ramcharan tej
-
తొలి విహార యాత్ర!
రామ్చరణ్, ఉపాసన ఇటలీ వెళ్లారు. తమ కుమార్తె క్లీం కారని తీసుకుని ఈ విహార యాత్రకు వెళ్లారు. కుమార్తెతో చరణ్, ఉపాసన వెళ్లిన ఫస్ట్ వెకేషన్ ఇది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తున్నారు రామ్ చరణ్. ఈ సినిమా తాజా షెడ్యూల్ మంగళవారంతో పూర్తయింది. తర్వాతి షెడ్యూల్కి కాస్త గ్యాప్ రావడంతో కుటుంబంతో కలిసి బుధవారం ఇటలీ వెకేషన్కు బయలుదేరారు రామ్చరణ్. దాదాపు వారంరోజుల పాటు ఈ ట్రిప్ని ΄్లాన్ చేసుకున్నారని సమాచారం. -
పలు గెటప్స్లలో కనిపించనున్న టాప్ హీరోలు
అభిమాన హీరోలు వెండితెరపై ఒక గెటప్లో కనిపిస్తేనే ఫ్యాన్స్ ఖుషీ అవుతారు. అలాంటిది ఆ స్టార్ హీరో పలు రకాల గెటప్స్లో కనిపిస్తే ఆ ఖుషీ డబుల్ అవుతుంది. అలా డిఫరెంట్ గెటప్స్లో కనిపించే కథలు కొందరు స్టార్స్కి సెట్ అయ్యాయి. ఒక్కో హీరో మినిమమ్ నాలుగు, ఇంకా ఎక్కువ గెటప్స్లో కనిపించనున్నారు. గెట్.. సెట్.. గెటప్స్ అంటూ ఆ స్టార్స్ చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. విభిన్న భారతీయుడు విభిన్నమైన గెటప్స్లో కనిపించడం కమల్హాసన్కు కొత్తేం కాదు. ‘దశావతారం’లో కమల్ పది పాత్రల్లో పది గెటప్స్ చేసి ఆడియన్స్ను ఆశ్చర్యపరిచారు. అన్ని పాత్రల్లో కాదు కానీ ‘ఇండియన్ 2’లో కమల్హాసన్ డిఫరెంట్ గెటప్స్లో కనిపించనున్నారని తెలుస్తోంది. 1996లో హీరో కమల్హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు సీక్వెల్గా ‘ఇండియన్ 2’ వీరి కాంబినేషన్లోనే రూపొందుతోంది. 1920 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని, ఇందులో కమల్హాసన్ నాలుగుకి మించి గెటప్స్లో కనిపిస్తారని కోలీవుడ్ టాక్. వీటిలో లేడీ గెటప్ ఒకటనే టాక్ తెరపైకి వచ్చింది. మహిళగా, 90 ఏళ్ల వృద్ధుడిగా, యువకుడిగా.. ఇలా విభిన్నంగా కనిపించడానికి కమల్కి ప్రోస్థటిక్ మేకప్ వేసుకోవడానికి, తీయడానికి మూడు గంటలకు పైగా పడుతోందని యూనిట్ అంటోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. పెయింటరా? సైంటిస్టా? పెయింటరా? రైతా? సైంటిస్టా? అసలు ‘ఈగిల్’ సినిమాలో రవితేజ క్యారెక్టర్ ఏంటి? అనే సందేహం తీరాలంటే ఈ సంక్రాంతి వరకూ వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడే. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ ఫిల్మ్ ‘ఈగిల్’. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ ఓ లీడ్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇందులో రవితేజ ఐదారు గెటప్స్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. వీటిలో ప్రొఫెషనల్ స్నైపర్ గెటప్ ఒకటి అని భోగట్టా. ఇంకా రవితేజ లుక్ విడుదల కాలేదు. పదికి మించి.. ప్రయోగాత్మక పాత్రలకు సూర్య ముందుంటారు. ‘సుందరాంగుడు’, ‘సెవెన్త్ సెన్స్’, ‘24’, ‘బ్రదర్స్’... ఇలా సూర్య కెరీర్లో వైవిధ్యమైన చిత్రాల జాబితా ఎక్కువే. ఈ కోవలోనే సూర్య నటించిన మరో చిత్రం ‘కంగువా’. శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సూర్య పదమూడు గెటప్స్లో కనిపిస్తారనే టాక్ ఎప్పట్నుంచో వినిపిస్తోంది. 17వ శతాబ్దంలో మొదలై 2023కి కనెక్ట్ అయ్యేలా ‘కంగువా’ కథను రెడీ చేశారట శివ. రెండు భాగాలుగా విడుదల కానున్న ‘కంగువా’ తొలి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. స్టూడెంట్.. రాజకీయ నాయకుడు కాలేజ్ స్టూడెంట్, ఐఏఎస్ ఆఫీసర్, రాజకీయ పార్టీ కార్యకర్త... ఇలా ‘గేమ్ చేంజర్’ సినిమాలో రామ్చరణ్ ఏడు గెటప్స్లో కనిపిస్తారనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్లాష్బ్యాక్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. రాజకీయ నాయకులకు, ఐఏఎస్ ఆఫీసర్లకు మధ్య నెలకొని ఉండే అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందట. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. 2 దశాబ్దాలు.. 4 గెటప్స్ ‘తొలిప్రేమ’ (2018)లో వరుణ్ తేజ్ క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తాయి. కాలేజీ కుర్రాడిలా, ఉద్యోగం చేసే వ్యక్తిగా కనిపిస్తారు. ఇదే తరహాలో వరుణ్ తేజ్ మరో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే ‘మట్కా’. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ నాలుగు గెటప్స్లో కనిపిస్తారని చిత్ర యూనిట్ వెల్లడించింది. వైజాగ్ నేపథ్యంలో 1958 నుంచి 1982 టైమ్ పీరియడ్లో ‘మట్కా’ కథనం ఉంటుంది. ‘పలాస’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ అక్టోబరు మొదటి వారంలో ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేస్తారు. పలు అవతారాల్లో స్మగ్లింగ్ స్మగ్లింగ్ చేస్తున్నారట కార్తీ. అది కూడా గోల్డ్ స్మగ్లింగ్. ఇందులో భాగంగా అధికారులను బోల్తా కొట్టించేందుకు తన గెటప్ మార్చుతుంటారట. ఇదంతా ‘జపాన్’ సినిమా కోసం. రాజు మురుగన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని, ఇందులో కార్తీ డిఫరెంట్ గెటప్స్లో కనిపిస్తారని సమాచారం. ఈ చిత్రం ఈ దీపావళికి విడుదల కానుంది. -
‘సిరివెన్నెల’ చివరి పాట మా సినిమాలో ఉండడం అదృష్టం: నిర్మాత
‘‘ప్రేక్షకుడిగా నేనో సినిమా చూసినప్పుడు కథలో కొత్తదనం ఉండాలని కోరుకుంటాను. ‘బెదురులంక 2012’ కథలో అలాంటి కొత్తదనాన్ని చూపించారు క్లాక్స్’’ అని నిర్మాత బెన్నీ ముప్పానేని అన్నారు. కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి జంటగా క్లాక్స్ దర్శకత్వం వహించిన చిత్రం ‘బెదురులంక 2012’. సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ సందర్భంగా బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ– ‘‘సినిమాలపై ఉన్న ఆసక్తితో సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి, నిర్మాతగా మారాను. ఓ ఊహాజనిత గ్రామంలో 2012లో 21 రోజులు ఏం జరిగింది? అనేది ‘బెదురులంక 2012’ చిత్రకథ. మనం చని΄ోతాం అని తెలిస్తే చివరి క్షణాల్లో ఎలా ఉంటాం? అనేది సినిమా కోర్ పాయింట్. కార్తికేయ చాలా ప్రొఫెషనల్. అతనితో మరో సినిమా చేద్దామనుకుంటున్నాం. నేహా శెట్టి పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఒదిగి΄ోయారు. మణిశర్మగారు అద్భుతమైన సంగీతం ఇచ్చారు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు రాసిన చివరి పాట మా సినిమాలో ఉండటం మా అదృష్టం. మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన రామ్చరణ్గారు కథని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం మా బ్యానర్లో మూడు ్రపాజెక్ట్స్ ఓకే చేశాం’’ అన్నారు. -
దుబాయ్లో బేబీ షవర్
రామ్చరణ్–ఉపాసన ఫుల్ జోష్లో ఉన్నారు. తల్లి దండ్రులు కాబోతున్న ఆనందం అది. ఇటీవల లాస్ ఏంజిల్స్లో జరిగిన ఆస్కార్ అవార్డు వేడుకకు హాజరైన ఈ దంపతులు ప్రస్తుతం దుబాయ్లో ఉన్నారు. అక్కడి నమ్మోస్ బీచ్ క్లబ్లో ఉపాసన బేబీ షవర్ జరిగింది. ఈ వేడుకలో రామ్చరణ్, ఉపాసనల స్నేహితులు, కజిన్స్ పాల్గొన్నారని సమాచారం. కొన్ని ఫొటోలను ఉపాసన షేర్ చేశారు. వేడుకలో తెలుపు రంగు గౌనులో ఆమె మెరిసిపోయారు. కొన్నాళ్లు దుబాయ్లో వెకేషన్ని ఎంజాయ్ చేసి, చరణ్–ఉపాసన ఇండియా చేరుకుంటారట. ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ‘గేమ్ చేంజర్’ సినిమా షూట్లో పాల్గొంటారు చరణ్. -
ఆర్ఆర్ఆర్ ఖాతాలో మరో అరుదైన అవార్డు
ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు సాధించిన విషయం తెలిసిందే. తాజాగా 46వ జపాన్ అకాడమీ ఫిల్మ్ ప్రైజ్కు సంబంధించి ‘అవుట్ స్టాండింగ్ ఫారిన్ ఫిల్మ్’ విభాగంలో ‘ఆర్ఆర్ఆర్’ అవార్డు సాధించింది. ‘అవతార్: ద వే ఆఫ్ వాటర్’, ‘టాప్గన్: మ్యావరిక్’ వంటి హాలీవుడ్ చిత్రాలను దాటి ‘ఆర్ఆర్ఆర్’ ఈ జపాన్ అవార్డును సాధించడం విశేషం. గత ఏడాది జపాన్లో విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ అక్కడి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతున్న సంగతి తెలిసిందే. ఇక 95వ ఆస్కార్ అవార్డ్స్కు బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ‘నాటు నాటు’ పాట (మరికొన్ని విభాగాల్లో ‘ఆర్ఆర్ఆర్’ నామినేషన్ పోటీలో ఉంది), ‘బెస్ట్ ఫారిన్ ఫిల్మ్’ విభాగంలో గుజరాతీ ఫిల్మ్ ‘ఛెల్లో షో’, డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ‘ఆల్ దట్ బ్రీత్స్’, డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ‘ఎలిఫెంట్ విష్పర్స్’ ఆస్కార్స్ షార్ట్ లిస్ట్ జాబితాలో ఉన్నాయి. ‘ఆర్ఆర్ఆర్’, ‘ఛెల్లో షో’లతో కలిపి పది ఇండియన్ చిత్రాలు ఆస్కార్ రిమైండర్ లిస్ట్లో ఉన్నాయి. కాగా నేడు ఆస్కార్ నామినేషన్స్ వెల్లడి కానున్నాయి. మరి.. ఎన్ని ఇండియన్ చిత్రాలు నామినేషన్స్ దక్కించుకుంటాయో చూడాలి.. -
SS Rajamouli: ప్రసంశల గురించి పెద్దగా ఆలోచించను నాకు కావాల్సింది అదే!
‘ఆర్ఆర్ఆర్’ చిత్రం 95వ ఆస్కార్ అవార్డ్స్కు ఇండియా తరఫున అఫీషియల్ ఎంట్రీగా ఎంపిక కాకపోవడం అనేది కాస్త నిరుత్సహపరిచిందని దర్శకుడు రాజమౌళి పేర్కొన్నారు. ఓ ఆంగ్ల ఆన్లైన్ పోర్టల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి ఈ విధంగా స్పందించారు. ‘‘మన దేశం తరఫున ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు అధికారిక ఎంట్రీ లభించకపోవడంతో నిరాశ చెందాను. ‘ఆర్ఆర్ఆర్’కు ఆఫీషియల్ ఎంట్రీ లభిస్తే బాగుండేదన్నట్లుగా విదేశీయులు సైతం అనుకుంటున్నారు. అయితే మా సినిమాకు ఎందుకు అధికారిక ఎంట్రీ లభించలేదు? అని పదే పదే ఆలోచిస్తూ ఉండే మనస్తత్వాలు కావు మావి. జరిగిందేదో జరిగిపోయింది. మనం ముందుకు సాగిపోవాలి. అయినా ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎఫ్ఐ) కమిటీ నియమ, నిబంధనలు, మార్గదర్శకాలు వంటి అంశాల గురించి నాకు తెలియదు కాబట్టి నేను ఈ విషయంపై కామెంట్ చేయాలనుకోవడం లేదు. ఇక దేశం తరఫున అఫీషియల్ ఎంట్రీగా పంపిన ‘ఛెల్లో షో’ (గుజరాతీ ఫిల్మ్, ఇంగ్లిష్లో ‘లాస్ట్ ఫిల్మ్ షో) చిత్రానికి ఆస్కార్ షార్ట్ లిస్ట్లో స్థానం లభించినందుకు నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది కూడా ఇండియన్ సినిమాయే’’ అని చెప్పుకొచ్చారు రాజమౌళి. కాగా ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటునాటు’ సాంగ్కు ఆస్కార్ షార్ట్ లిస్ట్లో స్థానం లభించింది. ఇక గుజరాతీ ఫిల్మ్ ‘ఛెల్లో షో’ ఇండియా తరఫున అధికారిక ఎంట్రీగా బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ విభాగంలో షార్ట్లిస్ట్ కాగా, ‘ఆర్ఆర్ఆర్’తో పాటు మరో ఎనిమిది ఇండియన్ చిత్రాలు ‘ఆస్కార్ రిమైండర్ లిస్ట్’లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక 95వ ఆస్కార్ అవార్డ్స్కు సంబంధించిన నామినేషన్స్ ఈ నెల 24న వెల్లడికానున్నాయి. అవార్డ్ ఫంక్షన్ మార్చిలో జరగనుంది. ‘ఆర్ఆర్ఆర్’ విషయానికి వస్తే.. ఎన్టీఆర్, రామ్చరణ్లు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన విషయం తెలిసిందే. డబ్బు కోసమే... డబ్బు, ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే ఓ దర్శకుడిగా నేను సినిమాలు తీస్తాను. విమర్శకుల ప్రసంశల గురించి పెద్దగా ఆలోచించను. ‘ఆర్ఆర్ఆర్’ ఓ కమర్షియల్ ఫిల్మ్. బాక్సాఫీస్ వద్ద నా సినిమా కమర్షియల్గా సక్సెస్ అయితే నేను హ్యాపీ. అవార్డ్స్ను బోనస్లా భావిస్తాను. అయితే ఓ సినిమా కోసం పడిన కష్టానికి గుర్తింపు లభిస్తే నాకు, నా చిత్రబృందానికి సంతోషం అనిపిస్తుంది’’ అని కూడా పేర్కొన్నారు రాజమౌళి. ఇక మహేశ్బాబు హీరోగా రాజమౌళి తర్వాతి సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. -
Seattle Film Critics Society: ఆర్ఆర్ఆర్ ఫైట్స్కి అవార్డ్
ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు అందుకున్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో మరో అవార్డు చేరింది. సియాటెల్ ఫిలిం క్రిటిక్స్ సొసైటీ అవార్డ్స్లో బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ కేటగిరీలో అవార్డు దక్కించుకుంది. ఈ విషయాన్ని సదరు సొసైటీ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. విక్కీ ఆరోరా, ఇవాన్ కోస్టాడినోవ్, నిక్ పావెల్, రాయిచో వాసిలెవ్ స్టంట్స్ కో ఆర్డినేటర్లుగా చేయగా, ప్రేమ్ రక్షిత్, దినేశ్ కృష్ణన్ స్టంట్స్ కొరియోగ్రఫీ చేశారు. హాలీవుడ్ చిత్రాలు ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ అట్ ఒన్స్, ది నార్త్మేన్, టాప్ గప్: మ్యావరిక్’లతో పోటీపడి ‘ఆర్ఆర్ ఆర్’ అవార్డు దక్కించుకోవడం విశేషం. -
నాటు నాటుకు ఆస్కార్ అవార్డు.. ఆస్కార్ రావాలంటే ఎలాంటి అర్హతలుండాలి
-
Golden Globe Awards 2023: తెలుగు నాటు యమా హిట్టు
నాటుదనంలో మాయామర్మం ఉండదు. నాటుదనంలో కల్లాకపటం ఉండదు. నాటుదనంలో హొయలు వగలు ఉండవు. నాటుదనంలో తళుకూ జిలుగూ ఉండవు. నాటుదనం గ్రామీణం. నాటుదనం భోళాతనం. నాటుదనం సాంస్కృతిక వరం. నాటుదనం మేకప్పు లేని సౌందర్యం. అందుకే ప్రపంచం మెచ్చింది. తెలుగు నాటుదనానికి చరిత్రాత్మక గుర్తింపునిచ్చింది. 78 ఏళ్లుగా ఇస్తున్న హాలీవుడ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్లో భారతదేశం నుంచి అందునా తెలుగు నుంచి మొట్ట మొదటిసారి ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’గా ఆర్.ఆర్.ఆర్లోని ‘నాటు నాటు’ పాట అవార్డు గెలుచుకుంది. సంగీత దర్శకుడు కీరవాణి తెలుగు కీర్తిని పెంచారు. రాసినవారు, పాడినవారు, ఆడినవారు, ఆడించినవారు, ఆదరించిన తెలుగు కుటుంబాలు సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం ఇది. పరమ నాటు సమయం. పాట కూడా ఒక్కోసారి బాకులా గుచ్చుకుంటుంది. గజమో రెండు గజాలో దూరం కాకుండా సముద్రాలు దాటి తియ్యటి గాటు పెడుతుంది. పల్లవి చెంప నిమురుతుంది. చరణం గుండె తడుముతుంది. పదం పదం కలిసి జ్వరం తెప్పించి వెర్రెక్కిస్తుంది. భాష తెలియని భావం అక్కర్లేని నాదం ముందుకు దుముకుతుంది. హోరున తాకే జలపాతం కింద నిలబడినవాడి జాతి ఏదైతే ఏంటి... రీతి ఏదైతే ఏంటి... నిలువునా తడిపేస్తుంది. పాట కూడా అంతే. ప్రణతి, ఎన్టీఆర్, రాజమౌళి, రమ, శ్రీవల్లి, కీరవాణి, ఉపాసన, రామ్చరణ్, కార్తికేయ, శోభు యార్లగడ్డ పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు... అది గుంటూరు మిర్చి పొలం కావచ్చు. బహుశా నెల్లూరు పోలేరమ్మ జాతర కావచ్చు. కాకుంటే లష్కర్ బోనాలు కావచ్చు. అయితే మేడారం మహా సంగమం కావచ్చు. తెలుగుదనం అది. తెలుగు ఘనం. తెలుగు జనం. తెలుగు జయం. గ్రామీణ తేటదనం. అమాయక నాటుదనం. అది ఊరి పెద్దమనిషి తలపాగ. పేదరైతు భుజాన కండువ. నిండు గాజుల ఇల్లాలి నుదుటి బొట్టు. రోకలి దంచే యువతి చెంపన చెమట చుక్క. అది నిర్మల్ కొయ్యబొమ్మ. కొండపల్లి పూలకొమ్మ. ఉత్త నాటు సౌందర్యం. బహుమేటి సౌందర్యం. నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు నాటు నాటు నాటు నాటు నాటు ఊర నాటు ఈ నాటు ఇప్పడు ప్రపంచాన్ని గెలిచింది. సినిమా ద్వారా అయితేనేమి తెలుగు మాట ఖండాతరాలలో మోగింది. తెలుగు బాణి దేశదేశాల వాళ్లతో చిందులు వేయించింది. తెలుగు దరువు భూగోళాన్ని డండనకర ఆడించింది. తెలుగువారికి ఏం తక్కువ? మనకంటే ఎవరు ఎక్కువ? చులకన చేయని ఘనత ఆర్.ఆర్.ఆర్లో ‘నాటు నాటు’ పాట వచ్చే సందర్భం ఆంగ్లేయులు తమను తాము గొప్ప చేసుకుంటూ తెలుగు వారికి ఏం వచ్చు అని ప్రశ్నించే సందర్భం. వాళ్ల స్టయిలు డాన్సులు, నైసు స్టెప్పులే గొప్ప అనుకుంటూ కథా నాయకులైన రామ్ను, భీమ్ను నిలదీసే సందర్భం. దానికి జవాబుగా తెలుగువారు రంగంలోకి దిగితే పరిస్థితి ఎంత నాటుగా ఉంటుందో హీరోలు చెప్పాలి. అందుకు పాట కావాలి. గీత రచయిత చంద్రబోస్కు సిట్యుయేషన్ చెప్పి ‘నువ్వు ఏదైనా రాయి మన ఘనత చాటుకునేలా ఉండాలి. ఎదుటివారిని అవమానించేలా తిట్టేలా ఉండకూడదు’ అన్నాడు దర్శకుడు రాజమౌళి. ఇంగ్లిష్ వాణ్ణి తిట్టకుండా చెంప పగులగొట్టాలన్న మాట. చల్లగరిగ (జయశంకర్ భూపాలపల్లి జిల్లా) లాంటి చిన్న పల్లెలో పుట్టిన చంద్రబోస్కి తెలుగు వేగం, తెలంగాణ యోగం తెలియనిది ఏముంది? పాట పుట్టింది. కిర్రు సెప్పులేసుకుని కర్రసాము సేసినట్టు మర్రిసెట్టు నీడలోన కుర్రగుంపు కూడినట్టు ఎర్రజొన్న రొట్టెలోన మిరపతొక్కు కలిపినట్టు నా పాట చూడు నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు చంద్రబోస్ మొత్తం పాట రాశాక కీరవాణి దానికి ట్యూన్ చేశాడు. పాట రాశాక ఫైనల్ వెర్షన్గా పాట బయటపడటానికి మధ్య దాదాపు 19 నెలలు ఉన్నాయి కరోనా వల్ల. ‘లోపలున పానమంతా దముకు దుముకులాడేలా’ చంద్రబోస్ రాయడం, ‘వొంటిలోన రగతమంతా రంకెలేసి ఎగిరేలా’ కీరవాణి ట్యూన్ చేయడం... దాంతో అది కోటి ఈలల పాటైంది. జపాన్ వాడి ఈల.. రష్యావాడి ఈల... చైనా వాడిదీ... వమెరికా వాడిదీనూ. పాదాల తుఫాను రికార్డింగ్ థియేటర్లో వాయుగుండం బలపడింది. ఇక అది తెర మీద తుఫానులా తాకాలి. గంటకు 240 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయాలి. పులి ఒకరు, బెబ్బులి ఒకరుగా ఇద్దరు హీరోలు... ఎన్టీఆర్, రామ్ చరణ్ సిద్ధంగా ఉన్నారు. వీరి కాళ్లకు గజ్జెలు కట్టే వీరుడు కావాలి. ప్రేమ రక్షిత్. ఈ పాండిచ్చేరి కుర్రాడు హైదరాబాద్నే తన రెండో ఇల్లు చేసుకున్నాడు. కొరియోగ్రఫీని ఒంట్లో నింపుకున్నాడు. ‘ఈ పాటను నువ్వు ఎలాగైనా కంపోజ్ చెయ్. కాని ఇద్దరు హీరోలు ఈక్వల్గా కనిపించాలి’ అనేది దర్శకుడి షరతు. ‘ఎవరి ఎనర్జీ లెవల్ కూడా తగ్గినట్టుగా స్క్రీన్ మీద ఉండరాదు’ అన్నాడు దర్శకుడు. ప్రేమ్ రక్షిత్ పాటను అందుకున్నాడు. నెల రోజులు తపస్సు చేశాడు. హుక్ స్టెప్ (వైరల్ అయిన స్టెప్) కోసం యాభై రకాల మూవ్మెంట్స్ సిద్ధం చేస్తే దర్శకుడికి ఇప్పుడు ఉన్నది నచ్చింది. పాట కోసం మొత్తం 94 రకాల మూవ్మెంట్స్ని కంపోజ్ చేశాడు ప్రేమ్ రక్షిత్. పాటను ఉక్రెయిన్లో ప్రెసిడెంట్ ప్యాలెస్ దగ్గర 20 రోజులు షూట్ చేశారు. ఇద్దరూ సింగిల్ టేక్ ఆర్టిస్టులే అయినా పర్ఫెక్ట్ సింక్ కోసం దాదాపు 46 రీటేకులు అయ్యాయి. నాటు నాటు నాచో నాచో తెలుగు తమిళ మలయాళ హిందీ భాషల్లో నాటు నాటు వీర నాటు హిట్ కొట్టింది. ఇందులోని హుక్ స్టెప్ను ఆబాల గోపాలం ఇమిటేట్ చేసింది. యూ ట్యూబ్ షాట్స్, ఇన్స్టా రీల్స్ వందల వేలుగా తయారయ్యాయి. సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ కూడా ఈ స్టెప్ను రిపీట్ చేశారు. ప్రపంచమంతా తెలుగు మోత మోగింది. ఒకప్పుడు రాజ్ కపూర్ చేసిన ‘ఆవారా హూ’ పాట ఇంత పెద్ద హిట్ అయ్యింది. తమిళంలో రహెమాన్ చేసిన ‘తిల్లానా తిల్లానా’ ఇలాగే హిట్ అయ్యింది. ఇప్పుడు తెలుగు వంతు. మన జానపదం, మన నాటుదనం ఇప్పుడు కేకమీదున్నాయి. ఇది తెలుగు ఘనం. ఇది తెలుగు జయం. ఇద్దరు స్టార్స్కి కొరియోగ్రాఫ్ చేయడం అనేది పెద్ద సవాల్. ఎందుకంటే ఒక్కో స్టార్కి ఒక్కో స్టైల్ ఉంటుంది. ‘నాటు నాటు..’కి రెండు స్టయిల్స్ తీసుకుని, ఒకే స్టయిల్గా మార్చడం జరిగింది. నేను సవాల్గా తీసుకుని ఈ పాట చేశాను. కొరియోగ్రాఫ్ చేయడానికి నాకు రెండు నెలలు పట్టింది. చిత్రీకరణకు 20 రోజులు. 43 రీటేక్స్ తీసుకోవడం జరిగింది. మొదట్లో కొంచెం భయం అనిపించింది. ఎందుకంటే ఇద్దరు స్టార్స్ని సమానంగా చూపించాలి. అందుకే చివరి వరకూ పాటకు మెరుగులు దిద్దుతూనే ఉండేవాళ్లం. – ప్రేమ్ రక్షిత్, కొరియోగ్రాఫర్ కీరవాణి సార్తో నా ప్రయాణం ఒక దశాబ్దం నాటిది. సార్ నన్ను న మ్మి ‘నాటు నాటు..’ ని నాలుగు భాషల్లో పాడేలా చేశారు. ఇది నాకు అద్భుతమైన అవకాశం. ‘ఆర్ఆర్ఆర్’కి పాడటం అనేది నాకో పెద్ద చాలెంజ్. నిరూపించుకోవాలని చాలా కష్టపడి పాట పాడాను. ఈ పాటను పెద్ద హిట్ చేసినందుకు యావత్ భారతదేశానికి ధన్యవాదాలు. – రాహుల్ సిప్లిగంజ్, గాయకుడు ‘‘నా జీవితంలో మరచిపోలేని మధుర క్షణాలివి. ఎందుకంటే ‘నాటు నాటు’ పాట విశ్వ వేదిక మీద విజయం సాధించింది. రచయితగా చాలా చాలా సంతోషంగా, గర్వంగా ఉంది’’ అన్నారు చంద్రబోస్.‘‘28 ఏళ్ల ప్రస్థానం, 850 చిత్రాలు, 3,600లకు పైగా పాటలు.. మొట్ట మొదటి పాట ‘తాజ్మహల్’లోని ‘మంచు కొండల్లోన చంద్రమా..’ నుండి ఇప్పటి ‘వాల్తేరు వీరయ్య’లోని పాట వరకూ.. ప్రతి పాటకూ తపస్సే, మథనమే జ్వలనమే. 3500 సార్లకు పైగా తపస్సు చేస్తే ఒక్కసారైనా భగవంతుడు ప్రత్యక్షమవుతాడు కదా. ఈసారి ‘నాటు నాటు..’ పాటకు భగవంతుడు ప్రత్యక్షం అయి, వరం ఇచ్చాడని భావిస్తున్నాను. – చంద్రబోస్, రచయిత ప్రతి భారతీయుడిని గర్వించేలా చేసింది ‘‘ఈ విజయం చాలా ప్రత్యేకం. కీరవాణి, ప్రేమ్ రక్షిత్, కాలభైరవ, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్లకు అభి నందనలు. ఎస్.ఎస్. రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్తో పాటు ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర బృందానికి అభినందనలు. ఈ ప్రతిష్టాత్మక గౌరవం ప్రతి భారతీయుడిని ఎంతగానో గర్వించేలా చేసింది’’ అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. చిత్ర బృందాన్ని అభినందిస్తూ ట్వీట్ చేశారు. – నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి మరిన్ని విజయాలు సాధించాలి ‘నాటు నాటు’ గోల్డెన్ గ్లోబ్ అవార్డు సాధించి నందుకు ‘ఆర్ఆర్ ఆర్’ యూనిట్ని గవర్నర్ విశ్వ భూషణ్ హరి చందన్ అభినందించారు. ఈ పాటకు అవార్డు రావడం ద్వారా తెలుగు సినిమా ప్రపంచ సంగీత వేదికపై గర్వించదగ్గ స్థాయిలో నిలిచిందన్నారు. తెలుగు సినీ పరిశ్రమ భవిష్యత్లో అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించా లని గవర్నర్ ఆకాంక్షించినట్లుగా రాజ్ భవన్ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. – విశ్వభూషణ్ హరిచందన్, గవర్నర్ ఆర్ఆర్ఆర్ టీమ్కు అభినందనలు ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు సాధించి తెలుగుజెండాను రెపరెపలాడించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర యూనిట్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ‘ఆర్ఆర్ఆర్’ సాధించిన ఈ విజయాన్ని చూసి గర్వపడుతున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బుధవారం ట్వీట్ చేశారు. చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, హీరోలు తారక్ (జూనియర్ ఎన్టీఆర్), రామ్ చరణ్తోపాటు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా టీమ్ మొత్తానికి అభినందనలు తెలిపారు. – వైఎస్ జగన్ మోహన్రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి తెలుగు పాటకు దక్కిన గౌరవం ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడం భారతీయ సంగీతానికి, ప్రత్యేకంగా తెలుగు పాటకు దక్కిన అద్భుత గౌరవమని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి కొనియాడారు. ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు కీరవాణి, దర్శకుడు రాజమౌళి, నటులు రామ్చరణ్, ఎన్టీఆర్తో పాటు యావత్ చిత్ర యూనిట్కు ఆయన అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో మన సంగీతం, మన కొరియోగ్రఫీ, మన దర్శకత్వం, మన చిత్రాలు మరింత గుర్తింపును అందుకోవాలని కోరుకుంటున్నట్టు తెలియజేశారు. – కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి -
నాటు నాటుకు డ్యాన్స్ చేశా!
షారుక్ ఖాన్, దీపికా పదుకోన్ జంటగా నటించిన చిత్రం ‘పఠాన్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలింస్ నిర్మించిన ఈ హిందీ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. కాగా ఈ చిత్రం తెలుగు ట్రైలర్ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు హీరో రామ్చరణ్. ఈ సందర్భంగా ట్విట్టర్లో తనదైన స్టైల్లో రామ్చరణ్కి కృతజ్ఞతలు చెప్పారు షారుక్ ఖాన్. ‘‘థ్యాంక్యూ సో మచ్. నా మెగా పవర్స్టార్ రామ్చరణ్. మీ ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ఆస్కార్ అవార్డును ఇండియాకు తీసుకొచ్చినప్పుడు దయచేసి నన్ను తాకనివ్వండి.. లవ్యూ’’ అని ట్వీట్ చేశారు షారుక్. ‘‘తప్పకుండా ఎస్ఆర్కే సార్. ఈ అవార్డు ఇండియన్ సినిమాకు చెందింది’’ అని పోస్ట్ చేశారు చరణ్. కాగా ‘నాటు నాటు..’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించడం పట్ల షారుక్ ఖాన్ హర్షం వ్యక్తం చేశారు. ఉదయం వార్త తెలిసిన వెంటనే ‘నాటు నాటు..’ పాటకు డ్యాన్స్ చేశానని ట్విట్టర్లో వెల్లడించారు. భారత్ను గర్వపడేలా చేశారని ప్రశంసించారు. -
బాలీవుడ్ హీరోల రెమ్యూనరేషన్ ను దాటేస్తున్న టాలీవుడ్ హీరోలు
-
నేను తీసిన సినిమాలలో నా ఫేవరెట్ సీను అదే : రాజమౌళి
-
హీరోలను మించిపోతున్న వారి భార్యల క్రేజ్
-
చరణ్ - శంకర్ సినిమాలో మోహన్ లాల్
-
ఆర్ఆర్ఆర్ మరో రికార్డ్.. హాలీవుడ్ చిత్రాలను సైతం వెనక్కి నెట్టి..!
ఈ ఏడాది మరో పాన్ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో టాలీవుడ్ సత్తాను ప్రపంచానికి తెలియజేశాడు రాజమౌళి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ మూవీ మార్చి 25న విడుదలై, అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. రూ. 550 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం.. దాదాపు రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి టాలీవుడ్లో చరిత్ర సృష్టించింది. ఈ చిత్రానికి ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. తాజాగా ఈ చిత్రం సైట్ అండ్ సౌండ్ మ్యాగజైన్-2022 జాబితాలో 50 ఉత్తమ చిత్రాల్లో 9వ స్థానాన్ని పొందింది. ఆస్కార్ నామినేషన్స్ చిత్రాలైన టాప్ గన్ మావెరిక్, టార్లను అధిగమించింది. సౌండ్ అండ్ సైట్ మ్యాగజైన్-2022 రూపొందించిన జాబితాలో తెలుగు చిత్రం చోటు దక్కించుకుంది. అదే జాబితాలో చేరిన మరో భారతీయ చిత్రం షౌనక్ సేన్ డాక్యుమెంటరీ ఆల్ దట్ బ్రీత్స్ చిత్రానికి 32వ స్థానం దక్కింది. స్కాటిష్ చలనచిత్ర దర్శకుడు షార్లెట్ వెల్స్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఆఫ్టర్ సన్ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. ఆర్ఆర్ఆర్ ఈ జాబితాలోని టామ్ క్రూజ్ మూవీ టాప్ గన్: మావెరిక్, డేవిడ్ క్రోనెన్బర్గ్ చిత్రం క్రైమ్స్ ఆఫ్ ది ఫ్యూచర్, కేట్ బ్లాంచెట్ సినిమా టార్, గిల్లెర్మో డెల్ టోరో చిత్రం పినోచియో, ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్ వంటి అతిపెద్ద హాలీవుడ్ సినిమాలను అధిగమించింది. And the winner is… AFTERSUN (dir. Charlotte Wells) Find out what Sight and Sound critics have voted as the 50 best films of 2022 https://t.co/tGxmSad8jq — Sight and Sound magazine (@SightSoundmag) December 20, 2022 -
అరుదైన రికార్డు సాధించిన ధనుష్..
-
ఆర్ఆర్ఆర్ చిత్రం మరో ఘనత.. ప్రతిష్ఠాత్మక అవార్డులు కైవసం
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్. బాక్సాఫీస్ వద్ద ఆ మూవీ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం జపాన్లోనూ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. అక్టోబర్ 21న జపాన్లో విడుదలైన 'ఆర్ఆర్ఆర్' పలు రికార్డులు సృష్టించింది. ఈ చిత్రం అంతర్జాతీయ అవార్డుల పరంపరను కొనసాగిస్తోంది. తాజాగా మరో రెండు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుంది. ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (HCA)లో స్పాట్లైట్ అవార్డును కైవసం చేసుకుంది. ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ టీం ట్విటర్ ద్వారా వెల్లడించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24న లాస్ ఏంజెల్స్లో జరగనున్న 6వ హెచ్సీఏ ఫిల్మ్ అవార్డ్స్లో ఈ అవార్డును అందజేయనున్నారు. మరోవైపు అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్’ ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగానూ ‘ఆర్ఆర్ఆర్’ ఎంపికైంది. ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ‘సన్సెట్ సర్కిల్’, ‘శాటర్న్’ అవార్డులూ గెలుచుకుంది. ఇటీవల.. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ (ఎన్.వై.ఎఫ్.సి.సి) పురస్కారాల్లో ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి ఎంపికయ్యారు. ఇండియాలో సంచలనం సృష్టించిన ఈ సినిమా విదేశాల్లోనూ విడుదలై సత్తా చాటింది. కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాల్ని స్ఫూర్తిగా తీసుకుని ఓ కల్పిత కథతో రూపొందించిన ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్చరణ్ అద్భుతంగా నటించారు. Thank you so much @ATLFilmCritics 🙏🏻🙏🏻 #RRRMovie https://t.co/gczgxrsmWY — DVV Entertainment (@DVVMovies) December 5, 2022 We RRR elated... 🤩 The cast and crew of #RRRMovie bags the prestigious HCA Spotlight Winner Award! We'd like to thank the @HCAcritics jury for recognising #RRRMovie ! pic.twitter.com/j5S8B2Rgvq — RRR Movie (@RRRMovie) December 6, 2022 -
రీమేక్ లకు గుడ్ బై చెప్పిన మెగా బ్రదర్స్..!
-
2023 లో బాక్సాఫీస్ ని షేక్ చెయ్యబోతున్న సినిమాలివే..
-
శంకర్- రామ్చరణ్ సినిమా; పది కోట్ల పాట?
దర్శకుడు శంకర్ సినిమాల్లో సాంగ్స్ విజువల్స్ పరంగా, లొకేషన్స్ పరంగా చాలా గ్రాండియర్గా ఉంటాయన్న సంగతి తెలిసిందే. తాజాగా శంకర్ మరో గ్రాండియర్ సాంగ్ను తీసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసమే శంకర్ పది కోట్ల బడ్జెట్తో పాట ప్లాన్ చేశారట. ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ న్యూజిల్యాండ్లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ ఈ నెల 20 నుంచి డిసెంబరు 2 వరకు జరుగుతుందట. హీరో రామ్చరణ్, హీరోయిన్ కియారా అద్వానీలపై గ్రాండ్గా డ్యూయట్ సాంగ్ చిత్రీకరించనున్నారని సమాచారం. వార్తల్లో ఉన్న ప్రకారం ఈ పాటకు దాదాపు పదికోట్ల రూపాయలకు పైనే బడ్జెట్ను కేటాయించారట. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ ఈ పాటకు నృత్యరీతులు సమకూర్చుతారని సమాచారం. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతదర్శకుడు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించిన రామ్ చరణ్
-
ఆర్ఆర్ఆర్ సీక్వెల్.. రాజమౌళి క్లారిటీ ఇదే..!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీస్టారర్లుగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం.. రణం.. రుధిరం). దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 24న విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టింది. రూ.1200 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా సత్తా చాటింది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ చిత్రం ఇటీవలే జపాన్లోనూ విడుదలైంది. జపాన్లోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. (చదవండి: ఆర్ఆర్ఆర్ మరో రికార్డ్.. హాలీవుడ్ చిత్రాలను సైతం వెనక్కి నెట్టి..!) అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఫ్యాన్స్ ఆర్ఆర్ఆర్ సీక్వెల్పై అంతా చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై తాజాగా దర్శకుడు రాజమౌళి స్పందించారు. ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. ఇటీవల చికాగోలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజమౌళి మాట్లాడుతూ.. 'నా చిత్రాలకు మా నాన్నే రచయిత. మేమిద్దరం ఆర్ఆర్ఆర్-2 పై చర్చించాం. కథ రూపొందించే పనిలో మా నాన్న నిమగ్నమై ఉన్నారు.' అని అన్నారు. ఈ ప్రకటనతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి ఎట్టకేలకు ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ఉంటుందని ప్రకటించడంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. -
బుచ్చిబాబు తో రామ్ చరణ్ సినిమా ..?
-
జపాన్లో రామ్ చరణ్ వీరాభిమాని.. ఆమె ప్రతిభకు చెర్రీ ఫిదా
ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ల కోసం జపాన్ వెళ్లిన చిత్రబృందానికి అక్కడ అభిమానులు ఘనస్వాగతం పలికారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎక్కడికెళ్లినా ఫోటోల కోసం ఫ్యాన్స్ ఎగబడ్డారు. జపాన్ లో కూడా ఈ హీరోల క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. విదేశియులు సైతం మన ఆర్ఆర్ఆర్ హీరోల నటనకు ఫిదా అయిపోయారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ ఓ డై హర్డ్ ఫ్యాన్ను కలుసుకున్నారు. (చదవండి: రామ్ చరణ్ మాటలకు ఏడ్చేసిన జపాన్ ఫ్యాన్స్) చరణ్కు వీరాభిమాని అయిన ఆ మహిళ వయసు దాదాపు 70 ఏళ్లకు పైగానే ఉంటుంది. రామ్ చరణ్ సినిమాలు గతంలో జపాన్లో విడుదల కావడంతో ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగింది. తాజాగా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ల కోసం వెళ్లిన స్టార్ హీరో ఆమెను కలుసుకుని ఓ జ్ఞాపికను అందజేశారు. దీంతో సంతోషం వ్యక్తం చేశారు. ఆమె వేసిన పెయింటింగ్స్ అద్భుతంగా ఉన్నాయని రామ్ చరణ్ ప్రశంసించారు. ఇంతకీ ఆమె ఎవరంటే.. జపాన్కు చెందిన నోరికో కాసై అనే మహిళ ఓ ఆర్టిస్ట్. రామ్ చరణ్ చిత్రాలను గీసి తన అభిమానాన్ని చాటుకుంటోంది. ఆమెతో సరదాగా మాట్లాడిన చెర్రీ ఫోటోలు దిగి ఆశ్చర్యానికి గురిచేశారు. ఆ ఫోటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. రామ్చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్లుగా నటించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్'. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. విడుదలైన అన్ని భాషల్లో ఈ మూవీ కాసుల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1200కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. రీసెంట్ ఈ సినిమాను జపాన్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 21న జపాన్ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ అయ్యింది. -
జపాన్ వీధుల్లో చరణ్, తారక్ హంగామా
-
రంగస్థలం - 2 షూటింగ్ ఎప్పుడంటే ..!
-
రామ్చరణ్- శంకర్ కాంబినేషన్.. క్రేజీ అప్డేట్..!
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం క్రేజీ అప్డేట్ వచ్చింది. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ రేపటి నుంచి ప్రారంభం కానుందని సోషల్ మీడియాలో ఓ వార్త వైరలవుతోంది. రాజమండ్రిలో జరగనున్న షూటింగ్ కోసం రామ్చరణ్ ఇప్పటికే అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం రామ్చరణ్ 15వ సినిమాగా నిలవనుంది. ఆరు రోజుల పాటు రాజమండ్రిలో షూట్ జరగనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ అయితే తాను చేస్తున్నాడు. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ కనిపంచనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. దీపావళి కానుకగా చరణ్ ఫస్ట్ లుక్ విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. #RamCharan Latest 📸 Instagram Post 🤩 Rajahmundry schedule for #RC15 starts from Tomorrow (6 Days Schedule for Father role)#RamCharanForOscars 💥 #RRRInJapan pic.twitter.com/74fDlBAe76 — Ujjwal Reddy (@HumanTsunaME) October 9, 2022 -
లాస్ఎంజిల్స్లో ఆర్ఆర్ఆర్ షో.. రాజమౌళిపై జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ వైరల్
టాలీవుడ్లో సంచలనం ఆర్ఆర్ఆర్ మూవీ. తాజాగా ఈ చిత్రాన్ని అమెరికాలోని లాస్ఎంజిల్స్లోని ఓ థియేటర్లో ప్రత్యేక షో వేశారు. ఈ షోకు చిత్ర దర్శకుడు రాజమౌళి కూడా హాజరయ్యారు. తాజాగా ఈ షో విజయవంతం కావడం పట్ల రాజమౌళి ట్వీటర్ వేదికగా పంచుకున్నారు. తాజాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దీనిపై స్పందించారు. ఈ ఘనతలన్నింటికీ మీరే అర్హులు జక్కన్న అంటూ పోస్ట్ చేశారు. నిన్న దర్శకధీరునిపై రామ్ చరణ్ ట్వీట్ చేయగా.. ఇవాళ యంగ్ టైగర్ రాజమౌళిని సోషల్ మీడియా వేదికగా ప్రశంసించారు. You deserve all the applause you’re getting and much more Jakkanna @ssrajamouli https://t.co/jMbSlGuobS — Jr NTR (@tarak9999) October 3, 2022 థియేటర్లో ఫ్యాన్స్ సందడి: నాటు నాటు సాంగ్కు ఫారిన్ ఫ్యాన్స్ సైతం డ్యాన్స్ చేస్తూ థియేటర్లలో సందడి చేశారు. ఈ విషయాన్ని ట్విటర్లో పంచుకున్న రాజమౌళి ప్రేక్షకులను ధన్యవాదాలు తెలిపారు. ఆయన ట్వీట్ చేస్తూ 'నా హీరోలు, నా సినిమా, నా పట్ల మీ అభిమానం, ప్రశంసలు చాలా అపారమైనవి. థ్యాంక్స్ యూఎస్ఎ' అంటూ పోస్ట్ చేశారు. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ తమ పాత్రలతో అదరగొట్టారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఆర్ఆర్ఆర్ రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. Your adoration and applause towards my heroes, my film and me were enormous. THANK YOU USA 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/YH0hPL1q3H — rajamouli ss (@ssrajamouli) October 1, 2022 ఒక్క షో.. రూ.17 లక్షలు: దాదాపు 932 సీట్లు కెపాసిటీ గల థియేటర్లో ఆర్ఆర్ఆర్ షో వేయడంతో సుమారు రూ.17 లక్షలకు పైగా వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. యూఎస్లో జరిగే బియాండ్ ఫెస్ట్లో భాగంగా ఈ చిత్రాన్ని రీ-రిలీజ్ చేశారు. ఈ ప్రత్యేక షో టికెట్లు కేవలం 20 నిమిషాల్లోనే అమ్ముడయ్యాయి. -
రాజమౌళిపై రామ్ చరణ్ ట్వీట్.. వీడియో వైరల్..!
'ఆర్ఆర్ఆర్' అంటే తెలుగు ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సాధించిన మూవీ. ఈ సినిమా దర్శకధీరుడు రాజమౌళిని మరోస్థాయికి తీసుకెళ్లింది. తాజాగా ఈ మూవీని అమెరికాలోని లాస్ఎంజిల్స్లో బిగ్ స్క్రీన్పై ఎంజాయ్ చేశారు రాజమౌళి. ఫారిన్ ఆడియన్స్తో కలిసి వీక్షించిన ఆయన థియేటర్లో సందడి చేశారు. తాజాగా ఆ వీడియోను మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ 'వన్ అండ్ ఓన్లీ.. ఎస్ఎస్ రాజమౌళి' అంటూ పోస్ట్ చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో జక్కన్న పేరు మరోసారి ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. లాస్ ఎంజిల్స్లోని థియేటర్లో సినిమాను వీక్షిస్తున్న ఫారిన్ ఆడియన్స్ డ్యాన్స్తో హోరెత్తించారు. నాటు నాటు పాటకు స్టెప్పులతో అదరగొట్టారు. అభిమానుల కోలాహలంతో థియేటర్ మార్మోగిపోయింది. ఫ్యాన్స్ డ్యాన్స్ చేస్తున్న వీడియోను లాస్ ఏంజిల్స్ టైమ్స్ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆర్ఆర్ఆర్ సాంగ్కు విదేశీయులు డ్యాన్స్ చేయడాన్ని చూసిన టాలీవుడ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. One and Only @ssrajamouli Garu ❤️🙏 pic.twitter.com/FHOXTfyDQK — Ram Charan (@AlwaysRamCharan) October 2, 2022 Foreigners dancing.. Feel the Highhh💥💥💥 Thank you SSR 🧎 #RRR #RamCharan 🦁 🔥 https://t.co/LCbFJa1wPe pic.twitter.com/wJQ6wIxFlf — Ujjwal Reddy (@HumanTsunaME) October 1, 2022 -
'ఆచార్య' ఫ్లాప్.. స్పందించిన మెగాస్టార్
మొదటిసారి తండ్రి, తనయుల కాంబినేషన్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఆచార్య. తాజాగా ఆ మూవీ ఫెయిల్యూర్పై మెగాస్టార్ స్పందించారు. ఆయన నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్ ప్రమోషన్లలో భాగంగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చిరంజీవి. భారీ అంచనాలతో రిలీజైన ఆచార్య బాక్సాఫీస్ వద్ద అభిమానులను మెప్పించలేకపోయింది. ఆచార్యపై చిరంజీవి మాట్లాడుతూ 'సినిమా ఫలితం మన చేతుల్లో ఎప్పుడు ఉండదు. మన పనిలో మనం బెస్ట్ ఇస్తామంతే. ఆచార్య పరాజయం నన్ను బాధ పెట్టలేదు. ఎందుకంటే దర్శకుడు చెప్పిందే మేం చేశాం. ఈ చిత్రంలో చిన్న విచారం ఏంటంటే.. చరణ్ నేను కలిసి మొదటిసారి నటించాం. అది హిట్ కాలేదు. ఒకవేళ భవిష్యత్తులో మేము మళ్లీ కలిసి పనిచేయాలనుకుంటే అంతటి హైప్ ఉండకపోవచ్చు. అంతకు మించి ఎలాంటి బాధ లేదు' అని అన్నారు. చిరంజీవి, రామ్చరణ్ నటించిన ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ఏప్రిల్29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ను తెచ్చుకుంది. ప్రస్తుతం మెగాస్టార్ నటించిన 'గాడ్ ఫాదర్' రిలీజ్కు సిద్ధమైంది. దసరాకు థియేటర్లలో సందడి చేయనుంది. -
రామ్ చరణ్పై మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్.. చిరుత టూ ఆర్ఆర్ఆర్..!
మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్పై తన ప్రేమను చాటుకున్నారు. నటుడిగా కెరీర్ ప్రారంభించి 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిరు ఎమోషనల్ అయ్యారు. చిరుతతో మొదలై మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ వరకు చరణ్ ప్రస్థానాన్ని మెగాస్టార్ కొనియాడారు. ప్రస్తుతం దర్శకుడు శంకర్తో సినిమా చేసే స్థాయికి ఎదిగాడని చిరు ఆనందం వ్యక్తం చేశారు. (చదవండి: గాడ్ ఫాదర్ మరో సాంగ్ అవుట్.. అభిమానులకు గూస్బంప్స్ ఖాయం) 'తన వర్క్, డెడికేషన్ అన్నీ చూసి ఎంతో గర్విస్తున్నా. భవిష్యత్తులో రామ్ చరణ్ మరిన్ని ఉన్నత శిఖరాలు అందుకోవాలి. నిన్ను చూసి గర్విస్తున్నా. నువ్వు సాధించాల్సివి ఇంకా ఉన్నాయి. వాటి కోసం ముందుకెళ్లు.' అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. రామ్ చరణ్ పదిహేనేళ్ల సినీ ప్రస్థానంపై మెగా అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. ఇవాళ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను అనంతపురంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. Supremely pleased at his passion, body of work, dedication and his innate urge to excel at what he does. Proud of you my boy! Here’s to greater heights and greater glories that await you! Go for it! May the Force be with you!@AlwaysRamCharan pic.twitter.com/kby2zqzRbm — Chiranjeevi Konidela (@KChiruTweets) September 28, 2022 -
Acharya: నా జీవితంలో మర్చిపోలేని రోజులవి: రామ్ చరణ్
‘‘ఆచార్య’ సినిమాలో నాన్నగారి(చిరంజీవి) ఆచార్య, నేను చేసిన సిద్ధ పాత్రలు చాలా బలంగా ఉంటాయి. నా పాత్ర సెకండాఫ్లో వస్తుంది. నాన్నతో కలిసి ఈ సినిమాలో 45నిమిషాల నిడివి ఉన్న పాత్ర చేసేందుకు నాకు 13ఏళ్లు పట్టింది. అలాంటిది ఆయనతో పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్ర అంటే ఇంకా చాలా సమయం పడుతుంది’’ అని హీరో రామ్చరణ్ అన్నారు. చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’. రామ్చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటించారు. సురేఖ కొణిదెల సమర్పణలో నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో రామ్చరణ్ పంచుకున్న విశేషాలు... ► ‘ఆచార్య’ లో మీ పాత్ర ఉంటుందని మీకు ముందే తెలుసా? తెలియదు.. ఎందుకంటే ‘ఆచార్య’ సినిమాకి నేను ఓ నిర్మాతగా ఎంటర్ అయ్యానే కానీ నటుడిగా కాదు. ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన చిన్న పాత్ర ఉంటుందని ఆ తర్వాతే తెలిసింది. పైగా ఈ పాత్ర కథకి ఎంతో ముఖ్యం అని కొరటాల శివగారు చెప్పారు. అలాగే ‘ఆచార్య’ నాన్నగారి సినిమా కావడంతో ఓకే చెప్పాను. ► కొరటాల శివ ‘ఆచార్య’ కథ చెప్పినప్పుడు ఎలా అనిపించింది? ‘మిర్చి’ సినిమా తర్వాత నుంచి నేను–కొరటాలగారు ఓ సినిమా చేద్దామనుకున్నాం. కానీ, ఎవరి ప్రాజెక్టుల్లో వారు బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. అయినప్పటికీ మా కాంబినేషన్ కుదరలేదనే బాధ నాకెప్పుడూ లేదు. ఎందుకంటే మా ఇద్దరి మధ్య బలమైన స్నేహ బంధం ఉంది. అందుకే తొందరపడకుండా వీలు కుదిరినప్పుడు మంచి ప్రాజెక్ట్ చేయాలనుకున్నాం. ► ‘ఆచార్య’కి మీరు పచ్చజెండా ఊపాక మీ కోసం కథలో ఏవైనా మార్పులు చేశారా? ఎలాంటి మార్పులు లేవు. అయితే తొలుత నాది, పూజా హెగ్డేది 15 నిమిషాలే అనుకున్నాం. కానీ నా పాత్ర 45 నిమిషాలు ఎలా అయిందో నాకే తెలియడం లేదు. ఆచార్య, సిద్ధ పాత్రలకి చాలా తేడా ఉంటుంది. ఈ పాత్రలు వేరే ఏ హీరోలు చేసినా కూడా హిట్ అవుతాయి. కాకపోతే నాన్నగారు, నేను చేయడం వల్ల మరింత క్రేజ్ వచ్చింది. ఈ మూవీలో చాలా సన్నివేశాలు సహజంగా ఉంటాయే కానీ ఎక్కడా కావాలని యాడ్ చేసినట్లు ఉండవు. ► సిద్ధ పాత్ర ఎలా ఉంటుంది? ‘ఆచార్య’ లో నాన్నది, నాది తండ్రీ కొడుకుల పాత్ర కాదు. నేను ‘ధర్మస్థలి’ లోని గురుకులంలోని యువకునిగా కనిపిస్తాను. నాన్నగారు ఒక ఫైటర్లా కనిపిస్తారు. మా ఇద్దరి పాత్రలు పూర్తి వ్యతిరేకంగా ఉంటాయి. అయితే ధర్మం కోసం ఇద్దరూ ఎలా కలుస్తారు? అధర్మంపై ఎలా పోరాటం చేశారు? అనేది కొరటాలగారు చాలా బాగా చూపించారు. ► ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్నప్పుడు ‘ఆచార్య’ కోసం రాజమౌళిని ఎలా ఒప్పించారు? రాజమౌళిగారు ‘బొమ్మరిల్లు’ ఫాదర్లాంటివారు. ఆయన సినిమా అంగీకరించామంటే అది పూర్తయ్యే వరకూ ఆర్టిస్ట్ల చేయి వదలరు. కానీ సిద్ధ పాత్ర గురించి కొరటాలగారు రాజమౌళిగారికి చెప్పారు. ఆ పాత్రకు ఉన్న ప్రాధాన్యతను రాజమౌళిగారు గుర్తించి, నేను చేస్తేనే బాగుంటుందన్నారు. పైగా మా నాన్నమీద గౌరవంతో, అమ్మ(సురేఖ) డ్రీమ్ ప్రాజెక్ట్ అని ‘ఆచార్య’ చేసేందుకు నాకు అవకాశం ఇచ్చారు రాజమౌళిగారు. ఇందుకు ఆయనకు రుణపడి ఉంటాను. ► ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్నప్పుడే ‘ఆచార్య’ కి మేకోవర్ కావడం కష్టంగా అనిపించిందా? ఇష్టమైన పని చేస్తున్నప్పుడు కష్టం అనిపించదు. అటు ‘ఆర్ఆర్ఆర్’ లో రామరాజు పాత్ర కానీ, ఇటు ‘ఆచార్య’ లో సిద్ధ పాత్రకి కానీ మేకోవర్ కావడం కష్టంగా అనిపించలేదు. ఎందుకంటే నాకు బాగా నచ్చిన పాత్రలు ఇవి.. అందుకే చాలా ఇష్టంగా చేశాను. ‘ధృవ’, ‘రంగస్థలం’, ‘ఆర్ఆర్ఆర్’ నా మనసుకి బాగా దగ్గరైన చిత్రాలు. ఆ కోవలో నిర్మించిన ‘ఆచార్య’ మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ► ‘ఆచార్య’ కి పనిచేస్తున్నప్పుడు చిరంజీవి నుంచి ఏం నేర్చుకున్నారు? ఈ 35 ఏళ్లల్లో నేను చూసిన నాన్నగారు వేరు.. ‘ఆచార్య’ కోసం మారేడుమిల్లి అడవుల్లో 20 రోజులు షూటింగ్ చేసినప్పుడు చూసిన నాన్నవేరు. అయితే మారేడుమిల్లి అడవుల్లో ‘ఆచార్య’ షూటింగ్ కోసం ఇద్దరం ఒక కాటేజ్లో ఉన్నాం. కలిసి వ్యాయామం, భోజనం చేశాం, ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. నా జీవితంలో మర్చిపోలేని రోజులవి. ఆ 20 రోజుల షూటింగ్లో నాన్న నుంచి ఎంతో నేర్చుకున్నా. ► ‘ఆచార్య’ కి మీరు నిర్మాతనా? హీరోనా? కొణిదెల ప్రొడక్షన్స్లోనే ‘ఆచార్య’ నిర్మించాలనుకున్నాం. అయితే ‘ఆర్ఆర్ఆర్’ తో నేను బిజీగా ఉండటం వల్ల ప్రొడక్షన్పై పూర్తిగా దృష్టి సారించలేననిపించింది. అప్పుడు నిరంజన్ రెడ్డిగారు ఈ సినిమా చేసేందుకు ముందుకు వచ్చారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కూడా మా సొంత బ్యానర్లాంటిదే. అందుకే ఇప్పటికి కూడా నాన్న, నేను ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదు. ప్రస్తుతానికి నా దృష్టి నటనపైనే. ‘సైరా, ఆచార్య’ లాంటి బలమైన కథలు వచ్చినప్పుడు కొణిదెల ప్రొడక్షన్స్లో నిర్మిస్తాను. ► ‘ఆర్ఆర్ఆర్’ పాన్ ఇండియా స్థాయిలో పెద్ద సక్సెస్ అయింది. మరి ‘ఆచార్య’ ని పాన్ ఇండియన్ మూవీగా రిలీజ్కి ఎందుకు ప్లాన్ చెయ్యలేదు? ‘ఆచార్య’ ని దక్షిణాదిలో చేయాలనుకునే కొరటాలగారు చేశారు. ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ విడుదలకి మధ్య ఎక్కువ గ్యాప్ లేదు. పాన్ ఇండియా రిలీజ్ అంటే చాలా ప్లా¯Œ ్స ఉంటాయి. సమయం తక్కువ ఉంది. అందుకే తెలుగులో రిలీజ్ చేసిన తర్వాత పాన్ ఇండియా స్థాయిలో చేయాలనుకుంటున్నాం. ► స్ట్రైట్ బాలీవుడ్ సినిమా ఎప్పుడు చేస్తున్నారు? నేనేదీ ప్లాన్ చేసుకోను. ఏ డైరెక్టర్ అయినా నాకు కరెక్ట్ కథ తీసుకొస్తే ఏ భాషలో అయినా చేస్తాను. నేను కావాలనుకుని డిజైన్ చేసిన సినిమాలకంటే డైరెక్టర్స్ ఆలోచించి చేసిన సిని మాలే నాకు సూపర్ హిట్స్ ఇచ్చాయి. ‘ఆరెంజ్’ సరిగ్గా ఆడలేదు కానీ, ఇప్పటికీ నా ఫేవరేట్ సినిమాల్లో అది ఒకటి. ► సౌత్ సినిమాలు పాన్ ఇండియన్ హిట్స్ కావడం ఎలా అనిపిస్తోంది? ఇటీవల వచ్చిన ‘పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2’ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో హిట్స్ కావడం చాలా గర్వంగా ఉంది. ఇది వరకు ఇండియన్ సినిమా అంటే కేవలం హిందీ సినిమా అనే వారు. కానీ, ఇప్పుడు మన సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. ► మీ తర్వాతి చిత్రాలేంటి? శంకర్గారి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా 60రోజులు షూటింగ్ పూర్తయింది. ఆ సినిమా తర్వాత ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తాను. నానమ్మ ఎప్పుడూ నాన్నవైపే.. ‘ఆచార్య’ సెట్స్లో నానమ్మ(అంజనాదేవి), అమ్మ(సురేఖ)ల మధ్య సరదా పోటీ ఉండేది. నా కొడుకు బాగా చేశాడంటే, కాదు.. నా కొడుకు అనేకునేవారు. నానమ్మ ఎప్పుడూ నాన్నవైపే ఉండేవారు. -
మా కోసం చిరంజీవి ఎన్నో మాటలు పడ్డారు: రాజమౌళి
సాక్షి, బెంగళూరు: ‘‘ఆర్ఆర్ఆర్’ స్వాతంత్య్ర పోరాట యోధుల సినిమా కాబట్టి నేను ఈ వేడుకకు వచ్చాను. ఎంతోమంది తమ ప్రాణాలను త్యాగం చేసి స్వాతంత్య్రం తెచ్చారు. వారి గురించి, ఆ పోరాటం గురించి అందరికీ తెలియాలి’’ అన్నారు కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై. స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్చరణ్ నటించగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ నెల 25న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కర్నాటకలోని చిక్బళ్లాపూర్లో జరిగింది. శనివారం జరిగిన ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కర్నాటక ముఖ్యమంత్రి సీఎం బసవరాజ బొమ్మై మాట్లాడుతూ – ‘‘దేశం గర్వించదగ్గ సినిమా ‘ఆర్ఆర్ఆర్’ను తెరకెక్కించారు రాజమౌళి. దేశం మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సినిమాను థియేటర్లో చూడాలి. కన్నడలోనూ ఈ సినిమా రావడం గర్వంగా ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ విజయవంతమై చరిత్రలో నిలిచిపోవాలి. ఈ సమయంలో పునీత్ రాజ్కుమార్ను మరవడం సాధ్యం కాదు. విజేతలు మరణించాక కూడా జీవిస్తారనే వివేకానందుడి మాటలు పునీత్ జీవితంలో నెరవేరాయి. పునీత్కు ప్రకటించిన కర్ణాటక రత్న అవార్డును త్వరలో ఆయన కుటుంబ సభ్యులకు అందిస్తాం’’ అన్నారు. ‘‘ఆర్ఆర్ఆర్ అంటే రికార్డ్స్.. రికార్డ్స్.. రికార్డ్స్ ఒక్కటే’’ అని మరో అతిథి, కర్నాటక వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ కె. సుధాకర్ అన్నారు. ‘‘కొంచెం సంతోషం, కొంత బాధగా ఉంది. మా తమ్ముడు పునీత్ మరణంతో నాలుగు నెలలుగా సినీ పరిశ్రమ, కన్నడనాడు దుఃఖంలో ఉంది. రామ్చరణ్, తారక్ (ఎన్టీఆర్)లో పునీత్ను చూస్తున్నాను. దక్షిణాది నుంచి అంతర్జాతీయ స్థాయికి ఒక దర్శకుడు (రాజమౌళి) ఎదగడం గర్వంగా ఉంది’’ అన్నారు మరో అతిథి, కన్నడ హీరో శివరాజ్కుమార్. రాజమౌళి మాట్లాడుతూ– ‘‘పునీత్ అందరి మనసుల్లో ఉన్నారనడానికి ఇటీవల విడుదలైన ఆయన ‘జేమ్స్’ సినిమా విజయమే నిదర్శనం. ‘ఆర్ఆర్ ఆర్’ తెలుగు సినిమాకి గర్వకారణం కాబట్టి టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిచ్చిన ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్రెడ్డిగారికి, మంత్రి పేర్ని నాని, కొడాలి నానీగార్లకు, తెలంగాణ సీఎం కేసీఆర్గారికి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్గారికి, ఎంపీ సంతోష్కుమార్గారికి, ప్రకాశ్రాజ్కి కృతజ్ఞతలు. ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డిగారితో ఉన్న సాన్నిహిత్యంతో ఆయనతో మాట్లాడి టికెట్ రేట్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసిన చిరంజీవిగారికి కృతజ్ఞతలు. మమ్మల్ని నెగ్గించేందుకు చిరంజీవిగారు చాలామందితో ఎన్నో మాటలు పడ్డారు. ఇండస్ట్రీ పెద్ద అంటే ఆయనకు ఇష్టం ఉండదు. కానీ నేను మాత్రం ఆయన్ను ఇండస్ట్రీ పెద్దగానే గౌరవిస్తాను. నేను అడిగిన వెంటనే ఎలాంటి ప్రశ్నలు అడగకుండా నా రాముడు (రామ్చరణ్), నా భీముడు (ఎన్టీఆర్) శరీరంలోని ప్రతి అణువును పెట్టారు’’ అన్నారు. రామ్చరణ్ మాట్లాడుతూ – ‘‘ఏపీ, తెలంగాణ తర్వాత కర్నాటక పెద్ద మార్కెట్. ప్రతి ఒక్కరూ థియేటర్లోనే సినిమా చూడాలి’’ అన్నారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘ప్రాంతీయ సినిమాల అడ్డంకులను చెరిపివేసి తన సినిమాల ద్వారా భారతదేశ ఐక్యతను చాటుదామనుకుంటున్న ఓ గొప్ప దర్శకుడి కల ‘ఆర్ఆర్ఆర్’. ఇది ఒక భారతదేశ సినిమా అని గర్వంగా ఉంది’’ అన్నారు. ‘‘రామ్చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి... ముగ్గురూ అత్యుత్తమ ప్రదర్శనను ఈ సినిమాలో కనబరిచారు’’ అన్నారు చిత్ర సంగీతదర్శకుడు కీరవాణి . ‘‘ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించిన ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డిగారికి, మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిగార్లకు ధన్యవాదాలు. తెలంగాణ సీఎం కేసీఆర్గారికి, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీనివాస్ యాదవ్గారికి కృతజ్ఞతలు’’ అన్నారు చిత్రనిర్మాత దానయ్య. సినిమాను కర్ణాటకలో విడుదల చేస్తున్న వెంకట నారాయణ్ మాట్లాడుతూ– ‘‘ఆర్’ అనే అక్షరానికి ఎంతో పవర్ ఉంది. ఏపీలో ఎన్టీఆర్, తమిళనాడులో ఎంజీ ఆర్, కర్నాటకలో రాజ్కుమార్, హిందీలో రాజ్కపూర్.... ఇలా ‘ఆర్’కు ఎంతో పవర్ ఉంది. అలాంటిది ఇప్పుడు మూడు ‘ఆర్’లు కలసి వస్తున్నారు’’ అన్నారు. -
వారంలో ఓ డేట్ నైట్
Upasana Valentines Day Tips: ‘‘ప్రేమలో పడటం సులభమే. కానీ ఎప్పుడూ ప్రేమతో కొనసాగడం ప్రేమికులుగా పార్క్లో నడిచినంత సులభం కాదు’’ అంటున్నారు రామ్చరణ్ సతీమణి ఉపాసన. సోమవారం వాలెంటెన్స్ డే సందర్భంగా తమ (రామ్చరణ్, ఉపాసన) వివాహం జరిగి పదేళ్లు పూర్తయ్యాయని, తమ సక్సెస్ఫుల్ అండ్ హ్యాపీ లైఫ్కి ఇవే కారణాలై ఉండొచ్చన్నట్లుగా ఉపాసన కొన్ని సలహాలు, సూచనలను ఓ వీడియో రూపంలో షేర్ చేశారు. ∙దాంపత్య జీవితంలో ఆరోగ్యానిదే అగ్రస్థానం. కాబట్టి ఇద్దరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఉదయాన్నే నిద్రలేవడం వల్లే మన ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని నేను నమ్ముతాను. చాలామంది మ్యారేజ్ గోల్స్ను పెయిన్ఫుల్గా భావిస్తారు. కానీ ప్రేమతో చేస్తే అవే బ్యూటిఫుల్గా ఉంటాయి. ∙ప్రతిరోజూ మన ప్రియమైన వారితో కాస్త సమయాన్ని గడిపేలా ప్లాన్ చేసుకోవాలి. కలిసి భోజనం చేయడం, కబుర్లు చెప్పుకోవడం, కలిసి సినిమాలు చూడటం.. ఇలాంటివి జీవితాన్ని మరింత ప్రేమతో నింపి మరింత అందంగా మారుస్తాయి. అలాగే వారంలో ఓసారి డేట్ నైట్ను ప్లాన్ చేసుకోండి. మీ వివాహ బంధంలో ఏవైనా దూరాలు ఉంటే మళ్లీ కనెక్ట్ అవ్వండి. జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించండి. ∙పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని అంటారు కానీ అది నిజం కాదని నా నమ్మకం. భూమి మీద ఓ ఇద్దరు చేసే ఎఫర్ట్స్పైనే వారి దాంపత్య జీవితం ఆధారపడి ఉంటుంది. ఈ అంశాలతో పాటు మన జీవిత భాగస్వామిపట్ల అమితమైన ప్రేమ, గౌరవాన్ని కూడా కలిగి ఉండాలని మర్చిపోవద్దు. -
చొక్కా విప్పి సిక్స్ ప్యాక్ చూపిస్తున్న హీరోలు!
చోలీ కే పీచే క్యా హై అంటే... చోలీ మే దిల్ హై మేరా అన్నారు మాధురీ దీక్షిత్. ‘ఖల్ నాయక్’లోని ఈ పాట చాలామంది దిల్ని కొల్లగొట్టింది. ఇప్పుడు... ‘చొక్కా కే పీచే క్యా హై’ అని మన హీరోలను అడిగితే... చొక్కా మే ప్యాక్ హై మేరా అంటారేమో. కథ డిమాండ్ చేస్తే ఆరు పలకలు.. ఎనిమిది పలకల దేహంతో ఫ్యాన్స్ దిల్ని ఖుషీ చేయడానికి రెడీ అయ్యారు హీరోలు. షర్ట్లెస్గా కనిపించనున్నారు.. రండి... సిక్స్ ప్యాక్ చూద్దాం. ఫైట్ సీన్స్ని ఇష్టపడే ప్రేక్షకుల శాతం ఎక్కువే ఉంటుంది. అందుకే హీరోలు కూడా డిఫరెంట్ యాక్షన్ సీన్స్ చేస్తుంటారు. వీటికోసం ప్రత్యేకంగా మేకోవర్ అవుతారు. కొందరు హీరోలు అవసరమైతే సిక్స్ ప్యాక్ చేస్తారు. చొక్కా విప్పి, ఆ ప్యాక్ని చూపిస్తారు. ఒక సినిమాలో కనిపించి, మరో సినిమాలో కూడా షర్ట్లెస్గా కనిపించాలంటే ‘సై’ అంటారు. ‘టెంపర్’ చిత్రంలో షర్ట్లెస్గా సిక్స్ ప్యాక్తో కనిపించిన ఎన్టీఆర్ ఇప్పుడు ‘రౌద్రం.. రణం.. రుధిరం’లో షర్ట్లెస్గా కనిపించిన దృశ్యాలు ఈ చిత్రం ట్రైలర్లో కనిపించాయి. ఇక ఇదే చిత్రంలో మరో హీరోగా చేసిన రామ్చరణ్ ‘ధృవ’లో షర్ట్లెస్గా కనిపించారు. ఇప్పుడు ‘రౌద్రం.. రణం.. రుధిరం’లోనూ అలా కనిపించనున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం (జనవరి 7న) విడుదల కావాల్సింది. కరోనా ఎఫెక్ట్తో వాయిదా పడింది. ఇక ‘అర్జున్రెడ్డి’లో కొన్ని సీన్స్లో చొక్కా లేకుండా కనిపించారు విజయ్ దేవరకొండ. ఇప్పుడు ‘లైగర్’ కోసం బాక్సర్గా సిక్స్ప్యాక్తో రెడీ అయ్యారు. ఇటీవల విడుదలైన ‘లైగర్’ గ్లింప్స్ వీడియోలో విజయ్ షర్ట్లెస్గా కనిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్టు 25న విడుదల కానుంది. అయితే కరోనా కారణంగా ‘లైగర్’ షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయినట్లు విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. ఇప్పటివరకు లవర్బాయ్లా కనిపించిన అఖిల్ ‘ఏజెంట్’ చిత్రం కోసం ఒక్కసారిగా మాస్ లుక్లోకి మారిపోయారు. సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం దాదాపు ఏడాది కష్టపడి అఖిల్ మేకోవర్ అయ్యారు. ఇందులో అఖిల్ సిక్స్ప్యాక్ లుక్లో కనిపిస్తారు. ఇక హీరోగా పరిచయమైన తొలి చిత్రం ‘ఆర్ఎక్స్100’లోనే సిక్స్ప్యాక్ బాడీతో కనిపించారు కార్తికేయ. ఆ చిత్రం తర్వాత కూడా కొన్ని చిత్రాల్లో షర్ట్లెస్గా కనిపించారు. తాజాగా అజిత్ హీరోగా చేసిన యాక్షన్ ఫిల్మ్ ‘వలిమై’లో కార్తికేయ విలన్గా నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కార్తికేయ ఓ ఫైట్లో సిక్స్ప్యాక్లో కనిపిస్తారు. ఈ సినిమా కోసం బాడీ బిల్డింగ్ చేస్తున్నట్లుగా కార్తికేయ సోషల్ మీడియాలో చొక్కా లేకుండా షేర్ చేసిన ఫొటో ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈ హీరోలే కాదు.. మరికొందరు కూడా షర్ట్లెస్కి సై అంటున్నారు. మళ్లీ అలా కనిపిస్తారా డ్యూడ్... సిక్స్ ప్లస్ కటౌట్ ఉన్న ప్రభాస్ సిక్స్ ప్యాక్లో కనిపిస్తే.. ‘వావ్ డ్యూడ్’ అంటారు. ‘మిర్చి’ లో ప్రభాస్ కటౌట్ మీద ‘కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్’ అనే డైలాగ్ కూడా ఉందిగా. ‘బాహుబలి’లో తన కటౌట్ని చూపించారు ప్రభాస్. మరోసారి చొక్కా లేకుండా కనిపించే అవకాశం ఉంది. తాజా చిత్రం ‘ఆదిపురుష్’లో రాముడి పాత్ర చేస్తున్నారు ప్రభాస్. రాముడంటే చొక్కా లేకుండా కనబడతారు కదా.. సో.. మరోసారి ప్రభాస్ కటౌట్ని చూడొచ్చన్న మాట. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్ట్ 11న విడుదల చేయాలనుకుంటున్నారు. -
నా ఊహలోని విజువల్కు తగ్గట్లుగా నటించే గొప్ప యాక్టర్ అతను: రాజమౌళి
RRR Movie Pre Release Event Chennai: ‘‘ప్రపంచవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారన్నా.. యూఎస్ ప్రీమియర్స్ 2 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయన్నా అందుకు కారణం నేను కాదు.. నా ముందున్న ఇద్దరు స్టార్సే(ఎన్టీఆర్, రామ్చరణ్)’’ అని రాజమౌళి అన్నారు. ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రౌద్రం..రణం..రుధిరం’(ఆర్ఆర్ఆర్). డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం జనవరి 7న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చెన్నైలో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు హీరోలు శివ కార్తికేయన్, ఉదయనిధి స్టాలిన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాజమౌళి మాట్లాడుతూ–‘‘తారక్(ఎన్టీఆర్) ప్రేమను తట్టుకోవడం చాలా కష్టం. నేను షాట్ పెడితే చాలు నా ఊహలోని విజువల్కు తగ్గట్లుగా నటిస్తాడు. ఇలాంటి యాక్టర్ దొరకడం తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు.. భారతీయ సినిమా చేసుకున్న అదృష్టం. పని గురించి ఎంతో ఆలోచించి నేను సెట్స్కు వస్తుంటాను. కానీ చరణ్ క్లియర్ మైండ్తో వచ్చి ‘నా నుంచి మీకు ఏం కావాలి?’ అని అడుగుతారు. ఇలాంటి మెంటాలిటీని నేను ఎక్కడా చూడలేదు. తన గురించి తను అంత సెక్యూర్గా ఫీలైన యాక్టర్ను నేను ఇంతవరకు చూడలేదు. అంత అద్భుతంగా యాక్ట్ చేస్తారు’’ అన్నారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ–‘‘ఒకప్పుడు కమల్, రజనీసార్లు కలిసి ఒకే సినిమాలో నటించారు. అలాంటి గ్లోరీని ‘ఆర్ఆర్ఆర్’తో రాజమౌళి మళ్లీ తీసుకువస్తున్నారు. ఈ సినిమాలోని ప్రతి సీన్ను మళ్లీ చేయాలనుకుంటాను.. ఎందుకంటే చరణ్తో మళ్లీ టైమ్ స్పెండ్ చేయవచ్చు’’ అన్నారు. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) రామ్చరణ్ మాట్లాడుతూ–‘‘మా ఇద్దర్నీ(రామ్చరణ్, ఎన్టీఆర్) కలిపి ఓ సినిమా తీసినందుకు రాజమౌళిసర్కి థ్యాంక్స్. నాతో, తారక్తో తమిళ్లో బాగా డబ్బింగ్ చెప్పించిన మదన్సర్కి థ్యాంక్స్. నిజ జీవితంలో నాకు, తారక్కి ఒక ఏడాది తేడా. కానీ తనది సింహంలాంటి పర్సనాలిటీ.. చిన్నపిల్లల లాంటి మనస్తత్వం.. తనతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తారక్లాంటి నిజమైన బ్రదర్ని ఇచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్. తారక్కి థ్యాంక్స్ చెబితే మా బంధం ఇక్కడితో ముగిసిపోద్ది అనేది నా భావన.. నేను చనిపోయేవరకు ఆ బ్రదర్ హుడ్ని నా మనసులో పెట్టుకుంటాను’’ అన్నారు. నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, ఆర్బీ చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
‘సువర్ణభూమి’ కొత్త లోగోను ఆవిష్కరించిన రాంచరణ్
రాయదుర్గం: ప్రముఖ రియల్ఎస్టేట్ సంస్థ సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నూతన లోగోను ఆవిష్కరించింది. మాదాపూర్లోని ఐటీసీ కోహినూర్లో కొత్త లోగో, యాడ్ ఫిల్మ్ను సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్తో కలిసి శుక్రవారం సాయంత్రం సినీ హీరో రాంచరణ్ ఆవిష్కరించారు. రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ప్రత్యేకతను, వినియోగదారుల మన్ననలను పొందుతున్న సంస్థగా సువర్ణభూమి నిలుస్తోందని రాంచరణ్ ప్రశంసించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే సువర్ణభూమి సంస్థతో పనిచేయడం, బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం సంతోషం కలిగిస్తోందన్నారు. అందుబాటు ధరలలో అపార్ట్మెంట్లు, విల్లాలను వినియోగదారులకు అందించడం అభినందించదగ్గ విషయమన్నారు. ప్రతి ఒక్కరూ తమ సొంతింటి కలను నిజం చేసుకునే అవకాశాన్ని కలిగిస్తున్న సువర్ణభూమి సంస్థను అభినందించారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ ఆధునిక సకల సౌకర్యాలతోపాటు సరసమైన ధరలకు ఫ్లాట్స్, విల్లాలతో పాటు స్థలాలను కూడా అందజేస్తున్నట్లు తెలిపారు. ఎంతో కాలంగా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. -
త్రివిక్రమ్ వల్లే... శంకర్ సినిమా వచ్చింది
‘సామజ వరగమన...’ అన్నారు తమన్.. అన్ని వర్గాల పాటల ప్రేమికులు... ‘ఏం ట్యూన్ అన్నా’ అన్నారు. ఇదొక్కటేనా? అంతకుముందు ఎన్నో ట్యూన్స్ ఇచ్చారు. అయితే ‘సామజ..’ వేరే లెవెల్కి తీసుకెళ్లింది. శంకర్ ‘బాయ్స్’లో నటించిన తమన్ ఇప్పుడు రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రానికి సంగీతదర్శకుడు. ‘సాక్షి’కి తమన్ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలోని కొన్ని ముఖ్యాంశాలు. ► శంకర్ డైరెక్షన్లో నటించిన ‘బాయ్స్’ తర్వాత ఇన్నేళ్లకు ఆయన సినిమాకి సంగీతం అందిస్తున్నారు... ఈ స్థాయికి రావడానికి ఇరవయ్యేళ్లు పట్టింది. నిజానికి సంగీతం అంటేనే నాకు ఆసక్తి. ‘బాయ్స్’ అçప్పుడే శంకర్ సార్తో మ్యూజిక్ గురించి మాట్లాడేవాణ్ణి. నా ట్యూన్స్ని ఫస్ట్ విన్నది ఆయనే. నిజానికి ‘బాయ్స్’ సినిమాలో హయ్యస్ట్ పెయిడ్ యాక్టర్ను నేనే. అయినప్పటికీ మ్యూజికల్గానే నా లైఫ్ను మేనేజ్ చేయాలని నిర్ణయించుకున్నాను. అయితే ముందు గా నేను సినిమాల నుంచి నేర్చుకోవాలనుకున్నాను. శంకర్గారు పాటలు ఎలా తీయిస్తున్నారు? కెమెరామేన్ రవిచంద్రన్గారు ఎలా పిక్చరైజ్ చేస్తున్నారనే విషయాలను తెలుసుకున్నా. అలా నా కెరీర్లో ఓ ఏడాది శంకర్ సార్కు కేటాయించాను. ‘బాయ్స్’లో మాత్రమే యాక్ట్ చేశాను. యాక్టింగ్ నా స్పేస్ కాదనిపించింది. ► శంకర్ని తరచూ కలుస్తుంటారా? నటుడిగా ఎందుకు కొనసాగలేదు? చాన్స్ రాలేదా? ‘బాయ్స్’ చిత్రయూనిట్లోని యాక్టర్స్లో ఇప్పటికీ ఆయన్ను తరచూ కలుస్తుండేది నేనే. ఆ సినిమా విడుదలైన ఓ రెండు, మూడేళ్ల తర్వాత .. ‘నువ్వు యాక్ట్ చేయనన్నావని దర్శకుడు లింగుస్వామి చెప్పారు. అజిత్, విజయ్ సినిమాల్లో యాక్ట్ చేయనన్నావట? ఏడాది పాటు కష్టపడ్డావు? నువ్వు ఇండస్ట్రీకి వచ్చింది ఎందుకు?’ అని శంకర్గారు అడిగారు. ‘‘వారికి ఏదో ఒక రోజు మ్యూజిక్ చేస్తాను కానీ వారి సినిమాల్లో యాక్ట్ చేయాలనుకోవడంలేదు’’ అని ఆయనకు చెప్పాను. ‘సరే.. మ్యూజిక్కే చేస్తావా?’ అన్నారు. అవునన్నాను. ‘నా ప్రొడక్షన్లో రూపొందుతున్న ‘ఈరమ్’ (2009) (తెలుగులో ‘వైశాలి’) సినిమాకు సంగీతం ఇస్తావా?’ అని అడిగారు.. చేశాను. ఆ తర్వాత ‘మాస్కోవిన్ కావేరి’ సినిమాకు సంగీతం అందించే చాన్స్ వచ్చింది. ఎస్ పిక్చర్స్ (ఈరమ్), ఆస్కార్ ఫిలింస్ (మాస్కోవిన్ కావేరి) చెన్నైలో అప్పటికే పెద్ద బ్యానర్స్. నేను మ్యూజిక్ అందించిన సినిమా ఒక్కటి కూడా విడుదల కాకుండానే.. రెండు సినిమాలకు మ్యూజిక్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. మ్యూజిక్ డైరెక్టర్గా నా ఫస్ట్ ఫిల్మ్ శంకర్గారిదే. ► ఇప్పుడు హీరో రామ్చరణ్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లోని సినిమాకు చాన్స్ ఎలా వచ్చింది? శంకర్గారి దర్శకత్వంలో రామ్చరణ్ హీరోగా ‘దిల్’ రాజు నిర్మాణంలో సినిమా ఓకే అయ్యిందని తెలియగానే ... ‘దిల్’ రాజుగారితో ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో ఏఆర్ రెహమాన్గారు తొలిసారి మ్యూజిక్ చేయనున్నారు.. అదీ శంకర్సార్ దర్శకత్వంలో.. కంగ్రాట్స్ సార్’ అన్నాను. కానీ ఆయనేమో ‘ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో నాకు శంకర్ వేరే ఆప్షన్ ఇవ్వడం లేదు. నిన్నే కావాలంటున్నారు, మార్చి 1న ఆయన్ను వెళ్లి కలువు’ అన్నారు. షాకయ్యాను. ► మరి.. ఏఆర్ రెహమాన్ మీ సినిమాకు సంగీతం చేయడం లేదా అని శంకర్ను అడిగారా? అడగలేదు. ఆయనకు ఫోన్ చేస్తే, ‘15 రోజుల్లో ఓ సాంగ్ చేయాలి.. నువ్వు ఎప్పుడొస్తావ్?’ అని అడిగారు. ‘ఒక వారం టైమ్ ఇవ్వండి.. వస్తాను’ అన్నాను. ఇప్పటివరకు మూడు పాటలు పూర్తి చేశాను. ఈ సినిమాలో ఏడు పాటలు ఉంటాయి. ► ఏఆర్ రెహమాన్ వంటి సంగీత దర్శకులతో వర్క్ చేసిన శంకర్ టేస్ట్కు తగ్గట్లు మ్యూజిక్ అందించగలనా అనే ఆందోళన లేదా? భయం ఉంటే మనం ముందుకు వెళ్లలేం. చాలెంజింగ్గా తీసుకున్నాను. దర్శకులు శంకర్, త్రివిక్రమ్ ఒకేలా ఆలోచిస్తారని నా అభిప్రాయం. ఇద్దరూ పదేళ్లు ముందుగా ఆలోచిస్తారు. వారిద్దరినీ పట్టుకోవాలి. దాని కోసం కొంచెం ఎక్కువగా పరిగెడతాను అంతే. ► త్రివిక్రమ్తో ఆల్రెడీ వర్క్ చేయడం వల్ల మీ పని ఈజీ అయ్యిందనుకోవచ్చా? త్రివిక్రమ్ నాకో ప్రొఫెసర్లాంటి వారు. ఆయన దర్శకత్వంలో ‘అరవిందసమేత వీరరాఘవ’ చేశాక మ్యూజిక్ పట్ల నా దృష్టి కోణం మారింది. శంకర్గారి సినిమాకు మ్యూజిక్ చేసే చాన్స్ త్రివిక్రమ్గారి వల్లే వచ్చిందను కుంటున్నాను. ‘అల.. వైకుంఠపురములో..’ సక్సెస్ వల్లే శంకర్గారితో సినిమా చేసే చాన్స్ వచ్చిందని నమ్ముతున్నాను. ► నా హార్ట్కు, బ్రెయిన్కు మధ్య త్రివిక్రమ్ ఓ కొత్త నర్వ్ వేశారని అన్నారు ఓ సందర్భంలో.. వివరిస్తారా? అది నిజమే. కొంతమందిని కలిసినప్పుడు మనం మారిపోతుంటాం... కనీసం ఒక శాతం అయినా. అది పెళ్లైన తర్వాత భార్య వల్ల కావొచ్చు, కొత్త ఉద్యోగంలో జాయిన్ అయ్యాక బాస్ వల్ల కావొచ్చు.. మనం మారవచ్చు. త్రివిక్రమ్గారి వల్ల నేను మారిపోయాను. సినిమాకు ఉన్న వేరే కోణాలు ఏంటో ఆయన చెప్పారు. ఇదివరకు నేను సినిమా ముందు ఉండేవాణ్ణి. ఆయనతో వర్క్ చేసిన తర్వాత సినిమా వెనక్కి వెళ్లాను. ఇప్పుడు స్క్రీన్ వెనకాల నుంచి వర్క్ చేస్తున్నాను. ► త్రివిక్రమ్ ఒక నర్వ్ వేశారు. మరి.. శంకర్? ఆ నరాన్ని స్ట్రాంగ్ చేసుకుంటాను. ► మీ అమ్మగారితో పాడించాలని ఎప్పుడూ అనుకోలేదా? నాన్న చనిపోయాక 27 ఏళ్లుగా అమ్మ బాధ్యత అంతా నాదే. పాడతానని అమ్మ అడుగుతుంటారు. అయితే ఫ్యామిలీ చేత ఎక్కువ పాడిస్తున్నానంటారేమో అని ఆగాను. నా భార్య శ్రీవర్ధిని ‘కిక్’ , ‘ఆంజనేయులు’ వంటి సినిమాల్లో పాడారు. అలాగే విశాల్ సినిమాకీ పాడుతున్నారు. ► మ్యూజిక్ పరంగా చెన్నైతో పోలిస్తే హైదరాబాద్..? హైదరాబాద్ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతోంది. మ్యూజిక్కి పెద్ద బేస్ ఇది. చెన్నై ముంబై నుంచి కూడా తరచుగా రాకపోకలు సాగించే మ్యుజిషియన్స్ ఉన్నారు. లోకల్గా ఎక్కువ సింగర్స్ ఉన్నారు. కీరవాణి, మణిశర్మ, కోటి వంటివారు చాలా ట్రైన్ చేసేశారు. అలాగే ఇక్కడ బ్యాండ్ కల్చర్ బాగా ఉండడం వల్ల చాలామంది ఇతర వాద్య కళాకారులు కూడా బాగా వచ్చేశారు. ► రీ– రికార్డింగ్ అంటే ఒకప్పుడు చెన్నై కేరాఫ్? అవును.. అయితే ఇప్పుడు అన్నీ హైదరాబాద్లోనే జరుగుతున్నాయి. ► క్రికెట్ బాగా ఆడతారు కదా? అవును శని, ఆదివారాల్లో పూర్తిగా క్రికెట్ ఆడుతూ ఉంటా. అయితే అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులో మరొకరో ఉండరు. అక్కడా సింగర్స్, ఇతర మ్యుజిషియన్స్ ఉంటారు. హైదరాబాద్, చెన్నైలలో 2 టీమ్స్ ఏర్పాటు చేశాం. ► డైరెక్టర్ శంకర్ ‘బాయ్స్’ చిత్రంతో నటుడిగా తెరంగేట్రం.. ఇప్పుడు శంకర్ సినిమాకే మ్యూజిక్ డైరెక్టర్... శంకర ప్రియతమన మ్యూజిక్ డైరెక్టర్... తమన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఈరోజు ఉదయం 9:30 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గంటలకు ‘సాక్షి’ టీవీలో – రెంటాల జయదేవ -
Acharya: కాకినాడ కాలింగ్
హైదరాబాద్ నుంచి కాకినాడకు ‘ఆచార్య’ లొకేషన్ షిఫ్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. రామ్చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రధారులు. ఈ సినిమా తాజా షెడ్యూల్ను కాకినాడలో ప్లాన్ చేశారని టాక్. మూడు నుంచి ఐదు రోజులు జరగనున్న ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలిసింది. ముఖ్యంగా చిరంజీవి, సోనూసూద్ కాంబినేషన్లో సీన్స్ తెరకెక్కిస్తారట. ఇదిలా ఉంటే... చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళ ‘లూసిఫర్’గా తెలుగులో రీమేక్ కానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘గాడ్ఫాదర్’, ‘ఫిల్మ్ మేకర్’ వంటి టైటిల్స్ని పరిశీలిస్తున్నారట. -
భీమ్ గెటప్ ఓకే... మరి.. రామరాజు?
కొమురం భీమ్ ముస్లిమ్ గెటప్లో ఎందుకు కనిపించాడు? అసలు కథ ఏంటి? అనే చర్చకు రచయిత విజయేంద్ర ప్రసాద్ ఫుల్స్టాప్ పడేలా చేశారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’లో కొమురం భీమ్ పాత్రను ఎన్టీఆర్ చేస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి ప్రతి సినిమాకీ కథ అందిస్తున్న విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కూడా రచయిత. కాగా ఎన్టీఆర్ ముస్లిమ్ గెటప్ గురించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ‘‘నిజామ్ పోలీసులు తన కోసం గాలిస్తున్న సమయంలో తప్పించుకునే క్రమంలో భీమ్ తన వేషాన్ని మార్చుకుంటాడు. ముస్లిమ్ టోపీ పెట్టుకుంటాడు’’ అన్నారు విజయేంద్ర ప్రసాద్. దాంతో కొమురం భీమ్ ముస్లిమ్ గెటప్ గురించి అందరికీ స్పష్టత వచ్చేసింది. కానీ, అల్లూరి సీతారామరాజు పోలీస్ గెటప్లో ఎందుకు కనిపించాడు? అనే చర్చ మాత్రం కొనసాగుతోంది. సీతారామరాజు పాత్రను రామ్చరణ్ చేస్తున్న విషయం తెలిసిందే. మరి.. రామరాజు పోలీస్ గెటప్లోకి మారడానికి గల కారణం ఏంటీ? అంటే.. అదే ఇంటర్వ్యూలో ‘‘ఆ రహస్యం ప్రతి ప్రేక్షకుడినీ ఆశ్చర్యపరుస్తుంది’’ అన్నారు రచయిత. సో.. పోలీస్ గెటప్ గురించి సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమా అక్టోబరు 13న విడుదల కానుంది. -
నీకు ఏ గిఫ్ట్ ఇచ్చినా తక్కువే: భార్యపై రామ్చరణ్ కామెంట్
Happy Birthday Upasana Konidela: మెగా పవర్ స్టార్ రామ్చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల నేడు (జూలై 20) పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చెర్రీ తన అర్ధాంగికి సోషల్ మీడియా వేదికగా స్పెషల్గా విషెస్ చెప్పాడు. "నీ కుటుంబం కోసం, నిరుపేదల కోసం ఏదైనా చేయడానికి నువ్వెప్పుడూ ముందుంటావు. అలాంటి నీకు కృతజ్ఞత చెప్పడానికి ఎంత పెద్ద బహుమతి ఇచ్చినా అది చిన్నదే అవుతుంది. హ్యాపీ బర్త్డే.." అంటూ హార్ట్, కేక్ ఎమోజీలతో ట్వీట్ చేశాడు. భార్య తన భుజంపై వాలి ఉన్న ఫొటోను సైతం అభిమానులతో పంచుకున్నాడు. కాగా అనిల్ కామినేని, శోభన కామినేనిల కూతురే ఉపాసన. 2012 సంవత్సరంలో జూన్ 14న మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్చరణ్ను పెళ్లాడి కొణిదెల ఇంట్లో కుడికాలు పెట్టింది. మరోవైపు అపోలో హెల్త్ కేర్ బాధ్యతలు చూసుకుంటూ సెలబ్రిటీల డైట్స్ గురించి కూడా ఇంటర్వ్యూలు చేసింది. ఆ మధ్య రైతు అవతారం ఎత్తి సేంద్రీయ వ్యవసాయం కూడా చేసి వార్తల్లో నిలిచింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) .@upasanakonidela You have never stopped giving ur best to people in need and ur family!! No gift could ever be enough to thank you!! HAPPY BIRTHDAY!! 🥳❤️🎂 pic.twitter.com/3V9GlzulI1 — Ram Charan (@AlwaysRamCharan) July 20, 2021 View this post on Instagram A post shared by Naga Babu Konidela (@nagababuofficial) -
ఈసారి 'వినయ విధేయ వార్నర్'లా..
మెల్బోర్న్: తెలుగు హీరోలను, సినిమాలను క్రమం తప్పకుండా ఫాలో అవుతూ, వారి ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ తరుచూ సోషల్ మీడియాలో షేర్ చేసే ఆసీస్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్.. తాజాగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ను వాడేశాడు. రాంచరణ్, కియారా అడ్వానీ నటీనటులుగా నటించిన వినయ విధేయ రామ సినిమాలోని యాక్షన్ సీన్లతో స్వాపింగ్ వీడియో రూపొందించి, తన ఇన్స్టా ఖాతాలో షేర్ చేశాడు. నేను మళ్లీ వచ్చేశాను. ఈ లెజెండ్ ఎవరు? ఇది ఏ సినిమాలో సన్నివేశం అని క్యాప్షన్ జోడించాడు. ఈ పోస్టుకు హీరోలు రాంచరణ్, రానా దగ్గుబాటి, ప్రభాస్లను ట్యాగ్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుత నెట్టింట హల్చల్ చేస్తుంది. దీనిపై రాంచరణ్ అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. View this post on Instagram A post shared by David Warner (@davidwarner31) కాగా, బుట్టబొమ్మ సాంగ్తో స్వాపింగ్ వీడియోలను రూపొందించడం ప్రారంభించిన ఈ ఆసీస్ స్టార్ క్రికెటర్.. ఆతర్వాత చాలా మంది తెలుగు అగ్ర హీరోలకు చెందిన సినిమాల్లోని సీన్లతో వీడియోలు చేశాడు. ఇటీవలే రాజమౌళీ ఆర్ఆర్ఆర్ పోస్టర్ను మార్ఫింగ్ చేసిన వార్నర్.. దానికి వచ్చిన రెస్పాన్స్ చూసి వినయ విధేయ రామను వాడాడు. ఈ మధ్యకాలంలో పేస్ ఆఫ్ యాప్ను ఉపయోగించి సౌత్ స్టార్స్ సినిమాల్లోని సన్నివేశాల్లో నటిస్తున్న డేవిడ్ భాయ్.. కొంతకాలంగా ఇలాంటి ప్రయోగాలనే చేస్తూ బీజీగా గడుపుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ రద్దు కావడంతో ఖాళీగా ఉన్న వార్నర్.. ఎక్కువ శాతం సమయాన్ని మార్ఫింగ్ వీడియోలు చేయడానికి కేటాయించడం విశేషం. -
చెప్పిన సమయానికే వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’
-
ఆర్ఆర్ఆర్ వచ్చేది ఈ అక్టోబరులోనే!
అనుకున్న సమయానికే విడుదలయ్యేందుకు ‘రౌద్రం... రణం.. రుధిరం’ (ఆర్ఆర్ఆర్) చిత్రం సిద్ధమవుతోంది. రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా నటిస్తున్న భారీ బడ్జెట్ పీరియాడికల్ చిత్రం ఇది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఒలివియా మోరిస్, ఆలియా భట్ కథానాయికలుగా నటిస్తున్నారు. -
‘కేజీఎఫ్’ డైరెక్టర్తో రామ్చరణ్ మూవీ..నిజం ఏంటంటే..
‘కేజీఎఫ్’ సినిమాతో ప్యాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆ సినిమా తర్వాత ఆయన దృష్టి తెలుగు చిత్ర పరిశ్రమపై పడింది. వరుసగా స్టార్ హీరోలతో పని చేసే అవకాశాలు అందుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్తో ‘సలార్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ఆయన ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్తోనూ ఓ సినిమా చేయనున్నారు. తాజాగా రామ్చరణ్తో ప్రశాంత్ నీల్ ఓ సినిమా చేయనున్నారనే వార్త ప్రచారం లోకి వచ్చింది. శంకర్ దర్శకత్వంలో రామ్చరణ్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పూర్తయిన వెంటనే ప్రశాంత్ నీల్తో సినిమా చేస్తారట రామ్చరణ్. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఉంటుందా? ఉండదా? ఉంటే ఏ జోనర్లో ఉంటుంది? అసలు ఈ వార్త నిజం అవుతుందా? అంటే కొద్దిరోజులు వేచి చూడాలి మరి. -
Acharya Moive: ఇరవై రోజులే ఉంది!
జస్ట్ 20 రోజులు షూటింగ్ జరిగి ఉంటే ‘ఆచార్య’ చిత్రబృందం గుమ్మడికాయ కొట్టేసేవాళ్లు. కానీ కరోనా ‘ఆచార్య’ ప్లాన్ను కాస్త అటూ ఇటూ చేసింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా చిత్రీకరణకు తాత్కాలిక బ్రేక్ పడిన విషయం తెలిసిందే. లాక్డౌన్ పూర్తయిన వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మొత్తం 20 రోజుల షూటింగ్ను నాన్స్టాప్గా జరిపేలా ప్లాన్ చేస్తున్నారట కొరటాల శివ. చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రంలో రామ్చరణ్ ఓ కీ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. రామ్చరణ్ సరసన పూజా హెగ్డే కనిపిస్తారు. ఈ ఏడాది మే 13న విడుదల కావాల్సిన ‘ఆచార్య’ చిత్రం కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. -
Acharya: చరణ్ ఎంట్రీ అదిరిపోద్దట!
చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య’. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. కీలక పాత్రల్లో రామ్చరణ్, పూజా హెగ్డే కనిపించనున్నారు. ఇందులో దేవాదాయ శాఖ ఉద్యోగిగా చిరంజీవి నటిస్తున్నారు. చరణ్ది పూర్తి స్థాయి నిడివి ఉన్న కీలక పాత్ర. దాదాపు 40 నిమిషాలు ఉంటుందని టాక్. ఇంటర్వెల్లో వచ్చే చరణ్ పాత్ర సెకండాఫ్ అంతా ఉంటుందని తెలిసింది. సినిమా ద్వితీయార్ధంలో ఈ పాత్ర చాలా కీలకంగా ఉంటుందట. అంతేకాదు.. ఈ సినిమాలో చరణ్ పాత్ర పరిచయ సన్నివేశం అదిరిపోతుందట. సెకండాఫ్లో ముఖ్యంగా చిరంజీవి, చరణ్ల మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్గా ఉంటాయని సమాచారం. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ‘ఆచార్య’ సినిమా షూటింగ్కి బ్రేక్ పడింది. ఇంకా రామ్చరణ్, పూజాలపై ఓ పాటను చిత్రీకరించాల్సి ఉంది. ఈ ఏడాది మే 13న విడుదల కావాల్సిన ఈ చిత్రం కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. -
ఆలియా.. జాన్వీ... ఫైనల్గా ఎవరో?
రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ ప్యాన్ ఇండియా మూవీని ‘దిల్’ రాజు నిర్మించనున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా ఇప్పటికే పూజా హెగ్డే, రష్మికా మందన్నా, కియారా అద్వానీల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా జాన్వీ కపూర్, ఆలియా భట్ల పేర్లు వినిపిస్తున్నాయి. ప్రముఖ నటి శ్రీదేవి కుమార్తె జాన్వీని దక్షిణాది తెరకు పరిచయం చేయడానికి చాలామంది దర్శక–నిర్మాతలు ఆసక్తిగా ఉన్నారు. మరోవైపు ఇప్పటికే రాజమౌళి ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్) చిత్రంలో రామ్చరణ్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి.. ఆలియా భట్ను హీరోయిన్గా ఫిక్స్ చేసి ‘ఆర్ఆర్ఆర్’ జోడీని దర్శకుడు శంకర్ రిపీట్ చేస్తారా? లేక జాన్వీని కన్ఫార్మ్ చేసి, కొత్త జోడీని వెండితెరపై చూపిస్తారా? ఆలియా, జాన్వీ కాకుండా మరో హీరోయిన్ని ఎంపిక చేస్తారా? అనేది తెలియాలంటే కొంత కాలం వేచి చూడక తప్పదు. -
కొమురం భీమ్.. నాకో సవాల్!
చేతిలో బల్లెం పట్టుకుని మహోగ్రరూపం దాల్చిన కొమురం భీమ్గా ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్ఆర్ఆర్) చిత్రంలోని జూనియర్ ఎన్టీఆర్ కొత్త పోస్టర్ విడుదలైంది. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో రామ్చరణ్ మరో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్చరణ్ నటిస్తున్నారు. గురువారం (మే 20) ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రంలోని ఎన్టీఆర్ కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ‘‘మంచి మనసు ఉన్న తిరుగుబాటుదారుడు కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నందుకు, అలాగే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని నా కొత్త పోస్టర్ను మీ అందరితో (అభిమానులు, ప్రేక్షకులు) పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. ఈ పాత్ర పోషించడం నాకో సవాల్లా అనిపిస్తోంది’’ అని సోషల్ మీడియా వేదికగా స్పందించారు ఎన్టీఆర్. ‘‘మా భీమ్ది బంగారంలాంటి మనసు. కానీ తిరగబడితే దేనికైనా బలంగా, ధైర్యంగా నిలబడతాడు’’ అని ట్వీట్ చేశారు రాజమౌళి. ఇదిలా ఉంటే.. మన దేశం కరోనాతో యుద్ధం చేస్తున్న వేళ పుట్టినరోజు వేడుకలకు ఇది సమయం కాదని, దేశం కరోనాను జయించిన రోజున అందరం వేడుక చేసుకుందామని, తన బర్త్ డే వేడుకలను నిర్వహించవద్దని ఎన్టీఆర్ తన అభిమానులకు విన్నవించుకున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్తో... ఎన్టీఆర్ హీరోగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకతంలో రూపొందనున్న సినిమా అధికారిక ప్రకటన గురువారం వెల్లడైంది. ‘‘ఎన్టీఆర్తో కలిసి సినిమా చేయడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో హీరోగా చేస్తారు ఎన్టీఆర్. ఆ తర్వాత ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్లోని సినిమా సెట్స్పైకి వెళుతుంది. -
ఆర్ఆర్ఆర్: వారెవ్వా.. క్యా సీన్ హై!
జూనియర్ ఎన్టీఆర్, పులి మధ్యలో వచ్చే ఓ సీన్ అదుర్స్. ప్రీ ఇంటర్వెల్లో రామ్చరణ్ యాక్షన్ సీక్వెన్స్ సూపర్. సినిమాలోని అండర్ వాటర్ సన్నివేశం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే... ఇలా ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్ఆర్ఆర్) సినిమాలోని సన్నివేశాల గురించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా మరో సీన్ గురించి చర్చ జరుగుతోంది. జైలులో జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్ల మధ్య వచ్చే ఆ సీన్ చాలా బాగుంటుందట. ఈ సీన్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసేలా రాజమౌళి తెరకెక్కించారట. అంతే కాదండోయ్.. సీన్ బ్యాక్గ్రౌండ్లో కాలభైరవ వాయిస్లో వచ్చే పాట ప్రేక్షకులను కంటతడి పెట్టించేలా ఉంటుందని టాక్. ‘వారెవ్వా.. క్యా సీన్ హై’ (వారెవ్వా.. ఏం సీన్) అనేలా ఉంటుందట. ఈ చిత్రంలో స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్చరణ్ కనిపిస్తారు. వాస్తవానికి కల్పన జోడించి రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబరు 13న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
క్వారంటైన్లో మహేశ్బాబు, ప్రభాస్, రామ్చరణ్
హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారు హీరో మహేశ్బాబు, ప్రభాస్, రామ్చరణ్. ఫ్యాన్స్ కంగారుపడాల్సిన అవసరంలేదు. ఇంతకీ విషయం ఏంటంటే... ‘సర్కారువారి పాట’ సినిమా షూటింగ్ సమయంలో చిత్రబృందంలోని ఐదుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఈ సినిమా షూటింగ్ను నిలిపివేశారు. అయితే కోవిడ్ బారినపడ్డ ఐదుగురిలో మహేశ్బాబు వ్యక్తిగత సహాయకుడు ఉన్నారట. దీంతో ఫ్యామిలీ డాక్టర్ సూచన మేరకు మహేశ్ క్వారంటైన్లోకి వెళ్లారని తెలిసింది. కేవలం మహేశ్ మాత్రమే కాదు.. ప్రభాస్, రామ్చరణ్లు కూడా హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. మొన్నటివరకు ‘రాధేశ్యామ్’ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు ప్రభాస్. కాగా ప్రభాస్ మేకప్మ్యాన్కు కూడా కరోనా పాజిటివ్. దీంతో ఆయన హోమ్ క్వారంటైన్లోకి వెళ్లారని తెలిసింది. అలాగే ఇటీవల సోనూ సూద్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ మధ్య ఆయన ‘ఆచార్య’ షూటింగ్లో పాల్గొన్నారు. రామ్చరణ్, సోనూలపై సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే చిరంజీవి, చరణ్ సహాయకుల్లో ఒకరికి కరోనా అట. దీంతో వైద్యుల సూచన మేరకు రామ్చరణ్ కూడా క్వారంటైన్లో ఉంటున్నారని సమాచారం. ఇలా ముగ్గురు టాప్ హీరోలు హోమ్ క్వారంటైన్లో ఉండటం తెలుగు పరిశ్రమలో చర్చనీయాంశమైంది. -
అతను ఐఏఎస్.. ఆమె జర్నలిస్ట్!
ఐఏఎస్ ఆఫీసర్ల విధివిధానాలు, బాధ్యతలు వంటి అంశాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారట హీరో రామ్చరణ్. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో హీరోగా నటించనున్న సినిమా కోసమే ఈ ఫోకస్. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది జూలై లేదా ఆగస్టులో ప్రారంభం అవుతుందని ఇటీవల ఓ సందర్భంలో చిత్రనిర్మాత ‘దిల్’ రాజు పేర్కొన్నారు. ఇందులో రామ్చరణ్ ఏ పాత్ర చేయనున్నారనేది ప్రస్తుతం హాట్ టాపిక్. ముందు ఐఏఎస్ ఆఫీసర్గా ఆ తర్వాత ముఖ్యమంత్రిగా చరణ్ కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ సినిమాలో హీరోయిన్గా రష్మికా మందన్నాను తీసుకోవాలనుకుంటున్నారని టాక్. ఆమెది జర్నలిస్టు పాత్ర అని సమాచారం. ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ నటించనున్నారట. చదవండి: ఐపీఎల్ సీజన్. ఓ అమ్మాయి కామెంటరీ ఇస్తోంది. -
ఆచార్యలో రామ్చరణ్ పాత్ర అదే
ధర్మస్థలిలో శత్రుసంహారం చేస్తున్నాడు సిద్ధ. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’ సినిమాలో ‘సిద్ధ’ అనే ప్రధాన పాత్రను రామ్చరణ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా కోసం ధర్మస్థలి విలేజ్ సెట్ను హైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టూడియోలో చిత్రబృందం తయారు చేయించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆ సెట్లోనే జరుగుతోంది. రామ్చరణ్, సోనూ సూద్ కాంబినేషన్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రామ్చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు. మే 13న ‘ఆచార్య’ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. అయితే ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. -
ఈ వార్త నిజమైతే.. ఫ్యాన్స్కు పండగే!
‘మగధీర, బ్రూస్లీ’ చిత్రాల్లో చిరంజీవి, రామ్చరణ్ ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే మెగాఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ రెండు చిత్రాల్లో రామ్చరణే హీరోగా నటించగా, చిరంజీవి గెస్ట్ రోల్ చేశారు. అలాగే చిరంజీవి నటించిన ‘ఖైదీ నం. 150’లో ఓ పాటలో కనిపించారు చరణ్. ఇప్పుడు ‘ఆచార్య’ సినిమాలో చిరంజీవి హీరోగా నటిస్తుండగా రామ్చరణ్ పూర్తి స్థాయి నిడివి ఉన్న లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది మే 13న విడుదల కానుంది. అయితే ఫిల్మ్నగర్ లేటెస్ట్ టాక్ ఏంటంటే... రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు ఓ ప్యాన్ ఇండియన్ మూవీని నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి ఓ లీడ్ క్యారెక్టర్ చేయనున్నారనే ప్రచారం వినిపిస్తోంది. ఈ వార్త నిజమైతే మెగాఫ్యాన్స్కు పండగే. మరి.. మరోసారి చిరంజీవి, రామ్చరణ్ స్క్రీన్ షేర్ చేసుకుంటారా? అనేది చూడాలి. ఈ సంగతి ఇలా ఉంచితే... శంకర్ దర్శకత్వంలో సినిమా చేయాలని ఉందని చిరంజీవి ఓ సందర్భంలో చెప్పారు. కానీ ఇప్పటివరకు కుదర్లేదు. మరి... ఆ తరుణం వచ్చిందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
ఎన్టీఆర్కు సింగర్ కంగ్రాట్స్: ఆడేసుకుంటున్న నెటిజన్లు!
అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్చరణ్ లుక్ను అతడి బర్త్డేకు ఒకరోజు ముందే(శుక్రవారమే) రిలీజ్ చేసి ఫ్యాన్స్కు ట్రీట్ ఇచ్చింది ఆర్ఆర్ఆర్ టీమ్. రామరాజు లుక్లో చెర్రీ అదిరిపోయాడంటూ సెలబ్రిటీలు, అభిమానులు పోస్టర్పై ప్రశంసలు కురిపించారు. రామరాజుగా మై బ్రదర్ రామ్చరణ్ అంటూ ఈ పోస్టర్ను జూనియర్ ఎన్టీఆర్ సైతం సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనికి సింగర్ దలేర్ మెంది రిప్లై ఇస్తూ.. 'కంగ్రాచ్యులేషన్స్ తారక్, పోస్టర్ చాలా బాగుంది, కీప్ ఇట్ అప్' అని అభినందించాడు. దీంతో అభిమానులు ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. అక్కడ రిలీజైంది చెర్రీ పోస్టర్ అయితే ఈయన తారక్కు శుభాకాంక్షలు చెప్తున్నాడేంటని తలలు పట్టుకున్నారు. వెంటనే ఫ్యాన్స్ అందులో ఉన్నది రామ్చరణ్ అయ్యా! అంటూ కౌంటర్లివ్వడం మొదలుపెట్టారు. రామ్చరణ్కు, ఎన్టీఆర్కు తేడా తెలియట్లేదా? అంటూ కామెంట్లతో ఆడుకున్నారు. కాగా రామ్చరణ్ బర్త్డే వేడుకలు ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం) సెట్స్లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి చెర్రీ చేత కేక్ కట్ చేయించింది చిత్రయూనిట్. మరోవైపు రామ్చరణ్ ఫ్యాన్స్ హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో చెర్రీ బర్త్డే వేడుకలు జరిపారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఓ ఫొటో షేర్ చేస్తూ.. ఈ ఏడాది మా ఇద్దరికీ జీవితాంతం గుర్తుండిపోతుంది. నీతో గడిపిన సమయాలు ఎప్పటికీ సంతోషకరమైనవే బ్రదర్. హ్యాపీ బర్త్డే అని రాసుకొచ్చారు. Congratulations @tarak9999 bro!! Love the poster!!! Keep it up. Looking forward. — Daler Mehndi (@dalermehndi) March 26, 2021 చదవండి: 'రామరాజు'గా రామ్చరణ్ పోస్టర్ విడుదల లగ్జరీ కారు కొన్న ప్రభాస్! ఖరీదు: అక్షరాలా ఏడు కోట్ల రూపాయలట! 'ఆర్ఆర్ఆర్' నుంచి రామ్చరణ్కు స్పెషల్ సర్ప్రైజ్ -
శత్రుసంహారానికి ఆచార్య సిద్ధం!
ధర్మానికి ధైర్యం తోడైన వేళ శత్రుసంహారానికి ఆచార్య సిద్ధమయ్యాడు. సిద్ధతో సహా ముందుడుగు వేశాడు. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. రామ్చరణ్, పూజా హెగ్డే కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఆచార్యగా చిరంజీవి, సిద్ధ పాత్రలో రామ్చరణ్ నటిస్తున్నారు. శనివారం చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాలో తండ్రీకొడుకులు కలిసి ఉన్న పోస్టర్ను విడుదల చేశారు. ‘‘మీతో కలిసి నటించడంతో నా కల నెరవేరినట్లు ఉంది నాన్నా. ఇంతకన్నా నాకు బర్త్ డే గిఫ్ట్ ఏముంటుంది’’ అని, ‘లాహి లాహి...’ పాటలో వింటేజ్ మెగాస్టార్ని చూస్తారని ప్రామిస్ చేస్తున్నాం అని పేర్కొన్నారు రామ్చరణ్. అలాగే ‘ఆచార్య’లోని ‘లాహి లాహి...’ అనే పాట లిరికల్ వీడియోను మార్చి 31న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ పాటకు సంబంధించి చిరంజీవి ఫొటోను విడుదల చేశారు. మే 13న ఈ సినిమా రిలీజ్. -
రామ్చరణ్ బర్త్డే: ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్
రేపు(శనివారం) రామ్చరణ్ బర్త్డే. ఈ సందర్భంగా చెర్రీ అభిమానులు సోషల్ మీడియాలో ఇప్పటి నుంచే నానా సందడి చేస్తున్నారు. రామ్చరణ్ సినిమా పోస్టర్లను, అతడి స్టిల్స్ను షేర్ చేసుకుంటూ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే అభిమానుల కోసం సాయిధరమ్ తేజ్ రిలీజ్ చేసిన కామన్ డీపీ అంతంత మాత్రంగానే ఉండటంతో విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. క్రియేటివ్గా కాకుండా ఓ సాదాసీదా ఫొటోను వదిలారంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారిని కూల్ చేసేందుకు మోషన్ పోస్టర్ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు కనిపిస్తోంది. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశాడు. ఇందులో నిప్పుల మధ్యలో నుంచి దూకుతున్న సింహంలా కనిపించాడు చెర్రీ. ఆర్ఆర్ఆర్లో నిప్పుకు ప్రతీకగా రామ్చరణ్ను చూపించడంతో మోషన్ పోస్టర్లో కూడా నిప్పునే ప్రధానంగా ఎంచుకున్నారు. డీపీ కంటే ఈ వీడియో వంద రెట్లు నయమంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా వుంటే చరణ్ ప్రస్తుతం రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్) సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇందులో ఆలియా సీతగా అతడితో జోడీ కడుతోంది. చెర్రీ బర్త్డేను పురస్కరించుకుని ఫ్యాన్స్కు ట్రీట్ ఇవ్వాలని నిర్ణయించుకుంది చిత్రయూనిట్. అందులో భాగంగా నేడు సాయంత్రం 4 గంటలకు రామరాజు లుక్ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. Here is the animated motion poster of @AlwaysRamCharan Anna’s by his beloved fans celebrating his birthday.. Looks superb!!🔥🔥🔥#RCBdaySplMotionPoster pic.twitter.com/Jbu7DS8fGm — Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) March 26, 2021 చదవండి: హీరోయిన్ కీర్తి వల్ల బతుకు బస్టాండ్ అయ్యింది : నితిన్ -
రామ్చరణ్ బర్త్డే సీడీపీ: ఫ్యాన్స్ ట్రోలింగ్!
హీరోల బర్త్డేలు అంటే మామూలుగా ఉండదు. ఫ్యాన్స్ పోటాపోటీగా సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తుంటారు. ఏ యేటికాయేడు రెట్టించిన ఉత్సాహంతో వేడుకలు చేసేందుకు రెడీ అవుతుంటారు. ఇక సోషల్ మీడియాలో చేసే హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా కామన్ డీపీతో రచ్చరచ్చ చేస్తుంటారు. చిన్నస్థాయి హీరోల నుంచి పెద్ద హీరోల వరకు అందరూ కామన్ డీపీ చేయించుకుంటున్నారు. ఇది టాలీవుడ్లో కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. అయితే రేపు మెగా పవర్ స్టార్ రామ్చరణ్ బర్త్డే. స్టార్ హీరో, అందులోనూ మెగాస్టార్ తనయుడు.. ఇంకేముందీ.. సీడీపీ ఓ రేంజ్లో ఉంటుందని భావించారంతా.. కానీ అందరికీ షాకిస్తూ ఓ సాదాసీదా డీపీని హీరో సాయి ధరమ్ తేజ్ విడుదల చేశాడు. ఇది చూసిన అభిమానుల ఉత్సాహం అంతా నీరుగారిపోయింది. మరీ ఇంత ఘోరమా అంటూ సాయిధరమ్ తేజ్ మీద గరమవుతున్నారు. దీనికంటే మేము చేసిన డీపీ బెటర్గా ఉందంటూ కొన్ని ఫొటోలను షేర్ చేస్తున్నారు. ఇది జస్ట్ పోస్టర్లా ఉందే తప్ప సీడీపీలా లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. Here's the CDP to celebrate Megapower Star @AlwaysRamcharan's birthday on March 27th. #RamCharanBdayCDP #RamCharan pic.twitter.com/yGW0SD3Fdn — Sai Dharam Tej (@IamSaiDharamTej) March 24, 2021 చదవండి: రామ్చరణ్ బర్త్డేకి ‘ఆర్ఆర్ఆర్’ స్పెషల్ గిఫ్ట్! దాదాపు ఎనిమిదేళ్లు అవుతోంది: పూజా హెగ్డే -
బ్యాక్ టు ఆర్ఆర్ఆర్
‘ఆచార్య, ఆర్ఆర్ఆర్’ చిత్రాల షూటింగ్స్ను భలేగా బ్యాలెన్స్ చేస్తున్నారు రామ్చరణ్. ఖమ్మంలో ‘ఆచార్య’ షూటింగ్ను పూర్తి చేసిన చరణ్ చిన్న బ్రేక్ తీసుకుని, తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ సెట్స్లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ చిత్రం నైట్ షూట్ జరుగుతోంది. శనివారం నుంచి రామ్చరణ్కు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కిస్తారని సమాచారం. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రూపొందుతున్న సినిమా ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్). ఒలీవియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్చరణ్ కనిపిస్తారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఈ ఏడాది అక్టోబరు 13న విడుదల కానుంది. -
పంచ్ డైలాగ్స్.. పవర్ఫుల్ సీన్స్
ఒకవైపు ‘ఆచార్య’, మరోవైపు ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాల షూటింగ్స్తో బిజీ బిజీగా ఉన్నారు రామ్చరణ్. ‘ఆచార్య’ షూటింగ్ త్వరలో పూర్తవుతుంది. ఆ తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ కూడా ముగింపు దశకు చేరుకునేసరికి శంకర్ కాంబినేషన్లో రామ్చరణ్ చేయనున్న సినిమా చిత్రీకరణ ఆరంభమవుతుందని తెలిసింది. ప్రస్తుతం శంకర్ స్క్రిప్ట్ వర్క్ మీద ఉన్నారు. జూన్లో చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారట. విజువల్ ఎఫెక్ట్స్కి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా పవర్ఫుల్ ఎమోషన్స్ ప్రధానంగా ఈ సినిమాను శంకర్ తెరకెక్కించనున్నారని తెలిసింది. ఎమోషనల్ డ్రామా, పవర్ఫుల్ సీన్స్, పంచ్ డైలాగ్స్తో ఈ ప్యాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేస్తున్నారట. శంకర్ గత చిత్రాలకు సంగీతదర్శకుడిగా చేసిన ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి కూడా స్వరకర్తగా చేయనున్నారని టాక్. ఇది రామ్చరణ్కి 15వ సినిమా అయితే చిత్రనిర్మాత ‘దిల్’రాజుకి 50వ సినిమా. -
ట్యూన్ అవుతున్నారా?
హీరో రామ్చరణ్–దర్శకుడు శంకర్తో ఏఆర్ రెహమాన్ ట్యూన్ అవుతున్నారని టాక్. శంకర్ దర్శకత్వంలో చరణ్ హీరోగా ‘దిల్’ రాజు ఓ భారీ చిత్రాన్ని నిర్మించనున్న సంగతి తెలిసిందే. శంకర్ తొలి చిత్రం ‘జెంటిల్మేన్’ నుంచి ఆయనతో రెహమాన్కి మంచి అనుబంధం ఏర్పడింది. శంకర్ తెరకెక్కించిన ‘భారతీయుడు’, ‘జీన్స్’, ‘శివాజీ’, ‘రోబో’, ‘2.0’ వంటి పలు చిత్రాలకు ఏఆర్ రెహమానే సంగీతదర్శకుడు. ఇప్పుడు చరణ్–శంకర్ కాంబినేషన్ చిత్రానికి రెహమాన్ ట్యూన్ అవుతున్నారట. ‘మీ నుంచి తెలుగు ఆల్బమ్ని ఎప్పుడు ఆశించవచ్చు?’ అని ఓ నెటిజన్ అడిగితే, ‘వెరీ సూన్’ అన్నారు రెహమాన్. చరణ్ చిత్రాన్ని ఉద్దేశించే ఆయన అలా అన్నారన్నది చాలామంది ఊహ. కాగా శంకర్తో ఇప్పటికే పలు చిత్రాలకు ట్యూన్ అయిన రెహమాన్ ఇప్పటివరకూ చరణ్ చిత్రాలకు సంగీతం అందించలేదు. ఒకవేళ ట్యూన్ అయితే ఇదే తొలి కాంబినేషన్ అవుతుంది. వచ్చే ఏడాది ఈ చిత్రం ఆరంభమవుతుంది. -
ఆచార్య షూటింగ్: వీడియో తీసిన ఫ్యాన్స్!
సాక్షి, తూర్పుగోదావరి: మగధీర, బ్రూస్లీ, ఖైదీ నంబర్ 150 చిత్రాల్లో చిన్న చిన్న సీన్లలో లేదా, పాటల్లోనో స్క్రీన్ మీద కనిపించారు చిరంజీవి, రామ్చరణ్. కానీ తొలిసారిగా ఈ తండ్రీకొడుకులు పూర్తి స్థాయిలో కలిసి నటిస్తున్నారు. చిరంజీవి ప్రధాన హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "ఆచార్య". ప్రస్తుతం ఆచార్య యూనిట్ రాజమండ్రిలో మకాం వేసిన సంగతి తెలిసిందే. మారేడుమిల్లి అడవుల్లో జరుగుతున్న షెడ్యూల్లో చరణ్పై ఓ యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్లో మెగాస్టార్ సైతం పాల్గొన్నారు. షూటింగ్ స్పాట్కు చేరుకున్న అభిమానులు వారిని ఫొటోలు, వీడియోలు తీసి నెట్టింట పోస్ట్ చేశారు. దీంతో అవి కాస్తా వైరల్గా మారాయి. ఇద్దరు స్టార్లను ఒకే ఫ్రేములో చూసిన అభిమానులు సమ్మర్లో సందడి మామూలుగా ఉండదంటున్నారు. ఇక్కడ షూటింగ్ పూర్తైన వెంటనే మార్చి 7 నుంచి 15వ తేదీ వరకు ఖమ్మం జిల్లాలోని ఇల్లందులో మరో షెడ్యూల్ ప్లాన్ చేసింది ఆచార్య యూనిట్. ఈ మేరకు ఇల్లందులోని జేకే మైన్స్లో షూటింగ్కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిరంజన్ రెడ్డి, రామ్చరణ్ నిర్మిస్తున్నారు. కాజల్ కథానాయిక. ఈ సినిమాలో సిద్ధ అనే పాత్రలో నటిస్తున్నారు చరణ్. అతడికి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఆచార్యలో సీన్స్ మాత్రమే కాకుండా లెట్స్ డు కుమ్ముడు అంటూ ఈ తండ్రీకొడుకులు స్టెప్స్ వేస్తారని టాక్. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మే 13న రిలీజ్ కానుంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్కు విశేషమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే. పైగా ఈ టీజర్కు రామ్చరణ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం మరింత ఆకర్షణగా మారింది. చదవండి: ఆచార్య: తెరుచుకున్న ధర్మస్థలి తలుపులు ఆచార్య@ మారేడుపల్లి.. చిరు గ్రాండ్ ఎంట్రీ -
జోడీ కుదురుతుందా?
రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ‘దిల్’ రాజు నిర్మించనున్న ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్గా ఉంటుందని టాక్. ఎప్పటిలానే శంకర్ స్టయిల్లో భారీ సెట్టింగ్స్తో ఈ సినిమా ఉంటుం దని వార్త. ఈ సినిమాలో హీరోయి¯Œ గా రష్మికా మందన్నా పేరుని పరిశీలిస్తున్నారని టాక్. రామ్చరణ్, రష్మికా ఇప్పటి వరకూ జోడీగా నటించలేదు. ఈ కాంబినేష¯Œ కొత్తగా ఉంటుందని చిత్రబృందం భావించిందట. తొలిసారి ఆర్ అండ్ ఆర్ కలసి యాక్ట్ చేస్తారా? చూడాలి. ప్యా¯Œ ఇండియా చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. -
'ఉప్పెన' విజయోత్సవ వేడుక ఫోటోలు
-
ఆచార్య.. చలో రాజమండ్రి
రాజమండ్రికి ప్రయాణం కానున్నారు రామ్చరణ్. ‘ఆచార్య’ చిత్రీకరణ కోసం కొన్ని రోజులు అక్కడే ఉండనున్నారని తెలిసింది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. కాజల్ అగర్వాల్ కథానాయిక. నిరంజన్ రెడ్డి, రామ్చరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నిర్మించడంతో పాటు ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు చరణ్. తనకు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. రాజమండ్రిలో జరిపే షెడ్యూల్లో చరణ్పై ఓ యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కించనున్నారు. ఈ షెడ్యూల్లో చిరంజీవి కూడా పాల్గొంటారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మే 9న విడుదల కానుంది. చదవండి: నా సిటీనే.. నా బ్యూటీ -
శంకర్ దర్శకత్వంలో చరణ్?
ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో స్టార్ హీరోలందరి చేతిలో మినిమమ్ రెండు మూడు సినిమాలు ఉన్నాయి. చేస్తున్న సినిమా కాకుండా మరో రెండు సినిమాల లైనప్ రెడీగా ఉంది. కానీ రామ్చరణ్ మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ తప్ప మరే ప్రాజెక్ట్ ప్రకటించలేదు. చిరంజీవి ‘ఆచార్య సినిమాలో చరణ్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. మరి రామ్చరణ్ ప్లాన్ చేస్తున్న నెక్ట్స్ సినిమా ఏంటీ అంటే... రెండు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో చరణ్ ఓ సినిమా కమిటయ్యారట. ఇది మల్టీస్టారర్ చిత్రమని టాక్. రామ్చరణ్, యశ్, విజయ్ సేతుపతి ఇందులో హీరోలుగా కనిపిస్తారని సమాచారం. మరొకటి... ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి చెప్పిన కథకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట చరణ్. ఈ రెండు సినిమాలు కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్నాయని తెలిసింది. -
ఆర్.ఆర్.ఆర్: తీవ్రంగా కసరత్తులు, కొంచెం రిలాక్స్
బీభత్సమైన పోరాట సన్నివేశాల్లో పాల్గొనాల్సి వచ్చినప్పుడు కఠినమైన కసరత్తులు చేయాలి. జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్ అదే చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’ (రౌద్రం... రణం... రుధిరం). ఇందులో కొమురం భీమ్ పాత్రలో తారక్, అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటిస్తున్నారు. ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోంది. పోరాట సన్నివేశాలు తీస్తున్నారు. దాంతో హీరోలిద్దరూ తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు. మధ్య మధ్యలో కొంచెం రిలాక్స్ అవుతున్నారు. అలా రిలాక్స్ అవుతున్న ఫొటోలను షేర్ చేశారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది. -
లెట్స్ డు కుమ్ముడు!
‘మగధీర, బ్రూస్లీ, ఖైదీ నంబర్ 150’ చిత్రాల్లో చిన్న చిన్న సన్నివేశాల్లోనో, పాటలోనో స్క్రీన్ మీద కనిపించారు చిరంజీవి, రామ్చరణ్. ‘ఆచార్య’లో తొలిసారి పూర్తి స్థాయిలో కలసి నటిస్తున్నారు. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. నిరంజన్ రెడ్డి, రామ్చరణ్ నిర్మిస్తున్నారు. కాజల్ కథానాయిక. ఈ సినిమాలో సిద్ధ అనే పాత్రలో నటిస్తున్నారు చరణ్. ఇటీవలే చిత్రీకరణలో జాయిన్ అయ్యారు. వచ్చే వారంలో చిరంజీవి–చరణ్ కాంబినేషన్ సన్నివేశాల చిత్రీకరణ ఆరంభమవుతుందని సమాచారం. ‘ఖైదీ నంబర్ 150’లో ‘అమ్మడు.. లెట్స్ డు కుమ్ముడు’ పాటలో కొన్ని స్టెప్పులేసి వెళ్లారు చరణ్. ‘ఆచార్య’లో సీన్స్ మాత్రమే కాదు... లెట్స్ డు కుమ్ముడు అంటూ ఈ తండ్రీకొడుకులు స్టెప్స్ వేస్తారని టాక్. మే 13న ‘ఆచార్య’ రిలీజ్ కానుంది. -
గణతంత్ర వేడుకల్లో మెగాస్టార్, మెగా పవర్ స్టార్
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం హైదరాబాద్లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో జెండావిష్కరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, ఆయన సోదరుడు నాగబాబు, కుమారుడు రామ్ చరణ్ తేజ్, నిర్మాత అల్లు అరవింద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంక్లో చిరంజీవి మూడు రంగుల జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధులకు పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో చిరంజీవి, రామ్చరణ్ అభిమానులు పాల్గొన్నారు. అంతకుముందు చిరంజీవి ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రక్తదానం చేయాలని అభిమానులకు పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని విస్తృతంగా రక్తదానం చేయాలనుకుని నిర్ణయించుకున్న మెగా బ్లడ్ బ్రదర్స్ని మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. తన పిలుపు మేరకు స్పందించి, చిరంజీవి బ్లడ్ బ్యాంక్కు వచ్చి, రక్తదానం చేసిన, చేస్తున్న రక్తదాక్తలకు హృదయ పూర్వక ధన్యవాదాలు అని చెప్పారు. రక్త దానం చేయండి, ప్రాణ దాతలుకండి అంటూ చిరంజీవి తన వాయిస్ వీడియో ద్వారా సోషల్ మీడియా వేదికగా తన సందేశాన్ని అందించారు. ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నిద్ర లేపి అడిగినా చెప్పేస్తా!
చిన్నప్పుడు స్కూల్లో సమాధానాలు అందరం బట్టీ పడుతుంటాం. ఆ సమాధానాలు ఎంతలా గుర్తుంటాయంటే నిద్ర లేపి అడిగినా టక్కున చెప్పేంత. ఆలియా కూడా ‘ఆర్ఆర్ఆర్’ డైలాగులను ఇలానే గుర్తుపెట్టుకున్నారట. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో చరణ్కు జోడీగా ఆలియా నటిస్తున్నారు. ఇటీవలే ఓ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేశారు ఆలియా. ఈ షూటింగ్ గురించి ఆలియా మాట్లాడుతూ – ‘‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణ నాకో కొత్త అనుభవం. నాకు తెలుగు రాదు. అందుకే షూటింగ్లో జాయిన్ అయ్యే ముందే డైలాగ్స్ నేర్చుకోవడం మొదలుపెట్టాను. సుమారు ఏడాదిన్నరగా ఈ డైలాగ్స్ నేర్చుకుంటూనే ఉన్నాను. ఎంతలా అంటే నిద్రలో లేపి అడిగినా చెప్పేసేంత. రాజ మౌళి దర్శకత్వంలో నటించడం ఎగ్జయిటింగ్గా ఉంది’’ అన్నారు. కోవిడ్ లేకపోతే పెళ్లి: హీరో రణ్బీర్ కపూర్, ఆలియా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే కోవిడ్ పరిస్థితుల్లో వాయిదా వేసుకున్నామని రణ్బీర్ పేర్కొన్నారు. -
కల్పనా? నిజమా?
ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. రాజమౌళి దర్శకత్వంలో ప్యాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. డీవీవీ దానయ్య ఈ చిత్రానికి నిర్మాత. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్చరణ్ నటిస్తున్నారు. చరిత్రలో ఎప్పుడూ కలవని కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు కలిస్తే ఏం జరుగుతుంది? అనే కాల్పనిక కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ ఫిక్షన్ సినిమాకి సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి బయటకు వచ్చింది. సినిమాలో ఎన్టీఆర్ వృద్ధునిగానూ కనిపించనున్నారని సమాచారం. అయితే కొమురం భీమ్ చిన్న వయసులోనే మరణించారు. అయితే ఇది కాల్పనిక కథ కాబట్టి ఎన్టీఆర్కి ఓల్డ్ గెటప్ పెట్టి ఉంటారనే ఊహాగానాలు ఉన్నాయి. ఈ పాత్ర కోసం ‘ప్రోస్థటిక్’ మేకప్ వాడాలనుకుంటున్నారట. మరి.. ఈ పాత్ర ఉందన్నది ఫిల్మ్ నగర్ కల్పనా? నిజమా? ట్రిపుల్ ఆర్లో ఎన్టీఆర్ రెండు గెటప్పుల్లో కనబడతారా? వెయిట్ అండ్ సీ. -
ఆచార్యలో... కియారా అద్వానీ
‘వినయ విధేయ రామ’ చిత్రంలో జంటగా నటించారు రామ్చరణ్, కియారా అద్వానీ. ఇప్పుడు రెండోసారి జోడీగా నటించనున్నారని సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. నిరంజన్ రెడ్డి, రామ్చరణ్ నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ కథానాయిక. ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపిస్తారు చరణ్. విద్యార్థి నాయకుడిగా ఆయన పాత్ర ఉంటుంది. చరణ్కు జోడీగా కియారా అద్వానీని ఎంపిక చేసినట్టు సమాచారం. వచ్చే నెలలో ఈ ఇద్దరూ చిత్రీకరణలో పాల్గొంటారట. ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు కియారా. ఆమె నటించిన హిందీ చిత్రం ‘ఇందూకీ జవానీ’ ఈ నెల 11న థియేటర్లలో రిలీజ్ కానుంది. -
‘ఆర్ఆర్ఆర్’లోకి అలియా ఆగయా
‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణలోకి బాలీవుడ్ భామ అలియా భట్ అడుగు పెట్టారు. సోమవారం హైదరాబాద్కు చేరుకొని రాజమౌళిని కలిశారు. ఈ మేరకు చిత్ర యూనిట్ అలియా, రాజమౌళికి చెందిన ఫోటోలను ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలు నెట్టింటా వైరల్గా మారాయి. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ ఇటీవల తిరిగి ప్రారంభమైంది. అప్పటి నుంచి సెట్లోకి అలియా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అందరి అంచనాలు అందుకుంటూ ఆర్ఆర్ఆర్ షూటింగ్లో భాగం కానున్నారు. చదవండి: ఆర్ఆర్ఆర్ షూటింగ్ వీడియో వైరల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఒలీవియా మోరిస్, ఆలియా భట్ కథానాయికలు. కొమరం భీమ్గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ కనిపిస్తారు. ఇందులో రామ్చరణ్కు జోడీగా ఆలియా భట్ నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన ఆలియా. ‘‘ఫైనల్గా... ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్లో జాయిన్ కాబోతున్నానోచ్’’ అంటూ ముంబై నుంచి హైదరాబాద్ ప్రయాణంలో సెల్ఫీ పోస్ట్ చేశారామె. సినిమాలో తెలుగు డైలాగ్స్ పలికేందుకు శిక్షణ తీసుకున్నారు ఆలియా. ఈ చిత్రంలో అజయ్ దేవగన్, శ్రియ, సముద్ర ఖని ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సెంథిల్ కెమెరామేన్. ఈ సినిమా చిత్రీకరణ మార్చికల్లా పూర్తవుతుందని సమాచారం. Beautiful and talented actress #AliaBhatt joins #RRRMovie shoot from today. She plays the role of #Sita in the film.@ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @oliviamorris891 @RRRMovie @DVVMovies pic.twitter.com/ToHK3CeQRY — BARaju (@baraju_SuperHit) December 7, 2020 -
ఆ హీరోకు పెద్ద ఫ్యాన్: ఉప్పెన హీరోయిన్
పంజా వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టి హీరోహీరోయిన్లుగా పరిచమవుతున్న చిత్రం "ఉప్పెన". ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు రింగుటోన్లుగా మారుమోగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా నీ కన్ను నీలి సముద్రం పాట యూట్యూబ్లో 143 మిలియన్ పైచిలుకు వ్యూస్ సంపాదించుకుంది. అలా ఈ చిత్రంలోని పాటలు వీక్షకులను కట్టిపడేయగా అందులో నటించిన కృతీశెట్టికి యువత దాసోహం అంటోంది. అమాయకత్వం కురిపించే కళ్లు, మాయ చేసే నవ్వుతో ఆమె యువతను బుట్టలో పడేసుకున్నారు. (‘ఉప్పెన’ మరో సాంగ్.. మెస్మరైస్ చేసిన దేవిశ్రీ) అయితే ఆమె కూడా ఒకరికి పడిపోయారట! మెగా హీరో రామ్చరణ్కు వీరాభిమాని అని ఆమె తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. తను ఇండస్ట్రీకి రాకముందే చెర్రీ నటించిన అన్ని సినిమాలను చూశానని తెలిపారు. కాగా ఆమె నటించిన ఉప్పెన చిత్రానికి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది. మరోవైపు కృతీ నేచురల్ స్టార్ నాని 'శ్యామ సింగ రాయ్ 'చిత్రంలోనూ నటిస్తున్నారు. (స్విమ్ ఫొటో’.. క్షమించమని అడిగిన హీరో!) -
రాజమౌళి చాలెంజ్ స్వీకరించారు
ఇటీవలే రామ్చరణ్ ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో పాల్గొన్న సంగతి తెలిసిందే. మొక్కలు నాటి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందాన్ని కూడా మొక్కలు నాటమంటూ ఈ చాలెంజ్కు ఎంపిక చేశారు. చరణ్ విసిరిన సవాల్ను స్వీకరించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందం మొక్కలను నాటారు. దర్శకులు రాజమౌళి, కెమెరామేన్ సెంథిల్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, దర్శకత్వ శాఖ ఇలా అందరూ మొక్కలు నాటుతున్న వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ చాలెంజ్ను ముందుకు తీసుకెళ్లమంటూ ‘ఆచార్య, రాధేశ్యామ్, పుష్ప’ చిత్రబృందాలను ఎంపిక చేసింది ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్. దర్శకులు రామ్గోపాల్ వర్మ, వీవీ వినాయక్, పూరి జగన్నాథ్లను గ్రీన్ ఇండియా చాలెంజ్కు ఎంపిక చేశారు రాజమౌళి. మీకో దండం రాజమౌళి విసిరిన ఈ చాలెంజ్కు ట్విట్టర్లో సరదాగా కామెంట్ చేశారు రామ్గోపాల్ వర్మ. ‘రాజమౌళిగారూ.. నేను చాలెంజ్లు, పచ్చదనం వంటి విషయాల మీద పెద్దగా ఆసక్తి లేనివాణ్ణి. అలాగే చేతికి మట్టి అంటుకుంటే మహా చిరాకు నాకు. నాలాంటి స్వార్థపరుడు మొక్కలు నాటడం కంటే వేరెవరైనా ఆ పని చేయడం మంచిదని నా అభిప్రాయం. మీకూ మీ మొక్కలకూ ఓ దండం’ అని ట్వీట్ చేశారు వర్మ. -
మీ ఊహకే వదిలేస్తున్నాం!
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పీరియాడికల్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. లాక్డౌన్ తర్వాత మళ్లీ చిత్రీకరణలో బిజీ అయింది ఈ టీమ్. సినిమాలోని కీలక సన్నివేశాలను హైదరాబాద్లోని ఓ ప్రత్యేక సెట్లో చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన చిన్న వీడియోను ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందం తమ సోషల్ మీడియా అకౌంట్లో పంచుకుంది. ‘ఈ సన్నివేశం ఎలా ఉండబోతోందో మీ ఊహకే వదిలేస్తున్నాం’ అని క్యాప్షన్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’లో ఐశ్వర్య? ‘ఆర్ఆర్ఆర్’లో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలుగా నటిస్తున్నారు. వీరితో పాటు మరో కథానాయికగా ఐశ్వర్యా రాజేశ్ కనిపిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఆమె గిరిజన యువతిగా కనిపిస్తారని, ఎన్టీఆర్కు ఓ జోడీగా ఐశ్వర్య పాత్ర ఉంటుందని సమాచారం. చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. -
ఒలీవియా.. ఆలియా.. పాఠాలయ్యా
పాత్రను బట్టి డైలాగ్ మారుతుంది. అది చెప్పే విధానం మారుతుంది. పరభాషా నటీనటులు తమకు రాని భాషలో సినిమాలు చేసేప్పుడు డైలాగ్స్ సరిగ్గా పలికేందుకు డైలాగ్ కోచ్లను పెట్టుకుంటారు. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కూడా పలువురు డైలాగ్ ట్యూటర్స్ను నియమించిందట. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం). డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. కొమరమ్ భీమ్గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్చరణ్ కనిపించనున్నారు. వీళ్లకు జోడీగా ఒలీవియా మోరిస్, ఆలియా భట్ నటించనున్నారు. ఒలీవియా హాలీవుడ్ నటి, ఆలియా బాలీవుడ్ నటి. అందుకే వీళ్ల కోసం ప్రత్యేకంగా డైలాగ్ ట్యూటర్స్ను ఏర్పాటు చేశారట. ఆలియా భట్ వచ్చే వారం నుంచి ఈ సినిమా చిత్రీకరణలో జాయిన్ అవుతారట. అజయ్ దేవగన్, సముద్రఖని ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడు. -
ఫిర్యాదులు... శుభాకాంక్షలు
శనివారం రాజమౌళి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ... ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందం ఓ వీడియో విడుదల చేసింది. రాజమౌళి మీద వాళ్లకు ఎలాంటి ఫిర్యాదులు ఉన్నాయో ఈ వీడియోలో సరదాగా పంచుకున్నారు. కీరవాణి మాట్లాడుతూ– ‘‘జనవరిలో పల్లవి చేస్తాం. జూన్లో చరణం. డిసెంబర్లో లిరిక్స్ రాస్తాం. వచ్చే ఏడాది మార్చిలో రికార్డింగ్ అంటాడు. అప్పటికి అసలు ఏ సినిమాకు పని చేస్తున్నామో? ఆ పాట ఎందుకు వస్తుందో? అనేది కూడా మర్చిపోతాం. అసలు ఆసక్తే పోతుంది’’ అన్నారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ – ‘‘మనం రిలాక్స్ అయిపోదాం అనుకున్నప్పుడే కష్టమైన షాట్స్ అన్నీ షూట్ చేస్తుంటాడు రాజమౌళి. అది అనుకుని చేస్తాడో లేక అప్పుడే అలాంటి ఐడియాలు వస్తాయో తెలియదు. పన్నెండున్నరకి మొదలుపెడితే రెండున్నరకు అవుతుంది. అప్పటికి ఆకలిపోతుంది. ఆ మధ్య నైట్ షూట్ చేశాం. రాత్రి 2 గంటలకు ప్యాకప్ చెప్పాలి. మా రాక్షసుడికి ఒకటిన్నరకి కొత్త ఆలోచన వస్తుంది. ఒక్క షాట్ కోసం 4 వరకూ ప్రయత్నిస్తాడు. పర్ఫెక్షన్ కోసం మా అందర్నీ చావకొడుతుంటాడు’’ అన్నారు. రామ్చరణ్ మాట్లాడుతూ – ‘‘రేపు యాక్షన్ సీన్ ఉందని జిమ్ బాగా చేసి చాలా ఉత్సాహంతో సెట్కి వెళ్తాను. 40 అడుగుల నుంచి ఇలా దూకాలి, చేయాలి అని అద్భుతంగా వివరిస్తారు. సూపర్ అనుకుంటాను. కాస్త రిస్కీగా ఉంది.. ఎవరు సార్ ఇది చేసేది? అని అడుగుతా అమాయకంగా. నువ్వే అంటారాయన. వెంటనే లాప్ట్యాప్ తెప్పించి మూడు రోజుల ముందే ఆ యాక్షన్ సీన్ ఆయన చేసింది చూపిస్తారు. ఆయన చేశాక మనం చేయకపోతే ఏం బావుంటుంది? ఎలాగోలా చేస్తాం’’ అన్నారు. మా అందరి సామర్థ్యాన్ని మరింత పెంచుకునేలా మమ్మల్ని అందర్నీ పని చేసేలా చేసే రాజమౌళిగారికి జన్మదిన శుభాకాంక్షలు అని చిత్రబృందం తెలిపింది. ఈ వీడియోలో దర్శకత్వ శాఖ, కెమెరామేన్ సెంథిల్, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్, నిర్మాత దానయ్య కూడా మాట్లాడారు. -
ప్రామిస్.. మరింత కష్టపడతా!
మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా రామ్చరణ్ హీరోగా పరిచయమైన తొలి చిత్రం ‘చిరుత’. ఈ సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. 2007 సెప్టెంబర్ 28న ఈ చిత్రం విడుదలైంది. ‘చిరుత’ విడుదలై 13ఏళ్లు పూర్తయిన సందర్భంగా రామ్చరణ్ తన సంతోషాన్ని పంచుకున్నారు. ‘‘అప్పుడే 13 ఏళ్లు అయిపోయాయంటే నమ్మలేకపోతున్నా. ఈ ప్రయాణంలో ఎన్నో విజయాలు, అపజయాలు తలుపుతట్టాయి. కానీ అన్నింటినీ ఎంజాయ్ చేశా. అన్నివేళలా నాకు అండగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు. ప్రామిస్.. ఇకముందు మరింత కష్టపడి మిమ్మల్ని సంతోషపెడతాను’’ అన్నారు. కాగా తన తొలి చిత్రదర్శకుడు పూరి జగన్నాథ్ పుట్టినరోజు కూడా సోమవారం కావడంతో ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పారు రామ్చరణ్. ‘‘చిరుత’ షూటింగ్ సమయంలో ప్రతిరోజూ ఓ తీయని జ్ఞాపకం. ఇప్పటికీ ఆ రోజులను నిన్నలాగే భావిస్తుంటా. ‘చిరుత’ యూనిట్కి కృతజ్ఞతలు. థ్యాంక్యూ పూరీగారు. హ్యాపీ బర్త్ డే’’ అన్నారు. -
మళ్లీ కలుస్తున్నారు
‘ఎవడు’ చిత్రంతో మంచి హిట్ అందుకున్నారు దర్శకుడు వంశీ పైడిపల్లి, హీరో రామ్చరణ్. ఈ కాంబినేషన్ మళ్లీ కలవనుందని ఈ మధ్య తరచుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా పక్కా అనేది తాజా సమాచారం. ఇటీవలే కథా చర్చలు కూడా పూర్తయ్యాయని టాక్. దసరా తర్వాత ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందట. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’, చిరంజీవి ‘ఆచార్య’లో అతిథి పాత్ర చేస్తున్నారు రామ్చరణ్. ఈ సినిమాలకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయ్యాక వంశీ పైడిపల్లి సినిమా చిత్రీకరణ మొదలుపెడతారు చరణ్. ఇదో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని టాక్. -
మిస్టర్ సీ.. జిమ్కి వచ్చేసీ... మరి మీరూ?
కోవిడ్ బ్రేక్ వల్ల జిమ్కి సెలవు పెట్టారట రామ్చరణ్. గురువారం జిమ్లోకి ఎంటరై, మళ్లీ వర్కవుట్లు మొదలుపెట్టారు చరణŠ.. ఈ విషయాన్ని ఆయన సతీమణి ఉపాసన తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ‘మిస్టర్ సీ (చరణ్ను ఆమె అలానే పిలుస్తారు) మళ్లీ జిమ్లోకి వచ్చారు. మరి మీరు?’ అని ఓ ఫోటోను షేర్ చేశారామె. రామ్చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ మరో హీరో. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటిస్తున్నారు. ఇందుకోసం తన శరీరాకృతిని కొత్తగా తయారు చేశారు. ఆ మధ్య విడుదల చేసిన ట్రైలర్లో తన కండలు తిరిగిన దేహాన్ని చూపించారు. అక్టోబర్లో ఈ సినిమా చిత్రీకరణ తిరిగి ప్రారంభం కానుందట! -
ఆగేది లేదు!
సినిమా షూటింగ్లను మళ్లీ ఎలా ప్రారంభించాలి? ప్రారంభిస్తే ఎలా పూర్తి చేయాలి? ఎంత త్వరగా పూర్తి చేయాలి? అనే ప్లానింగ్లో అన్ని సినిమా బృందాల వాళ్లు ఉన్నారు. అయితే ‘ఆచార్య’ చిత్రబృందం ఓ ప్లాన్ సిద్ధం చేసినట్టు సమాచారం. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. నిరంజన్ రెడ్డి, రామ్చరణ్ నిర్మాతలు. కాజల్ అగర్వాల్ కథానాయిక. ఈ సినిమాకు సంబంధించిన మిగతా చిత్రీకరణ మొత్తాన్ని ఏకధాటిగా సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేయాలని ‘ఆచార్య’ చిత్రబృందం భావిస్తున్నారట. ఆల్రెడీ సగానికి పైగా చిత్రీకరణ పూర్తయింది. మిగిలిన భాగాన్ని మొదలుపెడితే పూర్తి చేసేదాకా ఆగేది లేదన్నది యూనిట్ ఆలోచన అని సమాచారం. ఈ సినిమాలో రామ్చరణ్ అతిథి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది. -
చిరంజీవి డీపీలో ఈ లాజిక్ ఏంటో తెలుసా?
ఎవరి పుట్టిన రోజును వాళ్లే జరుపుకుంటారు. కానీ మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజును మాత్రం ఆయన అభిమానులందరూ పండగలా జరుపుకుంటారు. అదీ మెగా హీరోకు ఉన్న క్రేజ్. రేపు(శనివారం) ఆయన పుట్టిన రోజు. ఇంకొన్ని గంటల్లో ఆయన 65వ వడిలోకి అడుగు పెట్టనున్నారు. దీంతో మెగా అభిమానులు అప్పుడే సంబరాలు మొదలు పెట్టారు. మరోవైపు తండ్రికి మొదటి బర్త్డే విషెస్ చెప్పారు హీరో రామ్చరణ్. నాన్న పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకునేందుకు కామన్ డీపీని కూడా విడుదల చేశారు. ఇందులో చిరంజీవి కెరీర్లో సూపర్ డూపర్ హిట్ అయిన చిత్రాలను ఒక్కో మెట్టుపై ఉంచారు. (చిరు ఫ్యాన్స్కు పండుగే.. డబుల్ ధమాకా!) "ఖైదీ" నుంచి మొదలై "ఖైదీ నంబర్ 150" వరకు ఉన్న పాత్రలను మెట్లపై నిలిపి చూపించారు. వీటి మధ్యలో 'పసివాడి ప్రాణం', 'స్వయంకృషి', 'గ్యాంగ్ లీడర్', 'ఘరానా మొగుడు', 'ఇంద్ర' చిత్రాలకు సంబంధించిన పాత్రలున్నాయి. కానీ రాజకీయాల్లో వెళ్లి బ్రేక్ తీసుకున్న సమయానికి సంకేతంగా కొన్ని మెట్లను ఖాళీగా వదిలేశారు. ఇక మెగాస్టార్ టైటిల్ మధ్యలో మాత్రం "సైరా నరసింహారెడ్డి" పాత్రను నిలిపారు. "రక్తదానం చేయండి - ప్రాణాలు కాపాడండి" అన్న మెగాస్టార్ నినాదంతో పాటు "ప్లాస్మా దానం చేసి కరోనా రోగుల ప్రాణాలు కాపాడండి" అని ఈ పోస్టర్లో పేర్కొన్నారు. మరోవైపు 'హ్యాపీ బర్త్డే మెగాస్టార్' అంటూ చిరంజీవి కామన్ పోస్టర్ను కూడా వదిలారు. బీజీఎమ్తో అదరగొడుతున్న ఈ వీడియోలో ఆయన సూపర్ హిట్ సినిమాల పోస్టర్లు కనిపిస్తాయి. చివర్లో అందరికీ చెక్ పెట్టే రాజుగా హైలుక్లో కనిస్తారు. (వీరిలో ఓ వ్యక్తి మీకు బాగా తెలుసు..) -
స్పెషల్ గెటప్స్లో...
ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడికల్ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం). ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రల్లో కనిపించనున్నారు. సినిమా మొత్తంలో పలు గెటప్స్లో కనిపిస్తారట ఈ ఇద్దరు హీరోలు. బ్రిటిష్ అధికారులను ఎదుర్కొనే ప్రయత్నంలో రకరకాల గెటప్స్ వేసి వాళ్లను తెలివిగా ఢీ కొంటారని సమాచారం. పోలీస్ ఆఫీసర్గా చరణ్, బందిపోటు గెటప్లో ఎన్టీఆర్ కనిపిస్తారట. మరికొన్ని గెటప్స్లోనూ ఎన్టీఆర్, చరణ్లు కనిపిస్తారని తెలిసింది. ఈ స్పెషల్ గెటప్స్ సినిమాకి అదనపు ఆకర్షణగా ఉంటాయట. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్కు జోడీగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్, చరణ్కు జోడీగా బాలీవుడ్ నటి ఆలియా భట్ నటించనున్నారు. ప్రస్తుతం కరోనా వల్ల షూటింగ్కి అంతరాయం ఏర్పడింది. త్వరలోనే తిరిగి సెట్స్ మీదకు వెళ్లనుంది చిత్రబృందం. ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడు. -
యానిమేషన్... సూపర్విజన్
‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం) చిత్రీకరణ కరోనా వల్ల సాధ్యం కాకపోవడంతో రాజమౌళి అండ్ టీమ్ ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ‘రౌద్రం రణం రుధిరం’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఒలివియా మోరిస్, ఆలియా భట్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందులో స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్చరణ్ కనిపిస్తారు. లాక్డౌన్ వల్ల ఈ సినిమా చిత్రీకరణ నిలిచిపోయింది. ప్రభుత్వం షూటింగ్స్కు అనుమతులు ఇచ్చిన తర్వాత చిత్రీకరణను మొదలుపెట్టాలని అనుకున్నప్పటికీ కరోనా ప్రభావం మెండుగా ఉండటంతో షూటింగ్ జరిపేందుకు మరికొంత సమయం వేచి ఉండాలని చిత్రబృందం అనుకుందట. ఈ ఖాళీ సమయంలో గ్రాఫిక్స్ వర్క్ పై ప్రత్యేక దృష్టి సారించారు రాజమౌళి. కాగా ఈ సినిమాలో కీలకమైన యానిమేషన్ ఎపిసోడ్స్ ఉన్నాయని టాక్. ఈ ఎపిసోడ్స్తో కొమురం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రలకు సంబంధించిన కొన్ని విషయాలను ప్రేక్షకులకు చెబుతారట రాజమౌళి. ప్రస్తుతం ఈ ఎపిసోడ్స్కు సంబంధించిన వర్క్ను వర్చువల్గా సూపర్వైజ్ చేసే పనిలో రాజమౌళి బిజీగా ఉన్నారని సమాచారం. సముద్రఖని, శ్రియ, అజయ్ దేవగన్, అలిసన్ డూడీ, రే స్టీవెన్సన్ ఈ చిత్రంలో కీలక పాత్రధారులు. ఇప్పటికే 70 శాతానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
స్టార్ డైరీ
అమ్మ కోసం చిరంజీవి అలవోకగా దోసె వేశారు. ఇల్లంతా శుభ్రంగా కడిగిపారేశారు వెంకటేశ్. కిచెన్లో గిన్నెలు కడిగారు ఎన్టీఆర్. మజ్జిగ నుంచి వెన్న ఎలా తీయాలో నానమ్మ దగ్గర నేర్చుకున్నారు రామ్చరణ్. బెటర్హాఫ్ సమంత బర్త్డే కోసం నాగచైతన్య కేక్ చేశారు... అయితే విడి రోజుల్లో ఇలా చేసేంత సమయం వీళ్లకు ఉండదు గాక ఉండదు. లాక్డౌన్లో ఇలా రిలాక్స్ అవుతున్న స్టార్స్ ఒక్కసారి షూటింగ్ మొదలుపెడితే ఫుల్ బిజీ. ఇక ఇప్పటికే షూటింగ్లో పాల్గొన్న సినిమాలు, సైన్ చేసి, పట్టాలెక్కడానికి రెడీగా ఉన్న సినిమాలు, ఫలానా దర్శకుడి సినిమాలో ఫలానా హీరో నటించబోతున్నాడు అని ప్రచారంలో ఉన్న సినిమాలతో ‘స్టార్ డైరీ’ మీకోసం... చిరంజీవి: చేస్తున్నవి: కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రం ప్రకటించినవి: త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా, మెహర్ రమేష్, సుజిత్, కేఎస్ రవీంద్ర (బాబీ) కథలు వినిపించినట్లు ఇటీవల చిరంజీవి వెల్లడించారు. ప్రచారంలో ఉన్నది: సుజిత్ దర్శకత్వంలో చేయబోయేది మలయాళ ‘లూసిఫర్’, నాగ్ అశ్విన్తో సినిమా. బాలకృష్ణ చేస్తున్నది: బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా ప్రచారంలో ఉన్నవి: పూరి జగన్నాథ్, అనిల్ రావిపూడిలతో సినిమాలు. నాగార్జున చేస్తున్నవి: సాల్మోన్ దర్శకత్వంలో ‘వైల్డ్డాగ్’, హిందీ చిత్రం‘బ్రహ్మాస్త్ర’. ప్రచారంలో ఉన్నది: కల్యాణ్కృష్ణ దర్శకత్వంలో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సీక్వెల్. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో సినిమా. వెంకటేష్ చేస్తున్నది: శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘నారప్ప’ చిత్రం ప్రచారంలో ఉన్నవి: త్రివిక్రమ్, నక్కిన త్రినాథరావు, అనిల్ రావిపూడిలతో సినిమాలు. రవితేజ చేస్తున్నది: గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ ప్రకటించినవి: రమేష్వర్మ, వక్కంతం వంశీలతో సినిమాలు ప్రచారంలో ఉన్నది: సుధీర్వర్మతో సినిమా. పవన్ కల్యాణ్ చేస్తున్నవి: వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్సాబ్’, క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా. ప్రకటించినవి: హరీష్ శంకర్ సినిమా. మహేశ్బాబు ప్రకటించినవి: పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పేట’, రాజమౌళితో సినిమా ప్రచారంలో ఉన్నవి: కొరటాల శివ, సందీప్రెడ్డి వంగా, ప్రశాంత్ నీల్లతో సినిమాలు. గోపీచంద్ చేస్తున్నది: సంపత్ నంది దర్శకత్వంలో ‘సీటీమార్’ ప్రకటించినవి: బిను సుబ్రమణ్యం దర్శకత్వంలో ఓ సినిమా. ప్రభాస్ చేస్తున్నది: రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’. ప్రకటించినవి: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా. ప్రచారంలో ఉన్నది: ప్రశాంత్ నీల్తో సినిమా, బాలీవుడ్ దర్శకులు ఓం రౌత్, కబీర్ ఖాన్లతో సినిమాలు ఎన్టీఆర్ చేస్తున్నది: రాజమౌళి దర్శకత్వంలో ‘రౌద్రం రణం రుధిరం’ ప్రకటించనవి: త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రచారంలో ఉన్నది: అట్లీ, ప్రశాంత్ నీల్లతో సినిమాలు. అల్లు అర్జున్ చేస్తున్నది: సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ ప్రకటించినవి: వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ ప్రచారంలో ఉన్నది: కొరటాల శివ, లింగుస్వామిలతో సినిమాలు. మంచు విష్ణు చేస్తున్నది: ‘మోసగాళ్ళు’ ప్రచారంలో ఉన్నది: శ్రీను వైట్ల డైరెక్షన్లో ‘ఢీ’కి సీక్వెల్గా ‘ఢీ2’. రామ్చరణ్ చేస్తున్నది: రాజమౌళి దర్శకత్వంలో ‘రౌద్రం రణం రుధిరం’. ప్రచారంలో ఉన్నది: ‘ఆచార్య’లో కీ రోల్, కొరటాల శివ, వంశీ పైడిపల్లి, మేర్లపాక గాంధీ, గౌతమ్ తిన్ననూరిలతో సినిమాలు అల్లరి నరేశ్ చేస్తున్నది: విజయ్ కనకమేడల దర్శకత్వంలో ‘నాంది’, పి.వి. గిరి దర్శకత్వంలో చేసిన ‘బంగారు బుల్లోడు’ విడుదలకు సిద్ధంగా ఉంది. నితిన్ చేస్తున్నవి: వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘రంగ్దే’, చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ‘చెక్’ ప్రకటించినవి: కృష్ణచైతన్య దర్శకత్వంలో ‘పవర్పేట’, మేర్లపాక గాంధీ (హిందీ ‘అంధాథూన్’ రీమేక్). శర్వానంద్ చేస్తున్నవి: కిశోర్ దర్శకత్వంలో ‘శ్రీకారం’, శ్రీకార్తిక్ దర్శకత్వంలో ఓ సినిమా. మంచు మనోజ్ ప్రకటించిన చిత్రం: ‘అహం బ్రహ్మాస్మి’. రామ్ చేస్తున్నది: కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘రెడ్’ ప్రచారంలో ఉన్నది: సురేందర్ రెడ్డి, పూరి జగన్నాథ్లతో సినిమాలు నాని చేస్తున్నది : శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘వి’ (షూటింగ్ పూర్తయింది) ప్రకటించినది: రాహుల్ సంకృత్యాన్తో సినిమా. నాగచైతన్య చేస్తున్నది: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్స్టోరీ’ ప్రకటించినది: పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రచారంలో ఉన్నది: విక్రమ్కుమార్, ఇంద్రగంటి మోహనకృష్ణలతో సినిమాలు. రానా చేస్తున్నవి: వేణు ఊడుగుల దర్శకత్వంలో ‘విరాటపర్వం’, సాల్మన్ దర్శకత్వంలో ‘అరణ్య’ (షూటింగ్ పూర్తయింది) ప్రకటించినవి: గుణశేఖర్ దర్శకత్వంలో ‘హిరణ్యకశ్యప’ చిత్రం, కోడిరామ్మూర్తి బయోపిక్ ప్రచారంలో ఉన్నది: సుధీర్వర్మతో సినిమా. వరుణ్తేజ్ చేస్తున్నది: కిరణ్కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమా. అఖిల్ చేస్తున్నది: ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’. సాయిధరమ్ తేజ్ చేస్తున్నవి: సుబ్బు దర్శకత్వంలో ‘సోలో బ్రతుకే సో బెటర్’ ప్రకటించినది: వీరూ పోట్ల దర్శకత్వంలో ఓ సినిమా. విజయ్ దేవరకొండ చేస్తున్నది: పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ (వర్కింగ్ టైటిల్) ప్రకటించినవి: శివనిర్వాణ, ఆనంద్ అన్నామళ్లై దర్శకత్వాల్లో సినిమాలు. ప్రచారంలో ఉన్నది: ఇంద్రగంటి మోహనకృష్ణతో సినిమా. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ చేస్తున్నది: సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అల్లుడు అదుర్స్’. ఇంకా.... వేణు మల్లాడి దర్శకత్వంలో కల్యాణ్ రామ్ ఓ సినిమా చేస్తున్నారు. దర్శకుడు వీఐ ఆనంద్తో సినిమా చేయబోతున్నారని టాక్. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో ‘కపటధారి’ అనే చిత్రంలో నటిస్తున్నారు హీరో సుమంత్. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే సినిమాలో నటిస్తున్నారు సుశాంత్. దీనికి దర్శన్ దర్శకుడు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఇటీవలే ‘వి’ సినిమా షూటింగ్ను పూర్తి చేసిన సుధీర్బాబు.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కబోయే పుల్లెల గోపీచంద్ బయోపిక్లో నటించాల్సి ఉంది. చందు మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ 2’, సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ‘18 పేజెస్’ చిత్రాల్లో నిఖిల్ నటించాల్సి ఉంది. కిషన్ కట్టా దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ‘శ్వాస’ చిత్రంలో హీరోగా నటించడానికి కూడా గతంలో ఓకే అన్నారు నిఖిల్. రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’ విడుదల కావాల్సి ఉంది. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు నాగశౌర్య. లక్ష్మీసౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ఓ సినిమా తెరకెక్కాల్సి ఉంది. కౌశిక్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ‘చావు కబురు చల్లగా’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ. ‘అనగనగా దక్షిణాదిలో..’, ‘శబ్దం’ చిత్రాలను నారా రోహిత్ అనౌన్స్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘సూపర్ మచ్చీ’ చిత్రంలో నటిస్తున్నారు కల్యాణ్ దేవ్. ఇక కొత్త హీరోలు సాయిధరమ్తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ చిత్రంలో నటిస్తున్నారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తమ్ముడు సాయిగణేశ్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇంకా అల్లు శిరీష్, శ్రీవిష్ణు తదితర హీరోలు కూడా సినిమాలు కమిట్ అయ్యారు. ఇక షూటింగ్స్ మొదలుకావడమే ఆలస్యం. -
కాంబినేషన్ రిపీట్?
ఆరేళ్ల క్రితం వచ్చిన ‘ఎవడు’ (2014)తో హీరో రామ్చరణ్, దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్ కుదిరింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కుతుందనే వార్తలు అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఈ కాంబినేషన్ తెరపైకి వచ్చింది. వంశీ పైడిపల్లి చెప్పిన ఓ కొత్త స్టోరీ లైన్ రామ్చరణ్కు నచ్చిందట. దీంతో ఫుల్ స్క్రిప్ట్ను రెడీ చేసే పనిలో ఉన్నారట వంశీ. ఈ సంగతి ఇలా ఉంచితే... రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘రౌద్రం రణం రుధిరం’లో నటిస్తున్నారు చరణ్. ఇందులో ఎన్టీఆర్ మరో హీరో. అలాగే చిరంజీవి హీరోగా నటిస్తోన్న ‘ఆచార్య’ చిత్రంలో రామ్చరణ్ ఓ కీలక పాత్ర చేయనున్న సంగతి తెలిసిందే. -
మనసు చెప్పినది వినాలా?
మనసు చెబుతున్న మాట వినాలా? లేక మెదడు వినిపిస్తున్న ఆలోచనను ఫాలో కావాలా? అని రామ్చరణ్ కన్ఫ్యూజ్ అవుతున్నట్లున్నారు. మరి.. చరణ్ను ఇంతలా ఇరుకున పడేసిన ఆ సమస్య ఏమిటి? అంటే వర్కౌట్ అన్నమాట. కరోనా కారణంగా ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్) షూటింగ్ కాస్త ఆలస్యం అవుతోంది. ఈలోపు ఫిట్నెస్పై ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నారు రామ్చరణ్. తన వర్కౌట్ ఫొటోలను షేర్ చేసి, ‘‘మైండ్ వర్కౌట్ చేయమని చెబుతోంది. హృదయం ఇక చాలు ఊరుకోమంటోంది’’ అని క్యాప్షన్ ఇచ్చారు రామ్చరణ్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘రౌద్రం రణం రుధిరం’ సినిమాలో ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ఇందులో స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్చరణ్ నటిస్తున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
ఆర్ఆర్ఆర్ ఓ అద్భుతం
‘‘బాహుబలి’ సినిమాలో సినిమా రోమాలు నిక్కబొడుచుకునే సీన్లు పది పైనే ఉంటాయి. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో దాదాపు ప్రతి సీన్ అలానే ఉంటుంది. అంత అద్భుతమైన సినిమా’’ అంటున్నారు మదన్ కార్కీ. ‘బాహుబలి’ తమిళ వెర్షన్కి సంభాషణలు రాశారాయన. తాజాగా ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ (‘రణం, రుధిరం, రౌద్రం’) తమిళ వెర్షన్కి ఆయనే సంభాషణలు రాస్తున్నారు. ఈ చిత్రం గురించి మదన్ కార్కీ మాట్లాడుతూ – ‘‘ఇంతకుముందు ఎప్పుడూ చూడని విజువల్స్ ఈ సినిమాలో ఉంటాయి. దేశభక్తికి సంబంధించిన సినిమా కావటంతో దాదాపు ప్రతి సీన్ కూడా కవితలా ఉంటుంది. రాజమౌళి కథలో డైలాగులు భారీగా ఉండవు. లెంగ్తీ డైలాగులకు ఆయన అంత ప్రాధాన్యం ఇవ్వరు. మాటలు చాలా చిన్నగా ఎంతో అర్థవంతంగా ఉంటాయి. ఆయన చిత్రానికి నేను మాటలు రాయడం చాలా ఆనందంగా ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ భారీ బడ్జెట్ సినిమా. ఇందులో పవర్ఫుల్ కథతో పాటు బలమైన భావోద్వేగాలు ఉంటాయి. మాటల రచయితగా ‘బాహుబలి’ సినిమా నాకో పెద్ద చాలెంజ్. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విషయానికొస్తే ఒక రచయితగా పెద్దగా చాలెంజ్ లేనట్లే.. కారణం ఇది పీరియాడిక్ ఫిల్మ్ కావడమే. ‘బాహుబలి’కి కిలికి భాష సృష్టించాం’’ అన్నారు. కిలికి భాష సృష్టికర్త మదన్ కార్కీయే. ఈ విషయం గురించి మదన్ మాట్లాడుతూ – ‘‘ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కిలికి భాషను వాడేవారు దాదాపు 40 మంది వరకు ఉన్నారు. వారందరూ దాదాపుగా నాకు టచ్లో ఉంటారు. ‘బాహుబలి’ కోసం 3000 మాటలతో నాలుగేళ్ల క్రితం రాసిన కిలికి భాష ఇప్పుడు 4000 మాటలతో వృద్ధి చెందింది. ప్రస్తుతం ఆ భాషతో చిన్న చిన్న కథలను కూడా రాస్తున్నారు చాలామంది. నేనేదైనా స్కూల్కి వెళ్లినప్పుడు ఈ భాషలో శిక్షణ ఇవ్వండి అని చాలామంది అడగడం ఆశ్చర్యంగా, ఆనందంగా అనిపించింది. ఈ భాషతో సినిమా తీయటం కోసం కథ రెడీ చేశాను. కొందరు నిర్మాతలను కలిసి కిలికి భాషలో తయారైన కథ చెప్పాను. అందరూ బాగుందన్నారు. త్వరలోనే ఆ సినిమాకి సంబంధించిన పూర్తి విశేషాలను తెలియజేస్తాను’’ అన్నారు. -
ఆర్ఆర్ఆర్లో అజయ్దేవగన్ పాత్ర అదే!
సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం) సినిమాలో అజయ్ దేవగన్ జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్ల గురువుగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అదికూడా ఫ్లాష్ బ్యాక్లో ఫ్లాష్బాక్ సీన్లలో కనిపించనున్నట్లు సమాచారం. అతనికి జంటగా శ్రియ శరణ్ నటించనుంది. ఇక 1920 ల కాలం నాటి కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు రాజమౌళి తెలిపారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుండగా, హీరో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. (‘ఆర్ఆర్ఆర్’ ట్రయిల్ షూట్ రద్దు.. అందుకేనా!) ఈ సినిమాలో తెలంగాణ గొండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్కి జోడీగా ఒలివియా మోరిస్, రామ్ చరణ్కి జోడీగా ఆలియా భట్ నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్ సన్స్ , అలిసన్ డూడీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. (అజయ్ దేవగన్కి జోడీగా శ్రియ) -
అజయ్ దేవగన్కి జోడీగా శ్రియ
‘నా అల్లుడు’ చిత్రంలో ఎన్టీఆర్కి జోడీగా నటించారు శ్రియ. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన ‘ఛత్రపతి’ సినిమాలోనూ హీరోయిన్గా నటించారు. ఆ సినిమాలు విడుదలై దాదాపు 15 ఏళ్లు అవుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్చరణ్లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం). ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో నటించనున్నట్లు శ్రియ స్వయంగా తెలిపారు. 15 ఏళ్ల తర్వాత మళ్లీ ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్లో ఆమె చేయబోతున్న సినిమా ఇదే. లాక్డౌన్ కారణంగా భర్త ఆండ్రీతో కలసి స్పెయిన్లో ఉంటున్న శ్రియ అభిమానులతో చిట్చాట్ చేస్తూ తన తర్వాతి ప్రాజెక్ట్ల వివరాలు చెప్పుకొచ్చారు. తెలుగులో రెండు చిత్రాలకు పచ్చజెండా ఊపానని, వాటిలో ‘ఆర్ఆర్ఆర్’ ఒకటనీ అన్నారు. ఈ సినిమాలో ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్లలో అజయ్ దేవగన్తో కలసి నటించబోతున్నట్లు పేర్కొన్నారీ బ్యూటీ. అంటే... ఈ సినిమాలో అజయ్ దేవగన్కి జోడీగా ఆమె కనిపిస్తారని ఊహించవచ్చు. అలాగే సృజన దర్శకత్వం వహిస్తున్న ‘లిటిల్ బర్డ్’ అనే తెలుగు సినిమాలోనూ నటించనున్నారు శ్రియ. మహిళా దర్శకురాలితో పని చేయలేదనే లోటు ఈ సినిమాతో తీరనుంది అన్నారామె. అంతేకాదు.. తమిళంలో రెండు సినిమాలు, హిందీలో ఓ సినిమా అంగీకరించాననీ, లాక్డౌన్ ముగిసిన తర్వాత ఇండియాకి వచ్చాక ఆయా చిత్రాల షూటింగ్లో పాల్గొంటానని శ్రియ అన్నారు. -
అప్పుడు పెద్ద పండగలా ఉంటుంది
ఎన్టీఆర్ పుట్టినరోజు (మే 20) సందర్భంగా ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్) చిత్రం నుంచి ఎన్టీఆర్కి చెందిన టీజర్ లేదా ఫస్ట్ లుక్ విడుదలవుతుందని ఆశించినవారికి నిరాశే ఎదురైంది. ఫస్ట్ లుక్, టీజర్.. ఏదీ విడుదల చేయడం లేదని ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందం సోమవారం అధికారికంగా తెలిపింది. ‘‘లాక్డౌన్ను పొడిగిస్తూ వచ్చిన పరిస్థితుల నేపథ్యంలో మా పని ముందుకు సాగలేదు. ఎన్టీఆర్ బర్త్ డే గ్లిమ్స్ వీడియో కోసం మా వంతు ప్రయత్నం చేశాం. కానీ ఫస్ట్ లుక్ లేదా వీడియోను విడుదల చేయడం కుదరడం లేదు. కానీ ఇవి విడుదలైనప్పుడు మాత్రం మనందరికీ ఓ పెద్ద పండగలా ఉంటుంది. అభిమానుల ఎదురుచూపులకు తప్పక ఫలితం ఉంటుంది’’ అని ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందం పేర్కొంది. ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’. 1920 బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్చరణ్ నటిస్తున్నారు. అదే మీరు నాకు ఇచ్చే బహుమతి: ఎన్టీఆర్ ‘‘ప్రియమైన సోదరులకు ఓ విన్నపం. ఈ విపత్తు (కరోనా పరిస్థితులను ఉద్దేశించి) సమయంలో మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. అందరం కలిసి పోరాడితే ఈ సమస్య నుంచి సురక్షితంగా బయటపడతాం అని నమ్ముతున్నాను. ప్రతి ఏటా నా పుట్టినరోజున మీరు (అభిమానులు) చూపించే ప్రేమ, చేసే కార్యక్రమాలను ఒక ఆశీర్వచనంగా భావిస్తాను. ఈ ఏడాది మాత్రం మీరు ఇంటి పట్టునే ఉంటూ, అధికారుల సూచనలను పాటిస్తూ, భౌతిక దూరానికి కట్టుబడి ఉండాలని నా విన్నపం. ఇదే మీరు నాకు ఇచ్చే అతి విలువైన బహుమతి. అలాగే ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం నుంచి నా బర్త్ డే సందర్భంగా ఎటువంటి ఫస్ట్ లుక్ లేదా టీజర్ విడుదల కావడం లేదు అనే విషయం మిమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేసిందని నేను అర్థం చేసుకోగలను. మీ ఆనందం కోసం ఫస్ట్ లుక్ లేదా టీజర్ను సిద్ధం చేయాలని చిత్రబృందం ఎంత కష్టపడింది అనేది నాకు తెలుసు. కానీ ఒక ప్రచార చిత్రం మీ ముందు ఉండాలి అంటే అన్ని సాంకేతిక విభాగాలు కలిసి శ్రమించాలి. అధికారిక ఆంక్షల వలన అది కుదరలేదు. రాజమౌళిగారి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఓ సంచలనం అవుతుందన్న నమ్మకం నాకు ఉంది’’ అని పేర్కొన్నారు ఎన్టీఆర్. -
జక్కన్న ఛాలెంజ్ను అంగీకరించిన రామ్చరణ్
-
ఎన్టీఆర్, రామ్చరణ్లకు జక్కన్న ఛాలెంజ్
-
లాక్డౌన్ చెఫ్లు
లాక్డౌన్ సమయాల్లో ఇంట్లోనే ఉండిపోవడంతో ఇంటి పనుల్లో తమ వంతు సహాయం చేస్తున్నారు స్టార్స్. తమ ప్రతిభను బయటకు తీసుకొస్తున్నారు. ఈ మధ్యే రామ్చరణ్, మంచు విష్ణు చెఫ్లుగా మారారు. తన మిసెస్ కోసం రామ్చరణ్ డిన్నర్ తయారు చేస్తే, ఫ్యామిలీ కోసం సరదాగా కోకోనట్ చికెన్ తయారు చేశారు మంచు విష్ణు. ‘‘భర్తలందరూ వినండి, మిస్టర్ సి. (చరణ్ని ఉపాసన అలానే పిలుస్తారు) నాకోసం డిన్నర్ తయారు చేశారు. డిన్నర్ పూర్తయిన తర్వాత అవి శుభ్రం కూడా చేశారు. ఇలాంటి చిన్న చిన్న పనులే అతన్ని నా హీరోని చేస్తాయి’’ అని ట్వీట్ చేయడంతో పాటు చరణ్ వంట చేస్తున్న వీడియోను ఉపాసన షేర్ చేశారు. లాక్డౌన్ పూర్తయ్యేలోగా వంటలో మాస్టర్ అవుతానేమో? అంటున్నారు విష్ణు. వంట చేసిన వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి, ‘‘కొబ్బరి బోండం లోపల చికెన్ రైస్ని బేక్ చేశాను. లాక్డౌన్ పూర్తయ్యేసరికి కొత్త కొత్త వంటకాల రెసిపీల పేటెంట్ హక్కులు తీసుకోవాల్సి ఉంటుందేమో?’’ అన్నారు విష్ణు. తనయుడు వంట చేస్తుంటే మోహన్బాబు పక్కనే ఉండి చూస్తున్నారు. -
ఇల్లే స్టూడియో
లాక్డౌన్ వల్ల షూటింగ్కు బ్రేక్ పడటంతో ఈ ఖాళీ సమయాన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల కోసం ఉపయోగించుకుంటోంది ‘ఆర్ఆర్ఆర్’ టీమ్. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్). ఈ చిత్రంలో స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ కారణంగా ఈ సినిమా చిత్రీకరణను తాత్కాలికంగా నిలిపివేశారు. కానీ అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేయాలని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ప్రారంభించారట. ఎన్టీఆర్, రామ్చరణ్ తమ ఇళ్లలోని మినీ హోమ్ థియేటర్స్ను డబ్బింగ్ స్టూడియోలుగా మార్చుకుని ‘ఆర్ఆర్ఆర్’ డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేశారని లేటెస్ట్ టాక్. ఈ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నింటినీ వీడియో కాల్ ద్వారా పర్యవేక్షిస్తున్నారట రాజమౌళి. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 8న విడుదల చేయాలనుకుంటున్నారు. -
అందుకే ఆర్ఆర్ఆర్ వచ్చేలా టైటిల్ పెట్టాం
ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్). ఇందులో స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామ రాజు పాత్రలో రామ్చరణ్ నటిస్తున్నారు. ఈ సినిమాను పది భాషల్లో వచ్చే ఏడాది జనవరి 8న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ ఏడాది ఉగాది సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ టైటిల్ను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనకు ముందు ‘ఆర్ఆర్ఆర్’కు సరిపోయే టైటిల్ను ప్రేక్షకులే నిర్ణయించాలని రాజమౌళి అండ్ టీమ్ ప్రేక్షకులను కోరిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ టైటిల్ గురించి, ఈ ప్రాజెక్ట్ గురించి రాజమౌళి ఓ ఇంటర్య్వూలో ఏం చెప్పారంటే....‘‘ముందు ‘ఆర్ఆర్ఆర్’ను ఒక వర్కింగ్ టైటిల్ అనే భావించాం. కానీ ‘ఆర్ఆర్ఆర్’కు మంచి పాపులారిటీ వచ్చింది. దీంతో ఆ అక్షరాలు వచ్చేట్లే టైటిల్ పెట్టాలని నిర్ణయించుకున్నాం. ఎన్టీఆర్ (స్టూడెంట్ నెం 1, సింహాద్రి, యమదొంగ), రామ్చరణ్ (మగధీర).. ఇలా ఈ ఇద్దరితో నేను సూపర్ హిట్ సినిమాలు చేశాను. వాళ్లిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు అది నాకు బాగా అడ్వాంటేజ్ అయ్యింది. ‘ఆర్ఆర్ఆర్’ ఐడియాను వారికి చెప్పినప్పుడు ‘ఓకే’ చెప్పడానికి ఒక్క నిమిషం కూడా తీసుకోలేదు’’ అని పేర్కొన్నారు రాజమౌళి. -
డైరెక్టర్ ఎవరు?
మలయాళంలో మోహన్లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్హిట్ మూవీ ‘లూసీఫర్’ తెలుగులో రీమేక్ కానున్న సంగతి తెలిసిందే. ఈ పొలిటికల్ థ్రిల్లర్ తెలుగు రీమేక్ హక్కులను నటుడు–నిర్మాత రామ్చరణ్ దక్కించుకున్నారు. ఇందులో చిరంజీవి హీరోగా నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహించనున్నారు? అనే ప్రశ్నకు సమాధానంగా సుకుమార్, హరీష్ శంకర్ ఇలా కొంతమంది దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా యువ దర్శకుడు సుజిత్ పేరు వినిపిస్తోంది. ‘లూసీఫర్’ తెలుగు స్క్రిప్ట్ను రెడీ చేయాల్సిందిగా సుజిత్కు చిరంజీవి చెప్పారట. ఇంతకు ముందు శర్వానంద్ ‘రన్ రాజా రన్’, ప్రభాస్ ‘సాహో’ చిత్రాలకు సుజిత్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. -
ఆర్ఆర్ఆర్లో..?
‘రౌద్రం రణం రుధిరం’(ఆర్ఆర్ఆర్) చిత్రంలో మోహన్లాల్ ఓ కీలక పాత్రలో నటించబోతున్నారా? అంటే ఫిల్మ్ నగర్ వర్గాలు అవునంటున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’(ఆర్ఆర్ఆర్). 1920 నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్చరణ్ నటిస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో ఈ సినిమా షూటింగ్కు బ్రేక్ పడింది. తాజాగా ఈ సినిమాలో మోహన్లాల్ ఓ కీలక పాత్ర చేయనున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఎన్టీఆర్ పాత్రకు బాబాయ్గా మోహన్లాల్ కనిపిస్తారట. ఇది వరకు ఎన్టీఆర్, మోహన్లాల్ కలిసి ‘జనతా గ్యారేజ్’ (2016) చిత్రంలో నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆర్ఆర్ఆర్ చిత్రం వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కానుంది. -
అనుకున్న సమయానికే వస్తారు
‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్) విడుదల వాయిదా పడుతుందని, ఇందులో ఆలియా భట్ నటించడం లేదనే పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టారు ఈ చిత్రనిర్మాత డీవీవీ దానయ్య. ‘బాహుబలి’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’. ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన ఓలివియా మోరిస్, రామ్చరణ్కు జోడీగా ఆలియా భట్ను ఎంపిక చేశారు. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఈ సినిమా చిత్రీకరణ నిలిచిపోయింది. ఈ షెడ్యూల్స్ తారుమారు వల్ల ‘ఆర్ఆర్ఆర్’ విడుదల వాయిదా పడుతుందని, ఈ సినిమాకి ఇచ్చిన డేట్స్ని ఓ హిందీ చిత్రానికి కేటాయించడంతో ఆలియా ఈ చిత్రం నుంచి తప్పుకుందనే వార్తలు ప్రచారంలోకొచ్చాయి. వీటిని కొట్టిపారేశారు దానయ్య. ‘‘ఈ నెల 15నుంచి ఆలియా భట్ ‘ఆర్ఆర్ఆర్’ షూట్లో జాయిన్ కావాల్సింది. లాక్డౌన్ కారణంగా షూటింగ్కు బ్రేక్ పడటంతో ఆమె దగ్గర కొత్త కాల్షీట్లు తీసుకున్నాం. మేలో జరగబోయే పుణే షెడ్యూల్లో ఆలియా జాయిన్ అవుతారు. లాక్డౌన్ పూర్తయిన వెంటనే హైదరాబాద్లో ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ను మొదలుపెడతాం. ఆ తర్వాత పుణే షెడ్యూల్ ఉంటుంది. మరోవైపు మేజర్ గ్రాఫిక్స్ వర్క్ కూడా పూర్తి కావొస్తున్నాయి. అనుకున్న ప్రకారమే ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 8న విడుదల చేస్తాం’’ అని ఓ ఆంగ్ల పత్రికతో పేర్కొన్నారు డీవీవీ దానయ్య. -
కరోనా విరాళం
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సినిమా తారలు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు, ఇప్పటికే పలువురు తారలు విరాళాలిచ్చారు. శనివారం విరాళం ప్రకటించిన వారి వివరాలు. ► దగ్గుబాటి ఫ్యామిలీ (సురేష్ బాబు, వెంకటేష్, రానా) – 1 కోటి (ఆరోగ్య శాఖ వర్కర్లకు, సినీ వర్కర్లకు కలిపి) ► నాగార్జున – 1 కోటి (సినీ వర్కర్స్ సహాయార్థం) ► మహేశ్ బాబు – 25 లక్షలు ( కరోనా క్రై సిస్ చారిటీకి ) (ఆల్రెడీ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు కలిపి కోటి రూపాయిలు ప్రకటించారు) ► రామ్చరణ్ – 30 లక్షలు (సినీ వర్కర్స్ సహాయార్థం). ► నాగచైతన్య (ఉపాధి కోల్పోయిన తెలుగు సినీ కార్మికులు సంక్షేమం కోసం) ► నిఖిల్ – తెలుగు రాష్ట్రాల్లోని డాక్టర్స్, హెల్త్ వర్కర్స్కు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ (పీపీఈ)ను అందించి కరోనా సమయంలో తన వంతు సాయం చేశారు నిఖిల్. 2 వేల రిస్పైరేటర్స్, 2 వేల రీ యూజబుల్ గ్లౌజ్స్, 2 వేల ఐప్రొటెక్షన్ గ్లాసెస్, శానిటైజర్స్ లతో పాటుగా పది వేలమాస్క్లను అందజేశారు. ► కార్తికేయ – 2లక్షలు (రోజు వారి వేతనాలు తీసుకునే సినీ కార్మికుల కోసం) ► లావణ్యా త్రిపాఠి – 1 లక్షల (రోజు వారి వేతనాలు తీసుకునే సినీ కార్మికుల కోసం) -
ఇంటిపేరు అల్లూరి.. సాకింది గోదారి
ఏడాది నుంచి ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం) షూటింగ్ చేస్తున్నారు రాజమౌళి. సినిమాకు సంబంధించిన ఏ విషయాన్నీ బయటకు రానీయకుండా ఆడియన్స్ని ఊరిస్తున్నారాయన. శుక్రవారం ఓ ఊర మాస్ టీజర్తో ఎన్టీఆర్, రామ్చరణ్ అభిమానులకు ఊరట కలిగించారు. శుక్రవారం రామ్చరణ్ బర్త్డే. ఎన్టీఆర్ వాయిస్తో చరణ్ పాత్రకు సంబంధించిన టీజర్ను విడుదల చేసింది చిత్రబృందం. ‘‘ఆడు కనవడితే నిప్పు కణం నిలవడినట్టుంటది. కలవడితే ఏగుసుక్క ఎగవడినట్టుంటది. ఎదురువడితే చావుకైనా చమట ధార కడతది. బాణమైనా బందూకైనా వానికి బాంచనైతది. ఇంటిపేరు అల్లూరి.. సాకింది గోదారి. నా అన్న మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’’ అంటూ టీజర్లో రామ్చర ణ్ కసరత్తులు చేస్తుంటే ఎన్టీఆర్ పవర్ఫుల్ సంభాషణలు పలికారు. తమిళ, హిందీ, కన్నడ భాషల్లోని టీజర్స్కి ఎన్టీఆరే స్వయంగా డబ్బింగ్ చెప్పారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరమ్ భీమ్గా, చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఆలియా భట్, అజయ్ దేవగన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 8న ఈ చిత్రం విడుదల కానుంది. ‘‘అందరూ ఇంట్లో ఉండటమే తనకి ఇచ్చే బెస్ట్ బర్త్డే గిఫ్ట్’’ అని చరణ్ ట్వీట్ చేశారు. అలాగే ఉపాసన తయారు చేసిన కేక్ని కట్ చేసి ఇంట్లోనే బర్త్డేని జరుపుకున్నారు చరణ్. ఆ ఫోటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు ఉపాసన. -
రౌద్రం రణం రుధిరం
ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రానికి ‘ఆర్ఆర్ఆర్’ అని వర్కింగ్ టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ అంటే ‘రామ రావణ రాజ్యం’ అని, ఇలా పలు టైటిల్స్ ప్రచారంలోకొచ్చాయి. తాము అనుకున్న టైటిల్ని ఉగాది పండగ సందర్భంగా చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రానికి ‘రౌద్రం రణం రుధిరం’ అనే టైటిల్ని ఖరారు చేశారు. ఈ టైటిల్ను, తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సినిమాలో తెలంగాణ గొండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. మోషన్ పోస్టర్ చూస్తుంటే అగ్ని స్వభావంతో ఉన్నట్లు రామ్చరణ్ పాత్రను, జల స్వభావంతో ఉన్నట్లు ఎన్టీఆర్ పాత్రను రాజమౌళి తీర్చిదిద్దారని అర్థమవుతోంది. ఎన్టీఆర్కి జోడీగా ఒలివియా మోరిస్, రామ్ చరణ్కి జోడీగా ఆలియా భట్ నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్ సన్స్ , అలిసన్ డూడీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం 2021 సంక్రాంతి సందర్భంగా జనవరి 8న విడుదల కానుంది. -
అది నిజం కాదు
చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్రెడ్డితో కలిసి రామ్చరణ్ ‘ఆచార్య’ సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి చరణ్ టైమ్ కేటాయించడంలేదనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దీని గురించి మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ అధినేత నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ – ‘‘ప్రచారంలో ఉన్న వార్త నిజం కాదు. ఈ సినిమా ప్రారంభం అయినప్పటినుండి ప్రతి విషయంలోను రామ్చరణ్ సహకారం పూర్తిగా ఉంది. సినిమాకు సంబంధించిన అన్ని డిస్కషన్స్లోనూ మాతో పాటు సమానంగా దగ్గరుండి చరణ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని బాధ్యతలను కొణిదెల ప్రొడక్షన్స్ అధినేత రామ్చరణ్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్వర్తిస్తున్నాయి’’ అన్నారు. కరోనా విముక్త భారతాన్ని సాధిద్దాం: ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూని పాటిద్దాం. సాయంత్రం 5 గంటలకు మన గుమ్మాల్లోకి వచ్చి వైద్య సేవలందిస్తున్న వారికి కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు చెప్పాల్సిన సమయం ఇది. భారతీయులుగా ఐకమత్యంతో ఈ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొందాం. కరోనా విముక్త భారతాన్ని సాధిద్దాం. – చిరంజీవి -
నా పుట్టినరోజు వేడుకలు వద్దు
‘కరోనా వైరస్ ప్రభావం వల్ల ఈ ఏడాది నా పుట్టినరోజు వేడుకలు నిర్వహించొద్దు’ అని రామ్ చరణ్ తన అభిమానులను కోరారు. మార్చి 27న రామ్చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం మెగా అభిమానులు ఆయన పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తుంటారు. అన్నదానం, రక్తదానం వంటి సామాజిక కార్యక్రమాలూ చేపట్టేవారు. అయితే ఈ ఏడాది బర్త్డే సెలబ్రేషన్స్కి దూరంగా ఉండాలంటూ రామ్చరణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. దాని సారాంశం ఇలా... ‘‘మీకు (అభిమానులు) నాపై ఉన్న ప్రేమ, నా పుట్టినరోజుని పండుగగా జరపడానికి మీరు పడుతున్న కష్టాన్ని నేను అర్థం చేసుకోగలను. మనం ఉన్న ఈ అసాధారణ పరిస్థితులు మీకు తెలియనివి కాదు. ఇలాంటి సందర్భాల్లో జనం తక్కువగా ఉండేట్టు చూసుకోవడం మంచింది. ఇది మనసులో పెట్టుకుని ఈ సంవత్సరం నా పుట్టినరోజు వేడుకలను విరమించుకోవాల్సిందిగా మనవి. మీరంతా మన అధికారులకు సహకరించి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే విధానాలు ప్రజలకి అర్థమయ్యేలా తెలియజేసి మీ వంతు సామాజిక బాధ్యత నెరవేర్చండి. అదే నాకు మీరు ఇచ్చే అతి పెద్ద పుట్టినరోజు కానుక’’. -
వెల్కమ్ వైష్ణవ్
చిత్ర పరిశ్రమకు వైష్ణవ్ తేజ్కి ఆహ్వానం పలికారు రామ్చరణ్ తేజ్. ‘ఉప్పెన’ చిత్రం ద్వారా సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ హీరోగా పరిచయం అవుతున్నారు. ‘‘వెల్కమ్ వైష్ణవ్. ఈ ప్రయాణాన్ని నువ్వు ప్రేమిస్తావు. ప్రతిరోజూ పూర్తిగా ఆస్వాదించు. టీమ్కి ఆల్ ది బెస్ట్’’ అని పేర్కొంటూ ‘ఉప్పెన’ చిత్రం కొత్త పోస్టర్ను విడుదల చేశారు చరణ్. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కృతీ శెట్టి కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై నవీన్ యర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. ఈ చిత్రం ఏప్రిల్ 2న రిలీజ్ కానుంది. -
రాజమండ్రిలో కలుద్దాం
కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న సినిమాలో రామ్చరణ్ కీలక పాత్రలో కనిపిస్తారనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ పాత్ర నక్సలైట్ లీడర్గా ఉంటుందట. రాజమండ్రిలో జరగబోయే ఈ సినిమా షెడ్యూల్లో రామ్చరణ్ కూడా పాల్గొనబోతున్నారని సమాచారం. చిరంజీవి చిన్నప్పటి పాత్రను చరణ్ చేస్తున్నారని టాక్. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, రామ్చరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ఆచార్య’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్ట్లో విడుదల చేయాలనుకుంటున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారా? మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘లూసీఫర్’ తెలుగు రీమేక్ రైట్స్ రామ్చరణ్ తీసుకున్న సంగతి తెలిసిందే. చిరంజీవి హీరోగా ఆ సినిమా తెరకెక్కించనున్నారు. తాజాగా మరో మలయాళ చిత్రం ‘డ్రైవింగ్ లైసెన్స్’ తెలుగు రీమేక్ రైట్స్ను చరణ్ కొనుగోలు చేశారని టాక్. మరి ఈ రీమేక్లో చిరు కనిపిస్తారా? చరణ్ నటిస్తారా? తెలియాల్సి ఉంది. -
సంక్రాంతికి సై
దర్శకుడు రాజమౌళి తన పందెంకోళ్లను వచ్చే ఏడాది సంక్రాంతికి బాక్సాఫీస్ బరిలో దించడానికి నిర్ణయించుకున్నారు. ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడికల్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూలై 30న విడుదల చేయాలనుకుంటున్నట్లు ముందుగా ప్రకటించారు. ఆ తర్వాత సినిమా వాయిదా పడిందనే వార్తలు కూడా వినిపించాయి. తాజాగా ఈ సినిమాను జనవరి 8, 2021 విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ‘‘ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని అనుభవాన్ని అందించాలని మా టీమ్ అందరం కష్టపడుతున్నాం. వాయిదా పడటం నిరుత్సాహం కలిగించే వార్తే కానీ మా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం’’ అని ‘ఆర్ఆర్ఆర్’ బృందం ట్వీటర్లో పేర్కొంది. -
కొత్త కాంబినేషన్
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్చరణ్ ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నారు అనే విషయంపై ఎప్పటికప్పుడు పలు వార్తలు వినిపిస్తున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారని, అనిల్ రావిపూడితో సినిమా ఉండొచ్చని ఆ మధ్య ప్రచారం జరిగింది. తాజాగా ‘సాహో’ ఫేమ్ సుజీత్తో రామ్చరణ్ సినిమా చేసే అవకాçశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను యువీ క్రియేషన్ బ్యానర్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తోందని సమాచారం. యువీ క్రియేషన్స్ సంస్థ అధినేతలు వంశీ, ప్రమోద్, విక్కీ అటు దర్శకుడు సుజీత్కి ఇటు రామ్చరణ్కి సన్ని హితులు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్–సుజీత్ సినిమా ప్రారంభం అవుతుందట. -
ఆలియా.. అదిరే ఆటయా
రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు ఆలియా భట్. ఇందులో రామ్చరణ్ సరసన హీరోయిన్గా నటిస్తున్నారామె. ఈ సినిమాలో కీలక సన్నివేశాల్లోనే కాదు.. ఆలియా భట్ ఓ స్పెషల్ సాంగ్లోనూ కనిపిస్తారని తెలిసింది. ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి ఈ పీరియాడిక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ కొమరమ్ భీమ్గా, రామ్చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆలియా పాత్ర నిడివి తక్కువగా ఉంటుందట. అయితే ఆమె పై ఓ ప్రత్యేక పాటను చిత్రీకరిస్తే బావుంటుందని చిత్రబృందం భావించారని టాక్. ప్రత్యేకంగా వేసిన సెట్లో ఈ పాటను చిత్రీకరిస్తారట. ఈ పాటకు ఆదిరిపోయే రేంజ్లో ఆలియా స్టెప్పులేస్తారని సమాచారం. -
ఆర్ఆర్ఆర్ ప్రపంచానికి స్వాగతం
రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలు. ఈ సినిమాలో హిందీ నటుడు అజయ్ దేవగన్ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ మధ్యే ‘ఆర్ఆర్ఆర్’ సెట్లో అడుగుపెట్టారు అజయ్. లొకేషన్లో అజయ్ దేవగన్, ఎన్టీఆర్, రామ్చరణ్, రాజమౌళి కలిసి దిగిన ఫోటో ఒకటి బయటికొచ్చింది. ‘‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం అజయ్సార్’’ అన్నారు ఎన్టీఆర్. ‘‘మీ పని అంటే నాకు ఇష్టం. వ్యక్తిగా అంతకంటే ఇష్టం అజయ్సార్’’ అన్నారు చరణ్. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతోంది. ఇందులో కొమరమ్ భీమ్గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తున్నారు. -
సంక్రాంతి సంబరాలు
తెలుగు, తమిళ, కన్నడ సినీ తారల సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తమ ఆనందపు జ్ఞాపకాల క్షణాలను ఫొటోల్లో భద్రపరచి అభిమానుల కోసం వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవే ఇక్కడున్న ఫొటోలు. కుమార్తె సౌందర్య, అల్లుడు విశగన్లతో రజనీకాంత్, లత చిరంజీవితో అల్లు శిరీష్, అల్లు అర్జున్, కల్యాణ్దేవ్, వైష్ణవ్తేజ్, రామ్చరణ్, వరుణ్తేజ్, సాయిధరమ్తేజ్ తదితరులు పిల్లలు అరియానా, వివియానా, అవ్రామ్ భక్త, ఆరాలతో మంచు విష్ణు, వెరోనికా దంపతులు భార్య రాధికా పండిట్తో ‘కేజీయఫ్’ ఫేమ్ యశ్ తండ్రి సురేశ్కుమార్తో కీర్తీసురేశ్ -
నవిష్క..వేడుక
చిరంజీవి కుటుంబంలో డిసెంబర్ 25న రెండు పండగలు జరిగాయి. ఒకటి క్రిస్మస్ సెలబ్రేషన్ కాగా మరోటి చిరంజీవి మనవరాలు నవిష్క పుట్టినరోజు వేడుక. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ, కల్యాణ్ దేవ్ల కూతురు నవిష్క. ఈ చిన్నారికి మొదటి పుట్టినరోజు ఇది. ఈ బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేసింది చిరంజీవి ఫ్యామిలీ. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు ఉపాసన. ‘‘హ్యాపీ బర్త్డే డార్లింగ్ నవిష్క. మీ అత్తామామ (ఉపాసన, రామ్చరణ్)కు నువ్వంటే చాలా ప్రేమ’’ అని ఈ ఫొటోలను షేర్ చేశారు. కల్యాణ్ దేవ్, నవిష్క, శ్రీజ, రామ్చరణ్, ఉపాసన -
వన్య ప్రాణుల కోసం...
‘ఆరెంజ్’ సినిమాలో వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్గా కనిపిస్తారు రామ్చరణ్. అది సినిమా కోసం. ఇప్పుడు నిజంగానే వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్గా మారారాయన. అయితే చరణ్ ఫొటోగ్రాఫర్ కావడం వెనక ఓ మంచి ఉద్దేశం ఉంది. ప్రకృతిని కాపాడటం కోసం ‘డబ్లూడబ్ల్యూఎఫ్’ అనే స్వచ్ఛంద సంస్థ 60 ఏళ్లుగా పని చేస్తోంది. ఇటీవలే ఈ సంస్థకు రాయబారిగా రామ్చరణ్ సతీమణి ఉపాసన ఎన్నికయ్యారు. ఇప్పుడు వన్యప్రాణి సంరక్షణ కోసం నిధుల సేకరణలో చరణ్ కూడా తన వంతు సాయం చేయనున్నారు. సింహాలు, చిరుతపులులు, జిరాఫీలు తదితర వన్య ప్రాణుల ఫొటోలతో చరణ్ తన కొత్త ఇంట్లో ‘వైల్డెస్ట్ డ్రీమ్స్’ పేరుతో ఓ విభాగాన్నే ఏర్పాటు చేశారు. ఈ ఫొటోలను ప్రదర్శించి ప్రజల్లో చైతన్యం ఏర్పరచాలన్నది వీరి ఉద్దేశం. ‘‘భూమిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిదీ’’ అన్నారు చరణ్. -
అతి నిద్ర అనారోగ్యం
అలుపు, అసహనం, ఆగ్రహం, ఆరాటం, మతిభ్రమణం.. ఏంటి ఇవన్నీ అనుకుంటున్నారా? ఇవన్నీ అతి నిద్రవల్ల వచ్చే అనారోగ్యాలు. శనివారం ‘మత్తువదలరా’ చిత్రం టీజర్ను ఫేస్బుక్ ద్వారా విడుదల చేశారు హీరో రామ్చరణ్. టీజర్లో శుభోదయం కార్యక్రమంలో అతినిద్ర వల్ల వచ్చే అనర్థాల గురించి డాక్టర్ సలహాలు, సూచనలు వినిపిస్తుంటాయి. టేబుల్పై పడుకున్న హీరో మత్తువదిలి నిద్రలేస్తాడు. ఒక నిమిషం పాటు ఉన్న టీజర్లో కంటెంట్ ఇది. సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్. కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహా హీరోగా పరిచయం అవుతుండగా ఆయన పెద్ద కుమారుడు కాలభైరవ ఈ చిత్రంతో సంగీత దర్శకునిగా పరిచయం అవుతున్నారు. రితేష్ దర్శకునిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిరంజీవి (చెర్రీ), హేమలతలు నిర్మిస్తున్నారు. రామ్చరణ్ మాట్లాడుతూ – ‘‘రంగస్థలం’ సినిమా టైమ్లో నేను సింహాతో కలిసి వర్క్ చేశాను. ఆ ప్రయాణం మరచిపోలేనిది. మా నటుల ప్రపంచంలోకి సింహాకు స్వాగతం పలుకుతున్నా. కాలభైరవ విలక్షణ గాత్రానికి నేను పెద్ద అభిమానిని. తన పాటలను వినాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని అన్నారు. డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యంగ్ టాలెంట్ను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ చిత్రం నిర్మించాం. హాస్యంతో కూడిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఇది. ఈ చిత్రం ద్వారా ఎంతో మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు పరిచయం కాబోతున్నారు’’ అన్నారు. -
ఇట్స్ రొమాంటిక్ టైమ్
ఎన్టీఆర్ని కొమరమ్ భీమ్గా, రామ్చరణ్ను అల్లూరి సీతారామరాజుగా స్వాతంత్య్ర సమరయోధుల పాత్రల్లోకి మార్చేశారు దర్శకుడు రాజమౌళి. ఇదంతా ఆయన చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసమే అని తెలిసిందే. ప్రస్తుతం ఓ సాంగ్ షూటింగ్తో ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ బిజీగా ఉన్నారట. ఎన్టీఆర్, రామ్చరణ్లు హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన ఓలీవియా మోరిస్, చరణ్కు జోడీగా ఆలియా భట్ నటిస్తున్నారు. ప్రస్తుతం చరణ్, ఆలియా భట్లపై ఓ రొమాంటిక్ సాంగ్ను షూట్ చేస్తున్నారట. దీనికోసం ఓ భారీ సెట్ని కూడా వేశారని తెలిసింది. ఈ సినిమాలో ఆలియా భట్ పాత్ర ఎక్కువ సేపు ఉండకపోవచ్చని సమాచారం. సుమారు 70 శాతం షూటింగ్ ఆల్రెడీ పూర్తయిందని చిత్రబృందం ఇటీవల పేర్కొంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జూలైలో పది భాషల్లో విడుదల కానుంది. -
ఆర్ఆర్ఆర్ : కౌంట్డౌన్ స్టార్ట్ చేసిన ఫ్యాన్స్
దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ఫై దానయ్య 300 కోట్ల భారీ బడ్జెట్తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్స్టార్ రామ్చరణ్లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రం పిరియాడిక్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతోంది. చరణ్కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ నటించగా, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్ నటిస్తోంది. ఐరిష్ నటి అలిసన్ డూడీ, రే స్టీవెన్సన్ విలన్లుగా కనిస్తారు. జెన్నీఫర్ పాత్రలో ఒలీవియా మోరిస్, స్కాట్ పాత్రలో రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ లేడీ స్కాట్గా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, ఆలియా భట్, సముద్రఖని ముఖ్య పాత్రల్లో నటిన్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూలై 31న రిలీజ్ కానుంది. ఇక, తమ అభిమాన హీరో సినిమాల రీలీజ్ టైమ్లో ఫ్యాన్స్ కౌంట్డౌన్ పేరుతో హంగామా చేయడం సాధారణం. అయితే ఏ వారం ముందో, లేదా నెల ముందో కౌంట్డౌన్ మొదలు పెడుతారు. కానీ ఆర్ఆర్ఆర్ సినిమాకి 8 నెలల ముందే కౌంట్డౌన్ స్టార్ట్ చేశారు. 250 డేస్ టు గో .. అంటూ సోషల్ మీడియాలో కౌంట్డౌన్ స్టార్ట్ చేసేశారు.ఆర్ఆర్ఆర్ కోసం ఇంకా 250 రోజులు వేచి చూడాలంటూ ట్విటర్ వేదికగా ప్రచారం మొదలెట్టారు. నేటి నుంచి ఎన్నిరోజులు, ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకన్లకు సినిమా విడుదల అవుతుందో తెలుపుతూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. మరో వైపు ఆర్ఆర్ఆర్ సినిమాకు భారీ హైప్ తీసుకురావడంపై దర్శకుడు రాజమౌళి దృష్టి పెట్టాడు. క్యాస్టింగ్ దగ్గరి నుంచే సినిమా గురించి దేశం మొత్తం మాట్లాడుకునేలా చేశాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో హాలీవుడ్ క్యాస్టింగ్ను తీసుకున్న రాజమౌళి.. వారి పేర్లను ప్రకటించడం దేశంలోని అన్ని సినీ ఇండస్ట్రీల్లో చర్చనీయాంశంగా మారింది. 250 Days For RRR @tarak9999 😍😍#RRRMovie #KomaramBheemNTR#250DaysToMassiveRRR pic.twitter.com/iFNmZHH1jR — PaddhuPadmaja (@PadmajaPaddhu) November 23, 2019 Inka 8 months wait cheyali #250DaysToMassiveRRR pic.twitter.com/Onz4E0ZEe6 — Koratala Fan 💣 (@TarakUday9999) November 23, 2019 250 Days, 360000 Minutes, 21600000 Seconds. Will be waiting untill then, dot.#250DaysToMassiveRRR pic.twitter.com/9Xj7JVirxj — Adithya (@NTRAdherent) November 23, 2019 India's most awaited Biggest MultiStarer #RRRMovie Releasing July 30 2020 250 Days More For Massive Festival 💥🔥#KomaramBheemNTR#250DaysToMassiveRRR pic.twitter.com/EIS5DhIZEf — Hari Ram (@Hariramhere) November 23, 2019 -
హీరోయిన్ దొరికింది
ఎన్టీఆర్ సరసన హీరోయిన్ కుదిరింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఎన్టీఆర్కు జోడీగా ఇంగ్లీష్ నటి డైసీ ఎడ్గర్ జోన్స్ నటిస్తారని గతంలో ప్రకటించారు. అయితే ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. దాంతో కొత్త హీరోయిన్పై చాలా వార్తలు వచ్చాయి. తాజాగా ఎన్టీఆర్తో ఒలివియా మోరిస్ నటిస్తున్నారని చిత్రబృందం ప్రకటించింది. ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడికల్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. డీవీవీ దానయ్య నిర్మాత. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించనున్న హీరోయిన్, నెగటివ్ రోల్స్లో కనిపించే పాత్రలను బుధవారం ప్రకటించారు. ఐరిష్ నటి అలిసన్ డూడీ, రే స్టీవెన్సన్ విలన్లుగా కనిస్తారు. జెన్నీఫర్ పాత్రలో ఒలీవియా మోరిస్, స్కాట్ పాత్రలో రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ లేడీ స్కాట్గా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, ఆలియా భట్, సముద్రఖని ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది పది భాషల్లో విడుదల కానుంది. -
డబుల్ ధమాకా
ఎన్టీఆర్, రామ్చరణ్ మంచి డ్యాన్సర్లు. కష్టమైన స్టెప్పులను కూడా సునాయాసంగా వేసి, అభిమానులతో విజిల్స్ కొట్టించగలరు. ఇదే హైలెట్ పాయింట్ను ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’లో ఉపయోగించనున్నారట దర్శకుడు రాజమౌళి. ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడికల్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరమ్ భీమ్గా, చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్చరణ్లమీద ఓ జానపద పాట ఉండబోతోందని, ఇందులో ఇద్దరూ కలసి కాలు కదపనున్నారని తెలిసింది. ఇదే నిజమైతే ఈ హీరోల అభిమానులకు స్టెప్పుల విందే అని ఊహించొచ్చు. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. చరణ్కి జోడీగా ఆలియా భట్ నటించనున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూలైలో విడుదల కానుంది. -
చిన్న గ్యాప్ తర్వాత...
ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్లో ‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమా స్క్రీనింగ్ కోసం గతవారం లండన్లో గడిపారు దర్శకులు రాజమౌళి. ఈ కార్యక్రమం వల్ల ‘ఆర్ఆర్ఆర్’ (వర్కింగ్ టైటిల్) చిత్రీకరణకు చిన్న అంతరాయం ఏర్పడింది. లండన్ నుంచి రాజమౌళి తిరిగి రావడంతో మళ్లీ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పనులు ఊపందుకున్నాయి. ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఇది. 1920 నేపథ్యంలో సాగే ఈ సినిమాలో స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో ఎన్టీఆర్, చరణ్ నటిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ సోమవారం హైదరాబాద్లో ప్రారంభం అవుతుందని సమాచారం. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్, రామ్చరణ్ల కాంబినేషన్లో కీలక సన్నివేశాలను తెరకెక్కించబోతున్నారని తెలిసింది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూలై 30న విడుదల కానుంది. -
చిరు సందర్శన
చిరంజీవి 152వ సినిమా పనులు వేగంగా సాగుతున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో రామ్చరణ్ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కనుంది. కొరటాల శివ ఆఫీస్ను సరదాగా సందర్శించారు రామ్చరణ్. ఆ సందర్భంలో కొరటాలతో దిగిన ఈ ఫొటోను రామ్చరణ్ షేర్ చేసి, ‘‘శివగారి ఆఫీస్లో ఎనర్జీ చాలా నచ్చింది. నాన్న 152వ సినిమా తెరకెక్కించబోతున్నందుకు ఆయనకు ఆల్ ది బెస్ట్’’ అన్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఇక ఇక్కడి ఫొటో చూస్తే చరణ్ అయ్యప్ప దీక్షలో ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు. దాదాపు ప్రతి ఏడాదీ చరణ్ అయ్యప్ప మాల వేసుకుంటారు. -
చిరంజీవిగా చరణ్?
‘సైరా: నరసింహారెడి’్డ సక్సెస్ జోష్లో ఈ దసరా పండక్కి చిరంజీవి తన తర్వాతి చిత్రానికి కొబ్బరికాయ కొట్టిన సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రామ్చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. నవంబరులో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలోని చిరంజీవి పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయట. ఫ్లాష్బ్యాక్లో వచ్చే యంగ్ చిరంజీవి పాత్రలో చరణ్ నటించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇది నిజమైతే మెగాఫ్యాన్స్కు పండగేనని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే రామ్చరణ్ నటించిన ‘మగధీర, బ్రూస్లీ’ సినిమాల్లో చిరంజీవి అతిథి పాత్రలో కనిపించారు. అలాగే చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’లో ఓ పాటలో తండ్రితో చరణ్ కాలు కదిపిన విషయం తెలిసిందే. మరోవైపు సుకుమార్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ‘లూసీఫర్’ తెలుగు రీమేక్ రూపొందనుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ మళయాల చిత్రం తెలుగు రీమేక్ రైట్స్ను రామ్చరణ్ దక్కించుకున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలోనూ చిరంజీవి హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. -
సైరాలాంటి సినిమాలు ఇంకా రావాలి
‘‘సైరా నరసింహారెడ్డి’లాంటి కథను ఎంచుకోవడమే పెద్ద సాహసం. ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో రావాలి’’ అన్నారు ‘కళాబంధు’, నిర్మాత టి. సుబ్బిరామిరెడ్డి. చిరంజీవి హీరోగా సురేందర్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 2న విడుదలైంది. చిత్రబృందాన్ని టి. సుబ్బిరామి రెడ్డి సన్మానించి, మాట్లాడుతూ–‘‘దాదాపు ఇరవై ఏళ్ల క్రితం చిరంజీవితో నేను ‘స్టేట్రౌడీ’ సినిమా నిర్మించాను.ఈ సినిమాను హిందీలో డబ్ చేస్తే సూపర్హిట్ సాధించింది. చరణ్లాంటి కుర్రాడు ఇంత పెద్ద సినిమా నిర్మించాడంటే ఆశ్చర్యంగా ఉంది’’ అన్నారు. చిరంజీవి మాట్లాడుతూ– ‘‘సైరా’ సినిమా విజయం సాధిస్తుందని ధీమాగా చెప్పేవారు సుబ్బిరామిరెడ్డి. ఆయన కళాహృదయానికి చేతులెత్తి నమస్కరిస్తున్నా’’ అన్నారు. ‘‘సుబ్బిరామిరెడ్డిగారి ఫంక్షన్ లేకపోతే ఆ ఏడాది మాకు ఏదో వెలితిగా ఉంటుంది’’ అన్నారు రామ్చరణ్. ‘‘ఎక్కడ మంచి సినిమా ఉన్నా ఆ యూనిట్ని గౌరవించడం సుబ్బిరామిరెడ్డిగారి గొప్పతనం’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. ‘‘తెలుగు చలన చిత్రపరిశ్రమకు అంతర్జాతీయంగా పేరు తెచ్చిన గొప్ప సినిమా ‘సైరా’’ అన్నారు నటుడు మురళీమోహన్. ‘‘తెలుగువారందరూ గర్వపడేలా చేసిన చిరంజీవిగారు నిజంగా గ్రేట్’’ అన్నారు నటుడు రాజశేఖర్. ‘‘చిరంజీవిగారి కెరీర్లో ఇదొక మైలురాయి సినిమా’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. సురేందర్రెడ్డి, నటి తమన్నా, కెమెరామన్ రత్నవేలు, రచయితలు పరుచూరి వెంకటేశ్వరరావు, సాయి మాధవ్ బుర్రా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నటులు కృష్ణంరాజు, వెంకటేష్, దర్శకులు కోదండరామిరెడ్డి, క్రిష్, సుకుమార్, మెహర్ రమేష్, నిర్మాతలు అశ్వనీదత్, డి.సురేష్బాబు, బోనీ కపూర్, కేఎస్ రామారావులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
చిరు152షురూ
‘ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత చిరంజీవి హీరోగా నటిస్తున్న 152వ సినిమాకి కొబ్బరికాయ కొట్టారు. డిఫరెంట్ కమర్షియల్ ఎంటర్టైనర్స్తో వరుస బ్లాక్ బస్టర్స్ను సొంతం చేసుకున్న కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాని దసరా పండుగను పురస్కరించుకుని హైదరాబాద్లో మంగళవారం ప్రారంభించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై రామ్చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం దేవుడి చిత్రపటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి సతీమణి సురేఖ క్లాప్ ఇచ్చారు. ‘‘ఈ సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తాం. సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ కార్యక్రమంలో చిరంజీవి తల్లి అంజనాదేవి, హీరో రామ్చరణ్, నిరంజన్ రెడ్డి, చిరంజీవి కుమార్తె సుస్మిత తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: తిరు. -
నాకంటే అదృష్టవంతుడు ఎవరుంటారు?
‘‘ఇప్పటి వరకూ 150 సినిమాలు చేశాను. అవన్నీ ఒక ఎత్తయితే ‘సైరా నరసింహారెడ్డి’ ఒక ఎత్తని గతంలోనూ చెప్పా.. ఇప్పుడూ చెబుతున్నా. నా గత చిత్రాలన్నింటిలో ‘సైరా’ మొదటిస్థానంలో ఉంటుంది. దీన్ని మించిన సినిమా నా నుంచి వస్తే అంతకంటే ఆనందం ఇంకే కావాలి? నాకంటే అదృష్టవంతుడు ఎవరుంటారు?’’అని చిరంజీవి అన్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి, నయనతార జంటగా నటించిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. కొణిదెల సురేఖ సమర్పణలో రామ్చరణ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 2న విడుదలైంది. ఈ సందర్భంగా ‘సైరా’ చిత్రబృందం హైదరాబాద్లో విలేకరులతో సమావేశమయ్యారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు చిరంజీవి సమాధానమిస్తూ–‘‘సైరా’ చిత్రం కథ, కథనాలపై నమ్మకం ఉండటంతో బడ్జెట్కి కానీ, ఎక్కువ రోజులు షూటింగ్ చేయాల్సి వస్తుందని కానీ భయపడలేదు. ఈ సినిమాకి దాదాపు 285 కోట్లు బడ్జెట్ అయింది. అంత బడ్జెట్ రామ్చరణ్ పెట్టడానికి కారణం వాడి వెనుక నేను ఉన్నాననే భరోసా (నవ్వుతూ). ఎంతో మంది నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ‘సైరా’ ని ఇంత గ్రాండ్గా నిర్మించిన చరణ్ ఇండస్ట్రీలో నంబర్ 1 నిర్మాత అయ్యాడు. ‘రంగస్థలం’ చిత్రంలో చరణ్ నటనకు జాతీయ అవార్డు రావాలి. నిర్మాతగా, నటుడిగా, కొడుకుగా వాడికి 100కి 100మార్కులు వేస్తా. ‘సైరా’ డబ్బింగ్ టైంలో ‘ఇది మామూలు సినిమా కాదు. భారతీయులకు గౌరవాన్ని తీసుకొచ్చే చిత్రం. ముందుగానే అభినందనలు’ అంటూ అమితాబ్ బచ్చన్గారి నుంచి వచ్చిన ప్రశంసని మరచిపోలేను. నేను, నాగార్జున కలిసి స్వయంగా సినిమా చూశాం. సినిమా పూర్తవగానే నన్ను గట్టిగా హత్తుకుని ‘సినిమా సూపర్.. చాలా బాగుంది’ అంటూ తన స్టయిల్లో అభినందించాడు. ఎంతోమంది నా తోటి నటీనటులు అభినందిస్తూ మెసేజ్లు, ట్వీట్స్ చేశారు. పలువురు దర్శకులు స్వయంగా నన్ను కలిసి అభినందనలు చెప్పారు. అప్పుడు నాకు అనిపించింది.. తోటి నటులు నా నటన బాగుందంటూ అభినందిస్తుంటే ‘ఇంతకంటే ఇంకేం కావాలి? అనిపించింది. ‘సైరా’ తొలిరోజు 7గంటల వరకూ కూడా సినిమా గురించి ఎటువంటి ఫీడ్ బ్యాక్ రాలేదు. సినిమా విజయంపై నమ్మకం ఉంది. అయినా లోలోపల కొంచెం టెన్షన్ పడ్డాను. సినిమా సూపర్ అంటూ ‘బన్ని’ వాస్ చెప్పాడని బన్నీ (అల్లు అర్జున్) చెప్పాడు. మా ఇంట్లోవాడు కాబట్టి ఆ మాటలు అంత కిక్ ఇవ్వలేదు. ‘సినిమాకి ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వస్తోంది’ అంటూ యూవీ క్రియేషన్స్ విక్రమ్ వాయిస్ మెసేజ్ పెట్టడంతో చాలా సంతోషంగా అనిపించి, నా టెన్షన్ పోయింది. నేను, చరణ్ కలిసి నటించే సినిమాపై కొన్ని గంటల్లో ప్రకటన వెలువడనుంది. చరణ్తో కలిసి నటించడం ఎంత సంతోషంగా ఉంటుందో నా తమ్ముడు పవన్ కల్యాణ్తో నటించడం కూడా అంతే సంతోషంగా మంచి కిక్ ఇస్తుంది. నాకు, కల్యాణ్కి సరిపడ మంచి కథలతో వస్తే కచ్చితంగా సినిమా చేస్తాం’’ అన్నారు. పాటల రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి మాట్లాడుతూ – ‘‘సైరా’ సినిమా చూస్తుంటే యూనిట్ ఎంత కష్టపడ్డారో తెలుస్తోంది. చిరంజీవి ప్రాణం పెట్టి చేశాడు. ఆ పాత్రలో ఆయన్ని తప్ప ఎవర్నీ ఊహించలేం. ఆయన నటనకు హద్దుల్లేవ్. భారతదేశం అంతా చూడాల్సిన సినిమా ‘సైరా’. ప్రపంచంలో తెలుగు సినిమా తలెత్తుకునేలా చేసిన చిత్రమిది. ఇందులో నేను రాసిన పాటకి కచ్చితంగా జాతీయ అవార్డు వస్తుందనుకుంటున్నా’’ అన్నారు. ‘‘సైరా’ చిత్రంతో ఓ గొప్ప వీరుడి కథ చెప్పానని సంతోషంగా ఉంది. చిరంజీవిగారు ఏ రోజూ రెండో టేక్ తీసుకోలేదు. ఒక్క టేక్లోనే అద్భుతంగా నటించేవారాయన. అందుకే ఆయన అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ మెగాస్టార్’’ అని సురేందర్ రెడ్డి అన్నారు. ‘‘సైరా’ విడుదల తర్వాత అందరూ నన్ను సాయిచంద్ అనడం మానేసి సుబ్బయ్య అంటూ ఫోన్లు చేస్తూ, మెసేజ్లు చేస్తుండటం చాలా సంతోషంగా ఉంది. నా జీవితంలో మంచి కిక్ ఇచ్చిన పాత్ర ఇది. తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి ఎవరెస్ట్ శిఖరం. అలాంటిది నా నటన బాగుందని ఆయన అభినందించడం నాకు ఆస్కార్ అవార్డు వచ్చినంత సంతో షం వేసింది’’ అన్నారు నటుడు సాయిచంద్. ‘‘రేసుగుర్రం’ టైమ్లో మెగాస్టార్గారి గురించి విన్నా. ‘సైరా’లో ఆయనతో పనిచేయడం నా అదృష్టం. అంతపెద్ద స్టార్ అయినా సింపుల్గా ఉంటారాయన’’ అన్నారు నటుడు రవికిషన్. -
ఆర్ఆర్ఆర్ అంటే...
‘మా సినిమా వర్కింగ్ టైటిల్ ‘ఆర్ఆర్ఆర్’. దాని ఫుల్ఫామ్ మీరే (ప్రేక్షకులు) సూచించండి, నచ్చింది తీసుకుంటాం’ అని ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందం ఇదివరకే ప్రకటించింది. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ టైటిల్కి ఫుల్ఫామ్ ఫిక్స్ చేశారట. ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. డీవీవీ దానయ్య నిర్మాత. రామ్చరణ్ సరసన ఆలియా భట్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘రామ రౌద్ర రుషితం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారని సమాచారం. మిగతా భాషల్లో ‘రైజ్ రివోల్ట్ రివెంజ్’ టైటిల్ను ఉపయోగించాలనుకుంటున్నారట. వచ్చే ఏడాది జూలై 30న ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
సైరా సెలబ్రేషన్స్
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. చిరంజీవి టైటిల్ రోల్లో నటించిన ఈ సినిమాను సురేందర్రెడ్డి దర్శకత్వంలో రామ్చరణ్ నిర్మించారు. ఈ నెల 2న ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సక్సెస్ను సెలబ్రేట్ చేయడానికి అల్లు అరవింద్ ‘సైరా’ టీమ్కి పార్టీ ఏర్పాటు చేశారు. దర్శకులు త్రివిక్రమ్, సుకుమార్, వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్లతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ పార్టీలో పాల్గొన్నారు. -
చాలు.. ఇక చాలు అనిపించింది
‘‘సైరా’ సినిమా విడుదలకు నెలన్నర ముందు నుంచి తెల్లవారుజాము 3.30 ప్రాంతంలో ఉలిక్కిపడి నిద్రలేచేవాణ్ణి. అది ఎందుకో తెలియదు. బహుశా మన తెలుగు సినిమా నిర్మాతలందరూ అలాగే లేస్తారేమో తెలియదు’’ అన్నారు ‘సైరా’ చిత్రనిర్మాత రామ్చరణ్. చిరంజీవి టైటిల్ రోల్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో సురేఖ సమర్పణలో రామ్చరణ్ నిర్మించిన చిత్రం ‘సైరా’. సురేందర్రెడ్డి దర్శకుడు. ఈ చిత్రం ఈ నెల 2న విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిత్రబృందం ‘థ్యాంక్స్ టూ ఇండియా’ ప్రెస్మీట్ను నిర్వహించారు. రామ్చరణ్ మాట్లాడుతూ– ‘‘ఆ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆత్మ పైనుండి మమ్మల్ని ఆశీర్వదించి నాన్నగారితో ఇంత గొప్ప సినిమా తీసే అవకాశం ఇచ్చారేమో. ఇది భారతీయులు గర్వపడే సినిమా’’ అన్నారు. చిరంజీవి మాట్లాడుతూ– ‘‘ఈ కథ పరుచూరి బ్రదర్స్ బిడ్డ. ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు సురేందర్ రెడ్డితో చెప్పాం. కథ ఏ విధంగా చెప్పారో అదే కథను ఓ ఎపిక్లా తెరమీద చూపించినందుకు హ్యాట్సాఫ్ టు సురేందర్. నేను ఎప్పుడూ ఏ కథ విన్నా నాతోపాటు ఓ స్క్రిప్ట్ డాక్టర్ ఉంటారు. ఆయనే సత్యానంద్గారు. ఆయనకు థ్యాంక్స్. సాయిమాధవ్గారు చక్కని మాటలను అందించారు. అమితాబ్గారు స్పెషల్ ఫ్లైట్లో వచ్చి మాకు ఎలా కావాలో అలా అద్భుతంగా నటించారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు అంకితభావంతో చేశారు కాబట్టే ఈ రోజున ‘సైరా’ అందరితో ‘వావ్’ అనిపించుకుంటోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మొట్టమొదటి స్వాతంత్య్ర సమర యోధుడు అనే సంగతి ప్రపంచానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియన్ ఫిల్మ్గా విడుదల చేశాం. ఈ సినిమా ప్రీమియర్ను ఒకటో తారీఖున ముంబైలో మీడియాకి వేశాం. అక్కడ సినిమా చూసినవారందరూ సౌత్లో ఇంతమంచి నాయకుడు ఉన్నాడా అని ఆశ్చర్యపోయి, స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారట. ఇది సౌత్, నార్త్ సినిమా కాదు.. ఇండియన్ సినిమా అంటున్నారు. ప్రేక్షకులు ఈ సినిమా చూసి చిరంజీవి 150 సినిమాలు ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు అంటుంటే చాలు.. ఇక చాలు! ఈ సినిమా నా బిడ్డ నిర్మించినందుకు నాకు ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి అనిపించింది’’ అన్నారు. సురేందర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఇంత గొప్ప హిస్టారికల్ ఫిల్మ్ను తీసే చాన్స్ ఇచ్చినందుకు చిరంజీవిగారికి, రామ్చరణ్కి రుణపడి ఉంటాను’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘బాలీవుడ్ సినిమా కలెక్షన్లను గ్రాస్లో చెబుతారు. తెలుగులో షేర్ను మాత్రమే చెప్పేవాళ్లం. ఫస్ట్ టైమ్ తెలుగు సినిమా 85 కోట్లు వసూలు చేసిందని గ్రాస్లో కలెక్షన్లను చెబుతున్నాం. ఇది అమేజింగ్ ఫిగర్. చిరంజీవిగారిని కలిసినప్పుడు ఎంత కలెక్ట్ చేస్తుందని కాదు రాజూ.. ఇది రెస్పెక్టెడ్ మూవీ, ఆ గౌరవాన్ని కాపాడాలి అన్నారు’’ అని చెప్పారు. ‘‘చిరంజీవిగారు తన తర్వాతి సినిమాల్లో కూడా నన్ను తీసుకోవాలి’’ అన్నారు తమన్నా. పరుచూరి బ్రదర్స్, సత్యానంద్, రత్నవేలు, బుర్రా సాయిమాధవ్, కమల్కణ్ణన్, జగపతిబాబు, సుస్మిత, విద్య తదితరులు పాల్గొ న్నారు. -
నాన్నకు ప్రేమతో..
‘‘మాకన్నీ అందించిన వ్యక్తి నాన్నగారు. ఇప్పుడు ‘సైరా’తో ‘బాస్బస్టర్’ అందించారు. థ్యాంక్యూ నాన్నా’’ అంటూ ఈ ఫొటోలను రామ్చరణ్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్చరణ్ నిర్మించిన ‘సైరా’ బుధవారం విడుదలైన విషయం తెలిసిందే. -
ఆ కోరిక, కల అలాగే ఉండిపోయింది : చిరంజీవి
‘‘సెప్టెంబర్ 22 నా జీవితంలో అద్భుతమైనటువంటి ల్యాండ్ మార్క్. 1978 సెప్టెంబర్ 22న నా మొట్టమొదటి సినిమా ‘ప్రాణం ఖరీదు’ విడుదలైన రోజు. ఓ వైపు టెన్షన్.. మరోవైపు ఎగ్జయిట్మెంట్.. ఇలా రకరకాల అనుభూతులతోటి నేను నేలమీదలేనంటే ఒట్టు. ఇన్నేళ్ల తర్వాత అలాంటి అనుభూతి ఈరోజు భావిస్తున్నానన్నది వాస్తవం. దానికి కారణం ‘సైరా నరసింహారెడ్డి’’ అని చిరంజీవి అన్నారు. చిరంజీవి, నయనతార జంటగా అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, తమన్నా, సుదీప్, విజయ్ సేతుపతి, రవికిషన్ ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్చరణ్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 2న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చిరంజీవి మాట్లాడుతూ– ‘‘ఏ కథ అయినా అనుకుని అద్భుతంగా అల్లుకుని సెట్స్పైకి తీసుకెళతాం. కానీ, ‘సైరా’ అలాంటిది కాదు. దాదాపుగా ఒకటిన్నర దశాబ్దం నుంచి ఇది నా మదిలో మెదులుతూ ఉంది. దానికంటే 25 ఏళ్లకి ముందు ‘మీరు చేయాల్సిన పాత్రలేమైనా ఉన్నాయా?’ అని అడిగితే ఎప్పుడూ అంటుంటాను. స్వాతంత్య్ర సమరయోధుడి పాత్ర చేయాలి.. ప్రజల్లో శాశ్వితంగా నిలిచిపోయే పాత్ర అవ్వాలి.. నా కెరీర్కి అది బెస్ట్ పాత్ర అవ్వాలి అది భగత్సింగ్’ అంటూ నేను చెప్పుకుంటూ వచ్చేవాణ్ణి. కానీ ఎందుకో భగత్సింగ్ పాత్రని రచయితలు, దర్శకులు, నిర్మాతలు తీసుకురాలేదు.. దాంతో ఆ కోరిక, కల అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత, పుష్కరానికి ముందు పరుచూరి బ్రదర్స్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి చెప్పారు. ఆయన గురించి కర్నూలుతో పాటు చుట్టుపక్కన ఉన్న జిల్లాల్లోని కొందరికి తప్ప ఆయన గురించి ఎవరికీ తెలియదు. ఆ టైమ్లో నాకూ పెద్దగా తెలియలేదు. నాకు తెలిసినవారిని అడిగినా మాకూ తెలియదన్నారు. ఆయనకు సంబంధించిన కొన్ని పేజీలు, బుర్ర కథలు, ఒగ్గు కథలున్నాయి తప్ప ఆయన గురించి పెద్దగా ప్రాచుర్యం ఏ ప్రాంతానికీ పాకలేదు. కానీ, కథ విన్నప్పుడు అద్భుతమైన కథ, ఓ గొప్ప యోధుడు అనిపించింది. తెరమరుగైపోయిన, తొలి స్వాతంత్య్ర సమరయోధుడు నరసింహారెడ్డి కథని అందరికీ తెలియజేయాలని సినిమా తీశాం. 1857లో సిపాయుల తిరుగుబాటు వచ్చినప్పుడు మంగళ్పాండే, ఝాన్సీ లక్ష్మీభాయ్ గురించి తెలుసు. ఆ తర్వాత ఆజాద్, భగత్సింగ్, నేతాజీ... ఇలా ఒక్కరేంటి.. మహాత్మాగాంధీ వరకూ ఎంతో మంది యోధులు, త్యాగమూర్తుల గురించి పుస్తకాల్లో చదివి తెలుసుకున్నాం. అయితే మన తెలుగువాడైన నరసింహారెడ్డివంటివారి కథ తెరమరుగైపోకూడదు అని మైండ్లో గట్టిగా ఉండిపోయింది. ఇలాంటి కథ కోసమే కదా ఇన్నాళ్లు ఎదురు చూస్తున్నాను.. మనం సినిమా చేస్తున్నాం అని పరుచూరి బ్రదర్స్కి చెప్పా. అయితే ఈ కథని తెరకెక్కించి న్యాయం చేయాలంటే బడ్జెట్ సమస్య అని మాకందరికీ అనిపించింది. పది–పదిహేనేళ్ల కిత్రం నాపై 30–40 కోట్లతో సినిమాలు తీసే రోజుల్లో ‘సైరా’ సినిమాకి 60–70 కోట్లపైన అవుతుంది. ఏ నిర్మాత ముందుకు రాలేడు.. చేయమని మనం అడగలేం. ఎందుకంటే నష్టపోయే పరిస్థితి. కానీ, చూద్దాం.. చేద్దాం.. రాజీపడలేం అనుకున్నాం. ఏ నిర్మాత ముందుకు రాకపోవడంతో ఆగిపోయింది. కానీ, నా 151వ సినిమాగా ‘సైరా’ చేస్తే ఎలా ఉంటుందన్న మా ఆలోచనకు శ్రీకారం చుట్టింది, ఇన్డైరెక్ట్గా సపోర్ట్ చేసింది దర్శకుడు రాజమౌళి. ఆయన ‘బాహుబలి’ తీసి ఉండకపోతే ఈరోజు ‘సైరా’ వచ్చుండేది కాదు.. మన తెలుగు సినిమాకి భారతదేశమంతా ఓ దారి వేశారాయన. ఇన్ని వందల కోట్లు మనం ఖర్చు పెట్టినా సంపాదించుకోవచ్చు.. నిర్మాతలకి నష్టం లేకుండా చూడొచ్చు అని భరోసా ఇచ్చాడు రాజమౌళి. శభాష్.. హ్యాట్సాఫ్ టు రాజమౌళి. ‘ఇంతఖర్చు పెట్టి రిస్క్ చేయమని ఎవరికైనా ఎందుకు మనం చెప్పాలి.. రాజీ పడకుండా మనమే చేద్దాం’ అని చరణ్ అనడంతో సై అన్నాను. ఈ కథని ఎవరు డైరెక్ట్ చేస్తారంటే.. నాపైన నమ్మకం ఉన్న పరుచూరి వెంకటేశ్వరావుగారు ‘మీరే చేయండి’ అన్నారు. నటిస్తూ దర్శకత్వం చేయడం కష్టం. దర్శకత్వం చేయలేక కాదు. దేన్నో ఓ దాన్ని వదిలేయాలి.. దేన్ని వదిలేయమంటారు? అడిగితే.. నరసింహారెడ్డిగా మిమ్మల్నే ఊహించుకున్నాం.. డైరెక్టర్ని వేరేవారిని పెట్టుకుందాం అన్నారు. సరే ఎవరు? అనుకుంటుంటే ‘ధృవ’ చేసిన అనుభవంతో మన సురేందర్ రెడ్డి అయితే బావుంటుంది అని చరణ్ అన్నాడు. సరే అన్నాను. ఈ విషయం సురేందర్కి చెబితే ఎగిరి గంతేస్తాడని అనుకుంటే ‘నాకు కొంచెం టైమ్ కావాలి సర్’ అన్నాడు. ఆ మాట మమ్మల్ని నిరుత్సాహానికి గురిచేసింది. వారం తర్వాత వచ్చి చేస్తాను సర్ అన్నాడు. కర్నూలుకు వెళ్లి నరసింహారెడ్డిగారి గురించి సమాచారం సేకరించి, మూడు వారాలు గోవాలో ఉండి స్టోరీ రెడీ చేసుకొచ్చాడు. వాస్తవ కథను ఎక్కడా వక్రీకరించకుండా కమర్షియలైజ్ చేసిన తనకు హ్యాట్సాఫ్. ఈ పాత్రలో ఎంతో కష్టం ఉంటుంది. నేనేమో డూప్ని ఒప్పుకోను. నా అభిమానులు అస్సలు ఒప్పుకోరు. ‘సైరా’ లో శారీరకంగా నన్ను ఎంతో హింస పెట్టి యాక్షన్ సీక్వెన్స్ని రాబట్టారు. ఒక్కసారి మేకప్ వేసుకుని, కత్తి చేతబట్టుకుని గుర్రం ఎక్కాక నా వొళ్లు మరచిపోతాను.. నా వయసూ మరచిపోతాను.. నాకు గుర్తొచ్చేది నా భిమానులు మాత్రమే. అక్కడ గుర్తొచ్చేది నా ఇమేజ్ మాత్రమే. 25ఏళ్ల కిత్రం జోష్ ఉండేది. ఆ ఉత్సాహాన్ని ఇచ్చేది ఒకటి ఆ పాత్ర.. రెండోది అభిమానులు. ‘సైరా’వంటి సినిమా చేయడం ఆ భగవంతుడు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం.. మీకు చూపించడం ఎంతో పుణ్యం. ఇండస్ట్రీకి, తెలుగువారికి, ఆ సినిమా చేసిన వారికి గౌరవాన్ని తీసుకొచ్చే సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అంత గౌరవాన్ని తెచ్చిన సినిమా ‘శంకరాభరణం’. ఆ తర్వాత కొన్ని సినిమాలు గౌరవాన్ని తీసుకొచ్చినా తెలుగు సినిమాని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన ఘనత రాజమౌళి ‘బాహుబలి’. మనమంతా తెలుగువాళ్లం అని గర్వంగా చెప్పుకుంటూ కాలర్ ఎగరేసేలా గౌరవాన్ని తీసుకొచ్చింది. ఈరోజు ‘సైరా’ సినిమా కూడా అంత గౌరవాన్ని తెస్తుందనే ప్రగాఢ విశ్వాసం, నమ్మకం నాకుంది. నేను మాట్లాడేది గౌరవాన్ని గురించే.. విజయాన్ని గురించి ఇంకో సినిమాతో పోల్చట్లేదు.. ఇది గమనించాలి. పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ ‘సైరా’ సినిమాకి ఎంతో ఉపయోగపడింది. ఈ చిత్రంలో పాటలు, స్టెప్స్ ఉండకపోవచ్చు కానీ, ప్రతి ఒక్క యువతకి కనెక్ట్ అయ్యే సినిమా. ప్రతి భారతీయుడు గర్వపడే సినిమా ‘సైరా’. మనమందరం భారతీయులుగా గర్వించాలి. ఇలాంటి సినిమాని నిర్మించినందుకు చరణ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.. ఓ కొడుకుగా కాదు.. ఓ నిర్మాతగా. సురేందర్ రెడ్డి అడిగినది ఏదీ కాదనకుండా, ధైర్యంగా ఖర్చుకు వెనకాడకుండా చేశాడు చరణ్. జార్జియాలో 45రోజుల పాటు పతాక సన్నివేశంలో వచ్చే యుద్ధం చేశాం. దానికి 75కోట్లు ఖర్చు అయింది. ‘ఎంత లాభాలు పొందామన్నది కాదు. రామ్చరణ్–సురేందర్ రెడ్డి ఎంత గొప్ప సినిమా తీశారన్నది కావాలి’ అన్నాడు. ఒక్క ఫోన్ చేయగానే నా గురువుపాత్ర చేసేందుకు ఒప్పుకున్న అమితాబ్గారికి కృతజ్ఞతలు. జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా.. ఇలా అందరూ ‘సైరా’ లో భాగమవ్వాలని నటించారు. ఈ సినిమాలో నేను ఇంత గ్లామర్గా ఉన్నానంటే ఆ క్రెడిట్ కెమెరామన్ రత్నవేలుగారిదే. అక్టోబర్ 2న గాంధీగారి 150వ జయంతి. ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఆ రోజున సినిమాని విడుదల చేసేందుకు ముందుకు వెళుతున్నామంటే ఇందుకు దోహదం చేసిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు’’అన్నారు. పవన్కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘సైరా’ ప్రీ రిలీజ్ ఫంక్షన్కు ఒక అతిథిగా నన్ను పిలవడం నా అదృష్టం. బయట నా పేరు.. ఇమేజ్.. ఇవన్నీ నాకు తెలియదు కానీ అన్నయ్య దగ్గరకి వచ్చే సరికి నేను ఒక అభిమానిని. ఈ రోజు మీ(అభిమానులు) ముందు ఈ స్థాయిలో ఉండి మాట్లాడటానికి కారణం అన్నయ్య నేర్పించిన పాఠాలే. ఎప్పుడు కూడా అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి అన్నయ్య. నేను మద్రాసులో ఉన్నప్పుడు దేశం గర్వించే సినిమాలు అన్నయ్య చేయాలని కోరుకున్నాను. నాకు స్టార్డమ్ వచ్చినా అన్నయ్యతో సినిమా చేయలేకపోయాను. నా ముందు పెరిగిన రామ్చరణ్ స్వార్థం చూసుకోకుండా ఇలాంటి అద్భుతమైన సినిమా తీసినందుకు నా అభినందనలు. కళ అనేది అద్భుతమైనది. అనేక పరిస్థితుల్లో అది రకరకాలుగా ఉద్భవిస్తుంటుంది. భారతదేశం తాలూకు గొప్పదనం చెప్పే సినిమా ఇది. మన దేశం ఇతర దేశాలమీద దాడి చేయలేదు. ప్రపంచ దేశాలవారు మన దేశంపై దాడి చేశారు. మరి.. భారతదేశం అంటే ఏంటి? ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి వ్యక్తుల సమూహం భారతదేశం. ఆయన ఎలా ఉండేవారో, ఎలా పోరాటం చేశారో పుస్తకం చదివితే అర్థం చేసుకోవచ్చు. కానీ కొన్ని కోట్ల మంది ఒక అనుభూతిలోకి రావాలి అంటే ఇలాంటి సినిమాలు రావాలి. భగత్సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, మహాత్మాగాంధీ, పటేల్, అంబేద్కర్ వంటి గొప్ప మహనీయుల త్యాగాలను మనం గుర్తు పెట్టుకోవాలి. ఉయ్యాలవాడ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఒక వినోదం కోసం మాత్రమే కాదు. ఇలాంటి ఒక చరిత్రను తెరకె క్కించడానికి చాలా కష్టపడాలి. రక్తాలు ధారపోసి, ప్రాణాలు అర్పించిన ఎందరో స్వాతంత్య్ర సమర యోధుల త్యాగఫలితమే ఈ రోజు మనం అనుభవిస్తున్న ప్రజాస్వామ్యం. అనుభవానికి నేను చాలా పెద్దపీట వేస్తాను. ఇది ఎప్పుడు నేర్చుకున్నాను అంటే... అన్నయ్య ‘ఖైదీ’ సినిమా విడుదలైన తర్వాత బలమైన స్టార్డమ్ స్టార్ట్ అయినప్పుడు.. ఒక తమ్ముడిగా మా అన్నయ్య పెద్ద హీరో అని అనుకుంటాం కదా. అలా అనుకున్నప్పుడు... ఎన్టీఆర్గారి సినిమారాగానే... ‘విశ్వామిత్ర’ అనుకుంటా... అది అన్ని రికార్డులను బద్దలు కొట్టేసింది. ఆ రోజు నాకు అర్థం అయ్యింది. ఒక వ్యక్తి తాలూకు అనుభవాన్ని ఎప్పుడూ తీసివేయలేం. అలాగే చిరంజీవిగారి అనుభవాన్ని... ఎంతమంది కొత్తవారు వచ్చినా కానీ, ఎంతమంది రికార్డులు బద్దలు కొట్టినా కానీ.. అంటే ఆయన అనుభవాన్ని మనం కొట్టేయలేం. అందుకే నాకు సీనియర్స్ అంటే చాలా గౌరవం. ‘సైరా:నరసింహారెడ్డి’ సినిమాను భారతదేశం గర్వించే చిత్రంగా చేయడం చాలా గర్వంగా ఉంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగారు అంటే చిరంజీవిగారే గుర్తొచ్చారు. సురేందర్ రెడ్డిగారు చాలా బాగా తెరకెక్కించారు. పరుచూరి బ్రదర్స్ ఈ సినిమా కోసం కలలు కన్నారు. నేను నటించకముందు ‘శుభలేఖ’ లో ఒక డైలాగ్కి డబ్బింగ్ చెప్పాను. ఆ తర్వాత మళ్లీ నా గళం ఇచ్చింది ‘సైరా’ చిత్రానికే. మన దేశం కోసం, ప్రజల కోసం తీసిన సినిమా ఇది. అందుకే నా గొంతను గర్వంగా, మనస్ఫూర్తిగా ఇచ్చాను. ‘సైరా’లాంటి సినిమాలో నా భాగస్వామ్యం ఉన్నందుకు సంతోషంగా ఉంది. తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళిగారు ఇక్కడి రావడం నిజంగా సంతోషం. ఎవరు ఎన్ని విజయాలు సాధించినా మాకు అసూయ కలగదు. ఇంకా ఆనందపడతాం. ఎందుకంటే పదిమంది బాగుండాలని కోరుకునేవాళ్లం మేము. రాజమౌళిగారు రికార్డులు బద్దలు కొడితే ఆనందంగా ఉంటుంది. సురేందర్రెడ్డిగారు కూడా రికార్డులు బద్దలుకొడితే ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మన సినిమా. మన జాతి. మన భారతజాతి. మన తెలుగుజాతి. మనం ఎక్కడికి వెళ్లినా.. ఇండియా అనేది బ్రిటిష్ వారు పెట్టిన పేరు. భారతదేశం అనేది మనది. భారతీయులుగా మనం గర్వించేలా సినిమా తీసిన సాంకేతిక నిపుణులకు, నటీనటులకు ధన్యవాదాలు’’ అన్నారు. నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘ఈ వేదికపై చాలా మంది గొప్పవారు ఉన్నారు. ఈ సినిమాలో పనిచేసిన వారు కాకుండా ఈ సినిమాను చూసిన మొట్టమొదటి ప్రేక్షకుడిని నేను. సూపర్హిట్ సినిమా. ఇన్ని రోజులు, ఇంత ఖర్చు పెట్టి తీశారు. సినిమా ఎలా వచ్చిందో అని చాలా భయంతో చూసి, చిరంజీవిగారిని కౌగిలించుకున్నాను. నాకు దుఃఖం వచ్చినంత పని అయ్యింది. ఇంత గొప్ప సినిమా తీసినందుకు చిరంజీవిగారి కన్నా... రామ్చరణ్పై ఓ ఎమోషనల్ ఫీలింగ్ వచ్చింది. చిరంజీవిగారితో ఇన్ని సినిమాలు తీసిన నేను, ఇలాంటి ఓ సినిమా తీయలేకపోయానే అనే ఒక బాధ కలిగింది. రెండో సినిమాతోనే చరణ్ గొప్ప సినిమా తీశాడు’’ అన్నారు. రామ్చరణ్ మాట్లాడుతూ – ‘‘ఈ స్టేజ్పై నేను చెప్పే మాటలు నా లోని భావాలను తెలియజెప్పలేవు. ‘సైరా’ షూట్ చేసిన ప్రతిరోజు టీమ్కి థ్యాంక్స్ చెబుతూనే ఉన్నాను. అందరి సహకారం లేకపోతే నాన్నగారి ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ సాధ్యమయ్యేది కాదు. ఈ సినిమాలో నటించినవారికి, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు’’ అన్నారు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ–‘‘సైరా’ సినిమా కోసం 215 రోజులు ఓ కుటుంబంలా సాంకేతిక నిపుణలందరూ కష్టపడి పనిచేసినందుకు థ్యాంక్స్. చిరంజీవిగారి డ్రీమ్ ప్రాజెక్ట్ని డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు. నాకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చి సపోర్ట్గా ఉంటూ ఫ్రీడమ్ ఇచ్చి ముందుకు నడిపించిన రామ్చరణ్గారికి థ్యాంక్స్’’ అన్నారు. డైరెక్టర్ కొరటాల శివ మాట్లాడుతూ – ‘‘సైరా’ షూటింగ్ మధ్యలో ఉన్నప్పుడు రామ్చరణ్గారు కొన్ని రషెష్ చూపించారు. సినిమా అండర్ ప్రొడక్షన్లో ఉండగానే అంత పాజిటివ్, అంత బ్లాక్బస్టర్ టాక్ ఈ ఒక్క సినిమాకే సాధ్యం. ఇలాంటి గొప్ప కావ్యమైన సినిమా తీసినందుకు సురేందర్రెడ్డిగారికి ఇది గొప్ప అవకాశం.. అదృష్టం. జనరల్గా తండ్రి నిర్మాత అయితే కొడుకు నటిస్తాడు.. ఇక్కడ మాత్రం కొడుకు నిర్మాత అయితే తండ్రి నటించడం చూడ్డానికే చాలా ఆనందంగా ఉంది. ‘సైరా’ సినిమా నిజంగా చాలా సంచలనం అవుతుంది’’ అన్నారు. ‘‘నా తొలి తెలుగు సినిమా చిరంజీవిసర్తో చేయడం సంతోషంగా ఉంది. రామ్చరణ్, సురేందర్ రెడ్డి సార్లకు కృతజ్ఞతలు’’ అన్నారు నటుడు విజయ్ సేతుపతి. డైరెక్టర్ రాజమౌళి మాట్లాడుతూ– ‘‘ఇంతపెద్ద సినిమా, ఇంత చారిత్రాత్మక సినిమా వేడుక ఈ రోజు ఇక్కడ జరుగుతోందంటే మనం గుర్తించుకోవాల్సింది, అభినందించాల్సింది, కృతజ్ఞతలు చెప్పాల్సింది పరుచూరి బ్రదర్స్కి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథని ఎన్నేళ్లు వారి గుండెల్లో, మనసుల్లో మోశారో సినిమా రంగంలోని వారందరికీ తెలుసు. బ్రిటీష్వారిపై తొలిసారి పోరాడింది ఓ తెలుగు వీరుడు.. ఇది అందరికీ తెలియాలని వాళ్లు చాలా ఏళ్లు వేచిచూశారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత వాళ్ల కోరికని రామ్చరణ్ తీరుస్తున్నాడు. చరణ్.. ఇది మీ నాన్నగారికి ఇస్తున్న గిఫ్ట్ కాదు.. తెలుగువారందరికీ ఇస్తున్న గిఫ్ట్.. థ్యాంక్యూ. ఇలాంటి సినిమా తీయడం ఎంత కష్టమో నాకు తెలుసు. ‘బాహుబలి’ లో 2300 వీఎఫ్ఎక్స్ షాట్లు ఉంటే ‘సైరా’ లో 3800 షాట్స్ ఉన్నాయి. అన్ని షాట్స్ మధ్యలో ఎమోషన్స్ని వదలకుండా, మరచిపోకుండా చేశారు. ‘సైరా’ ట్రైలర్ చూడగానే సినిమాపై అందరికీ నమ్మకం వచ్చింది. ‘మగధీర’ స్టోరీ సిట్టింగ్స్లో వారం పాటు చిరంజీవిగారు ఉత్సాహంగా పాల్గొని చాలా సలహాలు ఇచ్చారు. కొన్ని ఇలా చేస్తే బాగుంటుందంటూ నటించి చూపించారు. అప్పుడు నాకు అనిపించింది. ఈ కథలో హీరోగా చరణ్ని ఊహించుకోకుండా ఆయన్నే ఊహించుకుంటున్నాడని నాకు అనిపించింది. ‘మగధీర’ విడుదలయ్యాక చిరంజీవిగారు చెప్పారు.. ‘రాజమౌళిగారు.. నేను ఇన్ని సినిమాలు చేశాను కానీ, ‘మగధీర’ లాంటి సినిమా ఒక్కటి కూడా చేయలేదు’ అన్నారు. ఆ కోరికని ఇప్పుడు చరణ్ తీరుస్తున్నాడు’’ అన్నారు. కథా రచయిత పరుచూరి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ –‘‘సైరా’ మా పదేళ్ల కల. ఈ కథని చాలామందికి చెప్పాం. చిరంజీవిగారు చేస్తాను అన్న తరవాత చాలా ఏళ్లు వెయిట్ చేశాం. న్యాయంగా చిరంజీవిగారి కోసమే చాలా మంది పెద్దవారు వదిలేసిన కథలా నేను భావిస్తుంటాను. నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవిగారు నటించడం మన అదృష్టం. రామ్చరణ్ అత్యద్భుతంగా ఈ సినిమా తీశారు. ఆర్టిస్టుల నుంచి మంచి నటనను రాబట్టుకోగలరు సురేందర్రెడ్డి. ‘సైరా’ చిత్రం సూపర్ హిట్ అవుతుంది’’ అన్నారు. మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా మాట్లాడుతూ – ‘‘కృష్ణానగర్లో నేను అవకాశాల కోసం తిరుగుతుండేవాణ్ణి. ఓ రోజు అమ్మమ్మ ఫోన్ చేసి ‘అరేయ్.. చిరంజీవిని కలవరా.. ఆయన సినిమాకి ఒక్క డైలాగ్ అయినా రాయరా’ అనేది. ఆయన సినిమాకి మాటలు రాయడం ఏంటమ్మా.. అది జరిగేపనికాదు.. అలాంటి అవకాశాలు రావు.. ఆకాశాన్ని అందుకోమంటున్నావు అది జరిగేపని కాదు ఫోన్ పెట్టేయ్’ అని చెప్పేవాణ్ణి. అలాంటి నేను చిరంజీవిగారికి తొలిసారి ‘ఖైదీ నంబర్ 150’ సినిమాకి, ఇప్పుడు ‘సైరా’ కి మాటలు రాశా. అవకాశం ఇచ్చిన చిరంజీవి, రామ్చరణ్, సురేందర్ రెడ్డిగార్లకు థ్యాంక్స్’’ అన్నారు. డైరెక్టర్ వీవీ వినాయక్ మాట్లాడుతూ– ‘‘తెలుగు సినిమా రారాజు మా అన్నయ్య మెగాస్టార్. ఈ సినిమా సూపర్హిట్ సాధించి చరణ్బాబు కలను, అన్నయ్యగారికి గొప్పగా గుర్తిండిపోయే సినిమా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు. కొణిదెల సురేఖ, నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, డి.సురేశ్బాబు, డీవీవీ దానయ్య, కిరణ్, హీరోలు వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వాకాడ అప్పారావ్, వైవీ ప్రవీణ్ కుమార్, రామ్చరణ్ సతీమణి ఉపాసన, సోదరీమణులు సుశ్మిత, శ్రీజ, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్, నటులు జగపతిబాబు, ‘థర్టీ ఇయర్స్’ పృథ్వీ, డైరెక్టర్ మెహర్ రమేశ్, కెమెరామన్ రత్నవేలు తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బై బై బల్గేరియా
బల్గేరియాకు బై బై చెప్పి హైదరాబాద్కు హాయ్ చెప్పారు ఎన్టీఆర్. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రూపొందుతున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో ఎన్టీఆర్, రామ్చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. రామ్చరణ్ సరసన ఆలియా భట్ కథానాయికగా నటిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ను ఫైనలైజ్ చేయాల్సి ఉంది. బల్గేరియాలో ఇటీవల మొదలైన ఈ సినిమా షెడ్యూల్ పూర్తికావడంతో ఆదివారం హైదరాబాద్కు చేరుకున్నారట ఎన్టీఆర్. ఈ షెడ్యూల్లో ఆయన ఇంట్రడక్షన్ సీన్స్ తీశారని తెలిసింది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ హైదరాబాద్లో జరగనుందని సమాచారం. ఈ షెడ్యూల్లో రామ్చరణ్ జాయిన్ అవుతారట. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూలై 30న విడుదల కానుంది. -
యంగ్ టైగర్ వర్సెస్ రియల్ టైగర్?
రాజమౌళి సినిమాల్లో హీరో పరిచయ సన్నివేశాలు ఎక్స్ట్రా స్పెషల్గా ఉంటాయి. ‘యమదొంగ’ సినిమా అందుకు ఓ ఉదాహరణ. సర్కస్లో ‘పులిని మనిషిగా మార్చు.. చూద్దాం’ అని ఓ ప్రేక్షకుడు అడగడంతో మెజీషియన్ అలీ నిజమైన పులిని ఎన్టీఆర్గా మార్చుతాడు. అది ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్. ఈ సీన్కి విపరీతమైన విజిల్సూ, క్లాప్స్ పడ్డాయి. ఇప్పుడు మరోసారి రియల్ టైగర్ని, యంగ్ టైగర్ని ఒకే ఫ్రేమ్లోకి తీసుకురావాలనుకుంటున్నారట దర్శకుడు రాజమౌళి. ఎన్టీఆర్, రామ్చరణ్లు హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. డీవీవీ దానయ్య నిర్మాత. ప్రస్తుతం ఎన్టీఆర్కు సంబంధించిన పరిచయ సన్నివేశాలను బల్గేరియాలో తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ సన్నివేశాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రియల్ టైగర్తో నటిస్తున్నారని తెలిసింది. ఈ సన్నివేశాల్లో వీఎఫ్ఎక్స్ హైలెట్గా నిలుస్తుందట. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం వచ్చే ఏడాది జూలైలో రిలీజ్ కానుంది. -
రియల్ మెగాస్టార్ని కలిశా
చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై చిరంజీవి తనయుడు, హీరో రామ్చరణ్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 2న విడుదలకానుంది. తండ్రితో కలిసి ఉన్న ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన రామ్చరణ్ ‘‘సైరా’ చిత్రం కోసం నాన్నగారు చాలా పరివర్తన చెందటం అద్భుతం. ఆ కష్టంలో మంచి అనుభవం దాగి ఉంది. నాన్నగారి సినిమాలకు నిర్మాతగా మారిన తర్వాత నేను రియల్ మెగాస్టార్ని కలిశాననిపిస్తోంది’’ అని పేర్కొన్నారు. ‘సైరా’ చిత్రంలో నయనతార కథా నాయికగా నటించారు. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, తమన్నా, జగపతి బాబు కీలక పాత్రధారులు. చిరంజీవి కమ్బ్యాక్ మూవీ ‘ఖైదీ నంబర్ 150’ సినిమాతో రామ్చరణ్ తొలిసారిగా నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. ‘సైరా’ చిత్రం చరణ్కు నిర్మాతగా రెండోది. -
అభిమానిగా అడుగుపెట్టి.. నేడు!
సాక్షి, గుంటూరు: శివ చెర్రి...సినిమా పరిశ్రమలో మెగా కుటుంబానికి, రాష్ట్రంలోని ఆ హీరోల అభిమానులకు సుపరిచితమైన పేరు. మెగా హీరోల సినిమాలకు ఆడియో ఫంక్షన్ల నుంచి, హైదరాబాద్ వెలుపల వారు పాల్గొనే పలు సభలు, సమావేశాలకు కీలక బాధ్యతల్లో తరచుగా వినిపిస్తుందా పేరు. ఆ క్రమంలోనే ఇప్పుడు సినీ ఎగ్జిక్యూటివ్ నిర్మాత అయ్యాడు. ఒకప్పుడు సినిమా ఫంక్షన్ల పాస్ల కోసం పాకులాడిన ఈ తెనాలి కుర్రోడు నేడు తన ఆధ్వర్యంలోనే మెగా హీరోల ఆడియో ఫంక్షన్లు జరిగేంతలా ఎదిగాడు. సినిమా అభిమానులంటే పనీపాట లేనివాళ్ల వ్యాపకమని చిన్నచూపు చూసే సమాజానికి, నిజమైన ‘అభిమానం’ జీవితాన్నిస్తుందని నిరూపించాడు. సినిమా నిర్మాణ రంగంలో తెనాలి కీర్తిప్రతిష్టలను నిలబెడతానని చెబుతున్నాడు శివ చెర్రీ. రాంచరణ్ అభిమాని నుంచి సినీ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా... శివ చెర్రి అసలు పేరు పసుపులేటి శివ. మధ్యతరగతి కుటుంబం. తండ్రి హజరత్ సినిమా థియేటర్లో క్యాంటిన్ నడిపేవారు. నష్టం రావటంతో కుటుంబంతో సహా కొల్లూరు మకాం మార్చారు. అక్కడో చిన్న క్యాంటిన్ తీసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత తెనాలి తిరిగొచ్చారు. అప్పటికి శివకు పదోతరగతి పూర్తవటంతో ఇక్కడే ఇంటర్లో చేరాడు. హైస్కూలులో రెండేళ్లు విద్యార్థి నాయకుడిగా, హౌస్ కెప్టెన్గా వున్న అనుభవం కలిగిన శివకు ఏదొకటి చేయాలన్న ఉత్సాహం. తాను అభిమానించే సినీనటుడు రామ్చరణ్ సినిమా మగధీర రిలీజయ్యే సమయం. తోటి స్నేహితులను కూడగట్టి, చరణ్ ఫాన్స్ అసోసియేషన్ స్థాపించాడు...అధ్యక్షుడయ్యాడు. చేతిలో రూపాయి లేకున్నా, సభ్యుల చందాలు రూ.80 వేలతో సినిమా విడుదల రోజున పట్టణాన్ని ఫ్లెక్సీలతో నింపేశాడు...తొలియత్నంలోనే తెనాలి సినీ అభిమానులు శివకేసి చూశారు. తర్వాతి సినిమాకు మరింత ఆర్భాటం చేశారు. తొలినుంచీ సినిమాపై గల పిచ్చి, తండ్రి చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడు కావటం ఇందుకు పురిగొల్పాయంటారు శివ. మరోవైపు చరణ్, చిరంజీవి జన్మదినాల్లో సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాల నిర్వహణ, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయటం మామూలే... శివచెర్రీగా..పసుపులేటి శివ హైదరాబాద్లో చిరంజీవి ఆధ్వర్యంలో నడిచే బ్లడ్బ్యాంకుకు శనివారం వెళితే ‘మెగా’ నటులను కలుసుకోవచ్చని తెలిసి.. ప్రతి శుక్రవారం డెల్టా ప్యాసింజరుకు వెళ్లటం, ఉదయాన్నే బ్లడ్బ్యాంకుకు వెళ్లి, సాయంత్రం వరకు అక్కడ ఎదురుచూడటం...నిత్య కార్యక్రమంగా చేసుకున్నాడు. ఒకరోజు చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడు, బ్లడ్బ్యాంక్ సీఈఓ స్వామినాయుడు దృష్టిలో పడ్డాడు. చిన్నవయసులోనే రక్తదానం వంటి పలు సేవాకార్యక్రమాలు నిర్వహించడం తెలుసుకున్న అతను టచ్లో ఉండమని చెప్పాడు. ఒకరోజు స్వామినాయుడు నుంచి పిలుపురావడంతో అమ్మతో కలిసి హైదరాబాద్ వెళ్లటం శివ జీవితానికి మలుపు. ‘శివలో సేవాగుణం ఉంది...ఇక్కడ వదిలేసి వెళ్లండి...మేం చూసుకుంటాం’ అనటంతో బట్టలు, రూ.3 వేల నగదు ఇచ్చేసి అమ్మ వెళ్లిపోయింది’ అని చెప్పారు శివ. స్పోకెన్ ఇంగ్లిష్, కంప్యూటర్ కోర్సులో చేర్పించారు. తర్వాత అక్కడే బీకెట్ పూర్తిచేశారు. అప్పుడే రాష్ట్ర ‘రామ్చరణ్ యువశక్తి’ని ప్రారంభించి, రాష్ట్రమంతా తిరిగి, అన్ని జిల్లాల్లో యువశక్తి విభాగాలను ఆరంభించారు. దీంతో పసుపులేటి శివ, శివ చెర్రీగా స్థిరపడిపోయారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా.. ఈ క్రమంలో రామ్చరణ్, అల్లు అర్జున్తో సహా మెగా కుటుంబంతో సాన్నిహిత్యం పెరిగింది. ఆడియో ఫంక్షన్లు, టీజర్ల విడుదల సహా అన్ని కార్యక్రమాల్లోనూ తన బాధ్యతలు తప్పనిసరైంది. బయట హీరోలతోనూ సంబంధాలు ఏర్పడ్డాయి. హీరో సందీప్కిషన్ ఆహ్వానంపై అతనికి మేనేజరుగా వెళ్లాడు. అదే హీరో వెంకటాద్రి టాకీస్ స్థాపించి, ‘నిను వీడని నీడను నేను’ సినిమాకు శ్రీకారం చుట్టినపుడు, శివ చెర్రీకి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా అవకాశం కల్పించారు. ఆ సినిమా హిట్ కావటంతో రెండోసినిమా ‘తెనాలి రామకృష్ణ బీఏ.,బీఎల్’ చిత్రం జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో త్వరలో సెట్స్పైకి వెళ్లనుందని శివ వెల్లడించారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా 20 మంది స్నేహితులకూ ఉపాధి చూపాననీ, ఎప్పటికైనా సొంతంగా ప్రొడక్షన్ సంస్థను స్థాపించాలనేది తన తాజా కలగా శివ చెప్పారు. తెనాలిలో ఏటా వినాయక చవితి వేడుకల్లో పాల్గొనటం శివకు అలవాటు, ఏటా ఒక సినిమా హీరోను ఇక్కడకు తీసుకొస్తున్నారు. ఈసారి సంపూర్ణేష్బాబు, విశ్వక్సేన్తో ఇక్కడ చవితి సందడి చేయించారు. తన ఎదుగుదలకు కారణమైన సినిమాకు, మెగా కుటుంబానికి రుణపడి ఉంటానని చెబుతారు శివ. -
ప్రమోషన్స్కు సైరా
విడుదల సమయం దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచారు ‘సైరా’ చిత్రబృందం. స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. చిరంజీవి టైటిల్ రోల్ చేశారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాను రామ్చరణ్ నిర్మించారు. అక్టోబరు 2న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో ప్రచార కార్యక్రమాలను ప్లాన్ చేస్తున్నారు ‘సైరా’ చిత్రబృందం. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు వాసి కాబట్టి అక్కడ ఓ ఈవెంట్ను ప్లాన్ చేశారు. ఈ వేడుక ఈ నెల 15న జరగనుందనే ప్రచారం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగానే ‘సైరా’ ట్రైలర్ను కూడా విడుదల చేస్తారని టాక్. ఇంకా చెన్నై, బెంగళూరులో కూడా ‘సైరా’ ప్రమోషన్స్ను ప్లాన్ చేస్తున్నారని వినికిడి. చిరంజీవి పుట్టిన రోజు (ఆగస్టు 22) సందర్భంగా ‘సైరా’ టీజర్ను ముంబైలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
హ్యాపీ బర్త్డే అప్పా
గురువారం చిరంజీవి బర్త్డే. సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్, ఇండస్ట్రీకి చెందినవాళ్లు చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. రామ్చరణ్ తన ఇన్స్టాగ్రామ్లో ఈ ఫొటోను షేర్ చేసి ‘‘కొన్ని వేల మందికి మీరు స్ఫూర్తి. మీరే గైడ్, మెంటర్ కూడా. ఆ వేల మందిలో నేనూ ఒకణ్ణి. వాళ్లందరూ మిమ్మల్ని మెగాస్టార్ అని పిలుస్తారు. నేను అప్పా (నాన్న) అంటాను. హ్యాపీ బర్త్డే నాన్న. ఎప్పటిలానే మా అందరినీ ఇన్స్పైర్ చేస్తూనే ఉండాలనుకుంటున్నాను. లవ్ యూ’’ అంటూ తండ్రి మీద ఉన్న ప్రేమ, గౌరవాన్ని వ్యక్తం చేశారు. అలాగే అత్తమామ, భర్తతో దిగిన ఫొటోను ఉపాసన షేర్ చేశారు. చిరంజీవి, రామ్చరణ్ -
కో అంటే కోటి గుర్తుకొచ్చింది
‘‘రణరంగం’ సౌండ్ కట్ ట్రైలర్ చాలా కొత్తగా ఉంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ చూశా. శర్వానంద్ని మేము ఎలా అయితే చూడాలనుకున్నామో అలాగే ఉంది. తనకు కరెక్ట్గా సరిపోయింది’’ అని హీరో రామ్చరణ్ అన్నారు. శర్వానంద్, కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరో హీరోయిన్లుగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రణరంగం’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలకానుంది. ఈ సినిమా సౌండ్ కట్ ట్రైలర్ని రామ్చరణ్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘శర్వాలో కష్టపడేతత్వం ఉంది. అదే మాకు నచ్చింది. అతని చిత్రాల్లో ‘కో అంటే కోటి’ నాకిష్టం. అలాంటి ఇంటెన్సిటీతో ఉన్న చిత్రం శర్వాకు పడితే బాగుంటుంది అనుకునేవాణ్ణి. సౌండ్ కట్ ట్రైలర్ చూసిన తర్వాత ‘రణరంగం’ అలాంటి చిత్రం అనిపించింది. ఈ సినిమాతో సుధీరవర్మ తన ప్రతిభను మళ్లీ నిరూపించుకున్నారనిపించింది. సన్నివేశాల తాలూకు కట్స్ చాలా ఆసక్తిగా ఉన్నాయి. ప్రశాంత్ పిళ్ళై సంగీతం బాగుండటంతో పాటు కొత్తగా ఉంది’’ అన్నారు. శర్వానంద్, సూర్యదేవర నాగవంశీ పాల్గొన్నారు. -
దోస్త్ మేరా దోస్త్
ఆదివారం స్నేహితుల దినోత్సవం. ఎన్టీఆర్, రామ్చరణ్ల మధ్య ఉన్న స్నేహాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘‘ఫ్రెండ్షిప్లో నెమ్మదిగా వెళ్లాలి. కానీ ఒక్కసారి ఫ్రెండ్ అయిన తర్వాత ఆ బాండ్ ఎప్పటికీ కంటిన్యూ అవ్వాలి. మా మధ్య ఫ్రెండ్షిప్ని వివరించడానికి ఈ కొటేషన్ చాలు’’ అన్నారు తారక్. ‘‘కొన్ని బంధాలు ఏర్పడటానికి సమయం తీసుకుంటాయి. ఏర్పడ్డాక తిరిగి చూసేపనిలేదు. తారక్తో నాకు అలాంటి బాండ్ ఏర్పడింది’’ అన్నారు చరణ్. వీళ్లిద్దరూ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ అనే పీరియాడికల్ మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
‘మగధీర’కు పదేళ్లు..రామ్చరణ్ కామెంట్..!
‘మగధీర’ ఈ మధ్యే విడుదలైనట్టు అనిపిస్తున్నా.. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి నేటికి సరిగ్గా పదేళ్లు పూర్తి చేసుకుంది. అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా నటీనటులకు మంచి పేరు తీసుకొచ్చింది. రెండో సినిమా అయినప్పటికీ రామ్చరణ్ చక్కని నటన కనబరిచాడు. స్టార్డమ్ సొంతం చేసుకున్నాడు. ఇందు, మిత్రవింద పాత్రల్లో మెప్పించిన కాజల్ అగర్వాల్కు వరుస ఆఫర్లు వెల్లువెత్తాయి. టికెట్ల ధరలు తక్కువగా ఉన్న కాలంలోనే ఈ సినిమా భారీ కలెక్షన్లు వసూలు చేసింది. జాతీయ స్థాయిలోనూ పలు అవార్డులను సొంతం చేసుకుంది. ‘మగధీర’ విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా రామ్చరణ్ స్పందించారు. ఇన్స్టాలో ఆ సినిమా షూటింగ్కు సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు. ‘మగధీర సినిమా వచ్చి 10 సంవత్సరాలు పూర్తయిందంటే నమ్మబుద్ధి కావట్లేదు. ఈ సినిమా కోసం కష్టపడ్డ యూనిట్ సభ్యులందరికీ కృతజ్ఞతలు’ అంటూ గత స్మృతులను గుర్తు చేసుకున్నాడు. ‘మగధీర’ రాజమౌళి సృష్టించిన అద్భుతమంటూ కొనియాడాడు. కాగా, రామ్చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్లో ‘ఆర్ఆర్ఆర్’ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక మగధీర విడుదలైన రోజునే.. అంటే 2020, జూలై 30న విడుదల చేస్తామని రాజమౌళి ఇదివరకే ప్రకటించారు. మరోసారి అద్భుత విజయం ఆవిష్కృతమవుతుందేమో వేచి చూడాలి..! View this post on Instagram Can’t believe it’s been a decade already! Still seems so recent! A big thank you to the dream team of #Magadheera, Keeravaani garu, @kajalaggarwalofficial & @geethaarts for this memorable film. @ssrajamouli garu, learnt so much from you back then and continuing to do so even now. #10YearsofMagadheera A post shared by Ram Charan (@alwaysramcharan) on Jul 30, 2019 at 9:32pm PDT -
లవ్ యు అమ్మా
ఫొటో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్లోకి లేటెస్ట్గా రామ్చరణ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలి పోస్ట్ను తన తల్లి సురేఖకు అంకితం చేశారు చరణ్. సోమవారం ఇన్స్టా ఎంట్రీ ఇచ్చిన చరణ్ శుక్రవారం నా మొదటి పోస్ట్ను షేర్ చేస్తాను అని ప్రకటించారు. మొదటి పోస్ట్ దేనికి సంబంధించి ఉంటుందా? అని ఫ్యాన్స్ అందరూ ఊహాగానాలు మొదలెట్టేశారు. ‘ఆర్ఆర్ఆర్’ అప్డేట్ అని కొందరు, ‘సైరా’ అప్డేట్ అని మరికొందరు ఊహించారు. కానీ తన తల్లితో దిగిన రెండు ఫొటోలను అప్లోడ్ చేశారు. ‘‘కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు. నా తొలి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ను మా అమ్మకు అంకితం చేస్తున్నాను. అమ్మా.. లవ్ యు’’ అని క్యాప్షన్ చేశారు చరణ్. ఇక సినిమాల విషయానికి వస్తే రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ మరో హీరో అనే సంగతి తెలిసిందే. -
నా మొదటి పోస్ట్ నీకే అంకితం: రామ్చరణ్
‘కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు!! నా మొదటి పోస్టు నీకే అంకితం చేస్తున్నా. లవ్ యూ అమ్మా’ అంటూ మెగా పవర్స్టార్ రామ్చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఆల్రెడీ ఫేస్బుక్లో యాక్టివ్గా ఉంటున్న రామ్చరణ్... ఇటీవలే ఫొటో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్ ఖాతా తెరిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తల్లి సురేఖ ఒడిలో సేద తీరుతున్న తన చిన్ననాటి, ప్రస్తుత ఫొటోను షేర్ చేసిన రామ్చరణ్ తొలి పోస్టును ఆమెకు అంకితం చేశాడు. #mamasboy, #forever అనే హ్యాష్ట్యాగ్లతో తల్లి పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నాడు. గంటలోపే లక్షకు పైగా లైకులు సాధించిన ఈ ఫొటోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కాగా రామ్చరణ్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అదేవిధంగా తండ్రి చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సైరా: నరసింహారెడ్డి’ సినిమా ప్రొడక్షన్ పనులతో తీరిక లేకుండా గడుపుతున్నాడు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. View this post on Instagram Somethings never change !! Dedicating my first post to u. Love u Amma. ❤#mamasboy #forever. A post shared by Ram Charan (@alwaysramcharan) on Jul 11, 2019 at 10:00pm PDT -
రామ్చరణ్ ఇన్...
స్టార్లు ఏం చేస్తుంటారు? ఏ సినిమాలు చేస్తున్నారు? ఎక్కడ వెకేషన్లో ఉన్నారు అనే అప్డేట్స్ అభిమానులకు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. సోషల్ మీడియా ద్వారా స్టార్స్ అందుబాటులోకి రావడం అభిమానులకు పండగలాంటిదే. ఫేస్బుక్, ట్వీటర్, ఇన్స్టాగ్రామ్ ఇలా విభిన్న యాప్స్లో అకౌంట్స్ ఓపెన్ చేసి తమ గురించిన అప్డేట్స్ తెలియజేస్తున్నారు. ఆల్రెడీ ఫేస్బుక్లో యాక్టివ్గా ఉంటారు రామ్చరణ్. తన సినిమాలు, డైట్.. ఇలా చాలా విషయాలను ఫ్యాన్స్తో పంచుకుంటుంటారు. తాజాగా రామ్చరణ్ ఫొటో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి పోస్ట్గా తన స్టిల్ను అప్లోడ్ చేశారు. ఇక ‘ఆర్ఆర్ఆర్, సైరా’ అప్డేట్స్ అన్నీ ఇందులో షేర్ చేస్తారని ఫ్యాన్స్ ఊహిస్తున్నారు. -
గ్రాండ్ ఎంట్రీ?
ప్రస్తుతం చిన్ని బ్రేక్లో ఉన్న ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ త్వరలో నార్త్ ఇండియాకు పయనం కానున్నారు. ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్చరణ్ నటిస్తున్నారు. రామ్చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన హీరోయిన్ ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్స్ పుణే, అహ్మదాబాద్ పరిసర ప్రాంతాల్లో జరగనున్నట్లు తెలిసింది. అంతేకాదు ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రీ సీన్కు పాతిక కోట్లు, రామ్చరణ్ ఎంట్రీ సీన్కు పదిహేను కోట్ల రూపాయలను టీమ్ కేటాయించిందట. ఆల్రెడీ రామ్చరణ్ ఎంట్రీ సీన్ పూర్తయిన సంగతి తెలిసిందే. దీంతో చరణ్కు చిన్న బ్రేక్ ఇచ్చి ఎన్టీఆర్పై చిత్రీకరణ స్టార్ట్ చేస్తారట. ఈ సినిమాలో రామ్చరణ్ పాత్రకు తండ్రి పాత్రలో అజయ్ దేవగణ్ నటించనున్నారని తాజా సమాచారం. ఈ నార్త్ ఇండియా షెడ్యూల్స్లోనే ఆలియా, అజయ్ పాల్గొంటారట. సముద్రఖని, రాహుల్రామకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు కీరవాణి స్వరకర్త. ఈ సినిమాను వచ్చే ఏడాది జూలై 30న విడుదల చేయాలనుకుంటున్నారు. -
ఆన్ వర్క్ మోడ్
ఇటీవల సౌతాఫ్రికాలో సతీమణి ఉపాసనతో కలిసి హాలిడేను బాగా ఎంజాయ్ చేసిన రామ్చరణ్ ఇక వర్క్ మోడ్లోకి రానున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా ‘ఆర్ఆర్ఆర్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 350 కోట్ల బడ్జెట్తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. రామ్చరణ్ సరసన ఆలియా భట్ కథానాయికగా నటిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన హీరోయిన్ ఇంకా ఫిక్స్ కాలేదు. ఈ సినిమా తాజా షెడ్యూల్ షూటింగ్లో సోమవారం నుంచి రామ్చరణ్ పాల్గొంటారని సమాచారం. కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణకు టీమ్ ప్లాన్ చేసిందని తెలిసింది. 1921 నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్చరణ్, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది జూలై 30న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ విడుదల కానుంది. -
ఇంటర్వెల్కు 40 కోట్లు?
రాజమౌళి ఆలోచనలు గ్రాండ్గా ఉంటాయి. ఆ ఆలోచనల్ని స్క్రీన్ మీద చూపించడానికి అదే రేంజ్లో ఖర్చు చేస్తుంటారు. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’లో ఇంటర్వెల్ ఎపిసోడ్ కోసం సుమారు 40 కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిసింది. ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. కొమరమ్ భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ కనిపిస్తారు. రామ్చరణ్ సరసన ఆలియాభట్ కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఇంటర్వెల్ సీన్ను హైదరాబాద్లో చిత్రీకరిస్తున్నారు. ఈ సీన్లో సుమారు 1000 మందికిపైనే జూనియర్ ఆర్టిస్ట్లు పాల్గొంటున్నారు. వీళ్లందర్నీ ఎన్టీఆర్ ఎదుర్కొంటున్నారు. మరో రెండు మూడు రోజుల్లో చరణ్ కూడా ఈ షూటింగ్లో జాయిన్ అవుతారు. ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్ చిత్రీకరణ నుసుమారు నెలరోజుల పాటు ప్లాన్ చేసిందట చిత్రబృందం. ఈ ఎపిసోడ్ ఖర్చు 40 కోట్లు అని తెలిసింది. ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా ఎవరు నటిస్తారు? అనే విషయం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సెంథిల్ కుమార్. -
ఏడడుగులకు ఏడేళ్లు
పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకోవడానికి సతీమణి ఉపాసనతో కలిసి రామ్చరణ్ సౌత్ఆఫ్రికా వెళ్లారు. అదేంటీ వారి మ్యారేజ్ డే (జూన్ 14)కి ఇంకా టైమ్ ఉంది కదా అంటే నిజమే. ఆ సమయంలో రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్తో చరణ్ బిజీగా ఉంటారట. అందుకే ఇలా ప్రీ–మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ కోసం ఆఫ్రికా వెళ్లారు చరణ్, ఉపాసన. ‘‘అడ్వాన్స్గా మాకు పెళ్లిరోజు శుభాకాంక్షలు. డైవింగ్, అడ్వెంచర్ స్పోర్ట్, హీలింగ్ టెక్నిక్స్.. ఇలా ప్రతి పెళ్లి రోజుకీ ఇద్దరం ఏవో కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటుంటాం. ఈసారి వైల్డ్లైఫ్ గురించి తెలుసుకుంటున్నాం. చాలా బాగుంది’’ అని పేర్కొన్నారు ఉపాసన. అలాగే తమ హ్యాపీ ట్రిప్కు సంబంధించిన ఫొటోలను సోషల్మీడియాలో షేర్ చేశారామె. ఇంకా ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ– ‘‘ఇది వన్వీక్ హాలీడే ట్రిప్. టాంజానియా, మౌంట్ కిలిమంజారో వంటి ప్రదేశాలను చూడాలనుకుంటున్నాం. చరణ్ కాలికి గాయం కావడం వల్ల ఎక్కువగా నడవడానికి కుదరదు. అయినప్పటికీ ట్రిప్ను బాగానే ఎంజాయ్ చేస్తున్నాం. ప్రేమలో పడటాన్ని చరణ్ అంతగా నమ్మరు. కానీ ప్రేమలో ఎదుగుదలను విశ్వసిస్తారు’’ అని చెప్పుకొచ్చారు ఉపాసన. అన్నట్లు.. ఈ ఏడాదితో చరణ్, ఉపాసనలది సెవెన్త్ మ్యారేజ్ డే. జూన్ 14న ఈ క్యూట్ కపుల్ మ్యారేజ్ డే. -
పోరాటం మొదలైంది
బ్రిటీషర్స్పై యుద్ధం మొదలెట్టారు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు. ఈ యుద్ధం ఎన్ని రోజులు సాగుతుందో తెలియాల్సి ఉంది. ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (వర్కింగ్ టైటిల్). డీవీవీ దానయ్య నిర్మాత. బాలీవుడ్ భామ ఆలియా భట్ కథానాయిక. చరణ్ సరసన ఆలియా నటిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా ఎవరు కనిపిస్తారన్నది ఇంకా ఫిక్స్ కాలేదు. తమిళ నటుడు సముద్రఖని, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, నిత్యా మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, జిమ్లో గాయపడిన కారణంగా చరణ్ కొన్నాళ్లు ఈ సినిమా షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నారు. ఈ షూటింగ్లో గాయపడిన ఎన్టీఆర్ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇద్దరు హీరోలూ జోష్గా ఈ సెట్లోకి ఎంటరయ్యారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం తాజా షెడ్యూల్ ఇటీవలే హైదరాబాద్లో ఆరంభం అయింది. నగర శివార్లలో వేసిన సెట్లో ఈ షూటింగ్ జరుగుతోంది. ఎన్టీఆర్, చరణ్ ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారని తెలిసింది. దాదాపు నెలరోజులకు పైనే ఈ షెడ్యూల్ సాగనుందని సమాచారం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సెంథిల్ కుమార్. -
బ్యాక్ టు స్కూల్
చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ అందరికీ స్పెషలే. అక్కడికి ఎప్పుడు వెళ్లినా మళ్లీ ఆ స్కూల్ స్టూడెంట్ అయిపోవడం కామన్. ఇప్పుడు అలానే బ్యాక్ టు స్కూల్ వెళ్లిపోయారు రామ్చరణ్. తను చదువుకున్న లారెన్స్ స్కూల్ను ఇటీవల సందర్శించారు. ఆ స్కూల్తో తనకున్న జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆ ఫోటోలను చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ‘‘జ్ఞాపకాలు ఎప్పటికీ ఉంటాయి. స్కూల్ క్యాంటీన్, హాస్టల్, క్లాస్ గ్రూప్ ఫోటో ఇవన్నీ చూసినప్పుడు పాత జ్ఞాపకాలు చటుక్కున గుర్తొసాయి. స్కూల్ని మిస్ అయిన ఫీలింగ్ కలిగిస్తాయి. చరణ్కి కూడా తన స్కూల్ జ్ఞాపకాలు చాలానే ఉన్నాయి. తనలోని చిన్నపిల్లోడిని మళ్లీ బయటకు తీసుకొచ్చాయి’’ అన్నారు ఉపాసన. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం వర్కవుట్స్ చేస్తూ రామ్చరణ్ గాయపడిన సంగతి తెలిసిందే. దాంతో షూటింగ్కి చిన్ని బ్రేక్ ఇచ్చారు. ఆ బ్రేక్లో సరదాగా స్కూల్ను సందర్శించారనుకోవచ్చు. కొన్ని రోజుల్లో ‘ఆర్ఆర్ఆర్’ కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. -
బ్యాక్ టు ట్రాక్
గాయాలతో ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ షూటింగ్ బ్రేక్లో ఉంది. మళ్లీ పదిరోజుల తర్వాత పరుగు మొదలు కానుందని తెలిసింది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. చరణ్ సరసన ఆలియా భట్ హీరోయిన్గా నటించనున్నారు. 1920 బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరమ్ భీమ్గా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రల్లో కనిపిస్తారు. ఆ మధ్య జిమ్లో రామ్చరణ్ గాయపడ్డారు. ఇటీవల షూటింగ్ చేస్తూ ఎన్టీఆర్ చిన్నగా గాయపడ్డారు. దీంతో ఈ చిత్రం షూటింగ్కు చిన్న విరామం ఇచ్చారు. వచ్చే పదిరోజుల్లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుందని తెలిసింది. ఈ షెడ్యూల్లో రామ్చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ పాల్గొంటారని సమాచారం. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్. -
చిన్ని బ్రేక్
యాక్షన్ సన్నివేశాలు లైవ్లీగా రావడానికి సెట్లో ఎన్టీఆర్ ఎంత కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రిస్కీ ఫైట్స్ని డూప్ లేకుండా చేయడానికే ఆసక్తి చూపుతారు. ఈ ప్రయత్నాన్ని రిపీట్ చేసే ప్రాసెస్లో ‘ఆర్ఆర్ఆర్’ సెట్లో ఎన్టీఆర్ స్వల్పంగా గాయపడ్డారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా ‘ఆర్ఆర్ఆర్’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో స్వాతంత్య్ర సమరయోధులు కొమరంభీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్చరణ్ నటిస్తున్నారు. 1921 నేపథ్యంలో సాగే ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ఎన్టీఆర్పై కొన్ని యాక్షన్ సీన్లు ప్లాన్ చేశారు టీమ్. ఈ సన్నివేశాలను చిత్రీకరించే సమయంలో ఎన్టీఆర్ చేయి బెణికింది. దీంతో ఎన్టీఆర్ బుధవారం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లొచ్చారని తెలిసింది. ఇది చిన్న గాయమేనని తెలిసింది. చేయి బెణకడం వల్ల జస్ట్ మూడు నాలుగు రోజులు రెస్ట్ తీసుకుని, మళ్లీ షూటింగ్లో పాల్గొంటారు. దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్తో డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది జూలై 30న విడుదల చేయాలనుకుంటున్నారు.