంగు లెహంగా విశేషాలు ఆసక్తికరంగా మారాయి. మరి ఆవివరాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కీర్తి సురేష్ వైబ్రంట్ లెహంగాతో అందంగా మెరిసిపోయింది. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో భర్త ఆంథోనీతో తన మెహందీ వేడుక ఫోటోలతోపాటు, పింక్ వైబ్రంట్ లెహంగా ఫోటోలను షేర్ చేసింది.కీర్తి, ఆంథోనీ ఇద్దరూ మ్యాచింగ్ దుస్తుల్లో అసలైన పెళ్లికళతో అందంగా కనిపించారు. చక్కటి ఎంబ్రాయిడరీ చేసిన గులాబీ రంగు కలిసిన బహుళ వర్ణ లెహెంగాలో కీర్తి మురిపించింది. దీనికి మిర్రర్ వర్క్, మోటిఫ్లు స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచాయి. ఇంకా పాస్టెల్-హ్యూడ్ స్లీవ్లెస్ బ్లౌజ్, లేత వంకాయ గులాబీ రంగు కలగలిసిన దుపట్టా మరింత ఎట్రాక్టివ్గా అమరాయి. ఇక తమిళ అక్షరాలతో రూపొందిన చెవిరింగులు భలే ఉన్నాయ్! చాలా సాధారణమైన మేకప్, తేలికపాటి ఆభరణాలను ఎంచుకుంది. మరికొన్ని ఫోటోలలో సన్ గ్లాసెస్ పెట్టుకుని చలాకీగా చిలిపిగా కనిపించింది. మరోవైపు, ఆంథోనీ మ్యాచింగ్ కుర్తా-పైజామా ధరించాడు. ప్రకాశవంతమైన-నీలం రంగు కుర్తా, గులాబీ జాకెట్తో కీర్తి లుక్కు అద్దినట్టు సరిపోయాడు.కాగా కీర్తి సురేష, ఆంథోనీ వివాహం గ్రాండ్గా గోవాలో (2024, డిసెంబర్ 12) జరిగింది. తొలుత తమిళ బ్రాహ్మణ సంప్రదాయాల ప్రకారం మూడుముళ్లు వేయించుకుంది. అలాగే మలయాళీ క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఉంగరాలు మార్చుకున్న సంగతి తెలిసిందే. అలాగే పసుపు తాడుతో తన లేటెస్ట్ మూవీ బేబీజాన్ ప్రమోషన్స్లో కనిపించి అందర్నీ ఆశ్చర్య పర్చింది. -
Keerthy Suresh: భర్తతో కీర్తి స్టెప్పులు.. ఈ ఫోటోలు చూశారా?
-
మారుతి ఫస్ట్ ఎలక్ట్రిక్ కారుతో.. కీర్తి సురేష్ (ఫోటోలు)
-
మెక్సికోలో తంగలాన్ భామ చిల్.. బాలిలో బిగ్బాస్ బ్యూటీ!
మెక్సికోలో చిల్ అవుతోన్న తంగలాన్ బ్యూటీ..లైగర్ భామ అనన్య పాండే గ్లామరస్ లుక్..బేబీ జాన్ మూడ్లోనే కీర్తి సురేశ్..బాలిలో ఎంజాయ్ చేస్తోన్న బిగ్బాస్ బ్యూటీ విష్ణు ప్రియ..ఆజ్ కీ రాత్ అంటోన్న బిగ్బాస్ భామ ప్రియాంక జైన్.. View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) -
Keerthy Suresh: భర్త ఆంటోనితో కీర్తి మొదటి సంక్రాంతి.. స్పెషల్ గెస్ట్గా విజయ్ (ఫోటోలు)
-
దుబాయ్లో కీర్తి సురేశ్.. బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న అనన్య..!
దుబాయ్లో కీర్తి సురేశ్ చిల్...సెల్ఫీ మోజులో శ్రద్ధాకపూర్..శారీలో లావణ్య త్రిపాఠి ఫోటో షూట్..పెళ్లి ఫోటోలు షేర్ చేసిన సాక్షి అగర్వాల్...బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్న అనన్య నాగళ్ల.. View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Lavanyaa konidela tripathhi (@itsmelavanya) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
Keerthy Suresh: భర్తతో జాలీగా వెకేషన్.. కానీ! (ఫోటోలు)
-
పెళ్లి తర్వాత కీర్తి సురేశ్ వేకేషన్.. చీరలో అనసూయ అదిరిపోయే లుక్
పెళ్లి తర్వాత వేకేషన్ ఎంజాయ్ చేస్తోన్న కీర్తి సురేశ్..చీరలో అనసూయ అదిరిపోయే లుక్..2024 జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న యాంకర్ రష్మీ గౌతమ్..బ్లూ డ్రెస్లో సన్నీ లియోన్ స్టన్నింగ్ లుక్స్..హీరోయిన్ ప్రణీత సుభాష్ లేటేస్ట్ పిక్స్..2025 న్యూ ఇయర్ విషెస్ చెబుతోన్న మాళవిక మోహనన్.. View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
15 ఏళ్ల ప్రేమ.. నేను అడగడం వల్లే.. కీర్తి సురేశ్ లవ్ స్టోరీ
హీరోయిన్లు డేటింగ్లో ఉంటే ఇట్టే తెలిసిపోతుంది. వాళ్లు గడప దాటి బయటకు వస్తే చాలు కెమెరాలు వారిని నిరంతరం వెంటాడుతూనే ఉంటాయి. ప్రేమలో ఉన్నా, బ్రేకప్ చెప్పుకున్నా, పెళ్లికి రెడీ అవుతున్నా అన్నీ వాళ్లు చెప్పకుండానే లీకైపోతుంటాయి. అయితే హీరోయిన్ కీర్తి సురేశ్ (Keerthy Suresh) మాత్రం ఏళ్ల తరబడి తన ప్రేమ విషయాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్తపడింది. ప్రియుడు ఆంటోని తటిల్ (Antony Thattil)ని పెళ్లి చేసుకుని షాకిచ్చింది.మొదట్లో సరదాగా చాటింగ్తాజాగా తన ప్రేమ కథను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కొత్త సంవత్సరంతో మా ప్రేమకు 15 ఏళ్లు పూర్తయ్యాయి. మొదట్లో ఓ నెలరోజులు సరదాగా చాటింగ్ చేసుకున్నాం. ఓరోజు నేను నా కుటుంబంతో రెస్టారెంట్కు వెళ్లాను. అతడు కూడా ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఉండటంతో కలవలేకపోయాను. ఆ తర్వాత మాత్రం నీకు దమ్ముంటే ప్రపోజ్ చేయ్ డ్యూడ్ అన్నాను. అలా 2010లో నాకు ప్రపోజ్ చేశాడు. 2016 నుంచి అది సీరియస్ రిలేషన్షిప్గా మారింది. నాకు ఓ ఉంగరం కూడా తొడిగాడు. పెళ్లయ్యేవరకు దాన్ని నేను తీయలేదు. నా సినిమాల్లో కూడా మీరు గమనించవచ్చు.నా అదృష్టంతటిల్ నాకంటే ఏడేళ్లు పెద్ద. ఖత్తర్లో పని చేస్తూ ఆరేళ్లపాటు నాకు దూరంగా ఉన్నాడు. పన్నెండో తరగతి నుంచి మేము ప్రేమించుకుంటున్నాం. కరోనా సమయంలో కలిసి జీవించాం. నన్ను ఎంతో సపోర్ట్ చేస్తాడు. నన్ను చేసుకోవడం అతడి అదృష్టం అని అంటున్నారు కానీ అతడు దొరకడం నా అదృష్టం. నా ప్రేమ రహస్యం ఇండస్ట్రీలో సమంత (Samantha), విజయ్, అట్లీ, కళ్యాణి ప్రియదర్శన్, ఐశ్వర్య లక్ష్మి సహా కొంతమందికే తెలుసు.ముహూర్తం బాగోలేదని..ఎక్కడ చూసినా ఇంకా పసుపుతాడుతోనే కనిపిస్తున్నానంటున్నారు. మంచి ముహూర్తం చూసుకుని దాన్ని బంగారు తాళిగా మార్చుకుంటాను. జనవరి నెలాఖరువరకు బాగోలేదు. అందుకే ఇలా పసుపుతాడుతోనే ఉంటున్నాను అని కీర్తి చెప్పుకొచ్చింది. కాగా కీర్తి డిసెంబర్ 12న హిందూ సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకుంది. తర్వాత గోవాలో క్రిస్టియన్ పద్ధతిలో మరోసారి వివాహం చేసుకున్నారు. ఈ బ్యూటీ ఇటీవలే బాలీవుడ్లో అడుగుపెట్టింది. బేబీ జాన్ సినిమాతో హిందీ చిత్రపరిశ్రమకు కథానాయికగా పరిచయమైంది.చదవండి: రవితేజకు 'నంది అవార్డు' తెచ్చిన సినిమా రీరిలీజ్పై ప్రకటన -
సమంత సందేశం ధైర్యాన్ని ఇచ్చింది: కీర్తి సురేశ్
స్టార్ హీరోయిన్ సమంతకు ‘మహానటి’ కీర్తి సురేశ్ థాంక్స్ చెప్పింది. ఆమె వల్లే తనకు ‘బేబీ జాన్’ అవకాశం వచ్చిందని, ఆమె ఇచ్చిన ధైర్యంతోనే సినిమాలో నటించానని చెప్పింది. కీర్తి సురేశ్ నటించిన తొలి హిందీ సినిమా ‘బేబీ జాన్’.వరుణ్ ధావన్ హీరోగా కాలీస్ దర్శకత్వంలో అట్లీ నిర్మించిన ఈ మూవీ క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీర్తి మాట్లాడుతూ.. ఈ చిత్రంలో నటించే అవకాశం ఎలా వచ్చిందో చెప్పింది. తమిళ మూవీ ‘తెరి’ని హిందీలో రీమేక్ చేయాలని భావించగానే సమంత నా పేరు చెప్పారు. తమిళ్లో ఆమె పోషించిన పాత్రను నేను హిందీలో చేయడం ఆనందంగా ఉంది. సామ్ వల్లే నాకు హిందీ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ‘తెరి’లో సమంత నటన నాకెంతో ఇష్టం. ఆ పాత్రలో నేను నటించాలని చెప్పగానే భయపడ్డాను. కానీ సమంత నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. మేకర్స్ నా పేరు వెల్లడించగానే.. ‘నువ్వు తప్ప ఈ పాత్రలో మరెవ్వరు చేయలేరు’ అని సమంత తన ఇన్స్టా స్టోరీలో పెట్టారు. ఆ సందేశం నాకు చాలా ధైర్యాన్ని, నమ్మకాన్ని పెంచింది. సమంత స్ఫూర్తితోనే ధైర్యంగా షూటింగ్ పూర్తి చేశాను. ఈ మూవీలో నటించనడం అదృష్టంగా భావిస్తున్నాను’ అని కీర్తి సురేశ్ చెప్పుకొచ్చింది. కాగా, గతంలో కీర్తి, సమంత కలిసి ‘మహానటి’లో నటించారు. -
ఓటీటీలో కీర్తీ సురేష్ భారీ డిజాస్టర్ సినిమా
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటించిన తాజా హిందీ చిత్రం ‘బేబీ జాన్’. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుంది. కాలీస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తీ సురేష్, వామికా గబ్బి హీరోయిన్లుగా నటించారు. తమిళ దర్శకుడు అట్లీ, సినీ1 స్టూడియోస్, ఏ ఫర్ యాపిల్ పతాకాలపై జ్యోతీ దేశ్పాండే, మురాద్ ఖేతనీ, ప్రియా అట్లీ నిర్మించిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న రిలీజ్ అయింది. అయితే బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్గా మిగిలింది.బేబీ జాన్తో కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అందువల్ల ఈ మూవీపై ఆమే చాలా ఆశలు పెట్టుకుంది. కానీ, ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ కాలేదు. దీంతో తన ఫస్ట్ సినిమానే డిజాస్టర్గా మిగిలిపోయింది. అయితే, ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్లో విడుదల కానుంది. వాస్తవంగా సినిమా విడుదలైన సమయం నుంచి సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్కు తీసుకురావాలని మొదట అనుకున్నారట. అయితే, సినిమా ఫలితం అనుకూలంగా రాకపోవడంతో జనవరి చివరి వారంలో బేబీ జాన్ ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. ఓటీటీలో తెలుగు, తమిళ్ భాషలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు సమాచారం.2016లో అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన 'తేరి' సినిమాలో విజయ్ దళపతి, సమంత నటించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇదే కథతో బేబీ జాన్ రీమేక్ అయింది. సుమారు రూ. 160 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 60 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. నెట్ పరంగా రూ. 40 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్లో భారీ డిజాస్టర్ లిస్ట్లో బేబీ జాన్ చేరిపోయింది. -
గ్రీన్ డ్రెస్లో బలగం హీరోయిన్ కావ్య కల్యాణ్ రామ్.. భల్లే భల్లే అంటోన్న మంగళవారం బ్యూటీ
గ్రీన్ డ్రెస్లో బలగం బ్యూటీ కావ్య కల్యాణ్ రామ్బేబీ జాన్ టీమ్తో కీర్తి సురేశ్ చిల్...బుల్లితెర భామ మౌనీ రాయ్ వేకేషన్ పిక్స్...వింటర్ ఎంజాయ్ చేస్తోన్న పూనమ్ బజ్వా..ఎమర్జన్సీ ప్రమోషన్స్తో బిజీగా కంగనా రనౌత్..గోవాలో ఎంజాయ్ చేస్తోన్న శ్రద్ధాదాస్...భల్లే భల్లే అంటోన్న మంగళవారం బ్యూటీ పాయల్ రాజ్పుత్.. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) -
కీర్తికి వింత అనుభవం.. దోస అని పిలవడంతో..
బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టింది హీరోయిన్ కీర్తి సురేశ్ (Keerthy Suresh). ఈ సినిమా కోసం ఎంతో కష్టపడింది. పర్సనల్ లైఫ్ను పక్కనపెట్టేసి ప్రమోషన్స్లో మునిగిపోయింది. కానీ ఏం లాభం? బేబీ జాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చూపించలేకపోయింది. మిక్స్డ్ టాక్ వస్తుండటంతో వసూళ్లు అందుకోవడం కష్టంగా మారింది.కీర్తి దోస..ఇకపోతే సినిమా కోసం తరచూ ముంబై వెళ్తోంది కీర్తి. ఈ క్రమంలో గురువారం రాత్రి అక్కడి ఫోటోగ్రాఫర్లు ఆమను కెమెరాల్లో బంధించడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో కొందరు తనను కృతి అని పిలిచారు. దీంతో ఆమె.. నా పేరు కృతి కాదు కీర్తి అని చెప్పింది. ఇకపోతే సౌత్ ఇండియన్ యాక్టర్స్ను అక్కడి ఫోటోగ్రాఫర్లు దోస అని పిలుస్తుంటారు. అలా కొందరు దోస అని పిలవడంతో ఆమె అభ్యంతరం చెప్పింది. నా పేరు కీర్తి దోస కాదు కీర్తి సురేశ్. కానీ నాకు దోస అంటే చాలా ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది.సినిమాబేబీ జాన్ (Baby John Movie) విషయానికి వస్తే వరుణ్ ధావన్ హీరోగా నటించగా కీర్తితో పాటు వామిక గబ్బి హీరోయిన్గా యాక్ట్ చేసింది. జాకీ ష్రాఫ్ విలన్గా నటించాడు. ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదలైంది. తేరీకి రీమేక్గా తెరకెక్కిన ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహించగా థమన్ సంగీతం అందించాడు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: బేబీ బంప్తో సమంత.. వైరల్ ఫోటోలపై ఫ్యాన్స్ ఫైర్ -
బ్యాడ్ లక్ కీర్తి.. అవమానమే తప్ప ఆశ తీరలేదు!
సౌత్ హీరోయిన్లకు ఓ కోరిక ఉంటుంది. ఎప్పటికైనా బాలీవుడ్లో రాణించాలని టార్గెట్గా పెట్టుకుంటారు. ఇక్కడ ఓ నాలుగైదు హిట్స్ పడగానే.. బాలీవుడ్ ఎంట్రీ కోసం బారులు తీస్తారు. అక్కడ డెబ్యూ మూవీ హిట్ అయితే చాన్స్లు వస్తాయి. కానీ తొలి సినిమానే ప్లాప్ అయితే మాత్రం అంతే సంగతి. పైగా ఆ సినిమా కోసం సౌత్ సినిమాలను వదులుకోవడం..ఇక్కడి దర్శకనిర్మాతలు కూడా బాలీవుడ్లో బీజీ అవుతుందేమోనని వేరే హీరోయిన్ని వెతుక్కోవడంతో రెండింటికి చెడ్డ రేవడిలా మారుతారు. గతంలో త్రిష, కాజల్, శ్రియ, తమన్నా, పూజా హెగ్డే లకు ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. ఇప్పుడు ఆ లిస్ట్లో కీర్తి సురేశ్(Keerthy Suresh) కూడా చేరబోతున్నారు. ఆమె బాలీవుడ్ డెబ్యూ మూవీ బేబీ జాన్(Baby John) ఇటీవల విడుదలై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. వరుణ్ ధావన్(varu Dhawan) హీరోగా నటించిన ఈ చిత్రం.. విజయ్ తేరి సినిమాకు హిందీ రీమేక్. ఈ చిత్రంతోనే కీర్తి సురేష్ బాలీవుడ్ లోకి డెబ్యూ చేసింది. ఎన్నడూ లేనంతగా బేబీ జాన్ లో గ్లామర్ షో చేసింది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం..తొలి రోజే ప్లాప్ టాక్ని తెచ్చుకొని కీర్తి సురేశ్ బాలీవుడ్ ఆశలన్నీ అడియాశలు చేసింది. అంతేకాదు బాలీవుడ్లో ఘోర అవమానం కూడా ఎదురైంది. సినిమా ప్రమోషన్ కోసం ఏర్పాటు చేసిన ఓ ప్రెస్ మీట్లో కెమెరామెన్లు ఆమె పేరు కూడా మర్చిపోయారు. కీర్తి సురేశ్కు బదులు కృతి ఇటు చూడు అంటూ ఫోటోలు తీశారు. దీంతో కాస్త అసహనానికి గురైన కీర్తి.. ‘నా పేరు కృతి కాదు..కీర్తి..కీర్తి సురేశ్’అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. జాతీయ అవార్డు గ్రహిత, దక్షిణాది స్టార్ హీరోయిన్ అయిన కీర్తి సురేశ్ పేరు కూడా బాలీవుడ్కు తెలియకపోవడం దారుణం అంటూ కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
Year Ender 2024: ఈ ఏడాది పెళ్లి చేసుకున్న సీనీ తారలు వీళ్లే
‘శ్రీరస్తూ శుభమస్తు... శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం... ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం’... ‘పెళ్ళి పుస్తకం’ చిత్రంలోని ఈ పాట తెలుగింటి పెళ్లి వేడుకల్లో వినబడుతుంటుంది. 2024లో పెళ్లితో ‘కల్యాణం... కమనీయం...’ అంటూ తమ జీవిత పుస్తకంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించిన స్టార్స్ చాలామందే ఉన్నారు. ఇక ఏయే తారలు ఏయే నెలలో, ఏ తేదీన పెళ్లి చేసుకున్నారనే విశేషాలు తెలుసుకుందాం.ఫిబ్రవరిలో... నార్త్, సౌత్లో హీరోయిన్గా ఓ మంచి స్థాయికి వెళ్లిన ఉత్తరాది భామ రకుల్ ప్రీత్ సింగ్ ఉత్తరాది ఇంటి కోడలు అయ్యారు. బాలీవుడ్ నటుడు–నిర్మాత జాకీ భగ్నానీతో 21న ఆమె ఏడడుగులు వేశారు. వీరిది ప్రేమ వివాహం. పెద్దల సమ్మతితో గోవాలో పెళ్లి చేసుకున్నారు. మార్చిలో... పంజాబీ భామ కృతీ కర్బందా, బాలీవుడ్ నటుడు పుల్కిత్ సామ్రాట్తో మార్చి 15న ఏడు అడుగులు వేశారు. వీరిది ప్రేమ వివాహం. గుర్గావ్లో వీరి వివాహం జరిగింది. ⇒ సౌత్, నార్త్లో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోని 23న వివాహం చేసుకున్నారు. పదేళ్లు రిలేషన్షిప్లో ఉన్న వీరిద్దరూ కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఉదయ్పూర్లో పెళ్లి చేసుకున్నారు. జూన్లో... నటుడు అర్జున్ పెద్ద కుమార్తె, నటి ఐశ్వర్యా అర్జున్, తమిళ స్టార్ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు, నటుడు ఉమాపతిల వివాహం చెన్నైలో జరిగింది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఐశ్వర్య–ఉమాపతి పెద్దల అంగీకారంతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ⇒ ప్రముఖ బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా కుమార్తె, హీరోయిన్ సోనాక్షీ సిన్హా, బాలీవుడ్ నటుడు జహీర్ ఇక్బాల్ ఏడడుగులు వేశారు. 23న వీరి వివాహం ఘనంగా జరిగింది. జూలైలో... వరలక్ష్మీ శరత్ కుమార్ తన ప్రేమికుడు, ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకుడైన నికోలయ్ సచ్దేవ్తో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో థాయ్ల్యాండ్లో 2న వీరి పెళ్లి జరిగింది. ఆగస్టులో... ‘రాజావారు రాణిగారు’ (2019) సినిమాతో తెలుగులో హీరో హీరోయిన్లుగా పరిచయమయ్యారు కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్. రీల్ లైఫ్లో ప్రేమికులుగా నటించిన ఈ ఇద్దరూ రియల్ లైఫ్లో భార్యాభర్తలయ్యారు. ఆ మూవీ సమయంలో వీరి మధ్య ఏర్పడిన స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో కర్నాటకలోని కూర్గ్లో 22న కిరణ్–రహస్య వివాహం చేసుకున్నారు. సెప్టెంబరులో... హీరోయిన్ మేఘా ఆకాశ్ తన ప్రియుడు సాయి విష్ణుని పెళ్లాడారు. వీరి వివాహం 15న చెన్నైలో ఘనంగా జరిగింది. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన సాయి విష్ణుతో మేఘా ఆకాశ్ చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి పచ్చజెండా ఊపడంతో ఏడడుగులు వేశారు. ⇒ గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న హీరో సిద్ధార్థ్, హీరో యిన్ అదితీరావు హైదరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తొలుత తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని 400 ఏళ్ల పురాతన రంగనాథస్వామి ఆలయంలో మార్చి 27న, ఆ తర్వాత రాజస్థాన్లోని ఓ రిసార్ట్లో సెప్టెంబరు 16న డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. నవంబరులో... ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి పెళ్లి పీటలెక్కారు. డాక్టర్ ప్రీతీ చల్లాతో 11న ఆయన ఏడడుగులు వేశారు. ‘వేదం, గమ్యం, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి చిత్రాలతో తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు క్రిష్. ప్రీతీతో ఆయన వివాహం హైదరాబాద్లో అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. ⇒ తెలుగు చిత్ర పరిశ్రమలో గాయకులుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న రమ్య బెహరా, అనురాగ్ కులకర్ణి 15న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ⇒ నటుడిగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దక్షిణాదిలో తనకంటూ గుర్తింపు సొంతం చేసుకున్న సుబ్బరాజు పెళ్లి పీటలెక్కారు. స్రవంతితో ఆయన ఏడడుగులు వేశారు. 26న వీరి వివాహం జరిగింది. డిసెంబరులో.. హీరో అక్కినేని నాగచైతన్య– హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ 4న హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేక పెళ్లి పందరిలో వీరిద్దరూ ఏడడుగులు వేశారు. ఈ వివాహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా చైతన్య–శోభితల పరిచయం ప్రేమగా మారి, ఆ తర్వాత పెళ్లి పీటల వరకూ వచ్చింది. పెద్దల అంగీకారంతో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ⇒ ‘కలర్ ఫొటో’ (2020) సినిమా డైరెక్టర్ సందీప్ రాజ్, నటి చాందినీ రావుతో కలిసి ఏడడుగులు వేశారు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో తిరుమలలో 7న వీరి వివాహం జరిగింది. ‘కలర్ ఫొటో’ చిత్రంలో చిన్న పాత్ర చేసిన చాందినీ రావుతో ఆయన పెళ్లి జరగడం విశేషం. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో వారి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. ⇒ ‘నువ్వేకావాలి, ప్రేమించు’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు సాయికిరణ్. ఆ తర్వాత సీరియల్స్ వైపు వెళ్లిన ఆయన బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ నెల 9న ఆయన స్రవంతి అనే సీరియల్ ఆర్టిస్ట్ని వివాహం చేసుకున్నారు. ⇒ మహానటిగా ప్రేక్షకుల మనసుల్లో స్థానం సొంతం చేసుకున్నారు కీర్తీ సురేష్ తన చిన్న నాటి స్నేహితుడు, వ్యాపారవేత్త ఆంటోనీ తట్టిల్తో ఈ నెల 12న ఏడడుగులు వేశారు. వీరిద్దరి మధ్య 15 ఏళ్లుగా స్నేహం, ప్రేమ కొనసాగుతోంది. ఇరు కుటుంబ సభ్యులు ఓకే చెప్పడంతో గోవాలో వీరి వివాహం జరిగింది. ⇒ ‘మత్తు వదలరా, మత్తు వదలరా 2’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు శ్రీసింహా (సంగీతదర్శకుడు కీరవాణి తనయుడు). ఆయన వివాహం నటుడు మురళీమోహన్ మనవరాలు మాగంటి రాగతో దుబాయ్లో 14న జరిగింది. ⇒ ఇలా 2024లో ఎక్కువమంది తారలు వివాహబంధంలోకి అడుగుపెట్టం విశేషం. -
చాలా మంది హీరోల నుంచి కీర్తి సురేష్ ని నేను కాపాడాను..
-
పెళ్లై రెండు వారాలే.. కీర్తి సురేష్పై అప్పుడే మొదలైన రూమర్స్
కథానాయకిగా మంచి క్రేజ్లో ఉన్న నటి నటనకు విరామం ప్రకటించడం జరుగుతుందా..? అదీ పాన్ ఇండియా నటి, జాతీయ ఉత్తమ నటి అవార్డు గ్రహీత అలా చేస్తుందా..? అంటే అది జరిగే పని కాదు. అయితే నటి కీర్తి సురేష్ విషయంలో ఇప్పుడు అలాంటి ప్రచారమే జరుగుతుండడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అనతికాలంలోనే అగ్ర కథానాయికి స్థాయికి చేరుకున్న ఈమె, అంతేవేగంగా ఇండియన్ కథానాయకిగా ఎదిగింది . మహానటి చిత్రంలో దివంగత నటి సావిత్రిగా జీవించి జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రాల్లోనూ నటించి మెప్పించింది.కాగా వివాహం విషయంలో చాలా మంది నటీమణుల కంటే ముందుంది.తను 15 ఏళ్లుగా ప్రేమించిన ఆంటోనితో ఈనెల 12వ అగ్ని సాక్షిగా ఏడడుగులు వేసింది. అయితే భర్తతో హ నీమూన్కు కూడా వెళ్లకుండా తాను కథానాయకిగా నటించిన తొలి హిందీ చిత్రం 'మేరీ జాన్' చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంది. ఈ చిత్రం బుధవారం ప్రపంచవ్యాప్తంగా తెరపైకి వచ్చింది. కాగా ప్రస్తుతం ఈ భామ కొత్త చిత్రాలు అంగీకరించడం లేదని ప్రచారం హోరెత్తుతోంది. చేతిలో ఉన్న రివాల్వర్ రీటా, కన్నివెడి చిత్రాల షూటింగ్ను కూడా పూర్తి చేసింది. కాగా కొత్తగా పెళ్లి చేసుకున్న కీర్తీ సురేష్ కొంత కాలం భర్తతో సంసార జీవితాన్ని ఎంజాయ్ చేయాలని భావిస్తున్నట్లు, అందుకని నటనకు విరామం ఇవ్వనున్నట్లు.. తరువాత నటిగా రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. ఇందులో నిజం ఎంతో అన్నది తెలియాల్సి ఉంది. అయితే కీర్తీ సురేష్కు ప్రస్తుతం ఏ భాషలోనూ కొత్తగా అవకాశాలు లేవన్నది నిజం. -
కీర్తి సురేశ్ పెళ్లిలో సందడి చేసిన ఆర్జీవీ మేనకోడలు శ్రావ్య వర్మ ఫోటోలు వైరల్!
-
ట్రెండింగ్ బ్యూటీ వామికా గబ్బి.. ఇంతకీ ఎవరీమె? (ఫొటోలు)
-
కీర్తి సురేశ్ 'బేబీ జాన్' ట్విటర్ రివ్యూ
హీరోయిన్ కీర్తి సురేశ్ (Keerthy Suresh) తొలి హిందీ సినిమా 'బేబీ జాన్' (Baby John Movie) చాలా ఏళ్ల క్రితం వచ్చిన 'తెరి' సినిమాకు ఇది రీమేక్. వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటించాడు. కీర్తితో పాటు వామికా గబ్బి హీరోయిన్గా నటించింది. ట్రైలర్తోనే ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటర్టైనర్ చూడబోతున్నాం అనే హింట్ ఇచ్చారు. ఇప్పుడు క్రిస్మస్ కానుకగా మూవీని థియేటర్లలో రిలీజ్ చేశారు. ఇంతకీ మూవీ టాక్ ఏంటి? ఆడియెన్స్ ఏమంటున్నారు?(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'బరోజ్' సినిమా రివ్యూ)సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది గానీ మరీ సూపర్ బంపర్ అనట్లేదు. తొలి 40 నిమిషాలు డీసెంట్గా ఉందని చెబుతున్నారు. ఇంటర్వెల్ ముందు 20 నిమిషాల మాత్రం హార్డ్ హిట్టింగ్ సీన్స్తో చూపించారని అంటున్నారు. సెకండాఫ్ని యాక్షన్ సన్నివేశాలతో నింపేశారని, క్లైమాక్స్ సాలిడ్గా ఉందని అంటున్నారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుందంటున్నారు.యాక్షన్, ఎమోషన్స్, డ్రామా, కామెడీ, కాస్త రొమాన్స్.. ఇలా అన్ని అంశాల మిక్స్ చేసి తీసిన మాస్ ఎంటర్టైనర్ 'బేబీ జాన్'కి పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. హీరోగా చేసిన వరుణ్ ధావన్, గెస్ట్రోల్ చేసిన సల్మాన్ ఖాన్ (Salman Khan) అదిరిపోయే ఫెర్మార్మెన్స్ ఇచ్చారని మెచ్చుకుంటున్నారు. (ఇదీ చదవండి: ఎదురుపడ్డ మాజీ ప్రేమికులు నిఖిల్-కావ్య.. అక్కడే ఉన్నా గానీ!)#BabyJohnReview : ⭐⭐⭐1/2.#BabyJohn is a massy hilarious ride crafted to captivate large audiences. The perfect mix of action, emotions, drama, & humor, coupled with lead actors outstanding performance, delivers an incredibly entertaining & enjoyable cinematic experience.👍 pic.twitter.com/8DMSxR1RKB— Always Bollywood (@AlwaysBollywood) December 25, 2024#BabyJohn Received Extraordinary Response From The Audience.Everyone Appreciate The Performance Of #VarunDhawan & #SalmanKhan's Cameo And Loudly Praise Him.Blockbuster Loading 🔥🔥🔥 @BeingSalmanKhan #SalmanKhan #BabyJohnReview pic.twitter.com/6h8LwgdgKx— Filmy_Duniya (@FMovie82325) December 25, 2024@Varun_dvn Is back with a BANG 🔥 #BabyJohn is the perfect blend of action, drama, romance, comedy & a killer music album! The punchlines and punches, both land so well that it will leave you speechless. The twists, the sound effects, everything make it a MUST WATCH. (1/2) pic.twitter.com/PJONKGkmO1— ekta | VD stan ✨ (@crazyvaruniac_) December 24, 2024Round 1 #BabyJohn Mass 🔥 pic.twitter.com/peivaAjeSf— sahil. (@shutupsahill) December 25, 2024Agree or die Best Title Card ever in the Bollywood cinema 🔥#VarunDhawan #BabyJohn pic.twitter.com/MeYu6kB0Oa— BUNNY (@BabyJohnDec25) December 24, 2024THIS MANNNN!!!! 🔥🤯ONE OF THE BEST ENTRY SCENE FOR SALMAN KHAN!! THE CENIMA WILL TURN INTO STADIUM !! 🥶GET READY FOR "AGENT BHAIJAAN" 🔥🌋🥵#BabyJohn #SalmanKhan #Christmas #MerryChristmas #BabyJohnreview #Sikandar #SikandarTeaser pic.twitter.com/DLmAmdMkab— it's cinema (@its_cinema__) December 24, 2024Only south Directors know how to present superstar like Salman Khan#BabyJohn #SalmanKhan pic.twitter.com/FJuFncJHtz— 𝙳𝚛 𝙼𝚞𝚓𝚓𝚞 𝙺𝚑𝚊𝚗 (@MajesticMujju) December 24, 2024#BabyJohnReview ~ ENTERTAINER!👌Rating: ⭐️⭐️⭐️½#BabyJohn offers GREAT ACTION, GOOD DIALOGUES, THRILLING BGM, and SOLID PERFORMANCEs by the lead and Supporting Actors🔥👌The first 40 minutes are just about decent, but 20 mins before the INTERVAL really HIT HARD! Thanks to… pic.twitter.com/VAAblSJ9Qb— CineHub (@Its_CineHub) December 25, 2024 -
బిగ్బాస్ షోలో 'బేబీ'తో కీర్తి సురేశ్ (ఫోటోలు)
-
ముంబైలో చాలామంది హీరోలు కీర్తి ఫోన్ నెంబర్ అడిగారు: వరుణ్ ధావన్
బేబీ జాన్ సినిమాతో కీర్తి సురేశ్ (Keerthy Suresh) బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది. బుధవారం (డిసెంబర్ 25)న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పెళ్లయిన రెండు రోజులకే పర్సనల్ లైఫ్ను పక్కనపెట్టేసి సినిమా ప్రమోషన్స్లో మునిగిపోయింది. తాజాగా ఈ బ్యూటీ బేబీ జాన్ (Baby John Movie) హీరో వరుణ్ ధావన్తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.ఎప్పుడూ పెళ్లి టాపికే..ఈ సందర్భంగా వరుణ్ ధావన్ (Varun Dhawan) మాట్లాడుతూ.. మేము ఎప్పుడూ పెళ్లి గురించే మాట్లాడుకునేవాళ్లం. నాకేమో పెళ్లయిపోయింది. తనేమో పెళ్లికి రెడీ అవుతోంది.. కాబట్టి ఈ హడావుడి గురించే ఎప్పుడూ కబుర్లాడుకునేవాళ్లం. వివాహమయ్యాక నేను మంచి ఇల్లాలుగా ఉంటాననేది. సినిమాలో తను ఎలాంటి భార్యగా నటించిందో చూడండి.. తనకు వైఫ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇచ్చేయాలంటారు. నిజానికి కీర్తి ఎంతోమంది మనసులను ముక్కలు చేసింది. (చదవండి: కోహ్లి నన్ను బ్లాక్ చేశాడు, ఎందుకో ఇప్పటికీ అర్థం కావట్లేదు: సింగర్)అదే బెటర్ అనిపించింది!తను ప్రేమలో ఉన్న విషయం ఏళ్ల తరబడి ఎవరికీ తెలియదు అన్నాడు. ఇంతలో కీర్తి మధ్యలో కలుగజేసుకుంటూ నాకు బాగా దగ్గరైనవాళ్లకు తెలుసు. అట్లీ, అతడి భార్య, అలాగే వరుణ్తో సినిమా చేస్తున్నప్పటి నుంచి తనకూ తెలుసు. అలాగే నా క్లోజ్ ఫ్రెండ్స్కు కూడా తెలుసు. ఈ విషయాన్ని బయటకు తెలియనివ్వకపోడమే బెటర్ అనిపించింది అని చెప్పుకొచ్చింది.చాలామంది హీరోలు తన నెంబర్ అడిగారువరుణ్ మాట్లాడుతూ.. మేము ముంబైలో షూటింగ్ చేస్తున్నప్పుడు చాలామంది తన ఫోన్ నెంబర్ పంపించమని మెసేజ్ చేశారు. ఎంతో మంది హీరోలు తన నెంబర్ అడిగారు. తనను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. అందుకే ఎవరికీ నెంబర్ ఇవ్వకుండా తనను కాపాడాను. చివరకు నా బేబీ.. నాకే వదినగా మారిపోయింది అని వ్యాఖ్యానించాడు.చదవండి: Pushpa 2 Movie: దమ్ముంటే పట్టుకోరా.. -
పెళ్లైనా తగ్గేదేలే అంటున్న కీర్తి సురేష్
-
కీర్తి సురేష్ పెళ్లి చీర : స్పెషల్గా కీర్తి ఏం చేసిందో తెలుసా?
సెలబ్రిటీలు, అందాల తారల పెళ్లిళ్లు పెళ్లి ముచ్చట్టు హాట్ టాపిక్గా నిలుస్తాయి. వారు కట్టుకున్న డిజైనర్ దుస్తులు, విలువైన ఆభరణాలు, వెడ్డింగ్ డెస్టినేషన్ ఇలా ఒకటనేమిటీ ప్రతీదీ వార్తల్లో విశేషంగా నిలుస్తుంటాయి. ప్రస్తుతం మహానటి ఫేం, నటి కీర్తి సురేష్ పెళ్లి చీర విశేషాలు వైరల్గా మారాయి. ఏంటా విశేషాలు తెలుసుకుందామా..!15 ఏళ్ల సుదీర్ఘ స్నేహం తర్వాత, ప్రియుడు ఆంటోనీ తటిల్తో ఈనెల 12న వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. అయ్యంగార్, క్రిస్టియన్ వివాహ సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. కీర్తి సురేష్ పెళ్లి చీర విశేషాలు గురించి మాట్టాడుకుంటే.. పసుపు , ఆకు పచ్చ రంగుల కాబినేషన్లో ఉన్న చీరలో కొత్త పెళ్లికూతురిగా అందంగా కనిపించిన సంగతి తెలిసిందే. ఈ చీర డిజైనర్ ఆంటోనీ అనితా డోంగ్రే ఈ చీర విశేషాలను ఇన్స్టాలో పంచుకున్నారు. ఇక కీర్తి సురేష్ రెడ్-టోన్డ్ వెడ్డింగ్ చీర ఆమె తల్లిదట దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ను డిజైన్ చేసినట్టు అనితా వెల్లడించారు.అమ్మచీర , కొంగుపై తమిళ పద్యంతొమ్మిది గజాల, అయ్యంగార్ (మడిసర్) స్టయిల్లో తన తల్లి చీరలో కీర్తి సురేష్ స్పెషల్గా కనిపించింది. ఈ పెళ్లి చీర మేకింగ్ వీడియోను అనితా సోషల్మీడియాలో పంచుకున్నారు. కంజీవరం చీరపై తమిళ పద్యాన్ని చేతితో అందంగా పొందరుపర్చారు. అదీ స్వయంగా కీర్తి చీర అంచులు, పల్లులో స్వయంగా తన చేతితో అక్షరాలను తీర్చిదిద్దడం విశేషం.తయారీకి 405 గంటలుఇంకా ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన బంగారు జరీ డైమండ్ సూది ఉన్నాయని అనితా డోంగ్రే వెల్లడించారు.అంతేకాదు దీని తయారీకి సుమారు 405 గంటలు పట్టింది. సంప్రదాయ నేత కళను, ఫ్యాషన్ సంస్కృతిని ప్రతిబింబించేలా తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు డిజైనర్లు. పెళ్లిలో ఆమె భరతనాట్య ఆభరణాలను ఎంచుకుంది. నెక్లెస్లు అట్టికై , హారం, మాంగ టిక్కా లేదా నెట్టి చుట్టి, ఒడ్డాణం, ఇరుచెంపలకు సూర్య , చంద్ర ఇలా సంప్రదాయ ఆభరణాలతో రాయల్ లుక్లో మెరిసింది. View this post on Instagram A post shared by Anita Dongre (@anitadongre)ఇక ఆంటోనీ పట్టు ధోతీ ,శాలువా తయారు చేయడానికి 150 గంటలు పట్టిందని కూడా ఆమె వివరించారు. ఇక వర్క్ విషయానికి వస్తే ‘బేబీ జాన్’తో బాలీవుడ్లో అడుగు పెడుతోంది. డిసెంబర్ 25న విడుదలకానున్న ఈ మూవీ ప్రమోషన్స్లో మంగళసూత్రంతో హాజరైన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్అయిన సంగతి తెలిసిందే. -
World Saree Day 2024: సెలబ్రిటీల బ్యూటిఫుల్ శారీ లుక్స్
-
జీవితంలో పెళ్లే చేసుకోనన్న హీరోయిన్.. కీర్తి సురేశ్ గురించి ఏమందంటే? (ఫోటోలు)
-
కీర్తి సురేశ్ పెళ్లికి ఇంతమంది హీరోహీరోయిన్లు వెళ్లారా? (ఫొటోలు)
-
Keerthy Suresh: అటు సంతోషం.. ఇటు డెడికేషన్..
మహానటి కీర్తి సురేశ్ ఈ మధ్యే పెళ్లి బంధంలో అడుగుపెట్టింది. డిసెంబర్ 12న అతడితో ఏడడుగులు వేసింది. తొలుత గోవాలో హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోగా తర్వాత క్రిస్టియన్ పద్ధతిలోనూ ఉంగరాలు మార్చుకుని వెడ్డింగ్ సెల్రేషన్స్ జరుపుకున్నారు. పెళ్లయి వారం కూడా కాలేదు, అప్పుడే తన సినిమా ప్రమోషన్స్లో పాల్గొంది. అంతేకాదు, మెడలో పసుపు తాడుతోనే ఈ వేడుకల్లో పాల్గొనడం విశేషం.బేబి జాన్కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ బేబి జాన్. వరుణ్ ధావన్, వామికా గబ్బి, జాకీ ష్రాఫ్ ముఖ్య పాత్రల్లో నటించారు. కలీస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు. డిసెంబర్ 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. కీర్తికి హిందీలో ఇదే తొలి సినిమా కావడం విశేషం! ఈ క్రమంలో ముంబైలో ఏర్పాటు చేసిన ప్రమోషనల్ ఈవెంట్కు కీర్తి హాజరైంది.సంతోషంలో కీర్తివివాహ బంధంపై ఎనలేని గౌరవంతో తాళిని అలాగే ఉంచుకుని ఈవెంట్కు రావడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరోవైపు పెళ్లిలో హీరో విజయ్ ఆశీర్వదించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. మా డ్రీమ్ ఐకాన్ విజయ్ సర్ మా పెళ్లికి హాజరై మమ్మల్ని ఆశీర్వదించాడు అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) చదవండి: సర్జరీ కోసం వెళ్తున్నా.. కాస్త ఆందోళనగానే ఉంది: శివరాజ్ కుమార్ -
మెడలో తాళిబొట్టు.. మోడ్రన్ డ్రెస్లో కీర్తి సురేష్ ట్రెండింగ్ (ఫోటోలు)
-
భాష మారింది.. కీర్తి సురేశ్ రెమ్యునరేషన్ డబుల్?
'మహానటి' కీర్తి సురేశ్ తెలుగు ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయిపోయింది. పేరుకే మలయాళీ గానీ టాలీవుడ్లోనే స్టార్ హీరోలతో వరస సినిమాలు చేసింది. రీసెంట్గా ఆంటోని తట్టిళ్ అనే బిజినెస్మ్యాన్ పెళ్లి చేసుకుంది. మరోవైపు ఈమె నటించిన తొలి హిందీ సినిమా 'బేబీ జాన్'.. వచ్చే వారం క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ కానుంది. ఇప్పుడు ఈ మూవీ కోసం డబుల్ రెమ్యునరేషన్ తీసుకుందనే టాక్ నడుస్తోంది.ప్రముఖ నిర్మాత సురేశ్, ఒకప్పటి హీరోయిన్ మేనక కూతురైన కీర్తి సురేశ్.. 'నేను శైలజ' సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. ఈ ఏడాది రిలీజైన ప్రభాస్ 'కల్కి'లో కారుకి వాయిస్ ఓవర్ ఇచ్చి ఎంటర్టైన్ చేసింది. ఈమె నటించిన 'బేబీ జాన్' అనే హిందీ మూవీలో నటించింది. తమిళ సినిమా 'తెరి' రీమేక్గా దీన్ని తెరకెక్కించారు.(ఇదీ చదవండి: రూ.10 టికెట్లో కూర్చుని 'పుష్ప 2' చూశా: నటి సంయుక్త)ఒరిజినల్ సినిమాలో సమంత కనిపించిన పాత్రలో ఇప్పుడు కీర్తి సురేశ్ నటించింది. సౌత్లో నటిస్తే రూ.2 కోట్లు ఈమెకు ఇస్తారు. కానీ 'బేబీ జాన్'లో నటించినందుకుగానూ రూ.4 కోట్లు పైనే పారితోషికం ఇచ్చారట. బహుశా అందుకేనేమో గ్లామర్ విషయంలోనూ తగ్గేదే లే అన్నట్లు పాటల్లో కనిపించింది!ఇదే సినిమాలో నటించిన మిగతా నటీనటులు రెమ్యునరేషన్ విషయానికొస్తే హీరో వరుణ్ ధావన్కి రూ.15 కోట్లు పైనే ఇచ్చారట. విలన్గా చేసిన జాకీ ష్రాఫ్కి కోటిన్నర, మరో హీరోయిన్గా చేసిన వామికా గబ్బికి కోటి రూపాయలు, కీలక పాత్ర చేసిన సన్యా మల్హోత్రాకు రూ.40 లక్షల పారితోషికం ఇచ్చారట. ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఇతడి శిష్యుడు కలీస్ దర్శకత్వం వహించాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు) -
క్రిస్టియన్ సంప్రదాయంలోనూ కీర్తి సురేశ్ పెళ్లి (ఫొటోలు)
-
లవ్ మ్యారేజెస్ తో... స్టార్ హీరోయిన్స్ బిజీ ?
-
2024లో ఇంతమంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్నారా? (ఫొటోలు)
-
Keerthy Suresh: కీర్తి సురేష్ పెళ్లి ఫోటోలు చూశారా?
-
గోవాలో ఘనంగా జరిగిన కీర్తిసురేష్ వివాహం
-
హిందూ సంప్రదాయ పద్ధతిలో కీర్తి సురేష్,ఆంటోనీల పెళ్లి
హీరోయిన్ కీర్తి సురేష్ తన చిరకాల స్నేహితుడు ఆంటోనీ తాటిల్ను పెళ్లి చేసుకుంది. గోవా వేదికగా వారిద్దరూ మూడుముళ్ల బంధంతో ఏడడుగులు నడిచారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఇరుకుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కీర్తి మెడలో ఆంటోనీ మూడుముళ్ల వేయడంతో నూతన వధూవరులను ఆశీర్వదించారు. వివాహ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలను అభిమానులతో కొత్త దంపతులు పంచుకున్నారు.గోవా వేదికగా జరిగిన ఈ వేడుకలో ఇరు కుటుంబ సభ్యులతో పాటు కొందిమంది సన్నిహితులు పాల్గొన్నారు. నూతన వధూవరులను వారందరూ ఆశీర్వదించారు. దీంతో అభిమానులు కూడా వారికి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ ఏడాది దీపావళి రోజున ఆంటోనీ తాటిల్తో తన ప్రేమ విషయాన్ని కీర్తి సురేశ్ తెలియజేసింది. సౌత్లో బిజీ హీరోయిన్గా ఉన్న ఆమె కెరీర్ పీక్లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. బేబీ జాన్ మూవీతో ఆమె బాలీవుడ్లోనూ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ త్వరలోనే విడుదలకానుంది.కీర్తి సురేష్ పెళ్లిలో పాల్గొన్న వారందరికీ KA అని ముద్రించి ఉన్న హ్యాండ్ బ్యాండ్స్ ఇచ్చారట.. వాటిని ధరించిన వారికి మాత్రమే పెళ్లి వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించారట. ఆంటోనీతో ప్రేమ, వివాహం గురించి ఇటీవల కీర్తి ఇన్స్టా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీపావళి వేడుకల్లో భాగంగా ఆయనతో కలిసి దిగిన ఒక ఫొటో విడుదల చేసిన ఆమె.. దాదాపు 15 ఏళ్ల తమ స్నేహబంధం ఇకపై జీవితాంతం కొనసాగనున్నట్లు తెలిపింది. ఆంటోనీ కుటుంబం వ్యాపార రంగంలో రానిస్తుంది. కొచ్చి, చెన్నైలలో వారికి వ్యాపారాలున్నాయి. స్కూల్ డేస్ నుంచి కలిసే ఉన్న కీర్తి, ఆంటోనీ కాలేజీ రోజుల్లో ప్రేమలో పడ్డారట. ఇప్పుడు పెళ్లితో ఒక్కటిగా కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
పెళ్లితో ఒక్కటైన కీర్తి సురేష్, ఆంటోనీ తాటిల్ (ఫోటోలు)
-
గోవాలో కీర్తి సురేశ్ పెళ్లి వేడుక.. ఫోటో పంచుకున్న హీరోయిన్!
హీరోయిన్ కీర్తి సురేశ్ వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది. ఈనెల 12న తన చిన్ననాటి స్నేహితుడు, ప్రియుడు ఆంటోనీ తటిల్ను పెళ్లాడనుంది. ఇప్పటికే కీర్తి సురేశ్ తన పెళ్లి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. గోవాలో జరగనున్న వీరి పెళ్లి వేడుకకు సంబంధించి ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి. తాజాగా కీర్తి సురేశ్ తన ఇన్స్టా స్టోరీస్లో ఫోటోను షేర్ చేసింది. ఇప్పటికే ఇరువురి కుటుంబ సభ్యులంతా గోవాలో ల్యాండైనట్లు తెలుస్తోంది. కాగా.. 15 ఏళ్లుగా వీరిద్దరు రిలేషన్లో ఉన్నారు.రెండు సంప్రదాయాల్లో వివాహం..ఇరు కుటుంబాల సమ్మతితో రెండు మతాలను సంప్రదాయాలనూ గౌరవించే విధంగా ఆంటోనీ, కీర్తి సురేష్ వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఈనెల 12వ తేదీ ఉదయం హిందూ మత సంప్రదాయ ప్రకారం, అదేరోజు సాయంత్రం చర్చిలో క్రిస్టియన్ మత సాంప్రదాయ ప్రకారం కీర్తి సురేష్, ఆంటోనీ పెళ్లి రెండు సార్లు జరగనుందని తెలిసింది. వీరి వివాహ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నట్లు సమాచారం. కాగా.. కీర్తి సురేశ్ ప్రస్తుతం హిందీలో బేబీ జాన్ మూవీతో ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. -
పెళ్లికి ముందు కీర్తి అలా.. చాన్నాళ్ల తర్వాత మెగా కోడలు ఇలా!
అందాల విందు చేసేలా శ్రీముఖి స్టిల్స్అత్తారింట్లో అడుగుపెట్టిన నటుడు జయరామ్ కోడలుడిజైనర్ వేర్లో కీర్తి సురేశ్ వయ్యారాలుమెగా కోడలు లావణ్య త్రిపాఠి క్లాస్ టచ్స్లీవ్లెస్ డ్రస్సులో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన ప్రీతి జింటాలండన్లో చిల్ అవుతున్న మాళవిక మోహనన్'కిస్సిక్' పాటకు స్టెప్పులేసిన అరియానా-సౌమ్య View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Jayaram (@actorjayaram_official) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Jacqueliene Fernandez (@jacquelienefernandez) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Face Magazine (@facemag.in) View this post on Instagram A post shared by Pranati Rai Prakash (@pranati_rai_prakash) View this post on Instagram A post shared by Anveshi Jain (@anveshi25) View this post on Instagram A post shared by Rithu Manthra (@rithumanthra_) View this post on Instagram A post shared by Lavanyaa konidela tripathhi (@itsmelavanya) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Kalidas Jayaram (@kalidas_jayaram) View this post on Instagram A post shared by Preity G Zinta (@realpz) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Shehnaaz Gill (@shehnaazgill) View this post on Instagram A post shared by Sathya krishnan (@sathya_krishnan27) View this post on Instagram A post shared by Sowmya Rao (@sowmya.sharada) View this post on Instagram A post shared by Anju Kurian (Ju) (@anjutk10) View this post on Instagram A post shared by Nikkii Galrani Pinisetty (@nikkigalrani) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) -
ఫేస్ మ్యాగజీన్ కవర్ : కాబోయే పెళ్లికూతురు కీర్తి ఫ్యాషన్ లుక్స్
-
నిర్మాతగా స్టార్ డైరెక్టర్ భార్య.. ట్రైలర్ చూశారా?
వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'బేబీ జాన్'. ఈ చిత్రాన్ని కలీస్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి డైరెక్టర్ అట్లీ భార్య ప్రియా అట్లీ నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ముంబయిలో నిర్వహించిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో విడుదల చేశారు. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.ట్రైలర్ చూస్తే ఫుల్ యాక్షన్ మూవీగానే బేబీ జాన్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ యాక్షన్ సీన్స్, ఫైట్స్ ఈ చిత్రంపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, వామికా గబ్బి రాజ్పాల్ యాదవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈ చిత్రానికి టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతమందించడం మరో విశేషం. -
రెండు సంప్రదాయాలను గౌరవిస్తూ కీర్తి సురేష్ పెళ్లి
సినీ తారల ప్రేమ, పెళ్లి అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతం ఇలాంటి సీజనే నడుస్తోందని చెప్పవచ్చు. ఇటీవల నటుడు నాగచైతన్య, శోభిత వివాహం సాంప్రదాయబద్ధంగా జరిగిన విషయం తెలిసిందే. మరుపక్క నటి సమంత బాలీవుడ్కు చెందిన ఓ నటుడి ప్రేమలో ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇకపోతే కురక్రారుల డ్రీమ్ గర్ల్ కీర్తి సురేష్ కూడా పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న హిందీ చిత్రం బేబీ జాన్తో ఈ అమ్మడు పాన్ ఇండియా కథానాయకిగా పేరు తెచ్చుకున్నారు. ఇలా కథానాయకిగా ఉన్నత స్థాయిలో రాణిస్తున్న సమయంలోనే కీర్తి సురేష్ పెళ్లికి సిద్ధమవడం చాలామందిని ఆసక్తికి గురిచేసింది. 15 ఏళ్లుగా ప్రేమించుకుంటున్న తన పాఠశాల స్నేహితుడు ఆంటోనితో ఏడడుగులు నడవడానికి కీర్తి సురేష్ సిద్ధమవుతున్నారు. కాగా తను పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి క్రిస్టియన్ మతానికి చెందినవాడు కావడంతో నటి కీర్తి సురేష్ కూడా మతం మారడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అయితే అది నిజం కాదంటూ తమ ప్రేమ, పెళ్లికి మతం సమస్య కాదని ఈ క్రేజీ జంట నిరూపించుకున్నారు. ఆ విధంగా ఇరు కుటుంబాల సమ్మతితో రెండు మతాలను సంప్రదాయాలనూ గౌరవించే విధంగా ఆంటోనీ, కీర్తి సురేష్ వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. వీరి పెళ్లి ఈనెల 12న గోవాలో జరగనుంది. అక్కడ 12వ తేదీ ఉదయం హిందూ మత సంప్రదాయ ప్రకారం, అదేరోజు సాయంత్రం చర్చిలో క్రిస్టియన్ మత సాంప్రదాయ ప్రకారం కీర్తి సురేష్, ఆంటోనీ పెళ్లి రెండు సార్లు జరగనుందని తెలిసింది. వీరి వివాహ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నట్లు సమాచారం. -
మీ ఆశీర్వాదాలు కావాలి.. కీర్తి సురేశ్ పెళ్లి పత్రిక ఫోటో వైరల్
మహానటి కీర్తి సురేశ్ జీవితంలో కొత్త అడుగు వేసేందుకు సిద్ధమవుతోంది. స్నేహితుడు, ప్రియుడు ఆంటోని తటిల్తో గుట్టుచప్పుడు కాకుండా ప్రేమాయణం జరిపిన ఆమె అతడితో ఏడడుగులు వేసేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని కీర్తితో పాటు ఆమె తండ్రి సురేశ్కుమార్ కూడా ధృవీకరించాడు. ఈ వేడుకకు గోవా వేదికగా మారనుందని కూడా చెప్పారు.వెడ్డింగ్ కార్డ్తాజాగా కీర్తి- ఆంటోని లగ్న పత్రిక ఇదేనంటూ ఓ వెడ్డింగ్ కార్డ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. డిసెంబర్ 12న మా కూతురి పెళ్లి చేస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్న ఈ జంటకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలి.. ఇట్లు జి.సురేశ్కుమార్, మేనక సురేశ్ అని అందులో రాసుంది.సినిమా..ఇకపోతే కీర్తి ఇటీవలే తన ప్రేమను అధికారికంగా ప్రకటించింది. పదిహేనేళ్ల ప్రయాణం.. ఇంకా కొనసాగుతుంది అంటూ ఆంటోనితో కలిసున్న ఫోటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. కాగా ఈ బ్యూటీ హీరోయిన్గా నటించిన బాలీవుడ్ మూవీ బేబీ జాన్ డిసెంబర్ 25న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) ద -
తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న కీర్తిసురేష్
-
వచ్చే నెలలో నా పెళ్లి.. అందుకే తిరుమలకి వచ్చా: కీర్తి సురేశ్
హీరోయిన్ కీర్తి సురేశ్.. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోనున్న నేపథ్యంలో కుటుంబంతో కలిసి కొండపై కనిపించింది. అలానే తన పెళ్లి గురించి తొలిసారి మాట్లాడింది. వచ్చే నెలలో గోవాలో పెళ్లి జరగనుందని, అందుకే ఇక్కడికి వచ్చానని చెప్పింది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 28 సినిమాలు)మలయాళ నిర్మాత సురేశ్, నటి మేనకల చిన్న కూతురు కీర్తి సురేశ్. బాలనటిగా కెరీర్ ప్రారంభించింది. తర్వాత తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. 'మహానటి' సినిమాతో తెలుగులోనూ సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది. ఈమె నటించిన హిందీ మూవీ 'బేబీ జాన్'.. క్రిస్మస్కి రిలీజ్ కానుంది.గత కొన్నాళ్లుగా కీర్తి సురేశ్ పెళ్లిపై రూమర్స్ వచ్చాయి. అవి నిజమని స్వయంగా ఈమెనే క్లారిటీ ఇచ్చింది. ఆంటోని తట్టిళ్తో తాను 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్న విషయాన్ని బయటపెట్టింది. ఇప్పుడు తిరుమలలో కనిపించి స్వయంగా మీడియాతో వచ్చే నెలల గోవాలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. డిసెంబరు 11-12 తేదీల్లో ఓ రిసార్ట్లో వివాహ వేడుక జరగనుంది.(ఇదీ చదవండి: చైతూ-శోభిత పెళ్లి సందడి.. హల్దీ ఫొటోలు వైరల్)Actress @KeerthyOfficial visited Tirumala.My wedding is in Goa next month, so I came for the darshan.#KeerthySuresh pic.twitter.com/Wbq6XORhxq— Suresh PRO (@SureshPRO_) November 29, 2024#GetsCinema UPDATE ✅#KeerthySuresh Confirmed her MARRIAGE - Next Month in GOA 🤩🤩🤩💥💥💥pic.twitter.com/H9tzU28pfs— GetsCinema (@GetsCinema) November 29, 2024 -
ప్రియుడిని పరిచయం చేసిన హీరోయిన్ కీర్తి సురేశ్
గత కొన్నాళ్లుగా వస్తున్న రూమర్లు నిజమయ్యాయి. హీరోయిన్ కీర్తి సురేశ్.. తనకు కాబోయే వాడిని పరిచయం చేసింది. ఆంటోని తట్టిళ్తో 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్న విషయాన్ని బయటపెట్టింది. ఇద్దరూ కలిసున్న ఫొటోని అయితే పోస్ట్ చేసింది గానీ ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు.మలయాళ నిర్మాత సురేశ్, నటి మేనకల కూతురైన కీర్తి సురేశ్.. బాలనటిగా చేసింది. 'నేను శైలజ' మూవీ హీరోయిన్ అయింది. తెలుగు, తమిళ, మలయాళంలో నటించింది. హిందీలోనూ ఈమె తొలి మూవీ 'బేబీ జాన్' త్వరలో రిలీజ్ కానుంది. ఇంతలోనే పెళ్లి రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటిని కీర్తి నిజమని ధ్రువీకరించింది.(ఇదీ చదవండి: చైతూ-శోభిత పెళ్లి.. అవన్నీ రూమర్స్ మాత్రమే)కీర్తి సురేశ్ చెప్పిన దానిబట్టి చూస్తే 15 ఏళ్ల ప్రేమ అంటే ఇంటర్మీడియట్లో ఒకరికి ఒకరు పరిచయం. ఆ తర్వాత ఈమె హీరోయిన్ కాగా.. ఆంటోని ఇంజినీరింగ్ చేసి ఖతార్లో కొన్నాళ్లు పనిచేసాడు. తిరిగి స్వదేశానికి వచ్చి కొచ్చిలో విండో సొల్యూషన్స్ కోసం యాస్పెరాస్ కంపెనీ పెట్టాడు. తర్వాత హోటల్స్ వ్యాపారంలోనూ అడుగుపెట్టాడు.15 ఏళ్ల ప్రేమని కొన్నాళ్ల క్రితం పెద్దలకు చెప్పారు. వాళ్ల కూడా అంగీకరించడంతో ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యారు. డిసెంబరు 11న గోవాలోని ఓ రిసార్ట్లో ఈ వేడుక జరగనుంది. బహుశా హిందూ-క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతుల్లో పెళ్లి జరుగుతుందేమో!(ఇదీ చదవండి: 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న నటుడు సుబ్బరాజ్) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
కీర్తి సురేశ్ గ్లామర్ డోస్.. ట్రెండింగ్ లో 'బేబీ జాన్' సాంగ్ (ఫొటోలు)
-
'బేబీ జాన్' కోసం కీర్తి సురేశ్ గ్లామర్ డోస్.. పూర్తి సాంగ్ విడుదల
వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ జోడీగా నటించిన చిత్రం ‘బేబీ జాన్’. కాలీస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి తాజాగా గ్లామరస్ సాంగ్ విడుదలైంది. కోలీవుడ్లో సూపర్ హిట్ సినిమా 'తెరి'కి రీమేక్గా బేబీ జాన్ రానుంది. కీర్తీ సురేశ్, వామికా గబ్బి హీరోయిన్లుగా ఇందులో నటించారు. తమిళ దర్శకుడు అట్లీ, సినీ1 స్టూడియోస్, ఏ ఫర్ యాపిల్ పతాకాలపై జ్యోతీ దేశ్పాండే, మురాద్ ఖేతనీ, ప్రియా అట్లీ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 25న రిలీజ్ కానుంది.బేబీ జాన్ నుంచి విడుదలైన తాజా సాంగ్లో కీర్తి సురేష్ కాస్త గ్లామర్ డోస్ పెంచింది. ఇప్పటి వరకు డీసెంట్ రోల్స్ చేస్తూ.. ఎక్కడా హద్దులు దాటకుండా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు వాటిని క్రాస్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో తను లిప్లాక్ సీన్లో కూడా నటించినట్లు సమాచారం. దీనంతటికి కారణం ఈ చిత్రంతో ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడమేనని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. -
పెళ్లికి వేళాయె
హీరోయిన్ కీర్తీ సురేష్ పెళ్లి పీటలు ఎక్కే సమయం ఆసన్నమైందట. తన స్నేహితుడు, ప్రియుడు ఆంటోని తటిల్ను ఆమె పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై కీర్తీ సురేష్ తండ్రి, నిర్మాత జి. సురేష్ కుమార్ ఓ మలయాళ మీడియాతో మాట్లాడుతూ– ‘‘కీర్తీకి 15 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న ఆంటోని తటిల్తోనే వివాహం జరగబోతోంది.గోవాలో ఈ పెళ్లి జరుగుతుంది’’ అని పేర్కొన్నారాయన. కాగా ఆంటోని తటిల్–కీర్తీలది డెస్టినేషన్ వెడ్డింగ్ అట. గోవాలోని ఓ రిసార్ట్లో డిసెంబరు 11 లేదా 12న వీరి వివాహం జరగనుందని టాక్. వివాహ వేడుకలను గోవాతో పాటు కేరళలోనూ జరిపేలా ΄్లాన్ చేశారనే వార్త కూడా వినిపిస్తోంది. ఇక ఆంటోని తటిల్ విషయానికొస్తే... ఆయన కేరళకు చెందిన వ్యాపారవేత్త. -
హీరోలకు తక్కువేం కాదు.. ట్రైనింగ్ తీసుకుని మరీ ఫైట్స్ చేస్తున్న హీరోయిన్లు
వెండితెరపై వీలైనప్పుడల్లా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేస్తుంటారు హీరోయిన్లు. కొన్ని చిత్రాల్లో ఫెరోషియస్ రోల్స్ చేస్తుంటారు. పూర్తి స్థాయి యాక్షన్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, ట్రైనింగ్ తీసుకుని మరీ ఫైట్స్ చేస్తుంటారు. హీరోలా సినిమాని నడిపించేలా హీరోషియస్ రోల్స్ చేస్తున్న కొంతమంది హీరోయిన్స్పై కథనం.ప్రతీకారంపవర్ఫుల్ ఉమన్ రోల్స్ చేసే అగ్రశ్రేణి హీరోయిన్స్ జాబితాలో అనుష్కా శెట్టి ముందు వరసలో ఉంటారు. ‘అరుంధతి, భాగమతి’ వంటి బ్లాక్బస్టర్ మూవీస్లో అనుష్క చేసిన నెక్ట్స్ లెవల్ పెర్ఫార్మెన్స్ను ఆడియన్స్ అంత సులభంగా మర్చిలేరు. కొంత గ్యాప్ తర్వాత ఇలాంటి ఓ పవర్ఫుల్ రోల్నే ‘ఘాటి’ చిత్రంలో చేస్తున్నారు అనుష్క. క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇటీవల ‘ఘాటి’ సినిమా గ్లింప్స్ విడుదలైంది. ఈ వీడియోలో ఓ మనిషి తలను అతి క్రూరంగా కొడవలితో నరికిన మహిళగా అనుష్క కనిపించారు. ఈ విజువల్స్ ఆమె పాత్ర ఎంత పవర్ఫుల్గా ఉంటుందో స్పష్టం చేశాయి. ‘షూటి’ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. త్వరలోనే విడుదల తేదీపై స్పష్టత రానుంది.ఇక వ్యాపారంలో అత్యుత్తమంగా ఎదుగుతున్న ఓ మహిళను కొందరు దారుణంగా మోసం చేస్తారు. ఈ మోసంతో ఆ మహిళ మనసు విరిగిపోయి, కఠినంగా మారుతుంది. తనను మోసం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. ఎక్కడైతే ఓడిపోయిందో అక్కడే గెలవాలనుకుంటుంది. ఆ మహిళ ఎలా గెలిచింది? అన్నదే ‘ఘాటి’ కథ అని సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... క్రిష్ దర్శకత్వంలో 2010లో వచ్చిన ‘వేదం’ సినిమాలో అనుష్క ఓ లీడ్ రోల్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.శివశక్తిదాదాపు ఇరవైఏళ్ల సినీ కెరీర్లో హీరోయిన్ తమన్నా డిఫరెంట్ రోల్స్ చేశారు. వీటిలో కొన్ని యాక్షన్ తరహా చిత్రాలూ ఉన్నాయి. అయితే ఈసారి కొంచెం కొత్తగా యాక్షన్తో కూడిన ఆధ్యాత్మిక పాత్ర నాగసాధువు శివశక్తిగా కనిపించనున్నారు తమన్నా. దర్శకుడు సంపత్ నంది కథతో అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఓదెల 2’ సినిమాలోనే నాగసాధువు శివశక్తిగా తమన్నా కనిపిస్తారు.మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ పతాకాలపై డి. మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహ, యువ, నాగమహేశ్ వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి ఈ సినిమాలోని ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఓదెల మల్లన్న ఆలయం, ఆ గ్రామంలో జరిగే కొన్ని ఊహాతీత ఘటనల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది.కూతురి కోసం...ఓ రాక్షసుడి నుంచి తన చిన్నారి కుమార్తెను కాపాడుకోవడానికి ఓ తల్లి రాక్షసిగా మారింది. ఈ రాక్షసుడిపై యుద్ధం ప్రకటించింది. ఈ యుద్ధంలో ఆ తల్లి ఎలా పోరాడింది? అనే ఇతివృత్తంతో తెరకెక్కుతున్న తమిళ సినిమా ‘రాక్కాయి’. నయనతార లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ఇది. ఇందులో కూతురి రక్షణ కోసం ఎంతకైనా తెగించే తల్లి పాత్రలో నయనతార నటిస్తున్నారు. సెంథిల్ నల్లసామి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఇటీవల ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ను రిలీజ్ చేశారు. ఓ చేతిలో బరిసె పట్టుకుని, ఆ బరిసెకు కొడవలి బిగించి, మరో చేతిలో మరో కొడవలిని పట్టుకుని ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్న నయనతార విజువల్స్ ‘రాక్కాయి’ టైటిల్ గ్లింప్స్లో కనిపించాయి. ఇప్పటివరకు ‘డోరా, ఐరా, నెట్రిక్కన్’ వంటి హారర్ ఫిల్మ్స్, ‘కర్తవ్యం’ వంటి సామాజిక సందేశం ఉన్న సినిమాల్లోనే నయనతార ఎక్కువగా నటించారు. తొలిసారిగా ఆమె ‘రాక్కాయి’ వంటి పూర్తి స్థాయి యాక్షన్ సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.వంట గదిలో తుపాకీకిచెన్లో గరిటె పట్టుకునే గృహిణిగానే కాదు... అవసరమైతే అదే చేత్తో తుపాకీ కూడా పట్టుకోగలదు. ఇంతకీ ఆ గృహిణి పూర్తి కథ ఏంటో తెలుసుకోవాలంటే ‘మా ఇంటి బంగారం’ సినిమా థియేటర్స్లోకి వచ్చేంతవరకూ వేచి ఉండాలి. ఇందులో సమంత లీడ్ రోల్లో నటిస్తారు. ‘ట్రా లా లా’ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాను సమంతనే నిర్మిస్తుండటం విశేషం. ఈ ఏడాది సమంత బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 28న ఈ సినిమాను ప్రకటించారు.అయితే ఈ సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు, షూటింగ్ అప్డేట్స్ వంటి విషయాలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కంద్రేగుల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారని, షూట్ మొదలైందని సమాచారం. ఇక ‘ది ఫ్యామిలీ మేన్’ వెబ్ సిరీస్లో సమంత ఓ యాక్షన్ రోల్ చేసి, బుల్లితెరపై సూపర్హిట్ అయ్యారు. ఇప్పుడు వెండితెరపైనా ఈ రిజల్ట్ను రిపీట్ చేయాలనుకుని యాక్షన్ బేస్డ్ మూవీ ‘మా ఇంటి బంగారం’కి గ్రీన్సిగ్నల్ ఇచ్చారని టాక్.హ్యాండ్ బాగ్లో బాంబుఓ అమ్మాయి హ్యాండ్బ్యాగ్లో ఏముంటాయి? మేకప్ కిట్, మొబైల్ ఫోన్... వగైరా వస్తువులు ఉండటం కామన్. కానీ ఓ అమ్మాయి హ్యాండ్బ్యాగ్లో మాత్రం రక్తంతో తడిసిన కత్తి, ఓ తుపాకీ, బాంబు ఉన్నాయి. ఆ అమ్మాయి ఎవరు అంటే రివాల్వర్ రీటా. వెండితెరపై రివాల్వర్ రీటాగా చేస్తున్నారు కీర్తీ సురేష్. పవర్ఫుల్ ఉమన్ రోల్స్ చేయడంలో సిద్ధహస్తురాలైన హీరోయిన్స్లో ఒకరైన కీర్తీ సురేష్ ‘రివాల్వర్ రీటా’లో మరోసారి నటిగా తానేంటో చూపించనున్నారు. ఈ సినిమాను తమిళ దర్శకుడు కె. చంద్రు తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా రిలీజ్పై త్వరలోనే ఓ స్పష్టత రానుంది.గాంధారి గతంకిడ్నాప్కు గురైన తన కుమార్తెను రక్షించుకోవడం కోసం ఓ తల్లి చేసే సాహసాల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘గాంధారి’. ఈ చిత్రంలో తల్లి పాత్రలో తాప్సీ నటిస్తున్నారు. ఈ ఫిల్మ్లోని కొన్ని యాక్షన్ సీక్వెన్స్లను ఆమె డూప్ లేకుండా చేశారు. దేవాశిశ్ మఖీజా దర్శకత్వంలో ఈ సినిమాను కనికా థిల్లాన్ నిర్మిస్తున్నారు. ఓ తల్లి గతం వల్ల ఆమె కూతురు ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది? కూతుర్ని కాపాడుకోవడం కోసం ఆ తల్లి ఏం చేసింది? అనే అంశాలతో ‘గాంధారి’ చిత్రకథ ఉంటుందని సమాచారం.ఇలా యాక్షన్ రోల్స్ చేసే హీరోయిన్స్ మరికొంతమంది ఉన్నారు. : ముసిమి శివాంజనేయులు -
Keerthy Suresh: కీర్తి సురేశ్ మ్యారేజ్ ఫిక్స్.. వరుడు ఎవరంటే
-
రూమర్స్ కాదు నిజంగానే కీర్తి సురేశ్కి పెళ్లి సెట్!
హీరోయిన్ కీర్తి సురేశ్ పెళ్లి గురించి ఎన్నోసార్లు రూమర్స్ వచ్చాయి. బిజినెస్మ్యాన్, ఫ్యామిలీ ఫ్రెండ్.. ఇలా గతంలో చాలాసార్లు పలువురి గురించి అన్నారు. కానీ ఆ వ్యక్తుల పేరు, డీటైల్స్ లాంటివేం రాలేదు. రీసెంట్గా గత రెండు మూడు రోజుల నుంచి కూడా కీర్తి సురేశ్ పెళ్లంటూ తెగ హడావుడి మొదలైంది. తొలుత ఇది కూడా ఎప్పటిలాంటి రూమర్ అని అందరూ అనుకున్నారు. కానీ ఈసారి మాత్రం నిజంగానే పెళ్లి చేసుకోబోతుందని క్లారిటీ వచ్చేసింది.(ఇదీ చదవండి: అయ్యప్ప మాలలో చరణ్.. కానీ దర్గాకు ఎందుకు వెళ్లాడంటే?)ఒకప్పటి హీరోయిన్ మేనక, నిర్మాత సురేశ్ కుమార్ ముద్దుల కూతురు అయిన కీర్తి సురేశ్.. బాలనటిగా కెరీర్ మొదలుపెట్టింది. 'నేను శైలజ' సినిమాతో హీరోయిన్ అయిపోయింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసింది. ఇప్పుడు కూడా ఈమె చేతిలో రెండు తమిళ, ఓ హిందీ మూవీ ఉన్నాయి.పెళ్లి విషయానికొస్తే కీర్తి సురేశ్ చాన్నాళ్లుగా ఆంటోని తట్టిల్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. కానీ ఎక్కడా ఆ విషయం బయటపడకుండా జాగ్రత్త పడింది. కొచ్చికి చెందిన ఇతడినే ఇప్పుడు పెళ్లి చేసుకోబోతుంది. డిసెంబరు 11-12 తేదీల్లో గోవాలో కీర్తి-ఆంటోని డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారు. ఇవన్నీ అనధికారికంగా వినిపిస్తున్న విషయాలు. త్వరలో ఈ విషయమై కీర్తి సురేశ్ అధికారిక ప్రకటన ఇవ్వనుంది.(ఇదీ చదవండి: అక్కినేని వారి పెళ్లిసందడి.. మూడుముళ్లు వేసే టైమ్ వచ్చేసింది) -
పెళ్లి పీటలు ఎక్కబోతున్న కీర్తి సురేశ్.. గోవాలో పెళ్లి? (ఫోటోలు)
-
గోవా లో కీర్తి సురేష్ పెళ్లి.. పెళ్లి కొడుకు ఎవరంటే..
-
సౌత్ టూ నార్త్.. సరికొత్తగా కీర్తి సురేష్ (ఫొటోలు)
-
ఫ్యాషన్ డిజైనర్ శ్రావ్య వర్మ పెళ్లిలో రష్మిక, విజయ్ దేవరకొండ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మేనకోడలు శ్రావ్య వర్మ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్లోని ఓ రిసార్ట్లో ఇది జరగ్గా.. హీరోయిన్ రష్మిక, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ, 'కల్కి' దర్శకుడు నాగ్ అశ్విన్, దర్శకుడు వంశీ పైడిపల్లి.. ఇలా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ పెళ్లికి హాజరయ్యారు. నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు.(ఇదీ చదవండి: అల్లు అర్జున్కి క్యూట్ గిఫ్ట్ ఇచ్చిన రష్మిక)శ్రావ్య వర్మకి ఫ్యాషన్ డిజైనర్గా టాలీవుడ్లో మంచి గుర్తింపు ఉంది. కీర్తి సురేశ్తో 'గుడ్ లక్ సఖి' అనే సినిమాకు నిర్మాతగానూ వ్యవహరించింది. ఈమె గత కొన్నేళ్లుగా ప్రముఖ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ ప్రేమలో ఉంది. కొన్నాళ్ల క్రితం నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. ఇప్పుడు గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు.రష్మిక, కీర్తి సురేశ్ తదితరులు తమ ఇన్ స్టా స్టోరీల్లో శ్రావ్యవర్మ, కిదాంబి శ్రీకాంత్ పెళ్లి ఫొటోలు, వీడియోలని పోస్ట్ చేశారు. దీంతో కొత్త జంటకు పలువురు నటీనటులు, నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: డబుల్ ఎలిమినేషన్.. గంగవ్వతోపాటు హరితేజ కూడా!) -
'తెరి' హిందీ రీమేక్ మూవీ టీజర్ రిలీజ్
తమిళ స్టార్ హీరో విజయ్ హిట్ సినిమాల్లో 'తెరి' ఒకటి. దీన్నే 'పోలీసోడు' పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తే ఇక్కడ కూడా హిట్ అయింది. ఆల్రెడీ తెలుగు వచ్చిన మూవీ పవన్ కల్యాణ్ రీమేక్ చేస్తున్నాడు. అదే 'ఉస్తాద్ భగత్ సింగ్' అని టాక్. చాలా ఏళ్ల క్రితమే ఇది మొదలైంది కానీ ఎప్పుడు పూర్తవుతుందో తెలీదు. మరోవైపు 'తెరి'ని హిందీలోనూ రీమేక్ చేశారు. 'బేబీ జాన్' పేరుతో దీన్ని తీస్తున్నారు. తాజాగా చిత్ర టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు.. ఐదు స్పెషల్)ఒరిజినల్లో విజయ్, సమంత, అమీ జాక్సన్ చేయగా.. అదే పాత్రల్లో వరుణ్ ధావన్, కీర్తి సురేశ్, వామికా గబ్బి నటించారు. టీజర్ చూస్తే చూచాయగా అదే కథ అని అర్థమైపోయింది. కాకపోతే అప్పట్లో ఓ మాదిరి మాస్ చూపిస్తే ఇప్పుడు ఎలివేషన్స్ కోసమా అన్నట్లు మూవీ తీసినట్లు కనిపిస్తుంది. సంగీతమందించిన తమన్ అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్తో హోరెత్తించాడు. టీజర్ చూస్తుంటే హిట్ కొట్టేలానే ఉంది.డిసెంబరు 25న 'బేబీ జాన్' థియేటర్లలోకి రానుంది. 'తెరి' దర్శకుడు అట్లీ దగ్గర సహాయకుడిగా చేసిన కలీస్.. ఈ సినిమాతో డైరెక్టర్గా పరిచయమవుతున్నాడు. నిర్మాతల్లో అట్లీ భార్య కూడా ఒకరు. చాలా రోజుల నుంచి బాలీవుడ్లో సరైన మాస్ మూవీ రాలేదు. మరి ఆ లోటుని 'బేబీ జాన్' తీరుస్తుందేమో చూడాలి.(ఇదీ చదవండి: నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి వేదిక అక్కడేనా..?) -
మెగాస్టార్ సరసన కథనాయకి.. ఈ స్టార్ హీరోయిన్ తల్లిని గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
HBD ‘మహానటి’ : చీరకే వన్నె తెచ్చే దసరా బ్యూటీ (ఫోటోలు)
-
బ్లాక్ శారీలో త్రిప్తి డిమ్రీ.. దుర్గామాత పూజలో శ్రద్ధాదాస్
దుర్గామాత పూజలో హీరోయిన్ శ్రద్దాదాస్ బ్లాక్ శారీలో యానిమల్ బ్యూటీ హోయలు.. స్టన్నింగ్ అవుట్ ఫిట్లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. శారీలో కీర్తి సురేశ్ అందాలు.. బతుకమ్మ సంబురాల్లో అనన్య నాగళ్ల.. View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
ఒంగోలులో సందడి చేసిన సినీనటి కీర్తి సురేష్ (ఫొటోలు)
-
వస్త్ర దుకాణం ప్రారంభోత్సవంలో కీర్తి సురేశ్ సందడి (ఫొటోలు)
-
దుబాయ్లో బుట్టబొమ్మ చిల్.. బంగారంలా మెరిసిపోతున్న తంగలాన్ బ్యూటీ!
డార్లింగ్ హీరోయిన్ నభా నటేశ్ స్మైలీ లుక్స్.. దుబాయ్లో చిల్ అవుతోన్న పూజా హెగ్డే.. దసరా టీమ్తో కీర్తీ సురేశ్ ఓనం సెలబ్రేషన్స్.. బంగారువర్ణంలా మెరిసిపోతున్న తంగలాన్ బ్యూటీ మాళవిక మోహనన్.. మరింత గ్లామరస్ లుక్లో కల్కి బ్యూటీ దిశా పటానీ.. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) -
ఓనం-దసరా కలిస్తే.. కీర్తి సురేశ్ క్రేజీ పోస్ట్ (ఫొటోలు)
-
అట్టహాసంగా ‘సైమా 2024 అవార్డుల’ వేడుక (ఫొటోలు)
-
డైరెక్ట్గా ఓటీటీకి కీర్తి సురేశ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హీరోయిన్ కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం రఘుతాత. ఈ మూవీకి సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్పై నిర్మించారు. తమిళంలో తెరకెక్కించిన ఈ మూవీని తెలుగులోనూ థియేటర్లలో విడుదల చేయాలని భావించారు. కానీ అనివార్య కారణాలతో టాలీవుడ్లో విడుదల కాలేదు.తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 13 నుంచి తెలుగు ప్రేక్షకులకు డైరెక్ట్గా ఓటీటీలోనే రఘు తాత అందుబాటులోకి రానుంది. ఈ సినిమా హక్కులను జీ5 దక్కించుకోగా.. తెలుగు, తమిళం,మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని జీ5 ట్విటర్ వేదికగా పంచుకుంది.ఆగష్టు 15న తమిళంలో విడుదలైన ఈ చిత్రం కోలివుడ్ ప్రేక్షకులను మెప్పించింది. హిందీ భాషను నేర్చుకోవడం తప్పనిసరి అనే విధానాన్ని వ్యతిరేకించడంతోపాటు మహిళలపై జరుగుతున్న పలు సంఘటనలతో ఫ్యామిలీ ఎంటర్టైయినర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇందులో కీర్తి సురేశ్ హిందీకి వ్యతిరేకంగా పోరాడే మహిళ పాత్ర పోషించింది. మొదటి నుంచి హిందీ భాషను వ్యతిరేకిస్తూ వచ్చిన ఆమె ఫైనల్గా హిందీ ఎగ్జామ్ రాయాలని ఎందుకు నిర్ణయం తీసుకుందో ఈ మూవీ చూస్తేనే తెలుస్తుంది. Kayal is coming to your home for blasting entertainment!😂🔥 #RaghuThatha will be streaming from September 13th only on ZEE5 in Tamil, Telugu, and Kannada. @KeerthyOfficial @hombalefilms @vkiragandur @sumank @vjsub @yaminiyag @RSeanRoldan @rhea_kongara @editorsuresh pic.twitter.com/XY1fO7HT55— ZEE5 Telugu (@ZEE5Telugu) September 9, 2024 -
కాబోయే అక్కినేని కోడలు శోభిత స్టన్నింగ్ లుక్స్.. పెళ్లికూతురిలా ప్రేమలు హీరోయిన్!
కాబోయే అక్కినేని కోడలు శోభిత స్టన్నింగ్ లుక్స్ పెళ్లికూతురిలా ముస్తాబైన ప్రేమలు హీరోయిన్ బ్లూ శారీలో కీర్తి సురేశ్ హోయలు.. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Mamitha Baiju (@mamitha_baiju) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) -
హన్మకొండలో సందడి చేసిన సినీనటి కీర్తి సురేశ్ (ఫొటోలు)
-
ప్రభాస్ కల్కిలో ఆఫర్.. రిజెక్ట్ చేశా: కీర్తి సురేశ్
దసరా బ్యూటీ కీర్తి సురేశ్ ప్రస్తుతం రఘుతాత చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గతేడాది దసరా మూవీతో సూపర్ హిట్ కొట్టిన కోలీవుడ్ భామ డిఫరెంట్ స్టోరీతో రాబోతోంది. అయితే ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ నటిచిన కల్కి 2898 ఏడీ సినిమాలో బుజ్జికి వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసింగే. తాజా ఇంటర్వ్యూలో కల్కి సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇందులో నాగ్ అశ్విన్ తనకు ఓ రోల్ ఆఫర్ చేశారని తెలిపింది. కానీ దాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు వెల్లడించింది.కీర్తి సురేశ్ మాట్లాడుతూ..'కల్కి 2898 ఏడీ చిత్రంలో ఓ రోల్ కోసం డైరెక్టర్ నన్ను సంప్రదించారు. కానీ ఆ పాత్ర నేను చేయలేనని చెప్పా. ఈ ప్రాజెక్ట్లో భాగం కావాలనుందని మెసేజ్ చేశా. ఆ తర్వాత ఆయన కాల్ చేసి బుజ్జి రోల్కు వాయిస్ ఓవర్ ఇవ్వాలని అడిగారు. నాకు మొదట అర్థం కాలేదు. షూట్లో నేను కూడా భాగం కావాల్సిన అవసరం లేదా? అని అడిగా. లేదు కేవలం వాయిస్ ఓవర్ ఇస్తే చాలు అన్నారు. దీంతో నేను వెంటనే ఓకే చెప్పా. వాయిస్ ఓవర్ విషయంలో నాగ్ అశ్విన్ నాకెంతో సాయం చేశారు' అని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా కల్కి పార్ట్ -2 కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. అయితే తనకు కల్కిలో ఆఫర్ చేసిన పాత్ర ఏంటనేది మాత్రం వెల్లడించలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా.. కీర్తి ప్రధానపాత్రలో సుమన్కుమార్ తెరకెక్కించిన రఘు తాత ఆగస్టు 15న విడుదల కానుంది. I was offered some other role in #Kalki2898AD which I said no & opted for #Bujji voice. My best dubbing till date, lot of fun and waiting for #Kalki2898AD Part 2👌#Bujji voice is getting such fame that Bhardwaj wanted to end episode with that voice👌🤩.@keerthyofficial #Prabhas pic.twitter.com/iIOUhIu8zB— Pakistan Prabhas Fanclub (@Pak_PrabhasFC) August 11, 2024 -
'ఐ యామ్ నాట్ సింగిల్'.. దసరా భామ ఆసక్తికర కామెంట్స్!
దసరా హీరోయిన్ కీర్తి సురేశ్ ప్రస్తుతం రఘుతాత మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. సుమన్కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాణసంస్థ హోంబలే ఫిల్మ్స్ తొలిసారి కోలీవుడ్లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు ముద్దుగుమ్మ.ఇదిలా ఉండగా కీర్తి సురేశ్ తాజాగా ఓ పాడ్కాస్ట్లో ఆసక్తికర కామెంట్స్ చేశారు. మీరు సింగిల్గా ఉంటున్నారు కదా? అని ఆమెను ప్రశ్నించారు. దీంతో తన రిలేషన్షిప్ గురించి దసరా భామ నోరువిప్పారు. దీనికి బదులిస్తూ.. 'నేనేప్పుడు సింగిల్ అని చెప్పలేదుగా' అమటూ సమాధానమిచ్చింది.కాగా.. గతంలో ఆమె పెళ్లిపై చాలాసార్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తన చిన్ననాటి ఫ్రెండ్ను పెళ్లి చేసుకోబోతోందని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో కీర్తి సురేశ్ చేసిన కామెంట్స్ నెట్టంటి తెగ వైరలవుతున్నాయి. అయితే తాను సింగిల్ కాదని చెప్పడంపై.. ఇప్పటికే రిలేషన్లో ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అందుకే పరోక్షంగా హింట్ ఇచ్చిందని చెబుతున్నారు. మరోవైపు కీర్తి సురేశ్ బాలీవుడ్లోనూ ఎంట్రీ ఇవ్వనుంది. బేబీ జాన్ సినిమాతో వరుణ్ ధావన్ సరసన నటించనున్నారు. -
అజిత్తో కలిసి కచ్చితంగా నటిస్తా!
అవకాశాలు వచ్చినా, విజయాలు అంత సులభంగా రావు. అందుకు కృషి, శ్రమ అవసరం, అదృష్టం చాలా ముఖ్యం. అలా సినీ కుంటుంబం నుంచి వచ్చిన నటి కీర్తీసురేశ్. తల్లి నటి, తండ్రి నిర్మాత కావడంతో ఈమెకు అవకాశాలు సులభంగానే వచ్చి ఉండవచ్చు. అయితే స్టార్ నటిగా రాణించడానికి ఆమె ప్రతిభనే ముఖ్య కారణం. మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్న కీర్తీసురేశ్ తాజాగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. తొలి రోజుల్లో వచ్చిన అవకాశాలను సది్వనియోగం చేసుకున్నా, ఇప్పుడు కథలు నచ్చితేనే నటించడానికి సమ్మతిస్తున్నారు. తెలుగు చిత్రం మహానటిలో నటించి జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న ఈమెకు ఆ తరువాత పలు ఉమెన్స్ సెంట్రిక్ కథా పాత్రలు వెతుక్కుంటూ వస్తున్నాయి. అలా తాజాగా కీర్తీసురేశ్ నటించిన చిత్రం రఘుతాత. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్త హోంబలే నిర్మించిన ఈ చిత్రంపై ఇప్పటికే చాలా ఆసక్తి నెలకొంది. కారణం ఇదిబలవంతపు హిందీ భాషను వ్యతిరేకించే కథాంశంతో తెరకెక్కడమే. చిత్రం ఈ నెల 15న తెరపైకి రానుంది. ఈ చిత్ర ప్రమోషన్లో బిజీగా ఉన్న కీర్తీసురేశ్ ఒక భేటీలో నటుడు అజిత్తో కలిసి నటించాలనే ఆసక్తిని వ్యక్తం చేశారు. ఈమె తమిళంలో నటుడు విజయ్, విశాల్, ధనుష్ శివకార్తికేయన్, చివరికి రజనీకాంత్కు చెల్లెలిగా కూడా నటించారు. కానీ అజిత్తో కలిసి నటించలేదు. ఇదే విషయాన్ని ఆమె పేర్కొంటూ ఈ మధ్య హైదరాబాద్లో షూటింగ్లో పాల్గొన్నప్పుడు అజిత్ కూడా అక్కడ జరుగుతున్న చిత్ర షూటింగ్లో పాల్గొన్నారని, ఆ సమయంలో తాను ఆయన్ని కలిసి పరిచయం చేసుకున్నానని చెప్పారు. అప్పుడు తన తల్లి, శాలిని కలిసి చాలా చిత్రాల్లో నటించారని ఆయనతో చెప్పానన్నారు. తాను కూడా కచ్చితంగా అజిత్తో కలిసి నటిస్తాననే నమ్మకాన్ని నటి కీర్తీసురేశ్ వ్యక్తం చేశారు. -
కోమాలోకి వెళ్లినప్పుడు చివరిసారి చూశా.. చిన్న వయసులో..
హీరోయిన్ కీర్తి సురేశ్ స్నేహితురాలిని కోల్పోయిన దుఃఖంలో ఉంది. తన చిన్ననాటి స్నేహితురాలు మనీష మరణించి వారాలు గడుస్తున్నా ఆ విషాదం నుంచి బయటపడలేకపోతోంది. తాజాగా ఆమెను గుర్తు చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్లో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. 'గడిచిన రోజులు ఎంతో కష్టతరమైనవి. నా చిన్ననాటి ఫ్రెండ్ మమ్మల్ని ఇంత త్వరగా వదిలేసి వెళ్లిపోయిందంటే నమ్మలేకపోతున్నాను. 21 ఏళ్ల వయసులోనే తనకు బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి సోకింది. మూడో సర్జరీ..దాదాపు ఎనిమిదేళ్లపాటు పోరాడింది. తనలా ధైర్యంగా పోరాడేవారిని నేను చూడనేలేదు. గతేడాది నవంబర్లో మూడోసారి సర్జరీ చేయించుకుంది. ఆ తర్వాత ఈ నొప్పి భరించలేకపోతున్నానంటూ నా ముందు ఏడ్చేసింది. అదే తనతో నాకున్న చివరి జ్ఞాపకం. తనముందు నా ఎమోషన్స్ను ఆపుకునే ప్రయత్నం చేశాను. కానీ నా వల్ల కాలేదు. బయటకు వచ్చి ఏడ్చేశాను. కోమాలోకి వెళ్లినప్పుడు చివరిసారిహాస్పిటల్ కారిడార్లో కళ్లజోడు, మాస్క్ల వెనక ఉన్న కన్నీళ్లను ఎవరికీ కనిపించకుండా తుడిచేసుకున్నాను. తను కోమాలోకి వెళ్లినప్పుడు చివరిసారి చూశాను. ఆమె ఇంకా సొంతంగా జీవితాన్ని ప్రారంభించలేదు, ప్రపంచాన్ని చూడనేలేదు, నెరవేర్చుకునే కలలు ఎన్నో ఇంకా అలాగే మిగిలున్నాయి.. ఇంత చిన్న వయసులోనే తనకు ఎందుకిలా జరిగింది? దీనికి నా దగ్గర సమాధానమే లేదు. వ్యాది తీవ్రం కావడంతో ఆమె చనిపోయింది. కానీ చివరి శ్వాస వరకు పోరాడింది.వదిలి వెళ్లిపోయావ్..సరిగ్గా నెల రోజుల క్రితం నువ్వు మమ్మల్ని వదిలి వెళ్లిపోయావు. అప్పటినుంచి నీ గురించి ఆలోచించని రోజంటూ లేదు. ఈ రోజు నీ పుట్టినరోజు.. నిన్నెప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను మచ్చుత' అని రాసుకొచ్చింది. తన స్నేహితురాలితో దిగిన ఫోటోలను ఈ పోస్టుకు జత చేసింది. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) చదవండి: ఆ సినిమాలు డేంజర్, అలాంటివాటి జోలికి వెళ్లడం అవసరమా?: ఆర్జీవీ -
ఆ హీరో అంటే చాలా ఇష్టం, తనతో నటించాలనుంది: కీర్తి సురేశ్ (ఫొటోలు)
-
చిరంజీవి కంటే తమిళ హీరో విజయ్నే బెస్ట్: కీర్తి సురేశ్
హీరోయిన్ కీర్తి సురేశ్ ఊహించని ట్రోలింగ్ని ఎదుర్కొంటోంది. మెగాస్టార్ చిరంజీవిపై చేసిన కామెంట్స్ దీనికి కారణం. గత కొన్నేళ్లుగా సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి.. 'రఘుతాత' అనే చిత్రాన్ని రిలీజ్కి రెడీ చేసింది. ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేశ్.. చిరంజీవి కంటే తమిళ హీరో విజయ్ బెస్ట్ డ్యాన్సర్ అని చెప్పుకొచ్చింది. దీంతో రచ్చ షురూ అయింది.(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు రిలీజ్)కీర్తి సురేశ్ విజయ్పై తనకున్న అభిమానం కొద్దీ విజయ్ పేరు చెప్పుండొచ్చు. కానీ మెగా అభిమానులు మాత్రం ఈమె కామెంట్స్ని తేలిగ్గా తీసుకోవట్లేదు. ఏ కోణంలో విజయ్ మంచి డ్యాన్సరో చెప్పాలని ట్రోల్స్, మీమ్స్ వేస్తున్నారు. విచిత్రం ఏంటంటే విజయ్తో 'భైరవ', 'సర్కార్' అనే సినిమాల్లో కలిసి నటించింది. చిరంజీవితోనూ 'భోళాశంకర్' కోసం కీర్తి సురేశ్ కలిసి పనిచేసింది. (ఇదీ చదవండి: సినిమా కోసం నిర్మాతలతో గొడవ పెట్టుకున్న మృణాల్!) -
వినోదం... పోరాటం
కీర్తీ సురేష్ లీడ్ రోల్లో నటించిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘రఘుతాత’. సుమన్కుమార్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. హోంబలే ఫిలింస్ తమ బేనర్పై నిర్మించిన ఈ తొలి తమిళ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. తెలుగులోనూ ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సినిమా తమిళ ట్రైలర్ను రిలీజ్ చేశారు.‘ఒక అమ్మాయిలా నువ్వు ఎందుకు డ్రెస్సింగ్ చేసుకోవు?’, ‘ఒక అచ్చమైన అమ్మాయిలా ఉండేందుకు నాకు ఆసక్తి లేదు’ అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ఓ భాష నేర్చుకోవడానికి ఓ యువతి పడే ఇబ్బందులు, ఆమె ముందు ఉన్న సవాళ్లు, ఆమె పోరాటం నేపథ్యంలో ఈ సినిమా కథనం వినోదాత్మకంగా ఉంటుందని సమాచారం. -
విల్లులా ఒళ్లు వంచేసిన షాలినీ.. బిగ్బాస్ స్రవంతి గ్లామర్ ట్రీట్!
గులాబీ పెట్టుకున్న గులాబీలో కీర్తి సురేశ్గోల్డ్ కంటే బ్రైట్గా మెరిసిపోతున్న శ్రీలీలఒళ్లుని విల్లులా వంచేసి హోయలు పోతున్న షాలీనీ పాండేఅద్దాల డ్రస్సులో జిగేలుమనేలా హెబ్బా పటేల్అందాల కుందనపు బొమ్మలా యాంకర్ విష్ణుప్రియజడతో పరాచకాలు ఆడేస్తున్న శ్రుతిహాసన్చీరలో అందాలన్నీ చూపించేస్తున్న బిగ్బాస్ స్రవంతిAngel in Gold 💫 Our @sreeleela14 as showstopper, show openerThrowback to @TimesFashionWk @BangaloreTimes1 By @studiobhargavi #Sreeleela pic.twitter.com/9a6qaKvunH— Team Sreeleela (@Teamsreeleela) July 30, 2024 View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by sravanthi_chokarapu (@sravanthi_chokarapu) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaj) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by mon (@imouniroy) -
మూవీ ప్రమోషన్లతో బిజీగా దసరా బ్యూటీ (ఫొటోలు)
-
నటుడు విజయ్ చెప్పినట్లు..!
ప్రస్తుతం పాన్ ఇండియా కథానాయకిగా మారిన నటి కీర్తీసురేశ్. ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా నటించి మెప్పింగల నటి ఈ బ్యూటీ. అపజయాలు విజయాలకు సోపానం అంటారు. అది కీర్తీసురేశ్కు చాలా బాగా వర్తిస్తుంది. ఈమె తల్లి మేనక అప్పట్లో కథానాయకిగా మంచి పేరు తెచ్చుకున్నారు. తమిళియన్ అయిన ఈమె మలయాళ సినీ నిర్మాత సురేశ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలా సినీ కుటుంబం నుంచి వచ్చిన కీర్తీసురేశ్ బాల నటిగానే చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఈమె కథానాయకిగా నటించిన తొలి తమిళ చిత్రం ఇదు ఎన్న మాయం. ఈ చిత్రం నిరాశ పరిచింది. ఆ తరువాత నటించిన రజనీ మురుగన్, రెమో వంటి చిత్రాలు హిట్ కావడంతో కీర్తీసురేశ్కు తెలుగులోనూ అవకాశాలు రావడం మొదలెట్టాయి. అలా అక్కడ నటించిన మహానటి చిత్రం ఆమెను జాతీయ ఉత్తమ నటి అవార్డును అందించింది. ఇక ఇప్పుడు బాలీవుడ్లోనూ రంగప్రవేశం చేశారు. దీంతో కీర్తీసురేశ్ స్థాయి పెరగడంతో పాటు, వదంతులు అధికం అవుతున్నాయి. ఈ బ్యూటీ 20 ఏళ్ల వయసున్న ఓ నటుడి ప్రేమలో మునిగి తేలుతున్నట్లు తాజాగా వైరల్ అవుతున్న ప్రచారం. దీనిపై స్పందించిన కీర్తీసురేశ్ నటుడు విజయ్ చెప్పినట్లు వదంతులకు వివరణ ఇస్తే అది నిజం అవుతుందన్నారు. కాబట్టి దాన్ని పక్కన పెట్టేద్దాం అన్నారు. ఇకపోతే నటన గురించి విమర్శలను తాను స్వాగతిస్తానని, ఒక నటిగా అవి తనను మెరుగుపరుస్తానికి ఉపయోగపడతాయని కీర్తీసురేశ్ సమాధానం ఇచ్చారు. ఇకపోతే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ భామ నటించిన ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రం రఘుతాత ఆగస్ట్ 15వ తేదీన తెరపైకి రానుంది. -
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. నటి ఏమన్నారంటే?
కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం రఘు తాత. ఈ చిత్రానికి సుమన్కుమార్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ పతాకంపై నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావడంతో ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో చిత్రయూనిట్ బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా వరుసగా ఈవెంట్లకు హాజరవుతున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న కీర్తి సురేశ్ అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. తన పెళ్లిపై వస్తున్న వార్తలపై మరోసారి క్లారిటీ ఇచ్చారు.కీర్తి సురేశ్ మాట్లాడుతూ..'నాపై వచ్చే రూమర్స్పై క్లారిటీ ఇస్తే అదే నిజమనుకుంటారు. అందుకే వాటిపై నేను రియాక్ట్ అవ్వను. కేవలం నా సినిమాల ఎంపిక, నటనపై విమర్శలు చేస్తే తప్పకుండా స్వీకరిస్తా. వాటితో కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతా. నా పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ గురించి ఎవరైనా కామెంట్స్ చేసినా పట్టించుకోను. వాళ్ల వ్యక్తిగత కారణాలతో చేసే కామెంట్స్ను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు' అని తెలిపింది.కాగా.. గతంలోనూ కీర్తి సురేశ్ పెళ్లిపై చాలాసార్లు రూమర్స్ వచ్చాయి. వాటిన్నింటినీ ఆమె తల్లిదండ్రులు సైతం కొట్టిపారేశారు. కాగా.. రఘుతాత చిత్రంలో పోరాటం చేసే మహిళ పాత్ర పోషిస్తున్నారు. ఆగస్టు 15న ఇది ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవలే టీజర్ను విడుదల చేయగా.. విద్యాభ్యాసం, ఉద్యోగంలో ఓ అమ్మాయి ఎలాంటి ఇబ్బందులు పడిందనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. -
ఆగస్టు 15న తెరపైకి కీర్తి సురేష్ రఘుతాత
మాలీవుడ్ నుంచి కోలీవుడ్కి ఆ తర్వాత టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి కథానాయకిగా దుమ్ము రేపుతున్న నటి కీర్తి సురేష్ కథానాయకిగా పరిచయమైన కొద్ది కాలంలోనే మహానటి చిత్రంలో దివంగత నటి సావిత్రి పాత్రకు ప్రాణం పోసి జాతీయ అవార్డును గెలుచుకున్న నటి ఈమె. తెలుగు తమిళం భాషల్లో ప్రముఖ హీరోల సరసన నటిస్తున్న కీర్తి సురేష్ మరోపక్క ఉమెన్ సెంట్రిక్ కథా పాత్రల్లోను నటిస్తూ రాణిస్తుండటం విశేషం. అలా తాజాగా ఈమె నటించిన హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రం రఘుతాత. రవీంద్ర విజయ్, ఎమ్మెస్ భాస్కర్ ఆనంద్ సామి, దేవదర్శిని తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని హోం భలే ఫిలిమ్స్ పతాకంపై సుమన్ కుమార్ దర్శకత్వంలో విజయ్ కిరకిందర్ నిర్మిస్తున్నారు. శ్యాన్ రోల్డన్ సంగీతం, యామిని జ్ఞానమూర్తి చాయగ్రహణం అందించారు. నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 15న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం చెన్నైలోని ఓ స్టార్ హోటల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు సుమన్ కుమార్ మాట్లాడుతూ ఇది హిందీ భాషకు వ్యతిరేకంగా తెరకెత్తిస్తున్న కథాచిత్రం అనే ప్రచారం జరుగుతోందని అది వాస్తవం కాదని హిందీ భాషపై ఒత్తిడిని వ్యతిరేకిస్తూ రూపొందించిన వినోదంతో కూడిన కుటుంబ కాథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. అనంతరం నటి కీర్తి సురేష్ మీడియాతో ముచ్చటిస్తూ దర్శకుడు చెప్పిన కథ విన్న తర్వాత ఈ చిత్రానికి తాను న్యాయం చేయగలనా? అనే సందేహం కలిగిందన్నారు. అయితే దర్శకుడు ఇచ్చిన ధైర్యంతో ఇందులో నటించడానికి అంగీకరించినట్లు చెప్పారు. దర్శకుడు చెప్పినట్లు ఇది హిందీ భాషను నేర్చుకోవడం తప్పనిసరి అనే విధానాన్ని వ్యతిరేకించడంతోపాటు మహిళలపై జరుగుతున్న పలు సంఘటనలను ఖండిస్తూ సాగే ఫ్యామిలీ ఎంటర్టైయినర్గా రఘుతాత ఉంటుందన్నారు. తాను చదివింది కేంద్ర విద్యాలయం పాఠశాలలో అని, అక్కడ కూడా ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం భాషల్లో మాత్రమే బోధనలు ఉండేవని చెప్పారు. కాగా తాను మహానటి చిత్రం తర్వాత ఫిట్నెస్పై దృష్టి సారించినట్లు చెప్పారు. ఆ తర్వాత యోగ వంటివి చేయడంతో ప్రస్తుతం చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు పేర్కొన్నారు. రాజకీయ రంగ ప్రవేశం చేసే ఆలోచన ఉందా? అన్న ప్రశ్నకు రాజకీయాల్లోకి రావచ్చు, రాకపోవచ్చు అంటూ తెలివిగా బదులిచ్చారు. అలాగే ప్రేమ పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారం గురించి స్పందిస్తూ పెళ్లి కాదు కానీ ఒక విషయం మాత్రం జరుగుతోందని, దాని గురించి త్వరలోనే వెల్లడిస్తానని నటి కీర్తి సురేష్ పేర్కొన్నారు. -
టార్గెట్ పంద్రాగస్ట్.. గెలుపు జెండా ఎగరేసేది ఎవరు?
వరుసగా సెలవులు వస్తే సినిమాలకు పండగే పండగ. ఆగస్ట్ రెండో వారం అలాంటి పండగే కానుంది. ఆగస్ట్ 15 గురువారం... స్వాతంత్య్ర దినోత్సవం కాబట్టి గవర్నమెంట్ హాలిడే. ఆ రోజుతో పాటు శుక్ర, శని, ఆదివారాల వసూళ్లు రాబట్టుకోవచ్చు. సోమవారం రక్షా బంధన్... అది కూడా కలిసొస్తుంది. అందుకే పంద్రాగస్ట్ టార్గెట్గా థియేటర్స్లో గెలుపు జెండా ఎగురవేయడానికి కొందరు నిర్మాతలు తమ చిత్రాలను ఆ తేదీన విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం.మిస్టర్ బచ్చన్ రెడీరవితేజ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్గా కనిపిస్తారని తెలుస్తోంది. పనోరమా స్టూడియోస్, టీ సిరీస్ల సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14 లేదా 15న థియేటర్స్లోకి రానుందని సమాచారం.కేజీఎఫ్ కథకేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్)లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘తంగలాన్’. 18వ శతాబ్దం నేపథ్యంలో పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్రమ్ హీరోగా నటించారు. పార్వతీ తిరువోతు, పశుపతి, హరికృష్ణన్, అన్బుదురై ఇతర లీడ్ రోల్స్లో నటించారు. ఈ సినిమాను జనవరి 26న విడుదల చేయాలనుకున్నారు. పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ పూర్తి కాకపోవడంతో విడుదల కాలేదు. అలా వాయిదా పడి ఫైనల్గా ఆగస్టు 15న రిలీజ్ కానుంది. కేజీఎఫ్లోని బంగారం కోసం జరిగే అక్రమ తవ్వకాలకు, అక్కడి ఓ గిరిజన తెగకు ఉన్న సంబంధం ఏంటి? అనేది ఈ చిత్రం ప్రధానాంశం. ఇందులో ఆ తెగ నాయకుడిగా విక్రమ్ కనిపిస్తారు. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రం తెలుగులోనూ ఆగస్ట్ 15నే రిలీజ్ కానుంది. డబుల్ ఎనర్జీపంద్రాగస్ట్కు థియేటర్స్లోకి వచ్చేందుకు డబుల్ ఎనర్జీతో రెడీ అయ్యాడు ‘డబుల్ ఇస్మార్ట్’. హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకి సీక్వెల్గా ‘డబుల్ ఇస్మార్ట్’ తెరకెక్కింది. సీక్వెల్లో కావ్యా థాపర్ హీరోయిన్గా నటించగా, సంజయ్ దత్, అలీ కీలక పాత్రధారులు. పూరి జగన్నాథ్, ఛార్మీ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ కానుంది. ఓ సీబీఐ ఆఫీసర్ మెమొరీని ఓ సైన్స్ చిప్ సాయంతో కిరాయి హంతకుడు శంకర్ (రామ్) మొదడులోకి ట్రాన్స్ఫార్మ్ చేస్తారు. ఆ తర్వాత శంకర్ జీవితం ఏ విధంగా ప్రభావితమైంది? అనే కోణంలో ‘ఇస్మార్ట్ శంకర్’ కథ సాగిన విషయం తెలిసిందే. ఈ కథకు కొనసాగింపుగా ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం ఉంటుందని తెలుస్తోంది.చిన్న కథ కాదు‘అమ్మ టెన్త్ ఫెయిల్... కొడుకు ఫిఫ్త్ ఫెయిల్... చిన్న కథ కాదు..’ అనే డైలాగ్ ‘35: చిన్న కథ కాదు’ సినిమాలోనిది. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్లో నటించిన చిత్రం ఇది. నంద కిశోర్ ఈమాని ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రసాద్ (విశ్వతేజ్), సరస్వతి (నివేదా థామస్) భార్యాభర్తలు. వీరి కొడుక్కి 35 పాస్ మార్కులు కూడా రావు. దీంతో వాళ్ల కుటుంబం కాస్త నిరాశకు లోనవుతుంది. నిజంగా... 35 పాస్ మార్కులు ముఖ్యమా? ఆ ఊర్లోని మాస్టర్ (ప్రియదర్శి) వల్ల సరస్వతి కొడుకు పడిన ఇబ్బందులు ఏంటి? అనే అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. రానా దగ్గుబాటి సమర్పణలో సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.స్ఫూర్తిదాయక పోరాటం కీర్తీ సురేష్ నటించిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘రఘుతాత’. తన గ్రామం కోసం కయల్విళి అనే ఓ యువతి చేసే స్ఫూర్తిదాయక పోరాటం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. సుమన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ బేనర్ నిర్మించింది. ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లుగా గతంలో మేకర్స్ ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఈ సినిమా రిలీజ్పై మరో అప్డేట్ రాలేదు. మరి.. ఆగస్టు 15 బరిలో కీర్తీ సురేష్ ‘రఘుతాత’ సినిమా ఉంటుందా? లేదా అనేది చూడాలి. ఈ తమిళ చిత్రం తెలుగు, మలయాళ భాషల్లోనూ విడుదల కానుంది. మేం ఫ్రెండ్సండి....మేం ఫ్రెండ్సండి అంటూ థియేటర్స్లోకి వస్తున్నారు కార్తీక్, సబ్బు, హరి. మరి... వీళ్ల కథ ఏంటి? అనేది ఆగస్టు 15న థియేటర్స్లో తెలియనుంది. ఈ చిత్రంలో కార్తీక్గా నార్నే నితిన్, అతని ప్రేయసి పల్లవి పాత్రలో నయన్ సారిక, సుబ్బుగా రాజ్కుమార్ కసిరెడ్డి, హరిగా అంకిత్ నటించారు. ప్రేమ, స్నేహం అంశాల మేళవింపుతో అంజి కె. మణిపుత్ర దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మించారు. పుష్ప వాయిదా పడటంవల్లేనా?‘పుష్ప’ ఫ్రాంచైజీలో హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో ‘పుష్ప: ది రూల్’ సినిమా రానుంది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కావాల్సింది. అయితే క్వాలిటీ విషయంలో రాజీ పడాలనుకోవడం లేదని, అందుకే విడుదలను వాయిదా వేశామని యూనిట్ పేర్కొంది. ఆ తర్వాత ‘పుష్ప: ది రూల్’ను డిసెంబరు 6న విడుదల చేస్తామని ప్రకటించింది. ఆగస్టు 15కి ‘పుష్ప’ రాకపోవడంవల్ల, లాంగ్ వీకెండ్, రక్షాబంధన్ ఫెస్టివల్ కూడా కలిసొచ్చి తమ సినిమాలకు లాభాలు వస్తాయని ఆయా చిత్రయూనిట్లు ఆలోచన చేసి ఆగస్టు 15ను టార్గెట్గా చేసుకుని ఈ సినిమాలను రిలీజ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆగస్టు 15కి ఇంకా సమయం ఉంది. సో... ఈ విడుదల జాబితా ఇంకా పెరిగే చాన్స్ ఉంది. -
అల్ట్రా స్టైలిష్ లుక్స్లో దసరా బ్యూటీ (ఫొటోలు)
-
బాలీవుడ్ కాలింగ్
ప్రతి ఏడాది బాలీవుడ్ తారలు కొంతమంది టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంటారు. అలాగే దక్షిణాది హీరోయిన్లు కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంటారు. ఈ ఏడాది కొందరు సౌత్ హీరోయిన్లను బాలీవుడ్ పిలిచింది. బాలీవుడ్ నుంచి కాల్ అందుకుని, ప్రస్తుతం అక్కడ సినిమాలు చేస్తున్న దక్షిణాది కథానాయికల గురించి తెలుసుకుందాం. కెరీర్లో యాభైకి పైగా సినిమాల్లో నటించి, దక్షిణాదిన స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపోయారు సమంత. హిందీలో ‘ఫ్యామిలీ మేన్’ సీజన్ 2 వెబ్ సిరీస్లో చేసిన రాజ్యలక్ష్మి పాత్రతో ఉత్తరాదిన కూడా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇదే జోష్లో ఇండియన్ వెర్షన్ ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ను కూడా పూర్తి చేశారామె. వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ హిందీ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్కు రెడీ అవుతోంది.ఇలా హిందీలో రెండు వెబ్ సిరీస్లు చేసిన సమంత ఇంకా అక్కడ ఒక్క సినిమా కూడా చేయలేదు. గతంలో రణ్వీర్ సింగ్, విక్కీ కౌశల్, రాజ్కుమార్ రావుల సినిమాల్లో సమంత హీరోయిన్గా నటిస్తారనే ప్రచారం సాగింది. కానీ అప్పట్లో ఆమె అనారోగ్య పరిస్థితుల కారణంగా కుదర్లేదట. ఇప్పుడు ఆ సమయం వచ్చిందట. ఓ హిందీ చిత్రం కోసం సమంత ఇటీవల కథ విన్నారని బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. సో... హిందీలో సమంత నటించే తొలి చిత్రంపై స్పష్టత రావడానికి కొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు.కాస్త ఆలస్యంగా... దక్షిణాదిలో అగ్ర కథానాయికల్లో కీర్తీ సురేష్ ఒకరు. నటిగా సౌత్లో తన సత్తా ఏంటో సిల్వర్ స్క్రీన్పై చూపించిన కీర్తీ సురేష్ బాలీవుడ్లోనూ టాప్ హీరోయిన్ల జాబితాలో చోటు సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నట్లున్నారు. ఈ క్రమంలోనే హిందీ చిత్రం ‘బేబీ జాన్’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ సినిమాలో కీర్తీ సురేష్ హీరోయిన్గా నటించారు. హిందీలో కీర్తీకి ఇది తొలి చిత్రం కాగా ఈ చిత్రదర్శకుడు కాలీస్ (తమిళ డైరెక్టర్)కు కూడా హిందీలో ఇదే తొలి చిత్రం. తమిళంలో అట్లీ దర్శకత్వం వహించిన ‘తేరీ’ సినిమాకు హిందీ రీమేక్గా ‘బేబీ జాన్’ తెరకెక్కింది.జ్యోతిదేశ్ పాండే, మురాద్ ఖేతనీ, అట్లీ, ప్రియా అట్లీ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను మే 31న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ వాయిదా పడింది. కొత్త తేదీ పై స్పష్టత రావాల్సి ఉంది. అలాగే కీర్తీ సురేష్, రాధికా ఆప్టే లీడ్ రోల్స్లో హిందీలో ఓ యాక్షన్ వెబ్ సిరీస్ కూడా రూపొందుతోంది. ఇదిలా ఉంటే... ‘బేబీ జాన్’ చిత్రానికన్నా ముందే కీర్తీకి బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. అజయ్ దేవగన్ హీరోగా నటించిన హిందీ చిత్రం ‘మైదాన్’లో ముందు హీరో యిన్గా కీర్తీ సురేష్ను తీసుకున్నారు ఈ చిత్రదర్శకుడు అమిత్ శర్మ. కానీ ఆ తర్వాత కీర్తీ సురేష్ ఈ ్రపాజెక్ట్ నుంచి తప్పుకోగా, ప్రియమణి నటించారు. ‘మైదాన్’ ఈ ఏడాది ఏప్రిల్ 10న రిలీజైంది. ఇలా కీర్తీ సురేష్ బాలీవుడ్ ఎంట్రీ కాస్త ఆలస్యమైంది. ఏక్ దిన్ హీరోయిన్ సాయి పల్లవికి సౌత్లో మంచి క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ను బాలీవుడ్లోనూ రిపీట్ చేయాలనుకుంటున్నారీ బ్యూటీ. బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ నటించిన చిత్రం ‘ఏక్ దిన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్)లో నటించారు సాయి పల్లవి. హిందీలో సాయి పల్లవి నటించిన తొలి చిత్రం ఇదే. ఈ సినిమా మేజర్ షూటింగ్ జపాన్లో జరిగింది. ఆమిర్ ఖాన్ ఓ నిర్మాతగా ఉన్న ఈ ‘ఏక్ దిన్’ సినిమా చిత్రీకరణ పూర్తయింది.ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. దక్షిణాది భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట ఆమిర్ ఖాన్. మరోవైపు మరో హిందీ చిత్రం ‘రామాయణ్’లో సాయి పల్లవి నటిస్తున్నారు. రణ్బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. సీతారాములుగా సాయి పల్లవి, రణ్బీర్ నటిస్తున్న ఈ భారీ చిత్రానికి నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. యశ్, నమిత్ మల్హోత్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2025 చివర్లో ఈ సినిమా తొలి భాగాన్ని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారని బాలీవుడ్ టాక్. కబురొచ్చింది ప్రస్తుతం తెలుగులో ట్రెండింగ్ హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. నటన పరంగా ఈ బ్యూటీకి ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. అందువల్లే రవితేజ ‘ధమాకా’, మహేశ్బాబు ‘గుంటూరు కారం’ వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించగలిగారు. తాజాగా శ్రీలీలకు బాలీవుడ్ నుంచి కబురొచ్చిందని టాక్. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం ఆలీఖాన్ హీరోగా ‘దిలేర్’ అనే సినిమా రూపొందుతోంది. కృణాల్ దేశ్ముఖ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ ఫిల్మ్లో ఇద్దరు హీరోయిన్లకు చోటు ఉందట. ఓ హీరోయిన్ పాత్ర కోసం మేకర్స్ శ్రీలీలను సంప్రదించారని సమాచారం. కథ నచ్చడంతో శ్రీలీల కూడా ఓకే చెప్పారని వినికిడి. అదే నిజమైతే శ్రీలీలకు ఇదే తొలి హిందీ చిత్రం అవుతుంది. కేరాఫ్ మహారాజ్ఞి ‘బింబిసార, సార్, విరూపాక్ష, డెవిల్’ వంటి తెలుగు సినిమాల్లో హీరోయిన్గా నటించారు సంయుక్తా మీనన్. అలాగే మలయాళ, తమిళ, కన్నడ చిత్రాల్లోనూ హీరోయిన్గా నటించి పాపులర్ అయ్యారామె. ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకీ రెడీ అయ్యారు. కానీ హీరోయిన్గా కాదు... ఓ లీడ్ రోల్లో... కాజోల్, ప్రభుదేవా లీడ్ రోల్స్లో ‘మహారాజ్ఞి: క్వీన్ ఆఫ్ క్వీన్స్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చరణ్తేజ్ ఉప్పలపాటి ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి దర్శకుడు.ఈ సినిమాలో సంయుక్తా మీనన్ ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో కాజోల్కు చెల్లి పాత్రలో కనిపిస్తారట సంయుక్త. నసీరుద్దీన్ షా, ఆదిత్య సీల్, చాయా కదమ్ వంటివారు ఈ సినిమాలోని ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. వెంకట అనీష్, హర్మాన్ బవేజా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇలా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దక్షిణాది కథానాయికల జాబితాలో మరికొంతమంది ఉన్నారు. -
ప్రముఖ బ్రాండ్కు ప్రచార కర్తగా కీర్తి సురేష్
పాండ్స్ స్కిన్ ఇన్స్టిట్యూట్ తన బ్రాండ్ అంబాసిడర్గా ప్రముఖ నటి, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ను నియమించుకుంది. దక్షిణాది సినిమా రంగంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన కీర్తి... సంస్థ ప్రకటనల్లో నటించి తమ ఉత్పత్తులను దక్షిణ భారతదేశంలోని కొత్త కస్టమర్లకు మరింత చేరువ చేస్తుందని కంపెనీ ఆశిస్తోంది. పాండ్స్ స్కిన్ ఇన్స్టిట్యూట్ నుంచి చాలా ఉత్పత్తులు ఉన్నాయి. స్కిన్ కేర్ విషయంలో శ్రేష్ఠతకు స్థిరంగా బెంచ్మార్క్ను పాండ్స్ సెట్ చేసింది.పాండ్స్ స్కిన్ ఇన్స్టిట్యూట్ అంబాసిడర్గా తన కొత్త పాత్రపై కీర్తి సురేష్ మాట్లాడుతూ, “నేను చాలా కాలంగా మెచ్చుకుంటున్న పాండ్స్ స్కిన్ ఇన్స్టిట్యూట్తో చేతులు కలపడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాతో సహా దేశవ్యాప్తంగా అనేకమంది హృదయాల్లో ఈ బ్రాండ్కు ప్రత్యేక స్థానం ఉంది.' అని ఆమె తెలిపింది.హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, స్కిన్కేర్ హెడ్ ప్రతీక్ వేద్ తమ భాగస్వామ్యం గురించి ఇలా వ్యాఖ్యానించారు. 'పాండ్స్ స్కిన్ ఇన్స్టిట్యూట్లో, టైమ్లెస్ బ్యూటీ సొల్యూషన్లను రూపొందించే ఆవిష్కరణ శక్తిని మేము విశ్వసిస్తున్నాము. కీర్తిని మా కొత్త బ్రాండ్ అంబాసిడర్గా స్వాగతించడం మా వినియోగదారులతో బలమైన సంబంధాన్ని ఏర్పరిచే మా ప్రయాణంలో ఒక ముఖ్యమైన దశ. ఆమె చక్కదనానికి ప్రతిభ, అందం మా బ్రాండ్కు కూడా కలిసొస్తుంది.' అని ఆయన తెలిపారు. -
పుష్ప రాజ్ కు పోటీగా కీర్తి సురేష్
-
శ్రీలీల కాదు ఆ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేశ్?
తమిళ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. 'విడాముయర్చి' షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలో రిలీజ్ తేదీపై ప్రకటన ఇవ్వనున్నారు. మరోవైపు తెలుగు బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తీస్తున్న 'గుడ్ బ్యాడ్ అగ్లీ' కూడా చేస్తున్నారు. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ మూవీపై అంచనాలు పెంచేసిందని చెప్పొచ్చు. అయితే హీరోయిన్ విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.(ఇదీ చదవండి: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రివ్యూ)షూటింగ్ ఇటీవలే హైదరాబాద్లో ప్రారంభమై, తొలి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. ఇందులో హీరోయిన్గా తొలుత శ్రీలీల పేరు వినిపించింది. కానీ ఇప్పుడు ఆ ప్లేసులో కీర్తి సురేశ్ నటించబోతుందని అంటున్నారు. మరి ఇద్దరు హీరోయిన్లకు చోటుందా? లేదా కీర్తి సురేశ్నే తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే కీర్తీసురేశ్ ఖాతాలో మరో భారీ చిత్రం పడినట్లే.(ఇదీ చదవండి: 'భజే వాయువేగం' సినిమా రివ్యూ) -
స్ఫూర్తిదాయక పోరాటం
రెగ్యులర్ కమర్షియల్ క్యారెక్టర్స్ మాత్రమే కాకుండా... వీలైనప్పుడల్లా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్లో పవర్ఫుల్ క్యారెక్టర్స్ కూడా చేస్తుంటారు హీరోయిన్ కీర్తీ సురేష్. ‘మహానటి’, ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’ వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్లో నటించి, ప్రేక్షకులను మెప్పించారు కీర్తి. తాజాగా ఆమె నటించిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘రఘు తాత’. కీర్తీ సురేష్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాకు సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు.‘సలార్, కేజీఎఫ్’ వంటి సినిమాలను నిర్మించిన హోంబలే ఫిలింస్ నిర్మించిన తొలి తమిళ సినిమా ఇది. ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ శుక్రవారం ప్రకటించారు. ‘‘ఈ సినిమా కథ ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేస్తుంది... నవ్విస్తుంది... స్ఫూర్తి కలిగిస్తుంది’’ అని పేర్కొన్నారు కీర్తీ సురేష్. ఒక సామాజిక అంశంతో ఓ మహిళ చేసే స్ఫూర్తిదాయక పోరాటం నేపథ్యంలో ‘రఘు తాత’ ఉంటుందని టాక్. తెలుగు, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం రిలీజ్ కానుందట. -
లెజెండరీ సింగర్ ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్లో కీర్తి సురేష్
-
ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్లో..?
ప్రముఖ గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్లో హీరోయిన్ కీర్తీ సురేష్ నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి తమిళ చిత్ర పరిశ్రమ వర్గాలు. మహానటి సావిత్రి బయోపిక్గా రూ΄÷ందిన ‘మహానటి’ (2018)లో తన అద్భుత నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు కీర్తీ సురేష్. ఈ చిత్రానికిగాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డును కూడా అందుకున్నారామె. ఆ తర్వాత రెగ్యులర్ కమర్షియల్ సినిమా లతో పాటు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తున్న కీర్తి తాజాగా ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్లో నటించనున్నారని భోగట్టా. ఈ సినిమా దర్శకుడు, నిర్మాణ సంస్థ వంటి వివరాలు అధికారికంగా ప్రకటించనప్పటికీ ఎంఎస్ సుబ్బలక్ష్మి పాత్రని కీర్తీ సురేష్ ΄ోషించే అవకాశాలు ఉన్నట్లు కోలీవుడ్ టాక్. తమిళనాడులోని మధురైలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సుబ్బలక్ష్మి ప్రపంచమంతా కీర్తించే గాయనిగా ఎలా ఎదిగారు? ఆమె ఎదుర్కొన్న ఒడిదొడుకులు, ఆనందం, విషాద ఘటనల నేపథ్యంలో ఈ బయోపిక్ తెరకెక్కనుందట. ఈ పాత్రకి కీర్తీ సురేష్ సరైన ఎంపిక అని చిత్ర యూనిట్ ఆమెను సంప్రదించగా, ఆమె పచ్చజెండా ఊపారని టాక్. కాగా ఎంఎస్ సుబ్బలక్ష్మి 2004 డిసెంబరు 11న తుది శ్వాస విడిచారు. -
బ్రెయిన్ ఉంటే సరిపోతుందా...
భైరవ బెస్ట్ ఫ్రెండ్ బుజ్జి... కానీ బుజ్జి అంటే మనిషి కాదు. మరి.. బుజ్జి అనేది వాహనమా? లేక ఓ టైమ్ మిషన్లాంటి పరికరమా? అనేది ఈ నెల 22న తెలుస్తుంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ అండ్ ఫ్యూచరిస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్న ఈ సినిమాను అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో భైరవ ΄ాత్రధారిగా ప్రభాస్, అశ్వత్థామ ΄ాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో మరో సూపర్ హీరోలాంటి బుజ్జి ΄ాత్ర కూడా ఉంది. ఈ ΄ాత్రను పూర్తిగా చూపించకుండా ఓ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఈ పాత్రకు హీరోయిన్ కీర్తీ సురేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ‘మనుషుల శరీరాన్ని బ్రెయిన్ కంట్రోల్ చేసినట్లే.. బుజ్జి బాడీని కూడా బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంటుంది’ (నాగ్ అశ్విన్), ‘హాయ్.. నేను బుజ్జి బ్రెయిన్... బ్రెయిన్ ఉంటే సరిబ్రెయిన్ ఉంటే సరిపోతుందా...తుందా... బాడీ కూడా కావాలి కదా.. భైరవ ఎక్కడికీ.. నా బాడీ బిల్డ్ చేయడానికేనా..’ (కీర్తీ సురేష్ వాయిస్ ఓవర్), ‘నీ టైమ్ స్టార్టైంది బుజ్జి.. పదా!’ (ప్రభాస్) అనే డైలాగ్స్ ఈ వీడియోలో ఉన్నాయి. ఈ బుజ్జి గురించిన పూర్తి వివరాలను ఈ నెల 22న వెల్లడిస్తామని మేకర్స్ తెలి΄ారు. ఇక ‘కల్కి 2898 ఏడీ’ జూన్ 27న విడుదల కానుంది. -
బోర్ కొట్టేస్తుంది.. అలాంటి సినిమాలు చేద్దామనుకుంటున్నా
కీర్తి సురేశ్ టాలెంట్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 'మహానటి' మూవీతో నేషనల్ అవార్డు అందుకుంది. తనెంటో ప్రూవ్ చేసింది. దీని తర్వాత తెలుగు, తమిళ, మలయాళంలో వరస చిత్రాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఇన్ని సినిమాలు చేస్తున్నా గానీ ఓ విషయంలో సంతృప్తి పడకూడదని అంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినిమాలు గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.(ఇదీ చదవండి: నేను హ్యాపీగా లేను.. హీరోయిన్ ఛాన్స్ అని చెప్పి: ఈషా రెబ్బా)''మహానటి' తర్వాత మరింత బాధ్యతగా సినిమాలు చేస్తున్నాను. కొన్ని కథా పాత్రలు నటీనటుల జీవితం, వృత్తి పరమైన ఇమేజ్ని మార్చేస్తాయి. ఇకపై మీ జర్నీ ఎలా ఉండాలనేది అవి డిసైడ్ చేస్తాయి. మంచి పాత్రలకు ఉండే బలం అది. 'మహానటి' విషయంలో నాకు అలాంటి అనుభవమే ఎదురైంది. దీని తర్వాత మంచి పాత్రలను ఎంపిక చేసుకుని నటించాలనే భావన కలిగింది''అయితే నేను చేసే అన్ని సినిమాలు అలాంటి ఫలితాన్ని అందిస్తాయని అనుకోవడం కరెక్ట్ కాదు. షూటింగ్ స్పాట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ పాత్రలోని ఎమోషనల్ వెంటాడుతుందంటే అది మంచి పాత్ర. అయితే అలాంటి మ్యాజిక్ కొన్నిసార్లే జరుగుతుంది. అలానే ఒకేలాంటి పాత్రలు చేస్తుంటే అభిమానులకు బోర్ కొడుతుంది. అందుకే ఛాలెంజింగ్ పాత్రల్లో నటించాలని అనుకుంటున్నాను' అని కీర్తి సురేశ్ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్) -
రివాల్వర్ రీటా’గా వస్తోన్న కీర్తి సురేశ్.. అప్డేట్ వచ్చేసింది!
మాలీవుడ్లో బాలనటిగా రంగప్రవేశం చేసి స్టార్ హీరోయిన్గా ఎదిగిన ముద్దుగుమ్మ కీర్తి సురేశ్. మహానటిగా ప్రేక్షకుల గుండెల్లో తనదైన ముద్రవేసుకుంది. కోలీవుడ్లో ఇదు ఎన్న మాయం చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్పుల్ హీరోయిన్గా పేరు తె చ్చుకుంది. హీరోయిన్గా తానేంటో నిరూపించుకున్న కీర్తి సురేశ్ టాలీవుడ్లో దివంగత నటి సావిత్రి జీవిత చరిత్రతో రూపొందిన తెలుగు చిత్రం మహానటి పాత్రకు జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కించుకున్నారు. అలా ఒక్కో అడుగేస్తూ ఇప్పుడు బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ వరుణ్ ధావన్కు జంటగా కోలీవుడ్ దర్శకుడు అట్లీ నిర్మిస్తున్న బేబీజాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇది తమిళంలో హిట్ అయిన తెరి చిత్రానికి రీమేక్గా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే తమిళంలో జయంరవికి జంటగా నటించిన సైరన్ చిత్రం కీర్తిసురేశ్ను నిరాశపరిచింది.ప్రస్తుతం ఈ బ్యూటీ నటిస్తున్న చిత్రాల్లో రివాల్వర్ రీటా ఒకటి. ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రంగా రూపొందిస్తోన్న ఈ చిత్రానికి చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. నటుడు రెడిన్ కింగ్స్లీ, మైమ్గోపీ, సెండ్రాయిన్, స్టంట్ మాస్టర్ సూపర్సుబ్బరాయన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఫ్యాషన్ స్టూడియోస్, ది రూట్ సంస్థ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని నటి కీర్తిసురేశ్ తన ఇన్స్టాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్తో చివరి షూటింగ్లో కేక్ కట్ చేసిన వీడియోను విడుదల చేశారు. అది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. కాగా ఈ చిత్రం ఆడియో, ట్రైలర్లను త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. కీర్తిసురేశ్ రఘుతాత అనే చిత్రంలోనూ నటిస్తున్నారు. -
విజయ్ చివరి చిత్రంలో ఇద్దరు స్టార్ హీరోయిన్లు..ఎవరంటే?
ఇప్పుడు కోలీవుడ్లో ఆసక్తికరమైన టాక్ హల్చల్ చేస్తోంది. నటుడు విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చి త్రం గోట్(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టై మ్) నటి మీనాక్షి చౌదరి, స్నే హ, లైలా, ప్రభుదేవా, ప్రశాంత్,వైభవ్, ప్రేమ్జీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. వెంకట్ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాగా తదుపరి విజయ్ తన 69వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇదే ఈయన చివరి చిత్రం అని ప్రచా రం జోరుగా సాగుతోంది. కారణం విజయ్ రాజకీయరంగ ప్రవేశం చేయడమే. కాగా ఆయన చివరి చిత్రానికి హెచ్ వినో ద్ దర్శకత్వం వహించనున్నారన్న ప్రచారం జరుగుతున్నా, అధికారికంగా ప్రకటించలేదు. అదే సమయంలో దీన్ని ఏ నిర్మాణ సంస్థ నిర్మించనుందీ అన్నది కూడా తెలియని పరిస్థితి. అయినప్పటికీ ఇందులో విజయ్తో జత కట్టే కథానాయికల గురించి ప్రచారం జో రుగా సాగుతోంది.అలా ఈ జాబితాలో పలువురు పేర్లు చెక్కర్లు కొడుతున్నా, నటి సమంత, కీర్తీసురేష్ పేర్లు తాజాగా వినిపిస్తున్నాయి. నటి సమంత ఇంతకు ముందు విజయ్ సరసన కత్తి, తెరి, మెర్సల్ చిత్రాల్లో నటించారు. అలాగే నటి కీర్తీసురేష్ కూడా ఇంతకు ముందు భైరవా, సర్కార్ చిత్రాలలో జత కట్టారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి విజయ్తో రొమాన్స్ చేయనున్నారనే ప్రచారం జోరందుకుంది. అయితే ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
బాలీవుడ్ ఎంట్రీ.. రెచ్చిపోతున్న కీర్తిసురేశ్!
ఇదు ఎన్న మాయం చిత్రంతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు కీర్తి సురేశ్. కెరీర్ ప్రారంభం నుంచే పక్కింటి అమ్మాయి ఇమేజ్ను మెయింటెన్ చేస్తూ వచ్చారు. అలా ఇక్కడ రజనీమురుగన్, రెమో, భైరవా, సామి 2 చిత్రాల్లో నటించి టాప్ హీరోయిన్ల లిస్టులో చేరారు. ఈ మధ్య నటించిన మామన్నన్, సైరన్ చిత్రాల వరకూ గ్లామర్కు దూరంగానే ఉంటూ వచ్చారు.బాలీవుడ్లో ఎంట్రీతెలుగులో మహానటి చిత్రంలో అద్భుతమైన నటనను ప్రదర్శించి ఉత్తమ నటిగా జాతీయ అవార్డునే గెలుచుకున్నారు. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో గ్లామర్గా కనిపించినా శ్రుతిమించి పోలేదు. అలాంటిది ఎప్పుడైతే బాలీవుడ్లోకి అడుగు పెట్టారో పూర్తిగా గ్లామర్కు ఓటేస్తున్నారు. హిందీ చిత్రాల్లో నటించడం మొదలెడితే అందాల ఆరబోత తప్పదేమో అనిపిస్తోంది కీర్తీసురేష్ను చూస్తుంటే! తెలుగు, తమిళంలో సక్సెస్లు ఉన్నా, అవకాశాలు తగ్గాయన్నది వాస్తవం.వరుణ్ ధావన్ బర్త్డేబేబీజాన్ చిత్రం ద్వారా కీర్తి బాలీవుడ్లోకి అడుగు పెట్టనున్నారు. ఇది తమిళంలో హిట్ అయిన తేరి చిత్రానికి రీమేక్. ఈ మూవీని తమిళ టాప్ దర్శకుడు అట్లీ నిర్మిస్తున్నారు. బేబీజాన్ షూటింగ్ దశలో ఉంది. బుధవారం (ఏప్రిల్ 24) ఈ మూవీ హీరో వరుణ్ ధావన్ బర్త్డే సెలబ్రేషన్స్ చిత్ర యూనిట్ మధ్య జరిగాయి. ఇందులో కీర్తీసురేష్ డీప్ నెక్ ఉన్న లెహంగాలో కనిపించింది. వరుణ్ ధావన్కు కేక్ తినిపించి ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వగానే ఇంతలా మారిపోయారేమిటి? అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. #KeerthySuresh from the sets of #Babyjohn ( Hindi remake of THERI) 🎬⭐️😎#VarunDhawan | #Atleepic.twitter.com/u3IkBELUtW— Tharani ᖇᵗк (@iam_Tharani) April 24, 2024 చదవండి: వీకెండ్ స్పెషల్.. ఈ సినిమాలు మిస్ కావొద్దు -
నేరుగా ఓటీటీలోకి కీర్తి సురేశ్ మూవీ, స్ట్రీమింగ్ అక్కడే!
తమిళ హీరో జయం రవి, హీరోయిన్ కీర్తి సురేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సైరన్. అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రలో మెరిసింది. ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదట్లో నేరుగా ఓటీటీలోకి రానుందని ప్రచారం జరిగింది. అయితే తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లో విడుదల చేశాకే ఓటీటీలో రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది. అక్కడ రిలీజ్ డిసెంబర్లో రిలీజ్ చేయాలనుకున్న ఈ సినిమాను పలు వాయిదాల తర్వాత తమిళంలో ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తెలుగులోనూ థియేటర్లలో విడుదల చేసేందుకు ప్రయత్నించారు. కానీ తమిళనాట మరీ అంత పాజిటివ్ స్పందన లేకపోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు. ఏప్రిల్ 19 నుంచి హాట్స్టార్లో సైరన్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సైరన్ అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించారు. కథేంటంటే? ఖైదీ పాత్రలో ‘జయం’ రవి, పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రలో కీర్తి సురేష్ నటించారు. భార్య(అనుపమ పరమేశ్వరన్)ను హత్య చేసిన కేసులో రవి జైలుకెళ్తాడు. పెరోల్పై బయటకు వచ్చిన సమయంలో ఓ లీడర్ను, పోలీస్ను హత్య చేస్తాడు. ఈ కేసు కీర్తి సురేశ్ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ప్రేమించి పెళ్లాడిన భార్యను నిజంగానే రవి చంపేశాడా? కీర్తి కేసును ఎలా సాల్వ్ చేసింది? అనేది తెలియాలంటే? ఈ సినిమాను ఓటీటీలో చూసేయండి.. #Siren OTT - Apr 19 - Hotstar. pic.twitter.com/Mr4KPtCHIe — Christopher Kanagaraj (@Chrissuccess) April 10, 2024 చదవండి: అమ్మ అంటే ఎంత ప్రేమో.. తనకోసం ఆలయాన్నే కట్టించిన హీరో -
'40 రోజులు వనవాసం'.. స్టార్ హీరోయిన్ ఆసక్తికర పోస్ట్!
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. గతేడాది దసరా మూవీతో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. కెరీర్ ప్రారంభంలోనే జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న కీర్తి తన శక్తికి మించిన పాత్రల్లోనూ నటించి మెప్పించింది. మహానటిగా అభిమానుల గుండెల్లో తన పేరును లిఖించుకుంది. తెలుగు, తమిళ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ తాజాగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అంతే కాకుండా ఇప్పుడు ఓటీటీ ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టారు. తాజాగా అక్కా అనే వెబ్ సిరీస్లో నటి రాధిక ఆప్టేతో కలిసి నటించారు. ధనరాజ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కోసం కేరళలో మకాం పెట్టిన కీర్తి సురేష్ తాజాగా తన ఇన్స్ట్రాగామ్లో పంచుకున్నారు. దాదాపు 40 రోజులు వనవాసం పూర్తి చేసి ఇప్పుడే సోషల్ మీడియాలోకి తిరిగివచ్చానని రాసుకొచ్చారు. అక్కా వెబ్ సిరీస్లో నటించడం చాలా సంతోషంగా ఉన్నారు. ఈ షెడ్యూల్ని ముగించుకుని ఇంటికి తిరిగిరావడం సరి కొత్త అనుభూతిగా ఉందని పేర్కొన్నారు. ఇకపై ఇతర మూవీ షూటింగ్లకు హాజరవుతానని తెలిపారు. కాగా.. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తమిళంలో రఘు తాత, రివాల్వర్ రీటా, కన్నివెడీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ మూడు ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రాలు కావడం విశేషం. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
రూ.1000 కోట్ల హీరోతో దసరా భామకు ఛాన్స్.. వేరే లెవెల్ రేంజ్! (ఫొటోలు)
-
ఒకప్పటిలా లేదు.. అందుకే కీర్తిసురేశ్కు నో ఛాన్స్!
అజయ్ దేవ్గణ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మైదాన్. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా ఇది.. కానీ అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవల అజయ్ నటించిన షైతాన్ మూవీ సూపర్ హిట్గా నిలవడంతో మైదాన్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ ఎట్టకేలకు ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ప్రియమణి హీరోయిన్గా నటించింది. ఫస్ట్ చాయిస్ ప్రియమణి కాదు అయితే హీరోయిన్ పాత్రకు ముందుగా ప్రియమణిని అనుకోలేదట! ఈ విషయాన్ని డైరెక్టర్ అమిత్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు. రహీం(హీరో పాత్ర పేరు) భార్యగా కీర్తి సురేశ్ను అనుకున్నాను. ఒకప్పుడు బొద్దుగా ఉండే ఆమె చాలా బరువు తగ్గిపోయి సన్నగా అయిపోయింది. అలా సన్నగా ఉంటే తను పాత్రకు సెట్టవదని మిగతావారి దగ్గరకు వెళ్లాను. అలా ఈ పాత్ర ప్రియమణిని వరించింది అని చెప్పుకొచ్చాడు. బాక్సాఫీస్ ఫైట్ మైదాన్ రిలీజ్ రోజే అక్షయ్ కుమార్- టైగర్ ష్రాఫ్ల మల్టీస్టారర్ బడే మియా చోటే మియా రిలీజ్ కానుంది. మరి ఈ బాక్సాఫీస్ ఫైట్లో ఎవరు గెలుస్తారో చూడాలి! ఇదిలా ఉంటే కీర్తి సురేశ్ బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. తమిళ హిట్ మూవీ తేరి హిందీ రీమేక్ 'జాన్ బేబీ'లో నటించనుంది. ఈ చిత్రాన్ని అట్లీ నిర్మిస్తుండగా అతడి అసిస్టెంట్ కలీస్ దర్శకత్వం వహిస్తున్నాడు. చదవండి: సుజిత్ పెళ్లికి ఎందుకు పిలవలేదు?.. ఆనంద్ మహీంద్రా ఆన్సరిదే! -
సుహాస్తో కీర్తి సురేశ్ కొత్త మూవీ!
హీరోయిన్ కీర్తీ సురేశ్ మెయిన్ లీడ్ రోల్లో నటించనున్న కొత్త సినిమాకు ‘ఉప్పు కప్పురంబు’ అనే టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ‘కలర్ ఫోటో’ ఫేమ్ సుహాస్ మరో లీడ్ రోల్లో కనిపిస్తారు. అని ఐవీ శశి దర్శకత్వంలో రాధికా లావు ఈ చిత్రం నిర్మిస్తున్నారు. వసంత్ మురళీ కృష్ణ మరింగంటి కథ అందిస్తున్నారు. ఓ గ్రామంలోని స్మశానం విస్తరణ నేపథ్యంలో ‘ఉప్పు కప్పురంబు’ సినిమా కథనం ఉంటుందనే ప్రచారం ఫిల్మ్నగర్లో వినిపిస్తోంది. కాగా ఈ సినిమాలో కీర్తీ సురేశ్, సుహాస్ జంటగా నటిస్తారా? లేదా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. మహానటితో సినిమా అనగానే సుహాస్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి కీర్తి అతిథి పాత్రలో కనిపించనుందా? ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. చదవండి: ఓటీటీలో సడెన్గా మాయమైన హిట్ సినిమా.. కారణం ఇదేనా -
బ్లాక్ శారీలో కీర్తి సురేశ్ స్టన్నింగ్ లుక్స్.. గ్లామర్తో రెచ్చగొడుతోన్న శ్రద్ధాదాస్!
బ్లాక్ శారీలో కీర్తి సురేశ్ స్టన్నింగ్ లుక్స్.. స్మైలీ లుక్స్తో కవ్విస్తోన్న ఐశ్వర్య లక్ష్మీ.. రెడ్ శారీలో ఆషిక రంగనాథ్ హోయలు.. బోల్డ్ లుక్స్తో రెచ్చిపోతున్న శ్రద్ధాదాస్... వాలెంటైన్స్ మూడ్లో మాళవిక మోహనన్.. ఆరెంజ్ డ్రెస్లో తేజస్విని గౌడ పోజులు.. రెడ్ డ్రెస్లో మరింత బోల్డ్గా యషిక ఆనంద్.. View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Tejaswini Gowda (@_tejaswini_gowda_official) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) -
స్టార్ హీరో యాక్షన్ థ్రిల్లర్.. టాలీవుడ్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్!
'తని ఒరువన్' 'కొమాలి' 'పొన్నియిన్ సెల్వన్' లాంటి చిత్రాలతో తెలుగులోనూ క్రేజ్ దక్కించుకున్న హీరో జయం రవి. ఆయన తాజాగా 'సైరన్' అనే మాస్ యాక్షన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో దసరా భామ కీర్తి సురేశ్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు. అంథోని భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి రానుంది. టాలీవుడ్లో ఈ సినిమా 'గంగ ఎంటర్టైన్మెంట్స్' పతాకంపై మహేశ్వర్ రెడ్డి మూలి రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే తెలుగు టీజర్ విడుదల కాగా మంచి స్పందన లభించింది. తాజాగా చిత్రబృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. దర్శకుడు ఆంథోని భాగ్యరాజ్ మాట్లాడుతూ.. " ఈ చిత్రం నాకొక కలలా జరిగిపోయింది. ఒక కొత్త దర్శకుడి మొదటి చిత్రం. అదీ పెద్ద హీరోతో చేసినప్పుడు కచ్చితంగా హిట్ కొట్టాలనుకుంటారు. ఆ బాధ్యత జయం రవి తీసుకున్నారు. జీవీ గారి మెలోడీస్ అంటే నాకు చాలా ఇష్టం. చిత్రం అద్భుతంగా వచ్చింది. తెలుగు ప్రేక్షకులకి నచ్చుతుందని ఆశిస్తున్నాం" అని అన్నారు. జయం రవి మాట్లాడుతూ.."ఈ చిత్రంలో ఎమోషన్స్ చాలా ముఖ్య పాత్రలు వహిస్తాయి. వాటికి జీవీ తన సంగీతంతో ప్రాణం పోశారు. అలాగే ఈ చిత్రంలో ముఖ్యమైన లేడి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కీర్తి సురేశ్ మా నమ్మకాన్ని నిలబెట్టింది. ఆంథోనీ భాగ్యరాజ్ లాంటి కొత్త దర్శకులతోనే చేస్తున్నందుకు నన్ను చాలా మంది హెచ్చరిస్తుంటారు. కానీ ప్రతిభ గల దర్శకుడి కష్టంలోనే విజయం కనిపిస్తుంది. ఈ చిత్రంలో నేను రెండు విభిన్నమైన పాత్రలు పోషించాను. మా సైరన్ తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది" అని అన్నారు. కాగా.. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. ఈ సినిమాలో సముద్రఖని, యోగి బాబు, అజయ్, అలగం పెరుమాళ్, పాండ్యన్ కీలక పాత్రలు పోషించారు. -
వీధి పోకిరి చెంప చెళ్లు మనిపించా: కీర్తి సురేశ్
తక్కువ కాలంలోనే హీరోయిన్గా అనూహ్య స్థాయికి చేరుకుంది కీర్తీ సురేశ్. మహానటి చిత్రంతో జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు మలయాళం, తమిళం, తెలుగు భాషలను దాటి ఉత్తరాది ప్రేక్షకులను అలరించడానికి బాలీవుడ్ వరకు చేరుకుంది. ఇలా చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న కీర్తీ సురేశ్కు ధైర్యం కాస్త ఎక్కువేనట. సినీ రంగప్రవేశం చేయకముందే నిజ జీవితంలో తన మాస్ హీరోయిజాన్ని చూపించారట. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన పాత రోజులను గుర్తు చేసుకుంటూ ఒక పోకిరికి బుద్ధి చెప్పిన సంఘటన గురించి చెప్పారు. నటిగా పరిచయం కాని సమయంలో ఒక రోజు అర్ధరాత్రి తాను స్నేహితురాళ్లతో కలిసి వెళుతున్నానని, అప్పుడొక మందుబాబు వెనుకగా వచ్చి తనను రాసుకుంటూ వెళ్లాడని చెప్పారు. తనకు కోపం తన్నుకు రావడంతో అతన్ని పట్టుకుని చెంపలు పగలకొట్టినట్లు చెప్పారు. ఆ తరువాత ఆ మందుబాబు తనపై దాడి చేసి తలపై కొట్టాడని, దీంతో అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించినట్లు కీర్తి సురేశ్గుర్తు చేసుకున్నారు. పోలీసులు అతన్ని ఆ రాత్రి అంతా జైలులోనే ఉంచి ఉదయం విడిచి పెట్టారని చెప్పారు. అయితే ఇది నమ్మశక్యంగా లేదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా కీర్తీ సురేశ్ తాజాగా జయంరవి చొక్కా కాలర్ పట్టుకుని ఈడ్చుకెళుతున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇది సైరన్ చిత్రంలో దృశ్యం అని గమనించవచ్చు. జయంరవి కథానాయకుడిగా నటించిన ఇందులో కీర్తీసురేశ్ పోలీస్ అధికారిగా నటించారు. ఈ చిత్రం కోసం ఈ బ్యూటీ 10 కిలోల బరువు పెరిగారట. సైరన్ చిత్రం ఈనెల 16న థియేటర్లలోకి రానుంది. -
కీర్తి సురేశ్ పవర్ఫుల్ పాత్రలో వస్తోన్న సైరన్.. రిలీజ్ ఎప్పుడంటే?
కోలీవుడ్ హీరో జయంరవి, కీర్తి సురేశ్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన తాజా చిత్రం సైరెన్. హోమ్ మూవీ మేకర్స్ పతాకంపై సుజాత విజయకుమార్ నిర్మించిన ఈ చిత్రం ద్వారా ఆంథోని భాగ్యరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జీవీ ప్రకాష్కుమార్ సంగీతాన్ని అందించిన సైరన్ చిత్రం ఈనెల 16న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ చైన్నెలోని పీవీపీ స్టూడియోలో ప్రెస్ మీట్ నిర్వహించారు. హీరో జయంరవి మాట్లాడుతూ.. తాము సమష్టిగా శ్రమించిన సైరన్ చిత్రం విడుదలకు సిద్ధమవుతోందని చెప్పారు. దర్శకుడు ఆంథోని భాగ్యరాజ్ చిత్రాన్ని చాలా బాగా తెరకెక్కించారని.. ఆయనకు మంచి భవిష్యత్తు ఉందని అన్నారు. కీర్తీసురేశ్ చాలా బలమైన పాత్రను అద్భుతంగా చేశారని అభినందించారు. తాను ఇందులో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించానని.. ఈ చిత్రం పిల్లలు నుంచి పెద్దల వరకు అందరినీ అలరిస్తుందనే నమ్మకాన్ని జయంరవి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిర్మాత సుజాత విజయకుమార్ మాట్లాడుతూ.. అంబులెన్స్ సైరన్కు, పోలీస్ సైరన్కు మధ్య జరిగే పోరాటమే ఈ చిత్రమని అన్నారు. జయంరవి కథానాయకుడిగా సైరన్ చిత్రాన్ని నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. ఆయన తన అల్లుడు అని చెప్పడం కాదు కానీ.. చాలా అద్భుతంగా నటించారని అన్నారు. కీర్తీసురేశ్ ఈ చిత్రంలో పోలీసు అధికారిగా పవర్ఫుల్ పాత్రను జయంరవికి ధీటుగా నటించారని ప్రశంసించారు. అనుపమ పరమేశ్వరన్ కూడా చాలా చక్కగా చేశారని చెప్పారు. దర్శకుడు తనకు చెప్పిన కథ వేరు.. జయంరవికి చెప్పి చేసిన సైరన్ చిత్ర కథ వేరని ఆమె అన్నారు. కాగా.. ఈ చిత్రంలో సముద్రఖని, అళగర్ పెరుమాళ్ ముఖ్యపాత్రలు పోషించారు. -
బేబీ జాన్తో బాలీవుడ్కి...
బాలీవుడ్లో హీరోయిన్ కీర్తీ సురేష్ ప్రస్థానం మొదలైంది. కీర్తీ సురేష్ హీరోయిన్గా నటిస్తున్న తొలి హిందీ చిత్రానికి ‘బేబీ జాన్’ టైటిల్ను ఖరారు చేసి, గ్లింప్స్ను విడుదల చేశారు మేకర్స్. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో వామికా గబ్బా మరో హీరోయిన్గా నటిస్తున్నారు. తమిళ దర్శకుడు ఎ.కాళీశ్వరన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ దర్శకుడు అట్లీ సమర్పణలో జ్యోతిదేశ్ పాండే, మురాద్ ఖేతని, ప్రియా అట్లీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ మొదలైంది. ‘బేబీ జాన్’ని మే 31న థియేటర్స్లో విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. కాగా తమిళ హిట్ విజయ్ ‘తేరీ’ (2016) సినిమాకు హిందీ రీమేక్గా ‘బేబీ జాన్’ రూపొందుతోందనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. తమిళంలో ‘తేరీ’ సినిమాకు దర్శకత్వం వహించిన అట్లీ ‘బేబీ జాన్’ సినిమాకు నిర్మాతగా ఉండటం విశేషం. ఇదిలా ఉంటే.. ఓ రాజకీయ నాయకుడి కొడుకు ఓ అమ్మాయిపై హత్యాచారానికి పాల్పడితే, అతన్ని చంపినందుకు గాను ఓ పోలీసాఫీసర్ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? అన్నదే ‘తేరీ’ కథ అని తెలిసిందే. -
డైహార్ట్ ఫ్యాన్కు క్షమాపణ చెప్పిన కీర్తీసురేష్
అభిమానులు లేనిదే ఏ స్టార్ లేరులే అన్నారో గీత రచయిత. ఇది మాత్రం నగ్న సత్యం. అందుకే నటీనటులు అభిమానులే తమ దేవుళ్లు అంటారు. ఇక అభిమానుల విషయానికొస్తే ఏ నటుడుగానీ, నటి గానీ వారికి నచ్చితే నెత్తినేసుకుని మోసేస్తారు. వారికి గుళ్లు, గోపురాలు కట్టి ఆరాధిస్తారు. సిరాతో కాకుండా రక్తంతో లేఖలు రాసే పిచ్చి అభిమానులు ఉంటారు. మరి కీర్తీసురేష్కు ఇలాంటి ఒక వీరాభిమానే ఉన్నాడు. బాలనటిగా నట జీవితాన్ని ప్రారంభించిన ఈమె, ఆ తరువాత కథానాయకిగా పరిచయం ఆపై తమిళం, తెలుగు, హిందీ అంటూ ప్రముఖ కథానాయకి స్థాయికి ఎదిగిన నటి కీర్తీసురేష్. అతి తక్కువ కాలంలోనే మహానటి చిత్రంలోని నటనకుగాను జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న అరుదైన నటి కీర్తీసురేష్. అదేవిధంగా కథానాయకి ప్రాముఖ్యత కలిగిన కథా చిత్రాల్లో నటించి మెప్పించే స్థాయికి ఎదిగారు. కోలీవుడ్లో పలు చిత్రాలతో బిజీగా వున్న ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. తమిళంలో విజయ్, సమంత, ఎమిజాక్సన్ హీరో హీరోయిన్లుగా నటించిన అట్లీ దర్శకత్వం వహించిన తెరి చిత్ర హిందీ రీమేక్లో కీర్తీసురేష్ నటిస్తున్నారు. తమిళంలో సమంత నటించిన పాత్రను హిందీలో పోషిస్తున్నారు. ఈమె కథానాయకిగా నటించిన సైరన్, రఘుతాత, రివాల్వర్ రీటా, కన్నివెడి చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి క్రేజీ నటి ఒక అభిమానికి క్షమాపణ చెప్పడం విశేషం. కృష్ణ అనే ఈమె వీరాభిమాని వరుసగా 233 లేఖలు రాసి ఆమెకు ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అప్పటికి అతని లేఖలకు స్పందించని కీర్తీసురేష్ 234వ లేఖకు బదులిచ్చారు. ఆమె ట్విట్టర్ ద్వారా అతని లేఖలకు స్పందిస్తూ 234 తనకు ఫాంటసీ నంబర్ అని పేర్కొన్నారు. ఆలస్యంగా స్పందించినందుకు క్షమించు లాట్సాప్ లవ్ అని పేర్కొంది. ఆమె ఈ ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్అవుతోంది. -
శింబుతో జతకట్టనున్న ఇద్దరు హీరోయిన్స్!
తమిళ హీరో శింబు నటించిన చివరి చిత్రం పత్తుతల. ఈ చిత్రం మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. దీంతో ఈయన తర్వాత చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా.. అని ఆయన అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. శింబు కథానాయకుడిగా కమల్ హాసన్ ఒక చిత్రాన్ని నిర్మించనున్నట్లు చాలాకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీనికి దేశింగు పెరియసామి దర్శకత్వం వహించనున్నారట. ఈయన చెప్పిన కథ రజనీకాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖ స్టార్స్ను మెప్పించిందని, ఇందులో రజనీ నటించాల్సిందని ప్రచారం జరిగింది. హీరో, విలన్.. అన్నీ ఒక్కడే అలాంటి కథలో ఇప్పుడు శింబు నటించనున్నారు. ఈ చిత్రం త్వరలో సెట్పైకి వెళ్లనుందని సమాచారం. ఈ చిత్రం కోసం శింబు కరాటే వంటి విద్యల్లో శిక్షణ పొందడం విశేషం. ఇది పీరియాడికల్ కథా చిత్రంగా ఉంటుందని టాక్. ఈ మూవీలో శింబు హీరో, విలన్ పాత్రను తనే పోషించనున్నారని టాక్! ఇకపోతే ఈ చిత్రంలో బాలీవుడ్ మోస్ట్ టాప్ హీరోయిన్గా రాణిస్తున్న దీపికాపదుకొనే, కీర్తీసురేశ్ హీరోయిన్లుగా నటించనున్నట్లు ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బాలీవుడ్ క్వీన్తో.. హీరోకు జంటగా కీర్తీసురేశ్, విలన్ సరసన దీపికా పదుకొనే నటించబోతున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే ఇది నిజంగానే భారీ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కే చిత్రమవుతుంది. దీపికా పదుకొనే చాలా గ్యాప్ తరువాత మరోసారి కోలీవుడ్ ప్రేక్షకులను ఈ చిత్రం ద్వారా పలకరించనున్నారన్నమాట. ఈ చిత్ర టైటిల్, ఫస్ట్లుక్ పోస్టర్లను ఫిబ్రవరి మూడో వారంలో విడుదల చేయడానికి యూనిట్ వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఈ నిజం నాకు ప్రతి క్షణం గుర్తుకొస్తూనే ఉంటుంది: మెగాస్టార్ ఎమోషనల్ -
స్టార్ హీరోయిన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. ఓటీటీలో కాదట!
దసరా బ్యూటీ కీర్తి సురేశ్, జయం రవి ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం 'సైరెన్'. 108 అనేది ఉపశీర్షిక. యాక్షన్ ప్యాక్డ్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమాను ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ తేదీని కీర్తి సురేశ్ తన ట్విటర్లో పోస్ట్ చేసింది. అంబులెన్స్ డ్రైవర్గా పనిచేసి క్రిమినల్గా మారిన ఓ వ్యక్తి కథనే సినిమాగా రూపొందిస్తున్నారు. 14 ఏళ్ల తర్వాత ఆ వ్యక్తి జైలు నుంచి బయటికొచ్చి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడనే కథాంశంతో తెరకెక్కుతోంది. డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్..! అయితే ఈ సినిమాపై మొదట డైరెక్ట్గా ఓటీటీలోనే రిలీజ్ కానుందని వార్తలొచ్చాయి. ఈ మూవీ రిలీజ్ తేదీపై గతంలో చాలాసార్లు రూమర్స్ వినిపించాయి. దీంతో ఈ సినిమాను ఓటీటీలో కాకుండా నేరుగా థియేటర్లలోనే విడుదల చేయనున్నట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. తమిళ, తెలుగు భాషల్లో థియేటర్లోనే విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్లను జయం రవి, కీర్తి సురేష్ ట్విటర్లో పంచుకున్నారు. (ఇది చదవండి: డైరెక్ట్గా ఓటీటీకి స్టార్ హీరోయిన్ యాక్షన్ థ్రిల్లర్..!) కాగా.. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ పోలీసు ఆఫీసర్గా కనిపించనున్నారు. డీజే టిల్లు స్క్వేర్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా ఫిబ్రవరి 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ప్రకటించారు. మరోవైపు కీర్తి సురేశ్ రఘుతాత అనే చిత్రంలోనూ నటిస్తున్నారు. . @actor_jayamravi coming out on parole this Feb16th ! 🚨#SirenFromFeb16 #Tamil & #Telugu A @gvprakash Musical @antonybhagyaraj @anupamahere @sujataa_HMM @iYogiBabu @IamChandini_12 @AntonyLRuben @brindagopal @dhilipaction @selvakumarskdop @SaktheeArtDir @shiyamjack… pic.twitter.com/Au67K5Vo3F — Keerthy Suresh (@KeerthyOfficial) January 22, 2024 -
Keerthy Suresh Sankranti Photos: కీర్తి సురేశ్ ఇంట సంక్రాంతి సంబురాలు (ఫోటోలు)
-
కీర్తి సురేశ్ లేటెస్ట్ మూవీ.. కాంట్రవర్సీ అయ్యేలా ఉందే?
జాతీయ భాష హిందీ గురించి చాలాకాలంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తమిళనాడులో హిందీ భాషపై చాలా వ్యతిరేకత ఉంది. మాతృభాష (తమిళభాష)పై ప్రేమ చూపించే తమిళనాడులో హిందీ భాషను నేర్చుకోవాలి అనే ఒత్తిడిని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడమే ఇందుకు కారణం. హిందీలో మాట్లాడితేనే ప్రభుత్వ ఉద్యోగాలు అనే నిబంధన విధించడం కూడా ముఖ్య కారణం. ఇక ఇదే అంశాన్ని సినిమాగా తీసినట్లు కనిపిస్తోంది. అదే 'రఘుతాత'. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ సాయిపల్లవి చెల్లి.. కుర్రాడు ఎవరంటే?) 'సలార్', 'కేజీఎఫ్' సినిమాలని నిర్మించిన హోంబలే ఫిల్మ్.. కీర్తి సురేశ్ని ప్రధాన పాత్రలో పెట్టి ఈ చిత్రాన్ని నిర్మించారు. సుమన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. త్వరలో థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. హిందీ భాషకు వ్యతిరేకంగా తీసిన ఈ చిత్రం.. వివాదాల్లేకుండా రిలీజైపోతుందా? లేదా? అనేది కొన్నిరోజులు ఆగితే క్లారిటీ వస్తుంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే?) -
డైరెక్ట్గా ఓటీటీకి స్టార్ హీరోయిన్ యాక్షన్ థ్రిల్లర్..!
కోలీవుడ్ స్టార్ జయంరవి, కీర్తీసురేష్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం సైరెన్. ఈ చిత్రంలో జయంరవి ద్విపాత్రాభినయం చేస్తున్నారు. యాక్షన్, థ్రిల్లర్, కుటుంబ కథా చిత్రంగా ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వంలో హోమ్ ఫిలిం మేకర్స్ పతాకంపై సుజాత నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్, టీజర్ ఇటీవల విడుదల కాగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో జయం రవి జైలర్గా నటిస్తుండగా, నటి కీర్తి సురేష్ పోలీసు అధికారిగానూ, అనుపమ పరమేశ్వరన్ ఆయన ప్రేయసిగా నటిస్తున్నారు. (ఇది చదవండి: నయనతార 'అన్నపూరణి'.. తెలంగాణ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్!) అయితే థియేటర్లలో రిలీజ్ కోసం ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. సైరెన్ త్వరలోనే తెరపైకి రానుందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జయంరవి అభిమానులకు షాకి ఇచ్చే విధంగా ఓ న్యూస్ నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ సినిమాను థియేటర్లలో కాకుండా డైరెక్ట్గా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా ఈ నెల 26న నేరుగా జీ5లో స్ట్రీమింగ్కు రానున్నట్లు సమాచారం. గతంలో జయంరవి నటించిన భూమి చిత్రం కూడా నేరుగా ఓటీటీలో విడుదల కావడం విశేషం. దీంతో ఈ మూవీ విషయంలోనూ అదే జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే సైరెన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందన్న విషయాన్ని చిత్ర వర్గాలు ఇంకా అధికారికంగా ప్రకటనైతే రాలేదు. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా.. ఈ చిత్రంలో యోగిబాబు, సముద్రఖని ముఖ్యపాత్రలు పోషించగా.. జీవీ ప్రకాష్కుమార్ సంగీతాన్ని అందించారు. -
ఆహా.. బయలుదేరిందయ్యా.. కీర్తి ట్వీట్ చూశారా?
కీర్తి సురేశ్.. పేరుకు తగ్గట్టుగానే నటిగా పేరు, పరపతిని పెంచుకుంటూ పోతున్నారు. ఆదిలోనే ఉత్తమ నటిగా జాతీయ ఉత్తమ అవార్డు గెలుచుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. తమిళం, మలయాళం, తెలుగు భాషలను అధిగమించి హిందీ చిత్ర సీమలోనూ మకాం పెట్టారు. ఇటీవల ఈ బ్యూటీ నటించిన తెలుగు చిత్రం దసరా మంచి విజయాన్ని సాధించింది. అదేవిధంగా తమిళంలో ఉదయనిధి స్టాలిన్తో జత కట్టిన మామన్నన్ చిత్రం కూడా మంచి సక్సెస్ సాధించింది. కీర్తి సురేశ్ నాయకిగా నటిస్తున్న తాజా చిత్రాల్లో రఘుతాతా ఒకటి. హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కేజీఎఫ్, సలార్ వంటి సంచలన చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. సుమన్కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన తెచ్చుకుంది. త్వరలో రఘుతాతా చిత్రం తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. దీని గురించి కీర్తీసురేశ్ తన ఎక్స్ మీడియాలో పేర్కొన్నారు. 'ఆహా బయలుదేరిందయ్యా.. బయలుదేరింది. వినోదాల విందులతో రఘుతాతా త్వరలో థియేటర్లలోకి రానుంది' అని పేర్కొన్నారు. ఇది పూర్తి కామెడీ ఎంటర్టైనర్ కథా చిత్రం అని హీరోయినే స్వయంగా చెప్తున్నారన్నమాట. కాగా ఇంతకుముందు అభినయంతో ఆ తరువాత అందంతో అలరించిన ఈ భామ తాజాగా వినోదంతో ఆకట్టుకునేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. A whirlwind of comedy is about to hit a cinema near you. Brace for a laughter overload, courtesy #Raghuthatha. ஆத்தி… கிளம்பிட்டாயா கிளம்பிட்டாயா! உங்களை வயிறு குலுங்க சிரிக்க சிரிக்கவைக்க வருகிறது, ரகு தாத்தா. விரைவில் உங்கள் அருகிலுள்ள திரையரங்குகளில்…@hombalefilms… pic.twitter.com/FvXW6yYsqG — Keerthy Suresh (@KeerthyOfficial) January 2, 2024 చదవండి: -
హీరోయిన్ కీర్తి సురేశ్ షాకింగ్ డెసిషన్.. దానికి గ్రీన్ సిగ్నల్
ఒకప్పుడంటే సినిమాల హవా నడిచేది గానీ ఇప్పుడు వెబ్ సిరీస్లు రాజ్యమేలుతున్నాయి. మూవీస్కి దీటుగా వీటిని తీస్తున్నారు. ఇంకా చెప్పాలంటే చాలామంది యాక్టర్స్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెడుతున్నవి వెబ్ సిరీస్లే. అందుకే స్టార్ హీరోహీరోయిన్స్ కూడా ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. హీరోయిన్ కీర్తి సురేశ్ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. (ఇదీ చదవండి: 'బిగ్బాస్ 7'లో ఓడిపోతేనేం.. ఇప్పుడు శోభాశెట్టికి ఆ అవార్డ్) 23 ఏళ్ల క్రితమే మలయాళంలో చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన కీర్తి సురేశ్.. 2013లో హీరోయిన్ అయిపోయింది. తెలుగు, తమిళ, మలయాళంలో దాదాపు పదేళ్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు బాలీవుడ్లోనూ పాగా వేయడానికి రెడీ అవుతోంది. 'తెరి' రీమేక్లో హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఇది రిలీజ్ కావడానికి ముందే ఓ వెబ్ సిరీస్తో అలరించనుంది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ దీన్ని తీస్తోంది. కీర్తి సురేశ్తో పాటు రాధికా ఆప్టే మరో ముఖ్య పాత్రలో నటిస్తుండగా.. ధర్మరాజ్ శెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సిరీస్కు 'అక్కా' టైటిల్ను ఖరారు చేశారు. త్వరలో హిందీతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. హీరోయిన్గా ఓ మాదిరి గ్లామర్ చూపిస్తూ వచ్చిన కీర్తి.. సెన్సార్ పరిధులు లేని ఈ సిరీస్లో ఎలా కనిపిస్తుందనేది ఇంట్రెస్టింగ్ విషయం. (ఇదీ చదవండి: మరోసారి ఆస్పత్రిలో చేరిన హీరో విజయ్కాంత్.. అదే కారణం?) -
కీర్తి సురేశ్ లేడీ ఒరియంటెడ్ ఫిలిం.. గ్లింప్స్ చూశారా?
వరుస విజయాలతో మంచి హుషారులో ఉంది హీరోయిన్ కీర్తి సురేశ్. చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఈ ఏడాది బాలీవుడ్లోనూ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో బోలెడన్ని సినిమాలున్నాయి. అందులో ఒకటి సైరన్.. హీరో జయం రవితో జోడీ కట్టిన ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఆమె నటించిన మరో చిత్రం రఘుతాత. ఇది లేడీ ఓరియంటెడ్ కథా చిత్రం. దీన్ని ప్రముఖ కన్నడ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ నిర్మించడం విశేషం. ఇది పిరియాడికల్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రంగా తెరకెక్కుతోంది. సుమన్కుమార్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో రూపొందుతోందని తాజాగా విడుదల చేసిన చిత్ర గ్లింప్స్ను చూస్తే తెలుస్తోంది. ఇంతకు ముందు తోపుడు బండ్లు, రిక్షాలలో చిత్రాలను ప్రచారం చేసేవారు. ఈ చిత్ర గ్లింప్స్లోనూ.. తోపుడు బండిపై కీర్తి సురేశ్ పోస్టర్ అంటించి ప్రచారం చేస్తున్నట్లు చూపించారు. నటుడు ఎంఎస్.భాస్కర్, దేవదర్శిని, రవీంద్ర విజయ్, ఆనందసామి, రాజేశ్ బాలకృష్ణన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శాన్ సంగీతాన్ని, యామిని యజ్ఞమూర్తి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుందని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమాతో కీర్తి సురేశ్ మరో హిట్ తన ఖాతాలో వేసుకుంటుందేమో చూడాలి! చదవండి: పల్లవి ప్రశాంత్కు 14 రోజుల రిమాండ్.. వారిద్దరిపై నమోదైన కేసు ఇదే -
జోస్ అలుక్కాస్ ‘నిత్యారా’ ఆవిష్కరణ
హైదారాబాద్: జోస్ అలుక్కాస్ ‘నిత్యారా’ పేరుతో కొత్త డైమండ్ కలెక్షన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ వజ్రాభరణాల శ్రేణిని సినీ నటి కీర్తీ సురేష్ ఆవిష్కరించారు. ‘‘అత్యుత్తమ వజ్రాలు, రత్నాలతో నిపుణులైన డిజైనర్లు, ప్రావీణ్యం కలిగిన కళాకారుల ‘నిత్యారా’ ఆభరణాలు రూపొందించారు. చీరలతో మాత్రమే కాకుండా ఆధునిక దుస్తులతో సైతం కలిసిపోయేలా అన్ని ఆధునిక హంగులతో ఆభరణాలు తీర్చిదిద్దారు’’ అని కంపెనీ తెలిపింది. ఈ కార్యక్రమంలో జోస్ ఆలుక్కాస్ ఎండీలు వర్ఘీస్ ఆలుక్కా, పాల్ ఆలుక్కా, జాన్ ఆలుక్కా పాల్గొన్నారు. -
ప్రయోగాలు చేసే సమయం ఇది!
‘‘నా కెరీర్లో ఎప్పుడూ విభిన్నమైన సినిమాలు, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించాలనుకుంటాను’’ అని హీరోయిన్ కీర్తీ సురేశ్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెకు.. ‘దసరా’, ‘మామన్నన్ ’ సినిమాల విజయాల తర్వాత కథ ఎంపికలో మీ ఆలోచనలు ఏవైనా మారాయా? అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు కీర్తీ సురేశ్ బదులిస్తూ.. ‘‘నేను నటించిన సినిమా హిట్టు అయిందనో, ఫ్లాప్ అయిందనో అప్పటికప్పుడు కథల ఎంపికలో నా ఆలోచనా విధానం మారదు. అయితే నేనెప్పుడూ భిన్నంగా చిత్రాలు చేయాలనుకుంటా. ఎందుకంటే నాకిది ప్రయోగాలు చేసే సమయం. అందుకు తగ్గట్టే కథలను ఎంపిక చేసుకుంటున్నా. నా వద్దకు వస్తున్న కథలు, పాత్రలు నా ఊహలకు, కలలకు మించిన విధంగా ఉంటున్నాయి. అలాంటప్పుడు మళ్లీ కథల గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఏముంటుంది? ఆ ప్రయాణాన్ని బాగా ఆస్వాదించాలనే దానిపైనే దృష్టిపెడితే సరిపోతుంది’’ అన్నారు. కాగా కీర్తీ సురేశ్ ప్రస్తుతం ‘సైరెన్ , రఘు తాత, రివాల్వర్ రీటా’ చిత్రాలు, ‘అక్క’ అనే వెబ్సిరీస్లో నటిస్తున్నారు. -
వెబ్ ఎంట్రీ
కీర్తీ సురేష్, రాధికా ఆప్టే ప్రధాన తారాగణంగా పీరియాడికల్ రివేంజ్ థ్రిల్లర్గా ‘అక్క’ వెబ్సిరీస్ రూపొందుతోంది. ధర్మరాజ్ శెట్టిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ఆదిత్యా చోప్రా ఈ వెబ్సిరీస్ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ మొదలైనట్లు బాలీవుడ్ సమాచారం. ‘‘ఇందులో కీర్తీసురేష్, రాధికా ఆప్టే పాత్రలు పోటాపోటీగా ఉంటాయి. వీక్షకులను ఆకట్టుకునేలా ఈ సిరీస్ సాగుతుంది’’ అనియూనిట్ పేర్కొంది. కాగా కీర్తీ సురేష్కు తొలి ఓటీటీ ప్రాజెక్ట్ ‘అక్క’. వరుణ్ధావ¯Œ హీరోగా నటిస్తున్న ఓ బాలీవుడ్ సిని మాలో Mీ ర్తి ఓ హీరోయి¯Œ గా నటిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. -
కీర్తి సురేష్: కేరళలో మహిళల క్రికెట్కు గుడ్విల్ అంబాసిడర్గా (ఫోటోలు)
-
రెండు పాత్రల కథ
జయం రవి, కీర్తీ సురేష్ నటించిన చిత్రం ‘సైరన్ ’. ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వంలో సుజాత విజయ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా టీజర్ను నిర్మాత ‘దిల్’ రాజు విడుదల చేసి, శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ , థ్రిల్లింగ్ అంశాలతో రూపొందిన చిత్రం ‘సైరన్’. రెండు పాత్రల మధ్య నడిచే కథ ఇది. ఖైదీ పాత్రలో ‘జయం’ రవి, పోలీస్ ఇన్ స్పెక్టర్ పాత్రలో కీర్తీ సురేష్ నటించారు. ఈ మూవీలో తొలిసారి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లో కొత్తగా కనిపిస్తారు రవి. త్వరలో సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు మేకర్స్. -
పదేళ్ల ప్రయాణం.. స్టార్ హీరోయిన్గా నిలదొక్కుకున్న మహానటి
సినీ కుటుంబం నుంచి వచ్చిన బ్యూటీ.. కీర్తీ సురేశ్. సినీ బ్యాగ్రౌండ్ వల్ల నటిగా రంగప్రవేశం చేయడం చాలా సులభమే అవుతుంది. అయితే కథానాయికగా కొనసాగడం మాత్రం చాలా కష్టతరం. దాన్ని కీర్తీసురేశ్ తన ప్రతిభతో సాధించిందనే చెప్పాలి. నటి మేనక, నిర్మాత సురేశ్ల వారసురాలు ఈ బ్యూటీ. బాల నటిగా రంగప్రవేశం చేసి మూడు చిత్రాల్లో నటించిన కీర్తీసురేశ్ ఆ తరువాత గీతాంజలి అనే మలయాళం చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమైంది. ఈ చిత్రం ఈమెకు చాలా ప్రత్యేకం. కారణం తొలి చిత్రంతోనే మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్కు జంటగా నటించడం, ద్విపాత్రాభినయం చేసింది. ఆ సినిమాతో ఎంట్రీ ఈ చిత్రం 2013 నవంబర్ 14న విడుదలైంది. అలా కీర్తీ నటిగా పది సంవత్సరాలు పూర్తిచేసుకుంది. మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళ భాషల్లోనూ నటించి స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న ఈమె 2015లో ఇదు ఎన్న మాయం చిత్రం ద్వారా కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా 2016లో శివకార్తికేయన్కు జంటగా నటించిన రజనీ మురుగన్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో హిట్ చిత్రాల నాయికగా ముద్రవేసుకుంది. పదేళ్ల ప్రయాణం అదేసమయంలో తెలుగులో నేను శైలజ చిత్రంతో రంగప్రవేశం చేసి తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకుంది. ఇక దివంగత నటి సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కిన మహానటి చిత్రంలో టైటిల్ పాత్రను పోషించి ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. అలా చాలా తక్కువ సమయంలోనే హీరోయిన్కు ప్రాధాన్యత కలిగిన పాత్రల్లో నటించిన నటిగానూ గుర్తింపు పొందింది. ప్రస్తుతం తమిళంలో సైరన్, రఘుతాతా, రివాల్వర్ రీటా, కన్నివెడి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. నటిగా దశాబ్ద కాలాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్న సందర్భంగా తనను ఆదరించిన చిత్ర పరిశ్రమకు చెందిన వారికి, అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) చదవండి: భారత్ గెలిస్తే అంటూ.. 'బోల్డ్ ఆఫర్' ప్రకటించిన తెలుగు హీరోయిన్ -
హీరోయిన్గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 10 ఏళ్లు పూర్తి చేసుకుంది కీర్తి సురేష్ (ఫోటోలు)
-
ఇది వరమా లేక శాపమా..? భయమేస్తోంది : కీర్తి సురేశ్
స్టార్ హీరోయిన్ రష్మిక డీప్ఫేక్ వీడియో అంశం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. సినీ ప్రముఖుల నుంచి మొదలు ప్రభుత్వ పెద్దల వరకు ఈ అంశాన్ని సీరియస్గా పరిగణించారు. ఇప్పటికే ఈ వీడియోపై అమితాబ్ బచ్చన్, నాగ చైతన్య, మా అధ్యక్షుడు మంచు విష్ణు, విజయ్ దేవరకొండ లాంటి అగ్ర నటీనటులు స్పందించారు. తాజాగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ కూడా సోషల్ మీడియా వేదికగా రష్మిక డీప్ఫేక్ వీడియో ఘటనపై స్పందిస్తూ.. ఇలాంటి చెత్త వీడియోలు సృష్టించే బదులు.. ఆ సమయంలో అందరికి ఉపయోగపడే పని చేసి ఉండాల్సిందని ఆమె అన్నారు. ‘సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డీప్ఫేక్ వీడియో చూస్తుంటే భయం వేస్తోంది. ఇలాంటి చెత్త వీడియోలను క్రియేట్ చేసే వ్యక్తి.. ఆ టెక్నాలజీని, విలువైన సమయాన్ని ఏదైన మంచి పనికి ఉపయోగించాల్సింది. ప్రస్తుతం అభివృద్ది చెందిన ఈ టెక్నాలజీ మనకు వరమో లేక శాపమో అర్థం కావట్లేదు. ప్రేమను, మంచి పంచడం కోసం ఈ టెక్నాలజీని ఉపయోగిద్దాం.అంతేకానీ చెత్తను పంచుకోవడం కోసం కాదు’ అని కీర్తి సురేశ్ ట్వీట్ చేశారు. ఇటీవల ‘భోళా శంకర్’తో ప్రేక్షకులను అలరించిన కీర్తి..ప్రస్తుతం ‘సైరెన్’, ‘రఘు తాత’, ‘రివాల్వర్ రీటా’, ‘కన్నివెడి’ తదితర తమిళ చిత్రాల్లో నటిస్తోంది. The deep-fake video that’s going around is scary. I really wish the person who had done this could have rather used that time to do something productive and not put the people involved, into misery. I don’t understand if technology for us today is a boon or a bane. Let’s use this… — Keerthy Suresh (@KeerthyOfficial) November 8, 2023 -
కీర్తి సురేశ్ బర్త్ డే సెలబ్రేషన్స్.. హాజరైన ఆ నిర్మాత
హీరోయిన్ కీర్తిసురేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గ్లామర్-డీగ్లామర్ పాత్ర ఏదైనా సరే సత్తా చాటుతూ సినిమాలు చేస్తోంది. 'మహానటి'తో జాతీయ అవార్డు సాధినంచిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత అన్ని భాషల చిత్రాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లో 29 సినిమాలు రిలీజ్) ఈ మధ్య కాలంలో దసరా, మామన్నన్ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించింది. తమిళంలో సైరన్, రఘుతాతా, రివాల్వర్ రీటా సినిమాలతో బిజీగా ఉంది. ఈ సుందరి వయసు 31 ఏళ్లు. అంత వయసున్నా కీర్తి సురేష్ అలా కనిపించదు అనుకోండి అది వేరే విషయం. తాజాగా తన 31వ బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకుంది. ఈ వేడుకల్లో కల్యాణి ప్రియదర్శన్, ప్రియా అట్లీ, కదిర్, దర్శకుడు అట్లీ, లియో చిత్ర సహ నిర్మాత జగదీష్ పాల్గొని కీర్తిసురేష్కు శుభాకాంక్షలు చెప్పారు. (ఇదీ చదవండి: బిగ్బాస్ 7: ఏడ్చేసిన శివాజీ.. కొత్త కెప్టెన్ ఎవరంటే?) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
ఈ టాప్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ఎందుకు ఇంతలా కష్టపడుతుందంటే
నటి కీర్తి సురేష్ మహానటి చిత్రంతో జాతీయ స్థాయిలో సత్తా చాటారు. ఆ మధ్య వరుస ప్లాప్లతో కెరీర్ పరంగా కొంచెం తడబడినా, ఆ తర్వాత తెలుగులో నానితో జతకట్టిన దసరా, తమిళంలో ఉదయనిధి స్టాలిన్ సరసన నటించిన మామన్నన్ చిత్రాలతో విజయాల బాట పట్టింది. కాగా ప్రస్తుతం తమిళంలోనే నాలుగైదు చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. అందులో రఘు తాత, రివాల్వర్ రీటా వంటి హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాలతో పాటు జయం రవి సరసన నటిస్తున్న సైరన్ వంటి చిత్రాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో కీర్తి సురేష్కు మరోసారి బాలీవుడ్ అవకాశం పలకరించింది. (ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి) ఈమె ఇంతకుముందే హిందీ చిత్రంలో నటించాల్సి ఉంది. అజయ్ దేవగన్ కథానాయకుడిగా నటిస్తున్న మైదాన్ చిత్రంలో కీర్తి సురేష్నే మొదట హీరోయిన్గా ఎంపికైంది. ఆ చిత్రం కోసం బాగా వర్క్ అవుట్ లు కూడా చేసింది. అదే ఆమె ఆ చిత్రాన్ని కోల్పోవడానికి కారణమైంది. కీర్తి సురేష్ సన్నబడటంతో చిత్ర దర్శక నిర్మాతలు ఆమెను మైదాన్ చిత్రం నుంచి తొలగించారని ప్రచారం జరిగింది. కాగా తాజాగా మరో బాలీవుడ్ చిత్రం ఈ బ్యూటీని వరించింది. తమిళంలో విజయ్ కథానాయకుడిగా, సమంత, ఎమీ జాక్సన్ నాయకిలుగా అట్లీ దర్శకత్వం వహించిన చిత్రం తెరి. ఇది మంచి విజయాన్ని అందుకుంది. కాగా ఈ చిత్రంతో దర్శకుడు అట్లీ హిందీలో నిర్మాతగా పరిచయం కాబోతున్నారు. ఈయన ఇప్పటికే దర్శకుడుగా షారుక్ ఖాన్, నయనతార, దీపికా పడుకొనే వంటి తారలతో జవాన్ చిత్రానికి దర్శకత్వం వహించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు నిర్మాతగా ఎంట్రీ ఇస్తూ బాలీవుడ్ స్టార్ నటుడు వరుణ్ ధావన్ హీరోగా తెరి చిత్రాన్ని, నటి కీర్తి సురేష్ బాలీవుడ్కు పరిచయం చేయబోతున్నారు. తెరి తమిళ్ వెర్షన్లో సమంత నటించిన పాత్రను హిందీలలో కీర్తి సురేష్ పోషించబోతున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రంలో మరింత ఫిట్నెస్గా కనిపించడానికి కీర్తి సురేష్ ఇప్పుడు తీవ్రంగా వర్కౌట్స్ చేస్తున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
పెళ్లి బిజీలో కీర్తి సురేశ్.. తమన్నా హీటెక్కించే లుక్
గ్లామర్ బెండు తీసేలా పోజులిచ్చిన కాజల్ అగర్వాల్ ఫ్రెండ్ పెళ్లిలో ఎంజాయ్ చేస్తున్న కీర్తి సురేశ్ పసుపు పచ్చ డ్రస్ లో కేక పుట్టిస్తున్న శ్రీలీల మైండ్ పోయే లుక్లో కనిపించిన తమన్నా హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ తడి అందాల విందు క్యూట్ వీడియోతో వావ్ అనిపిస్తున్న దివ్యభారతి ఒంపుసొంపులతో మైండ్ డ్యామేజ్ చేస్తున్న అన్వేషి జైన్ View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Anveshi Jain (@anveshi25) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
మహానటి సినిమా చూశాక నువ్వే నా మదర్ అన్నది
-
నేను తెలుగు పిల్లనే అంటున్న కీర్తి సురేష్
-
సావిత్రి గారి కూతురు ఒక మాట అన్నారు..!
-
ఆమెలా నటించడం నాకు చాలా కష్టమైంది
-
కీర్తి ఎంత బాగా పాడిందో వినండి..!
-
Keerthy Suresh Latest Pics: షాపింగ్మాల్లో కీర్తి సురేశ్ సందడి (ఫోటోలు)
-
అందరూ మహానటి అని అనుకుంటారు కానీ మహా నాటు
-
ఆ క్వాలిటీస్ ఉంటే చాలు పెళ్లికి రెడీ..!
-
బాలీవుడ్లోకి కీర్తీ సురేష్.. దర్శకుడిగా అట్లీ
వరుణ్ ధావన్ హీరోగా తమిళ దర్శకుడు కాలిస్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తీ సురేష్, వామికా హీరోయిన్స్గా నటిస్తున్నారని బాలీవుడ్ సమాచారం. ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ ముంబైలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ చిత్రీకరణ అక్టోబరు రెండో వారం వరకూ సాగుతుందట. వరుణ్, కీర్తీ కాంబోలో కొన్ని భావోద్వేగ సన్నివేశాలతో పాటు, వరుణ్తో ఓ యాక్షన్ సీక్వెన్స్ను ప్లాన్ చేశారట కాలిస్. కీర్తీసురేష్కు బాలీవుడ్లో ఇదే తొలి చిత్రం. ఈ సినిమాను దర్శకుడు అట్లీ నిర్మిస్తున్నారు. అయితే అట్లీ దర్శకత్వంలోని తమిళ హిట్ ‘తేరీ’ హిందీ రీమేక్గా ఈ చిత్రం తెరకెక్కుతోందనే టాక్ కూడా బాలీవుడ్లో విని పిస్తోంది. -
పబ్లో చిల్ అవుతున్న కీర్తి సురేశ్.. డ్యాన్స్ వీడియో వైరల్
తమిళసినిమా: కీర్తిసురేశ్ ఇప్పుడు విజయాల మీద సవారీ చేస్తుందనే చెప్పాలి. ఆమధ్య వరుస ఫ్లాప్లతో సతమతమైన ఈ కేరళ కుట్టి నటిగా మాత్రం ఫెయిల్ కాలేదు. నటనపై ఈమె అంకితభావమే ఇప్పుడు మళ్లీ గాడిలో పడేలా చేసిందని చెప్పవచ్చు. మహానటి వంటి అద్భుత విజయం సాధించిన చిత్రం తర్వాత కీర్తి సురేశ్ కథానాయకి పాత్రలకు ప్రాముఖ్యత కలిగిన చిత్రాల్లో నటించడం మొదలెట్టింది. అలా అనడం కంటే ఆమెను దర్శక, నిర్మాతలు అలాంటి పాత్రలకు ఎంపిక చేశారు అని చెప్పవచ్చు. అయితే ఆ చిత్రాలు కీర్తిసురేశ్కు ఆశించిన విజయాలను తెచ్చిపెట్టలేదు. ఇటీవల తెలుగులో నటించిన దసరా చిత్రం , తమిళంలో ఉదయనిధి స్టాలిన్ సరసన నటించిన మామన్నన్ చిత్రాలు మంచి విజయాన్ని సాధించడంతోపాటు కీర్తిసురేశ్ సహజత్వంతో కూడిన నటనకు సర్వత్రా ప్రశంసలు లభించాయి. అంతేకాదు ఇప్పుడు వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ఇప్పటివరకు తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తున్న కీర్తిసురేశ్కు ఇప్పుడు బాలీవుడ్ నుంచి కూడా పిలుపు రావడం విశేషం. హిందీలో వరుణ్ ధావన్ సరసన నటించబోతోంది. అదేవిధంగా తెలుగులో నాగచైతన్య సరసన నూతన చిత్రంలో నటించబోతున్నట్లు సమాచారం. తమిళంలో జయంరవి సరసన సైరన్, రివాల్వర్ రోటా, రఘు తాత అనే లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాలు చేస్తున్నారు. ఇంత బిజీలోనూ కీర్తిసురేశ్ పబ్ల్లో పాటలతో చిల్ అవుతోంది. ఈమె స్నేహితులతో ఒక పబ్లో డాన్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఈ హీరోయిన్లకు అదృష్టం లేదా?
చిత్రపరిశ్రమలో విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చినా కొంతమందికి అవకాశాలు రావు. మరికొంతమందికి వరుస ఫ్లాప్లు వచ్చిన క్రేజీ ఆఫర్స్ వరిస్తుంటాయి. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇలాంటి బాగా జరుగుతుంటాయి. సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ హీరోకి వెళ్తుంది. ఫ్లాప్ అయితే మాత్రం ఆ భారం హీరోయిన్ మోయాల్సి వస్తుంది. ఒకటి, రెండు చిత్రాలు హిట్ కాకపోతే చాలు ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా పక్కన పెట్టేస్తారు. పోనీ హిట్ ఇచ్చినా అవకాశాలు ఇస్తారా అంటే అదీ లేదు. టాలీవుడ్లో వరుస హిట్స్ ఇచ్చిన ఈ హీరోయిన్లకు ఇప్పటికీ సినిమా ఛాన్స్లు రావడం లేదు. పాన్ ఇండియా హిట్...బట్ నో చాన్స్ ‘కేజీయఫ్’ చిత్రంతో పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తుంపు తెచ్చుకుంది శ్రీనిధి శెట్టి. ప్రశాంత్ నీల్-యష్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. అలాగే ఈ చిత్రానికి సీక్వెల్గా వచ్చిన కేజీయఫ్ 2 కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ రెండు చిత్రాలలో శ్రీనిధి పెర్ఫామెన్స్ కూ ఆడియెన్స్ ఫిదా అయ్యారు. తన అందాలకు ముగ్దులయ్యారు. వరుస సినిమాల అవకాశాలు వస్తాయని అంతా భావించారు.కానీ ఈ భామకు కేజీయఫ్ 2 తర్వాత ఆ స్థాయిలో ఒక్క పెద్ద సినిమా కూడా రాలేదు. తమిళ స్టార్ చియాన్ విక్రమ్ సరసన ‘కోబ్రా’లో మెరిసింది. ఆ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక నెక్ట్స్ సినిమాలతోనైనా అలరిస్తుందని ఫ్యాన్స్ భావించారు. కానీ ఈ ముద్దుగుమ్మకు ఇప్పటికీ ఆఫర్లే అందకపోవడం గమనార్హం. ‘అఖండ’విజయం కానీ.. మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన కంచె సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయం అయింది ప్రగ్యా జైస్వాల్ .ఆ సినిమా లో తన క్యూట్ లుక్ తో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.అయితే ఆ సినిమా తరువాత ఎన్ని సినిమాల లో నటించినా అవి అంతగా ఆకట్టుకోలేక పోయాయి. చాలా కాలం తర్వాత ‘అఖండ’తో భారీ విజయం సాధించింది. బోయపాటి-బాలయ్య కాంబోలో వచ్చిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ కలెక్టర్గా నటించింది. తన గ్లామర్ తో ఆకట్టుకుంటూనే అద్భుతంగా నటించి అందరినీ మెప్పించింది.అయితే అఖండ సినిమా తరువాత ఈ భామ కు స్టార్ హీరోల సరసన అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ ఈ భామకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్.. అయినా కూడా.. భీమ్లానాయక్ సినిమాతో టాలీవుడ్కి పరిచమైంది సంయుక్త మీనన్. ఈ మూవీలో రానాకు జోడీగా నటించింది. తర్వాత కల్యాణ్ రామ్ ‘బింబిసార’ సినిమాలో నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కొట్టింది. ఆ వెంటనే ధనుష్తో కలిసి ‘సార్’ మూవీలో నటించింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సాధించింది. ఇక ఈ మధ్య మెగా హీరో సాయితేజ్తో కలిసి ‘విరూపాక్ష’లో నటించగా.. అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇలా హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న సంయుక్తకు మొన్నటి వరకు సినిమా అవకాశాలు రాలేదు. ఇప్పుడు నిఖిల్ హీరోగా నటిస్తున్న ‘స్వయంభూ’లో లీడింగ్ హీరోయిన్గా నటించే అవకాశం వచ్చింది. వీళ్లే కాదు.. దసరా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కీర్తి సురేశ్కు, బేబీ లాంటి సూపర్ హిట్ తర్వాత వైష్ణవికి కూడా సరైన ఆఫర్లు రాలేవు. వీరిద్దరు హీరోయిన్లుగా కమిట్ అయినా చిత్రాలే లేవు. అన్ని ఉన్నా అదృష్టం లేకపోతే ఏది దక్కదంటారు. మరి ఆ అదృష్టం ఈ అందగత్తెలకు ఎప్పుడు వస్తుందో చూడాలి.