
చిత్రబృందం సమక్షంలో బోయపాటికి కేక్ తినిపిస్తున్న రామ్చరణ్
ఫుల్ మాస్ హీరోకు మాస్ డైరెక్టర్ తోడైతే ఇక పిక్చర్ ఊర మాసే. థియేటర్స్లో ఆడియన్స్ విజిల్సే. రామ్చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఓ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ కథానాయిక. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో న్యూ లుక్లో కనిపించడం కోసం రామ్చరణ్ ఆల్రెడీ హెవీ వర్కౌట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆదివారం నుంచి ఈ షూటింగ్లో పాల్గొంటున్నారు హీరో రామ్చరణ్.
ప్రస్తుతం ఇంటర్వెల్కి ముందు వచ్చే లీడ్ సీన్ తీస్తున్నారని సమాచారం. ఇంటర్వెల్ బ్యాంగ్ అంటే కచ్చితంగా అదిరిపోయేలా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో.. రామ్చరణ్ ఇంటర్వెల్ సీన్స్తో ఈ సెట్స్లోకి ఎంటరయ్యారన్నమాట. కియారా అద్వానీ కూడా సెట్స్లోకి అడుగుపెట్టింది. ఆ సంగతలా ఉంచితే.. ఈ షూటింగ్ లొకేషన్లో బుధవారం బోయపాటి బర్త్డే జరిగింది. చిత్రబృందం సమక్షంలో బోయపాటి కేక్ కట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment