
రాజమండ్రికి ప్రయాణం కానున్నారు రామ్చరణ్. ‘ఆచార్య’ చిత్రీకరణ కోసం కొన్ని రోజులు అక్కడే ఉండనున్నారని తెలిసింది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. కాజల్ అగర్వాల్ కథానాయిక. నిరంజన్ రెడ్డి, రామ్చరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నిర్మించడంతో పాటు ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు చరణ్. తనకు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. రాజమండ్రిలో జరిపే షెడ్యూల్లో చరణ్పై ఓ యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కించనున్నారు. ఈ షెడ్యూల్లో చిరంజీవి కూడా పాల్గొంటారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మే 9న విడుదల కానుంది.
చదవండి: నా సిటీనే.. నా బ్యూటీ
Comments
Please login to add a commentAdd a comment