![Allu Arjun And Allu Aravind Celebrate The Success Of Sye Raa Narasimha Reddy - Sakshi](/styles/webp/s3/article_images/2019/10/5/syeraa-%282%29.jpg.webp?itok=8iJOsPJJ)
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. చిరంజీవి టైటిల్ రోల్లో నటించిన ఈ సినిమాను సురేందర్రెడ్డి దర్శకత్వంలో రామ్చరణ్ నిర్మించారు. ఈ నెల 2న ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సక్సెస్ను సెలబ్రేట్ చేయడానికి అల్లు అరవింద్ ‘సైరా’ టీమ్కి పార్టీ ఏర్పాటు చేశారు. దర్శకులు త్రివిక్రమ్, సుకుమార్, వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్లతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ పార్టీలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment